నాగార్జున హీరోగా, రామ్గోపాల్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ 'శివ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మకు ఈ సినిమా స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మళ్ళీ అదే చిత్రాన్ని నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్'లో కీలక పాత్ర పోషించారు. ఇంకా "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్గా నటిస్తోంది. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డ్ హ్యాండ్ నిర్మాత దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం చేపట్టా రు
ఎన్నికల ముందు నాగార్జున కాంగ్రెస్ కు అనుకూలంగా యాడ్స్ లో నటించారు. సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ పథకాలను ఆకాశానికి ఎత్తేశారు. తండ్రి తెలుగుదేశం పక్షపాతి అయినా నాగార్జున మాత్రం మళ్ళీ అధికారంలోకి రానున్న పార్టీ కాంగ్రెసేనని ముందే తన దివ్య దృష్టితో కనిపెట్టారు. అదే ఆయనకు ఇప్పుడు కలిసోచ్చింది. నాగార్జునకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. పైగా ఆయనది బిజినెస్ లో గోల్డెన్ హ్యాండ్ అన్న పేరుంది. కోకాపేట, గచ్చిబౌలిలో ఆయనకు బినామీ పేర్లతో ఎకరాల కొద్దీ భూమి ఉన్నట్టు తెలుస్తోంది. ఎకరం వేలల్లో కొనుక్కుంటే ఇప్పుడు ఒక్క ఎకరమే కోట్ల విలువ చేస్తుంది.
ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ వ్యాపార సామ్రాజ్యంలో కొంత వాటా నాగార్జునకు ఉందని తాజా సమాచారం. మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న జగన్ త్వరలో తన సామ్రాజ్యాన్ని విస్తరించబోతున్నారు. పాత వ్యాపారాల్లోనే కాక కొత్త వెంచర్లలో కూడా నాగ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. జగన్ ది గోల్డెన్ లెగ్గే, నాగార్జునది గోల్డెన్ హ్యాండే. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎందుకో...........