Free SMS And Earn Part Time Money







9/14/09

'మగధీర' చిత్రానికి మరో అదనపు ఆకర్షణను జోడించనున్నారు



దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్స్‌ కురిపిస్తూ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న 'మగధీర' చిత్రానికి మరో అదనపు ఆకర్షణను జోడించనున్నారు. ఈ చిత్రం అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకోనున్న శుభ సందర్భంలో అదనపు ఆకర్షణ కల్పించాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.

గీతా ఆర్ట్స్‌ సంస్థ త్వరలో ఈ చిత్రంలో ఉత్కంఠభరితమైన సన్నివేశాన్ని జోడించబోతున్నట్టు ఆయన చెప్పారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, కాజల్‌, శ్రీహరి, రావురమేష్‌లపై దర్శకుడు రాజమౌళి ఎంతో కష్టపడి చిత్రీకరించిన ఓ చూడముచ్చటైన యాక్షన్‌ సన్నివేశాన్ని జతచేస్తామని తెలిపారు.

ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఆల్‌టైం రికార్డ్‌గా అత్యధిక సెంటర్స్‌లో అర్థ శతదినోత్సవం జరుపుకోబోతున్న శుభసమయంలో ప్రేక్షకులకు అందిస్తున్న కానుక ఇది అని అరవింద్‌ అన్నారు.

చిత్ర నిడివిని తగ్గించే క్రమంలో తొలుత ఈ సన్నివేశాన్ని తొలగించామన్నారు. అయితే, చిత్రం విడుదలైన తర్వాత వస్తున్న అపూర్వ స్పందన నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సన్నివేశాన్ని జత చేయనున్నట్టు నిర్మాత తెలిపారు.


Powered by web analytics software.