Free SMS And Earn Part Time Money







7/11/09

రవితేజ, నయనతార ఆడియో రిలీజ్ ఇన్@'ఆంజనేయులు'

రవితేజ, నయనతార జంటగా పరశురామ్‌ (బుజ్జి) దర్శకత్వంలో నటుడు గణేష్‌బాబు పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న 'ఆంజనేయులు' చిత్ర నిర్మాణం పూర్తికావచ్చింది. 'ఆంజనేయులు ఆడియోను ఈ నెల 24న ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల,ఆగస్టు రెండవ వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు' నిర్మాత గణేష్‌బాబు కిక్ తో అంతగా అలరించని కొత్త కధ కధనంతో తోక లేని ఆంజనేయులుగా మళ్ళి ప్రేక్షకుల చెంతకు రాబోతున్నాడు.ప్రతి సినిమా లోను తన క్యారెక్టర్ డైలాగ్ డెలివరి అదేవిధంగా ఉన్న ఈ సినిమాలో కొత్తదనం ఉంటయని సినిమా యూనిట్ ఆశిస్తున్నారు

ఈ చిత్రంలో రవితేజ, నయనతార, ప్రకాష్‌రాజ్‌, షాయాజీషిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, సంగీతం: ఎస్‌.తమన్‌, ఫైట్స్‌: రామ్‌, లక్ష్మణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్‌ (బుజ్జి).ఆగష్టుకి విడుదల రవితేజకు దడ దడ ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యులోను నేను కిందనుంచి కష్టపడి వచ్చాను నాకు హిట్,ఫ్లేప్ ఒకటే అని చెప్పుకొనే రవితేజ ఇ సారి హిట్ రాక పోతే అటు నిర్మాతలకు ఇటు ప్రక్షకులకు మరింత దూరమవుతాడు మరి (జాగ్రత్త రవి)

బుల్లితెర షో లో "పోకిరి" నమ్రత శిరోద్కర్





















టాలీవుడ్ ప్రిన్స్, పోకిరి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. పెండ్లికిముందు యువరాజుతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. తాజాగా వ్యాపకం కోసం నిర్మాతగా మారి బుల్లితెరకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగా... ఓ బుల్లితెర షోను ఆమె నిర్మించనుంది. మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోంది. మరాఠీ నమ్రతా మాతృభాష కావడంతో తొలిసారి ఈ వెంచర్‌ చెపడుతోంది . వివాహానంతరం సినిమాలకు స్వస్తి చెప్పిన సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి నమ్రత ఈ షో జడ్జిగా వ్యవహరించనుండటం విశేషం. పిల్లల కోసం చేస్వ ఈ ప్రోగ్రాంలో సోదరి సిల్పాతో పాల్గొనుంది.ఈ షో కోసం తరచూ ముంబై వెళ్లవలసి ఉన్నప్పటికీ తన ఆసక్తితో ఇదంత చేస్తోంది,ప్రస్తుతం షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే ప్లాన్‌ అవుతోంది. టీవీషోలో నమ్రత తొలిసారి రంగప్రవేశం చేస్తున్న తరుణంలో మునుముందు మరింత బిజీ అవబోతోంది, మరిన్ని షోలు చేయాల్సిందిగా పలు ఛానల్స్‌ నమ్రత వెంట ఇప్పటికే తిరుగుతున్నాయ్ , అయితే ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయ్ ICICI BANK వారి కొత్త వీడియో ప్రకటన బావుంది




యువసామ్రాట్ తనయుడీ ఫస్ట్ లుక్




















యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్య వెండితెరపై ఎలా కనిపించబోతున్నారనే ఉత్సుకత రోజురోజుకూ ప్రేక్షకులలో ఎక్కువవుతోంది. నాగార్జున పోలికలతో యువ మన్మథుడుగా 'జోష్'తో అలరించేందుకు నాగచైతన్య ముస్తాబవుతున్నారు.
నాగచైతన్యను
అలనాటి కథానాయిక రాధ కుమార్తె కార్తీక ను పరిచయం చేస్తూ తాము నిర్మిస్తున్న చిత్రానికి 'జోష్' టైటిల్ ను ఖరారు చేసినట్టు దిల్ రాజు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారిగా చిత్ర విశేషాలను దిల్ రాజు శనివారంనాడు సంస్థ కార్యాలయంలో తెలియజేశారు.
ICICI BANK వారి కొత్త వీడియో ప్రకటన బావుంది
















టాలివుడ్ బాక్సాఫీసులో ఈ వారం టాప్ 5 చిత్రాలు

గీతాంజలిని తలపిస్తోందనే టాక్ తో బాటు షామిలి ఫస్ట్ సినిమా కావడంతో కలక్షన్స్ అధిరాయి

సినిమా బావుందనే టాక్ తో మంచి ఫలితాలు రాబడుతోంది

మ్యుజిక్ సూపర్ సినిమా మాత్రం టెర్రర్ చూడాలి ఆడియన్స్ ఎమంటారో

సినిమా బావున్నా హీరో హీరోఇన్లకు మ్యాచ్ అవ్వలేదనే టాక్

సరైన చిత్రాలు రాకపొవడం తో కిక్ టాప్ 5 లో కొనసాగుతోంది

సినిమా లు చెత్త స్టొరిలతో


Kiran Rathod







ఆ కుర్రాడు వయస్సు పదమూడు. ఆమె వయస్సు ముప్పై. ఆమెతో అతను శృంగారం పొందాలని ప్రయత్నం చేస్తాడు. ఇటలి సినిమా మలీనా ఆధారం గా ఈ చోటి సే లవ్ స్టొరీ మొదలైంది. అందరు దొంగలే, సత్యమే సుందరం వంటి చిత్రాలతో తెలుగు నాట పాపులర్ ఐన కిరణ్ రాథోడ్ ఈ మలీన తెలుగు వెర్షన్ లో నటిస్తోంది. నూతన దర్శకుడు నరిసింహ నంది ఈ చిత్రం డైరెక్ట్ చేస్తున్నాడు. అతను ఈ చిత్ర ప్రారంభం సందర్భం గా మాట్లాడుతూ తమ సినిమా ఇటలి ఫిలిం మలీన ఆధారంగా తయారౌతోందని చెప్పాడు. ఇక కొంత కాలంగా వేషాలు లేక వెనక బడ్డ కిరణ్ రాథోడ్ మాట్లాడుతూ తన పాత్ర సాప్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పింది. ఇక శృంగార ప్రధాన మైన సినిమా అని మలీన గురించి చెప్పినప్పుడే వచ్చిన వారికి అర్ధమైంది.
ఇంతకు ముందు కూడా భానుప్రియ తో టీచర్ ఐ లవ్ యు అనే చిత్రం గతంలో వచ్చింది. అంతకు ముందు మనీషాతో ఏక చోటేసే లవ్ స్టొరీ తీసారు. వీటన్నిటి కి ముందు రతి నిర్వేద అనే మలయాళ సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. దానిని భరతాన్ అనే దర్శకుడు డైరెక్ట్ చేసాడు. దాంతో ఆ తరహ సినిమా గా మారే అవకాసం ఉందంటున్నారు. ఇక ఈ చిత్రం ఓపెనింగ్ లో మీడియా వారు కిరణ్ రాథోడ్ ని మరి శృంగార సన్నివేశాలులలో కనిపిస్తారా అంటే పెదవి విప్ప లేదు. ఇక కిరణ్ రాథోడ్ వెయ్య బోయే పాత్ర ను ఇటలి లిలో సెక్సీ స్టార్ మోనికా బెలుచి వేసింది. ఇక ఈ చిత్రం తమిళ్ లో కూడా రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. దానికి రతి నిర్వేద అనే పేరు పీట్టి అవకాసం ఉంది.

జస్ట్ యెల్లో లో జెనిలియా





జస్ట్ యెల్లొ పతకం పై ఏర్పడే ప్రతి సినిమా ఏదో ఒక ప్రత్యేక కధనంతో తీస్తారు దానిలోభాగంగానే

జెనిలీయా తో ప్రారంభమయిన సినిమా అందులో ఎప్పుడు లేని విధముగా జెనిలీయా టీచర్

పాత్రలో నటించబోతోంది ప్రేక్షకులు ఈ సినిమాని ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో భినత్వాన్ని ఆశించే మన ప్రేక్షకులు అదరీస్తారో లేదో సినిమా విడుదలయ్యక చూడండి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా 'కథ' చిత్రాన్ని మలుస్తున్నారు. అరుణ్‌, జెనీలియా నాయకానాయికలుగా జస్ట్‌యల్లో పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సగభాగం పూర్తయింది. శ్రీనివాస్‌ రాగ దర్శకుడు. కాగా అరకులో రెండు పాటలను తీయడంతో పాటు సగం టాకీని పూర్తిచేశామని నిర్మాత గంగరాజు పేర్కొన్నారు. ఇంతవరకు చేయని టీచర్‌ పాత్రలో జెనీలియా నటిస్తోందని ఆయన చెప్పారు. వివిధ రకాల భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను జరపనున్నామని, అందులో భాగంగా మిగతా టాకీ, మరో రెండు పాటలను చిత్రీకరిస్తామని ఆయన వివరించారు.
ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, షఫీ, రఘుబాబు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు, పాటలు: గుణ్ణం గంగరాజు, సంగీతం: యస్‌.కె.బాలచంద్రన్‌, ఛాయాగ్రహణం: ఏండ్రు, ఆర్ట్‌: రవీందర్‌, కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం: శ్రీనివాస్‌ రాగ.

మగదీర ప్రోడ్యుసర్ అల్లు అరవింద్ పై బ్యాండ్



ప్రముఖ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్‌పై బ్యాన్ విధించే సూచనలు కనపిస్తున్నాయి. ఇటీవలే సినిమా యాడ్స్ ప్రసారం విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొన్ని టీవీ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. అందులో మాటీవీ సైతం ఉంది. అయితే అల్లు అరవింద్ నిర్మించిన మగధీర చిత్రం ఆడియో ఫంక్షన్‌ని మా టీవీ వారు లైవ్ టెలీకాస్ట్ చేసారు. దీనిపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అల్లుపై గుర్రుగా ఉంది. తమ అనుమతి లేకుండా బ్యాన్ విధించిన టీవీ ఛానెల్‌కు టెలీకాస్ట్ హక్కులు ఇచ్చినందుకు కౌన్సిల్ నోటీసు ఇచ్చిందని సమాచారం. అయితే అల్లు అరవింద్ దానిని లెక్క చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్లుపై బ్యాన్ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనకు ఏవిధమైన సహకారం ఎవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక మరో ప్రక్క ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా నిర్మాతల మండలి నుంచి నోటీసు అందుకున్నారు. నిర్మాత అడ్డాల చంటి ఇచ్చిన కంప్లైంట్‌తో నిర్మాతల మండలి రాజమౌళిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే


Powered by web analytics software.