
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రతీ ఒక్కరినీ ఆంటీ..అంకుల్ అని పిలుస్తూంటుంది. అయితే ఆమెను శృతిహాసన్..ఆంటి అని పిలిచి షాక్ ఇచ్చింది. అనగనగా ఒక ధీరుడు చిత్రంతో హీరోయిన్ గా పరచయం అయిన శృతిహాసన్ కి రీసెంట్ గా అందులో విలన్ గా చేసిన లక్ష్మీ ప్రసన్న పార్టీ ఇచ్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ...లక్ష్మి ప్రసన్న ఆంటీ ఇచ్చిన పార్టీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయేది అంది. దాంతో ఆమె త్వరలో ఈటీవీ కోసం చేసే ప్రేమతో మీ లక్ష్మీ పోగ్రాం టైటిల్ ని ప్రేమతో మీ లక్ష్మీ ఆంటీ అని మారిస్తే బాగుంటుంది అంటున్నారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న వర్మ దర్శకత్వంలో దొంగలముఠా చిత్రంలో కమిటైంది. ఆమె అనగనగా ఓ ధీరుడు చిత్రం ప్లాప్ అయినా అందులో ఆమె చేసిన మంత్రగత్తె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.