Free SMS And Earn Part Time Money







3/21/11


3/18/11

"DaBaang"హిరోయిన్ బికిని , ముద్దు సీన్లలో యాక్ట్ చేయటం కోసం 2కోట్లు


సెల్వరాఘవన్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన ఛాన్స్ దక్కించుకుని కోలీవుడ్‌ లో అడుగుపెడుతున్న బాలీవుడ్ ఫ్రెష్ ఫేస్'దబాంగ్' హీరోయిన్ సోనాక్షి సిన్హా, తొలుత ముద్దు సీన్లలో, రొమాన్స్, బికినీ సన్నివేశాల్లో నటించనని వాళ్లమ్మ చేత చెప్పించింది. రంగంలోకి దిగిన నిర్మాత ఆమెకు పారితోషికంగా రెండు కోట్ల రూపాయలను ఇస్తానన్నట్టు తెలిసింది. దీంతో మొన్నటివరకూ బికినీ వేయను, అందాలను అలవోకగా కూడా చూపను అని మొండికేసిన సోనాక్షి తన మనసు మార్చున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కండిషన్లు వదిలేసి ఎలా కావాలంటే అలా నటిస్తానని చెప్పేసిందట. కాగా దక్షిణాదిలో అడుగుపెడుతూ తొలి సినిమాకే రూ. 2 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్న ముద్దుగుమ్మ బహుశా సోనాక్షీయే అని అంటున్నారు. అంతే కాకుండా కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో ఓ హీరోయిన్‌ కు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికాన్ని ముట్టజెప్పిన దాఖలాలు కూడా లేవంటున్నారు. సోనాక్షీలో అంతగా ఏమున్నదో మరి...?

అప్పటి స్టార్ డం ఉందనుకుంటోంది పాపం అమ్మడు


బాలీవుడ్ ఒకప్పటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇప్పటికీ తానే నెంబర్ వన్ హీరోయిన్ ని అనుకుంటోంది. అందుకే, తన దగ్గరకొచ్చే నిర్మాతలకి కళ్ళు తిరిగే రేటు చెబుతోంది. ఈమధ్య అమెరికా నుంచి వచ్చి, ఓ రియాలిటీ షోలో పాల్గొన్న మాధురీ దీక్షిత్ ని నలుగురైదుగురు నిర్మాతలు కలిసి, తమ సినిమాల్లో నటించమని కోరేటప్పటికి, 5 కోట్లు రెమ్యునేరేషన్ గా అడిగిందట. దాంతో ఏం చెప్పాలో నోట మాట రాక, 'మళ్లీ వస్తాం మేడం' అంటూ ఆ ప్రోడ్యుసర్లు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్దంత మొత్తలో రెమ్యూనరేషన్ కరీనా కపూర్, కత్రినా కైఫ్ మరియు ప్రియాంకా చోప్రాలు మాత్రమే తీసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు, ‘అవును..మాధురీకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో చెక్కుచెదరని అభిమానం వుంది. ఆమె మీ సినిమాలో వుంటే కళ్ళు మూసుకుని బిజినెస్ అయిపోతుంది’ అంటూ గొప్పలు చెబుతున్నాడు. అయితే, బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు మాత్రం మాధురీకి అంత సీను లేదనీ, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుని అలా అడుగుతోందనీ అంటున్నారు. ‘ఇప్పుడు తను సిస్టర్ పాత్రలకీ, తల్లి పాత్రలకే సూట్ అవుతుంది. అలాంటప్పుడు అంత పారితోషికం ఎవరిస్తారు?’ అంటున్నారు

.వర్మ కనిపిస్తే.. కొట్టేటట్లున్నారని.. థియేటర్‌ యజమాని అనడం విశేషం...ఇది దొంగలముఠా రివ్యూ


నటీనటులు: రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు, సునీల్‌, లక్ష్మీమంచు, సత్యప్రకాష్‌, బ్రహ్మాజీ,సుప్రీత్‌లు, కెమెరా:ఎఫ్‌ఎక్స్‌ స్కూల్‌, నిర్మాత: కిరణ్‌కుమార్‌ కోనేరు, సంగీతం: అమర్‌ మోహ్లే, దర్శత్వం: రామ్‌గోపాల్‌వర్మ + హరీష్‌శంకర్‌. పాయింట్‌: ఓ ముఠా ద్వారా కిడ్నాప్‌ అయిన బ్రహ్మానందాన్ని కనిపెట్టే ఓ జంట. ఈ చిత్ర సమీక్ష రాయడానికి కారణం కేవలం రామ్‌గోపాల్‌వర్మ అనే పెద్ద దర్శకుడు సినిమా తీశాడననిన్నూ, రవితేజతోపాటు పలువురు ప్రముఖులు నటించారననిన్నూను. అంతకుమించి ఈ చిత్రంలో ఏమీలేదు. చూసినవాడు తలబాదుకోవడం ఖాయం. వెబ్‌దునియాలో అంతకుముందు పాఠకులు చదివినట్లే.... చార్మి.. అందాలపైనే వర్మ కెమెరాను ఫోకస్‌ చేయడం.. దర్శకత్వంతోపాటు వర్మ కెమెరామెన్‌ అవతారమెత్తడం మరో విశేషం. కొత్త ప్రయోగాలు చేయవచ్చు. కానీ ఆప్రయోగాలు ఎలా చేశారు. దాని గురించి వివరంగా చెప్పేందుకు దర్శకుడు, నిర్మాత సాహసించాలి. ఏదో గుడ్డిలో మెల్లగా రాత్రిరాత్రే వచ్చిన ఆలోచనతో సినిమా చుట్టేసి.. గొప్ప ప్రయోగం చేశామనుకోవడం భ్రమే అవుతుందని చూసిన ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు. కామెరూన్‌ అనే స్టిల్‌ కెమెరాతో కూడా సినిమా తీయవచ్చు. అనేది చెప్పడానికి వర్మ చేసిన ప్రయోగం. కానీ... ఆ కెమెరాతో పగలు షూటింగ్‌ చేస్తే క్లారిటీ బాగానే వస్తుందనేది అందరికీ తెలిసిందే. కానీ వెలుగులేని గదుల్లో కూడా క్లారిటీగా రావడం విశేషం. లైట్లు లేకుండా ఎలా తీయగలిగాడు..? అనేది వివరంగా వర్మ చెప్పలేకపోయాడు. అసలు లైట్లు పెద్దగా వాడలేదన్నాడు. కెమెరాకు సరైన లైటు లేకపోతే క్లారిటీ రాదు. వస్తే ఇన్నాళ్ళు ఆ కెమెరాను ఎందుకు వాడలేదు. పైగా కెమెరా ఎలా వాడారో తెలియజెప్పేందుకు... యూనిట్‌ ఎవరినీ తీసుకెళ్ళకుండా వర్మ జాగ్రత్తపడ్డాడు. ఐదు రోజుల సినిమా.. ఆర్టిస్టులకు పారితోషికాలు ఇవ్వలేదని వర్మ చెబితే నమ్మాలేమో.. ఒక్కరోజులో తమిళం, మలయాళంలో ఓ చిత్రాన్ని తీశారు. అందులో ప్రముఖ హీరోలు నటించారు. ఆ విషయం వర్మను అడిగితే... ఆ చిత్రం గురించి నాకు తెలీదు అన్నాడు... మరి ఈయన చిత్రం గురించి ఎవరికి తెలియాలని ఎవరైనా అడిగితే... సమాధానం ఏం వస్తుందో తర్వాత చూద్దాం... ఇక కథలోకి వెళితే.... సత్యప్రకాష్‌ ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేస్తాడు.. కట్‌చేస్తే... దంపతులైన సుధీర్‌(రవితేజ), రాణి (చార్మి)లు ఓ వివాహానికి వెళుతూ కారు పాడవడంతో మెకానిక్‌కోసం కొంచెం దూరంగా ఉన్న ఓ హోటల్‌కు వెళతారు. అక్కడ సుబ్బరాజు, సుప్రీత్‌, బ్రహ్మాజీలుంటారు. వారు హోటల్‌ నిర్వాహకులు. వారికి ఓ రూమ్‌ ఇస్తారు. ఈ రాత్రి అక్కడే ఉండి తెల్లారి వెళ్ళానుకుంటారు. వారి రూమ్‌ పక్క రూమ్‌లో రాణికి విచిత్రమైన అరుపులు విన్పిస్తుంటాయి. పైగా ఆ ముగ్గురి ప్రవర్తనపై అనుమానం వస్తుంది. వారి పిచ్చి ప్రవర్తనతో సుధీర్‌ విసిగిపోయి అక్కడ నుంచి బయటపడాలనుకుంటాడు. కానీ వారు వెళ్ళనివ్వరు. రాణిపై మోజుతో వారు తనకు రూమ్‌ ఇచ్చారని సుధీర్‌ గ్రహిస్తాడు. ఆ తర్వాత పోలీసు ఆఫీసర్‌ ప్రకాష్‌రాజ్‌ ఎంటరవుతాడు. ఆ తర్వాత మంచు లక్ష్మి, సునీల్‌ వస్తారు. కొన్ని సంఘటనలు జరిగాక... లక్ష్మీమంచు తాను పోలీసు ఆఫీసర్‌ అని ట్విస్ట్‌ ఇస్తుంది. మరి ప్రకాష్‌రాజ్‌ దొంగ అన్నమాట... ఇలా ఎందుకు అనేది తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటే సినిమాకెళ్ళాలి. ఈ చిత్రంలో పాత్రధారులు ప్రత్యేకంగా నటించింది ఏమీలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా అంతా లాగించేశాడు. అనవసరపు సౌండ్‌ సిస్టమ్స్‌తో... నటీనటులు ఒకరినొకరు వింతగా చూసుకోవడం... చార్మి పిరుదలు, నాభి ప్రాంతాలపైనే కెమెరాను కావాల్సింత మేర ఉంచినట్లు తెలుస్తుంది. సీరియల్స్‌లో ఇటువంటి ప్రయోగాలుంటాయి. రోడ్డుపై నుంచి రిసార్ట్‌ రావడానికి పావుగంట చూపించాడు. ఇది సీరియల్‌గానైనా జనాలు చూడరేమో. టైటిల్‌కు కథకు సంబంధం లేదు. దొంగతనం అనేది జరగదు. ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేస్తారు. అంటే.... తాను ముందుగా చెప్పేది ఒకటి తర్వాత చూపించేది ఒకటని... వర్మ మరోమారు నిరూపించాడు. అప్పల్రాజు సినిమాను అలాగే చేశాడు. కేవలం క్లోజప్‌షాట్స్‌, మిడ్‌ షాట్స్‌తోనే సినిమా అంతా లాగించేశాడు. చివరగా... రూపాయి ఖర్చు లేకుండా లక్షలు ఎలా సంపాదించాలి? అనే ఆలోచనతో వర్మ ఈ చిత్రాన్ని తీశాడని తెలుస్తుంది. లేదంటే..... ఏ మాత్రం ఖర్చులేకుండా... తనకున్న పరిచయాలతోనే ఓ డాక్యుమెంటరీలా చుట్టేసి ప్రేక్షకులు జేబులు కొట్టడానికే ఈ సినిమా తీశారా అనిపిస్తుంది. ట్విస్ట్‌ ఏమంటే..... హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ...వర్మ కనిపిస్తే.. కొట్టేటట్లున్నారని.. థియేటర్‌ యజమాని అనడం విశేషం...

కరీనా ని చూసి ఆగలేక రన్వీర్ ....????



తన సంబంధాలపై ఆమె చాలా సీక్రెట్‌గా వ్యవహరిస్తుంది. బాడీనీ జీరో సైజుకు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడింది. వెండితెరపై బికినీలో తన అందాలను ఆరబోస్తుంది. కానీ అవన్నీ ఆమెను ఓ స్టూడియోలో ఓ పురుషుడు వాటేసుకునే దాకా వెళ్తుందని ఆమె ఊహించలేదు. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్. ఆ ఆభిమాని అమాంతం వాటేసుకుని కరీనాను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఆ అభిమాని సాధారణమైనవాడేమీ కాదు. బాలీవుడ్ నటుడు రన్వీర్. అతన్ని వదిలించుకోవడానికి ఆమె చాలానే కష్టపడాల్సి వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదని నిర్ధారించుకుని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని కరీనా కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రన్వీర్ సింగ్‌ను గతంలో తాను యాష్‌రాజ్ స్టూడియోలో చూశానని, తనను చూసి అతను ఉద్వేగానికి లోనయ్యాడని, చిన్న పిల్లాడిలా గంతులేశాడని, అతన్ని సమాధాన పరిచి మామూలు స్థితికి తేవడానికి తాను ఎంతో శ్రమపడాల్సి వచ్చిందని, చాలా సేపటికి గాని అతను మామూలు మనిషి కాలేదని, అతన్ని సమాధాన పరిచి తాను గట్టిగా ఊపిరి తీసుకున్నానని కరీనా కపూర్ వివరించింది.

దొంగల ముఠా ప్రివ్యూ


రామ్ గోపాల్ వర్మ తాజా ప్రయోగాత్మక చిత్రం దొంగలముఠా ఈ రోజే(శుక్రవారం) విడుదల అవుతోంది. ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కథ ఓ కామిక్ ధ్రిల్లర్ లా సాగుతుందని తెలుస్తోంది. కథ ప్రకారం సుధీర్(రవితేజ),రాణి(ఛార్మి) స్నేహితురాలు వివాహంకి అటెండ్ అవటానకి ఓ నిర్మానష్యుమైన రోడ్డులో ప్రయాణిస్తూంటారు. హటాత్తుగా కారు ఆగిపోతుంది. వారు దగ్గరలో ఓ హోటల్ ఉండటాన్ని గమనిస్తారు. వారు ఆ హోటల్ లోకి వెళ్ళగానే అక్కడ వారు ఓ కారుని ఇచ్చి ప్రక్కనున్న విలేజ్ లోకి వెళ్ళి మెకానిక్ ని తెచ్చుకోమంటారు. కానీ వారు నీ భార్యని తీసుకెళ్ళద్దు అంటారు. దాంటో సుధీర్ చాలా ఇరిటేట్ అవుతాడు. వారిని గెట్ అవుట్ అని అరుస్తాడు. తర్వాత వారి ప్రక్క గదిలోంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. కానీ చూస్తే ఆ గది తాళం వేసి ఉంటుంది. మెల్లి మెల్లిగా సుధీర్ కి తాము ట్రాప్ అయ్యామనిడు ఆర్ డై సిట్యువేషన్ లో ఇరుక్కున్నామని అర్దమవుతుంది. ఇంతకి అక్కడి స్టాప్ మరెవరో కాదు..ఓ దొంగలముఠా. వారు ఓ బ్యాంక్ ని దోచి అక్కడ మేనేజర్ (బ్రహ్మానందం) ని అదుపులోకి తీసుకుని బంధించి దాక్కుని ఉంటారు. ఆ దొంగలముఠాకి ఓ నాయకురాలు(లక్ష్మీ ప్రసన్న) ఉంటుంది. ఆమె ఆధ్వర్యంలో అంతా జరుగుతూంటుంది. చివరకు ఆ చెరనుంచి సుధీర్, రాణి ఎలా తప్పించుకున్నారనేది మిగతా కథ. ఈ కథ హాలీవుడ్ లో వచ్చిన ద వేకిన్సీ చిత్రం నుంచి ప్రేరణ పొంది తయారు అయ్యిందని అంతటా వినపడుతోంది.

దీవిలో ఆదుకున్న కుర్రాడిని వదిలేసి భర్త చెంతకు దగ్గరైన భర్తను దూరం చేసుకుంటుందా? అనేదే పతాక దృశ్యం


కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ఆంగ్ల చిత్రం బ్లూ లాగూన్ అప్పట్లో యువతను కవ్వించి మైమరపించి ఓ సంచలనాన్ని సృష్టించింది. ఈ మధ్యనే దీనికి తదుపరి చిత్రంగా 'సర్వీయల్ ఐలాండ్' పేరుతో పార్ట్-2 వచ్చి ప్రపంచ దేశాల్లో యువతిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ప్రొడక్షన్స్ వారు అందాల దీవిలో అనే పేరు పెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అందిస్తున్న రఫాతున్నీసా "అందాల దీవి"లో చిత్రం గురించి చెపుతూ... అమెరికాలో వీకెండ్ సెలవు రోజుల్ని ఎంజాయ్ చేసేందుకు నాలుగు జంటలు ఓ షిప్పులో బయలుదేరి తమతమ గర్ల్‌ఫ్రెండ్సుతో సరదాగా కాలక్షేపం చేస్తున్న తరుణంలో వారు పయనిస్తున్న షిప్ యాక్సిడెంట్‌కి గురవుతుంది. అందులోని ఓ అమ్మాయి సముద్రపు అలలకు కొట్టుకొచ్చి తీరాంతంలో పడుతుంది. అలాగే అందులోనే ఉండే ఓ కుర్రాడు ఈవిధంగానే అలలకు కొట్టుకొచ్చి ఆ ప్రక్కనే పడిపోయి కొంతటైమ్ తర్వాత వీళ్లద్దరూ స్పృహలోకి వచ్చి ఏం చేయాలో తోచక ఒకరికి మరొకరు తోడై ఆ దీవిలో నుంచి బయటపడేందుకు శతవిధాలా కృషి చేస్తుంటారు. ఈ టైంలోనే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన భర్త కూడా ఆ దీవిలోకి చేరతాడు. తనను ఆ దీవిలో ఆదుకున్న కుర్రాడిని వదిలేసి భర్త చెంతకు ఆ అమ్మాయి చేరుతుందా..? లేక దగ్గరైన భర్తను దూరం చేసుకుంటుందా? అనేదే పతాక దృశ్యం.

యువ హిరోల పొట్టి తనానికి హిరోయిన్ చాన్స్ లు గల్లంతు


టాలీవుడ్ కత్రినా అంటూ తెగ పొగడ్తలను అందుకున్న సెక్సీ భామ దీక్షాసేథ్. వేదం చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి మిరపకాయ్, వాంటెడ్ చిత్రంతో అందరి కళ్లల్లోనూ పడింది. ఒడ్డూ పొడుగూ అందం చందం అంతా బాగానే ఉండటంతో తెలుగు దర్శకనిర్మాతలు ఆమెపై దృష్టి సారించారు. అవకాశాలను ఇచ్చేందుకు ఉబలాటపడ్డారు. కానీ ఆ హీరోయిన్ పక్కన నటించాలంటే కొంతమంది హీరోలు భయపడుతున్నారట. కారణమేంటని ఆరా తీస్తే... టాలీవుడ్‌లో కొందరు హీరోలు దీక్ష భుజాల వరకే వస్తున్నారట. ఐదడుగుల ఎనిమిదంగుళాల ఎత్తుతో పొడవుగా ఉండే ఆమె సరసన నటిస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడుతున్నారట. దీంతో చేసేది లేక ఏ అనుష్కనో... తమన్నానో... ఇలియానానో బుక్ చేసుకోవాల్సి వస్తోందట. ఇంతకీ దీక్షకంటే పొట్టిగా ఉన్న హీరోలెవరయా అని మరికొంచెం నిశితంగా పరిశీలిస్తే... అల్లు అర్జున్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్, నాగచైతన్య... ఇలా యువహీరోలంతా దీక్షకంటే రెండు మూడు అంగుళాలు ఎత్తులో తేడా ఉన్నట్లు తెలిసింది. పాపం... దీక్షా... అందం... అభినయం... చూపించే టాలెంట్ ఉన్నా ఆఫర్లే రావడం లేదు.

బాత్రుం సీన్లో రెచ్చిపోయిన అమీర్ అల్లుడు


బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ "షార్ట్ టెర్మ్ షాది " అనే సినిమా లో సెక్స్ బాంబ్ సోనియా మెహ్ర తో కొన్ని హాట్ హాట్ సీన్లలో రెచ్చిపోయి నటించాడట ఈ సినిమా లో బాత్రుం సన్నివేశంలో మెహ్ర నుడ్ గా చేయవల్సి వస్తే డైరక్టర్ సెకండ్ స్కిన్ వేసుకోమని చెప్పిన పర్వాలేదని ఇమ్రాన్ తో భీభత్సంగా నటించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి వీరిద్దర్ని విడదీయటాని యూనిట్ సభ్యులు నాన తంటాలు పడ్డారట మెహ్ర ఈ సినిమా గురించి మాట్లడుతు ఇమ్రాన్ కనిపించే అంతా కాం కాదని చెప్పుక్స్తోంది మరి అంతగా ఇమ్రాన్ మెహ్ర కి ఏం చూపించాడో మరి

రాణ హిరోయిన్ బాబయ్ ని తిరస్కరించింది


రాణ సరసన నటించిన రిచా గంగోపాద్యాయ వెంకటేష్ నాగవల్లి లో ఆఫర్ ఇవ్వగానే పళ్ళు ఇకిలిస్తు వెళ్ళి వేషం కట్టేసింది అదే రాణ పక్కన నటిస్తున్న ఇలియాన మాత్రం వెంకటేష్ పిలిస్తే ఆఫర్ తనకొద్దంటు తిరస్కరించింది కొడుకు తో చేస్తు బాబయ్ తో కూడ చేస్తే బాగోదనుకుందే ఎమో వెంకి ఇచ్చిన ఆఫర్ సున్నితంగా తిరస్కరించిది బాడీగార్డ్ సినిమా కోసం నయనతార కాని ఇలియాన గాని హిరోయిన్ చేద్దామనుకున్నడు నిర్మాత బెల్లంకొండ సురేష్ అవేమి కుదరక పోయేసరికి మళ్ళి త్రిషని పెట్టి సర్దుకొని తీస్తున్నాడు మరి ఈ బాడీగార్డ్ వెంకటేష్ మాత్రం అదే కాంబినేషన్ లో ఎన్నిసార్లు తీస్తామన్నట్టు తప్పక ఒప్పుకుంటున్నాడని గుసగుసలు

బరి తెగించిన హిరోయిన్లు


టాలీవుడ్ లో చూపిన హద్దులు బిదియాలు బాలీవుడ్ కి వర్తించవు అనుకుంటున్న టాలీవుడ్ హిరోయిన్ లు టాలీవుడ్ లో ఉనంతసేపు బికినిలకి కురచ దుస్తులకు దూరంగా ఉంటు వచ్చిన హిరోయిన్ లు కొందరు బాలీవుడ్ చాన్స్ రాగనే వారికి తోచిన విధంగా కొన్ని పత్రికలకి హద్దు ఆపు లేకుండా ఎక్స్పోజ్ చేస్తు అందాలు ఆరబోస్తున్నారు వారి లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రియ టాలీవుడ్ లో ఉన్నంతసేపు బికిని జోలికి పోని ఈ హిరోయిన్ బాలీవుడ్ లో వెళ్ళగానే మ్యాగ్జిం పత్రికకి మ్యాగ్జిమం కురచ దుస్తులు ధరించి ఫోజులిచ్చింది ఆ తరవాత త్రిష ఒంగి ఒంగి మరి పత్రికలకి ఎక్స్ పోజ్ చేసింది ఇలియాన ఎమైన తక్కువతింద అంటే అదిలేదు తనకి తోచిన విధంగా రేడియోకి ఎక్స్ పోజ్ చేసింది త్వరలో అసిన్ కూడ బికిని వేయటాని రేడి అంది సదా ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వెళ్ళిన ప్రతి హిరోయిన్ హద్దులు దాటి ఎక్స్ పోజ్ చేసేస్తున్నారు ఇప్పుడిప్పుడే చాన్స్ లు అందుకుంటున్న కాజల్ కూడ బాగనే చూపించటానికి రెడీ అవుతోందని సమాచారం మన డైరక్టర్ ల దగ్గర ఉన్న సిగ్గు బిడియం ఇతర డైరక్టర్ ల దగ్గర ఉండదేమో [మని మని అమ్మ సుట్టం కాదు అబ్బ సుట్టం కాదు మని మని ] ఈ పాట పై హిరోయిన్ లకి అంకితం

3/17/11

తెలుగు టాప్ నిర్మాత మనవడు సెక్సి హిరోయిన్ వలలో


టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న హిరో దగ్గుబాటి రాణ మీద తెగ ప్రేమ ఒలక బోస్తోంది బాలీవుడ్ ముదురు సుందరి బిపాష బసు "దం మారో దం"లో సినిమాలో బిపాసా బసు ,రాణ జంటగా నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిన విషయమే ఈ సినిమా ప్రమోషన్ లో రాణ ని బిపాసా ఆకాశానికి ఎత్తేస్తోంది బాలీవుడ్ కి తగ్గట్టుగా రాణ ఫిజిక్ ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది బిపాసా అంతేనా రాణ తనకి సరిగ్గా సరిపోయాడంటోంది ఈ బాలీవుడ్ ముదురు సెక్సీ అంతేకాక ఇంకా చెప్పింది వినండి తనతో కెమెరా ముందు యాక్ట్ చేయటం ఎంతో ఎంజాయ్ చేసిందట ఇలా అన్ని చెప్పి రాణ ని ముగ్గులో దింపిందని బాలీవుడ్ సమాచారం పాపం ఈ ముదురు సుందరి వలలో పడి లేత కుర్రాడు కెరీర్ ఎమైపోతుందోనని కొందరు ఇప్పటికే చెవులు కొరుక్కుటున్నారట మరి రాణ బాబాయ్ తాత ఎలా బయటకి లాగుతారో ఈ లేత కుర్రాడ్ని ముదురు భామ వలలో నుండి అని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి

మహేష్ ది పెద్దదని మణి డైరక్షన్ వదులుకున్న విక్రం


మణిరత్నం అడిగితే కాదు,లేదు అనే మాటలు తమిళ హిరోల నోట రావు అలాంటిది మణి రత్నం తన రావణ్ చిత్రంలో నటించిన విక్రం ని హీరోగా అడిగితే కాదన్నడట దేనికి అని వివరం లోకి వెళ్ళితే మణి రత్నం తీసే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హిరోలు ఒకటి మహేష్ బాబు , రెండు విజయ్, మూడు విక్రం అయితే ముగ్గురు హీరోలలో మహేష్ బాబు ది నిడివి గల క్యారెక్టర్ అందుకని ఆ క్యారెక్టర్ తన కిమ్మని విక్రం అడిగాడని సమాచారం మహేష్ ని ఒప్పించటానికి మణి రత్నం ఆ క్యారెక్టర్ ఉంచాడు అందుకని మణి ఆ క్యారెక్టర్ ఇవ్వకపోవటంతో విక్రం చిన్నబోయాడట ఆ స్థానంలో ఆర్యని ఫిలప్ చేశాడని అందరు అనుకుంటున్నారు

రూల్స్ సంవత్సర కాలం గుర్తురాలేదు చిరంజీవి వ్యతిరేక జంటకి


హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు జీతాల చెల్లించకుండా చిక్కుల్లో పడ్డారు. రాజశేఖర్ దంపతులు తమ సెక్యూరిటీకి జీతాలు చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని సిటీ సెక్యూరిటీ వింగ్ వారికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పది పన్నెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ చెల్లించడం లేదని, ఇదే ఆఖరు నోటీసులని హెచ్చరించింది. సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసిన 2+2 గన్‌మెన్లకు రాజశేఖర్ దంపతులు గత సంవత్సరకాలంగా జీతాలు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ వస్తున్న డాక్టర్ రాజశేఖర్ దంపతులపై కొందరు చిరంజీవి అభిమానులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత రాజశేఖర్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమకు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా అడిగారు. దీనికి నాటి ముఖ్యమంత్రి వారికి 2+2 గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరకాలంగా వారుమాత్రం జీతాలు చెల్లించడం లేదని నోటీసులు జారీ చేశారు.

అందుకే సూపర్ స్టార్ [ఆయన రూటే సెపరేటు]


సూపర్ స్టార్ రజనీకాంత్ దానధర్మాల గురించి ఎన్నో విన్నాం. ఎవ్వరూ అడిగినా అడగక పోయినా, రజనీకాంత్ దృష్టిలో ఎవరైనా నటుడు గానీ, లేక సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ గానీ బాధల్లో ఉంటే, రజనీ వెంటనే వారికి సహాయం జరుగుతుంది. అలా ఆయన ఎంతో మందికి సహాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలనాటి హీరో ఎంజీఆర్ స్టంట్ మెన్ ఆర్థికంగా ఎంతో బాధపడుతుంటే, షూటింగ్ స్పాట్ లో ఆ స్టంట్ మెన్ ను చూసి అతనికి కొన్ని లక్షలు సహాయం చేశాడు. అలాగే నటుడు కాంతారావుకు నెలకు పదివేల రూపాయాల చెక్ ను చనిపోయే వరకు అందించారు. అలనాటి కమేడియన్ ‘తంగవేలు’ కుమారుడికి కొన్ని లక్షల బ్యాంక్ బుణం ఇప్పించి, మంచి ఇండస్ట్రీ పెట్టించారు. ఇప్పుడు జపాన్ లో భూకంపం, సునామీ సందర్భంగా ‘టోక్యో’ నేలమట్టమయింది. ఎంతో మంది చనిపోయారు. సునామి కారణంగా ఇళ్ళు కొట్టుకొని పోయాయి. ఇప్పుడు కూడా జపాన్ లో ఎంత మంది శవాలు ఉన్నాయో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితులలో సూపర్ స్టార్ రజనీకాంత్, జపాన్ కు సహాయం అందించడానికి నడుం కట్టాడు. జపాన్ లో ‘రజనీకాంత్’కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యం రజినీకాంత్ తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ సహాయంతో జపాన్ ప్రజలకు అవసరమైన వస్తువులను, డబ్బును, జపాన్ ప్రజలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. రజినీకాంత్ జపాన్ వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితి బాగుండక పోవడంతో జపాన్ ప్రోగ్రామ్ ను నిర్ణయించలేదు. రజనీకాంత్ కోలీవుడ్ కో స్టార్స్ తో కూడా సంప్రదించి, కొన్ని వేల కోట్లు కలక్ట్ చేసి జపాన్ ప్రజలకు పంపించే ఆలోచనలో నిమగ్నమయ్యారని సమాచరం.

చిన్నప్పటి నుంచి నేనింతే అంటున్న డర్టి పిక్చర్స్ హిరోయిన్


బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ తనకు ఒళ్ళు రావటానకి కారణం తను రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోవటమేనంటూ తేల్చింది. అయితే ఈ నిద్రపట్టని సమస్య తనకు పన్నెండవ ఏట నుంచి ఉందని అప్పట్లో కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నని అదే తన మెటబాలిజాన్ని దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్ళ క్రిందట ఈ విషయం తనకు తెలిసిందని చెప్పింది. ఇక తన ఒళ్ళు గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడల్లా బాధకలిగేదని,అయితే లావు తగ్గటం కోసం తాను చాలా కష్టపడ్డానని అయితే ఫలితం లేకుండాపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో పూజ మకీజా అనే డైటీషన్ దగ్గరకు వెళితే ఆవిడ నా అలవాట్లు తెలుసుకుని అప్పుడు నిద్రపోకపోతే వచ్చే సమస్యలు చెప్పి, తనను మార్చిందని అప్పటినుంచి రాత్రిళ్ళు ఎక్కువ సేపు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నాని అంది. అయితే హఠాత్తుగా ఈ నిద్రగోల ఎత్తుకోవటానకి కారణం ఆమె స్లీపింగ్ ఎవేర్ నెస్ మంత్ కి బ్రాండ్ అంబాసిడర్ కావటమే. ప్రస్తుతం విద్యాబాలన్..సిల్క్ స్మితగా డర్టీ పిక్చర్ లో నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలింద్ లూద్రియా డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. ఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇరువురి వర్షన్స్ సెక్స్ కోరాడంటు హిరోయిన్ ఆడిషన్ లో ఫెయిల్ అంటు డైరక్టర్


ఖోస్లా కా గోస్లా, లవ్ సెక్స్ అవుర్ ధోకా, లక్కీ ఓయ్ లక్కీ చిత్రాల దర్శకుడు దివాకర్ బెనర్జీపై బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. విభిన్నమైన చిత్రాల ఈ దర్సకుడు ఇప్పుడు ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్లో బి గ్రేడ్ సినిమాలు చేసుకునే పాయిల్ రోహత్గీ అనే నటి తనను సెక్స్ వల్ గా వేధించాడంటూ ఆరోపణ చేసింది. అలాగే తనకు దివాకర్ చాలా కాలంగా ప్రెండ్ అని, అయితే అతను ఇలా సినిమాలో ఆఫర్ అడిగేసరికి ఇలా హెరాస్ మెంట్ కి దిగాడంటోంది. అయితే దివాకర్ వెర్షన్ వేరేగా ఉంది. ఆమె ఎంత స్నేహితురాలైనా ఆడిషన్లో ఫెయిల్ అయిందని, అలాంటప్పుడు ఆమెకు ఎలా ఛాన్స్ ఇవ్వగలుగుతానని, ఆ విషయాన్ని ఆమె పాజిటివ్ గా తీసుకోకుండా నానా యాగీ చెయ్యటాన్ని తాను ఊహించలేకపోతున్నాని వాపోతున్నాడు. దివాకర్ ప్రస్తుతం సాంఘై అనే చిత్రం రూపొందిస్తూ అందుకోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో మెయిన్ క్యారెక్టర్ కోసం అతన్ని ఆమె సంప్రదించింది. అయితే ఆమె ఫెయిల్యూర్ అయింది. కాస్టింగ్ కోచ్ వివాదంలో ఈసారి దివాకర్ బెనర్జీ ఇరుక్కోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పాయిల్ గురించి తెలిసిన వారంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. దాంతో ఆమె మీడియా ముందు తన ఆక్రోశం వెల్లబుచ్చుతోంది.

ఒక స్టార్ హిరోయిన్ చెల్లెలి కోర్సు పూర్తయింది


మామూలుగా హీరోలు తమ కొడుకుల్ని హీరోల్ని చేయడానికి నిర్మాతలుగా మారుతుంటారు. అయితే, ఇప్పుడు తన చెల్లెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఓ హీరోయిన్ నిర్మాత అవతారం ఎత్తుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో వున్న కత్రినా కైఫ్ తన చెల్లి ఇసాబెల్ కైఫ్ ని హీరోయిన్ గా ఇంట్రడ్యుస్ చేయడానికి రెడీ అవుతోంది. అందుకోసం తనే సొంతంగా ఓ చిత్రాన్ని ప్రోడ్యుస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. కత్రినా ఒక ఫ్రెంచి మూవీ ‘ప్రైవేట్ బెంజమిన్’ని రీమేక్ చేయడానికి ప్రేక్షకుల్ని, బిజినెస్ వర్గాలని ఎట్రాక్ట్ చేయడం కోసం ఇందులో తను కూడా నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇసా అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి, ముంబై వచ్చింది. సినిమా స్టార్ట్ అయ్యేలోగా ప్రతి రోజూ బాలీవుడ్ సినిమాలు చూస్తూ అవగాహన పెంచుకోమనీ, అలాగే భాష మీద పట్టుకోసం రోజూ తనతో హిందీలోనే మాట్లాడమనీ కేట్ చెల్లికి ఆదేశాలు ఇచ్చిందట.

యన్.టి. ఆర్ పెళ్ళి కలయిక శక్తి సినిమా కి ఫ్లాప హిట్ట


ధియోటర్స్ లో చూడెచ్చు అనగానే వివాహాన్ని లైవ్ గా ధియోటర్స్ స్క్రీన్స్ పై క్రికెట్ లాగా చూడెచ్చు అనుకోకుండి. జూ. ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి లో త్వరలో జరగనున్న ఎన్టీఆర్ వివాహంలోని హైలెట్స్ ను కలపనున్నారని సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్ తో అశ్వనీదత్ చర్చిస్తున్నాడని, ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ పెళ్ళిని మా టీవి వారు లైవ్ ఇవ్వటంతో అంతకన్నా క్రేజ్ వచ్చే విధంగా తన పెళ్ళిని ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా తన లేటెస్ట్ శక్తి చిత్రానికి ఎలాగయినా కొత్త క్రేజ్ తెచ్చి మరింత కలెక్షన్స్ సంపాదించాలని అనుకుంటున్నాడు. అందులోనూ శక్తి చిత్రం బడ్జెట్ లో అత్యధిక మొత్తంలో తయారవటంతో ఏమైనా చేసి మంచి రేటు కు అమ్మాలని అశ్వనీదత్ భావిస్తున్నారు. వీరందరి ఆలోచనలే ఈ పెళ్ళిని ధియోటర్స్ లో చూపాలనేది ఊతం ఇస్తోంది. ఇక ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అంటున్నారు. ఇదే గనుక జరిగితే శక్తి చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సోషియో పాంఠసి చిత్రంగా శక్తి పీఠాల నేఫధ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. అలాగే 'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.
Powered by web analytics software.