Free SMS And Earn Part Time Money







12/14/10

సూర్యకి Raktacharitra సినిమా కన్నా వర్మ టేకింగ్ నచ్చిందని




రామ్ గోపాల్ వర్మ, సూర్య కాంబినేషన్ లో వచ్చిన రక్త చరిత్ర చిత్రం super టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ త్వరలోనే రిపీట్ కానుందని సమాచారం. "ది బిజెనెస్ మేన్ " పేరుతో వర్మ నిర్మించనున్న చిత్రంలో సూర్య . త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.
ఈ చిత్రాన్ని మొదట పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తాడనుకున్నారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే . ఇక ప్రస్తుతం వర్మ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల రాజు షూటింగ్ ఫినిషింగ్ టచ్ స్ లో ఉన్నారు. ఇక రక్త చరిత్ర చిత్రం గురించి సూర్య మాట్లాడటానికి తమిళ మీడియా వద్ద ఇష్టపడటం లేదు. ఒక్కసారి ఇలా అయినంత మాత్రాన ఆ కాంబినేషన్ రిపీట్ చేయకూడదా అంటున్నాడు. అలాగే సూర్యకి సినిమా కన్నా వర్మ టేకింగ్ నచ్చిందని, తెలుగులో ఎలా ఉన్నా తమిళంలో బాగా వర్కవుట్ అవుతుందని చాలా ఆశలు.

అత్యద్భుతంగా పోషిస్తున్న బాలకృష్ణ:Baapu




శ్రీరాముని పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'.
బాపు దర్శకుడు.
సీతగా నయనతార,
అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి .
సాయిబాబా మూవీస్‌ పతాకం
యలమంచిలి సాయిబాబు నిర్మాణం .

కాగా ఈ చిత్రం కోసం భారీసెట్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు కొంత షూటింగ్‌ చేశామని, సమ్మె కారణంగా తాత్కాలికంగా షూటంగ్‌ను ఆపామని నిర్మాత సాయిబాబు తెలిపారు. సమ్మె పూర్తికాగానే మళ్లీ నిరవధికంగా షూటింగ్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు కొంత టాకీ, సగం పాటను చిత్రీకరించామని ఆయన వివరించారు. ఇందులో ప్రధాన తారాగణంతో పాటు 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. వాల్మీకి ఆశ్రమానికి సంబంధించిన సెట్‌ను భారీగా వేయించామని, ఇంకా పలు భారీ సెట్స్‌ను ఈ చిత్రం కోసం నిర్మించనున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎనిమిది పాటల రికార్డింగ్‌ పూర్తయిందని, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన పాటలు ప్రతిఒక్కరినీ అలరింపజేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో రాముడి పాత్రను అత్యద్భుతంగా పోషిస్తున్న బాలకృష్ణ లోగడ కృష్ణుడిగా, అర్జునుడిగా నటించి, మెప్పించిన విషయం తెలియందికాదని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యూనిట్‌తో పాటు తమ సంస్థకు పేరు తెచ్చిపెడుతుందని అన్నారు.

కాని ఈ పాత్రలో సుమన్ అలరించగలడని సినీ వర్గాల అభిప్రాయం ..........

హాటెస్ట్ యాడ్ సెక్సియస్ట్ అవార్డ్ రావటం లొలోపల తెగ మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ




అందరూ అనుకున్నట్టు తానేమంత సెక్సి కానోటోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రీనా "తీస్ మార్ ఖాన్"కోసం ఏదొ కొద్దిగా ఎక్స్పోజ్ చేసిందే తప్ప ఎప్పుడు సెక్సి గా కనపడదట.అందం వేసుకునే బట్టలో కాక చూసె కళ్ళలో ఉంటుందని.ఇండియా మొత్తానికి ఐశ్వర్య రాయ్ హాట్ హిరోయిన్ అని [తన దౄష్టిలో]

అయినా హాటెస్ట్ యాడ్ సెక్సియస్ట్ అవార్డ్ రావటం నాకు గౌరవంగా భావిస్తోందటా ఇలా చెబుతునే లొలోపల తెగ మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ

ఇట్లూ:::::::::::::::::::::::::

ఆమె ఇంట్లోనే ఆమె అద్దం ముందు సిల్క్ స్మిత లా పల్చటి దుస్తులు ధరించి ఏకపాత్రభినయం:ఎవరి భామ ???








నిన్నటితరం వెండితెర సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత గాధ ఆధరంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే

సిల్క్ స్మిత కి టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ అన్న తార తమ్యాలు లేకుండా ఉన్న పేరు అందరికి తెలుసు అందుకే బాలీవుడ్ తార విద్యా భాలన్ ఆమె పాత్ర గురించి వివరించగానే ఎగిరిగంతేసింది.


అంతేనా ఆమె ఇంట్లోనే ఆమె అద్దం ముందు సిల్క్ స్మిత లా పల్చటి దుస్తులు ధరించి ఏకపాత్రభినయం చేస్తోందట

ఎంత చేసినా సిల్క్ స్మిత హావ భావలు ఇవ్వలేకపోతోందట పాపం .........!!!ఈ బాలీవుడ్ భామ

సినిమా మొదలు కాకుండానే చేతులేత్తేస్తోంది ఈ భామ ....................!!!!

సినీ పరిశ్రమలో సమ్మె మరో టర్న్ తీసుకుంది:మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, లతో ఒక కమిటీ




point1:తెలుగు సినీ పరిశ్రమలో గత అయిదు రోజులుగా సాగుతున్న సమ్మె మరో టర్న్ తీసుకుంది.
point2:వివాదం కాస్తా దిశ మారి, నిర్మాణ వ్యయం అదుపుపై చర్చకు దారితీసింది.
point3:మూడు ప్రధాన విభాగాలు ఒక్క తాటిపై నిలిచి సమస్యలు పరిష్కరించాలని నిర్చయించుకున్నాయి
point4:ఓ హోటల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు రహస్యంగా సమావేశమయ్యారు.
point5:నిర్మాణ వ్యయం తగ్గించేందుకు హీరోలు, దర్శకులు సముఖుత వ్యక్తం
point6:అనువాద చిత్రాలను నిషేధించాలని ఒకరిద్దరు నిర్మాతలు ప్రస్తావన తీసుకురాగా, ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్లు సమాచారం
point7:ఇదే అంశాలపై మళ్ళీ మంగళవారం కూడా భేటీ
point8:దీనికి సంభందించి ఓ కమిటీని వేసినట్లు తెలిసింది.Mahesh babu&Pawankalyan మరో ఇద్దుర ముగ్గురు హీరోలతో పాటు,ఎస్.ఎస్.రాజమౌళి, వివి వినాయిక్, ఈశ్వరరెడ్డి మరో ఇద్దరు నిర్మాతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
point9:ఈ సమావేశం తీవ్రతను గమనిస్తే..మరో వారం పది రోజుల వరకూ షూటింగ్ లు జరిగే పరిస్ధితి లేదు
point10:ఈ నెల 16 న నాగవల్లి చిత్రాన్ని విడుదల చేయాలా ..వద్దా అనే విషయం పైనా చర్చ
point11:ఇటువంటి సమావేశాలకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ సమావేశానికి రావడం చిరంజీవి,నాగర్జున, కృష్ణం రాజు, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, రామ్ చఱణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, రాజశేఖర్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు ఈ భేటీకి వచ్చారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, జీవిత, ఆహుతి ప్రసాద్, ఏవీఎస్, వేణు మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్ర రావు, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి. వినాయిక్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్,బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, నిర్మాతలు డి.రామానాయుడు, అశ్వనీదత్, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, దిల్ రాజు, కె అచ్చి రెడ్డి,స డివివి దానయ్య ఈ చర్చలో పాల్గొన్నారు
point12:
ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించడానికి కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, లతో ఒక కమిటీ
point13:మూడు రోజుల్లో తగిన సూచనలను నిర్మాతల మండలికి, దర్శకులకు అందజేస్తుంది.
point14:మంగళవారం ఉదయం నిర్మాతల మండలి కీలక సమావేశం

బాబయ్ కాబట్టి ఇచ్చాడు మరి మరొ నిర్మాతొకొ :



WD
ఆరెంజ్ సూపర్ ప్లాప్‌తో నిర్మాత నాగబాబు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాడు. మొన్నీమధ్య మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో ఆరెంజ్ దర్శకునిపై పరోక్షంగా విరుచుకపడ్డాడు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత సినిమా తీస్తుంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోని కొందరు దర్శకులు నిర్మాతలను పురుగుల్లా పీల్చి పిప్పి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బాబాయ్ ఆవేదనను అబ్బాయ్ అర్థం చేసుకున్నాడో ఏమోగానీ, రాంచరణ్ ఆరెంజ్ సినిమాకోసం తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడట. బాధపడకు బాబాయ్... నిర్మాత దెబ్బతిన్నప్పుడు నటీనటులు తప్పక ఆదుకోవాలని తన మాటగా చెప్పాడట.

మరి రాంచరణ్ బాటలో ఎంతమంది నటీనటులు పయనిస్తారో...?

సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా ది డర్టీ Pictures




క్లబ్ డ్యాన్సర్ సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ అనే చిత్రం నిర్మితం కానుంది. బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను పోషించనుంది. ఇందుకోసం విద్యాబాలన్.. స్మిత బంధువులను, కుటుంబ సభ్యులను త్వరలో కలుసుకోనుంది.

మిలన్‌ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం విద్యా బాలన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలుస్తోంది. స్మిత పుట్టిపెరిగిన ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించి, స్మిత పడిన కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోనుంది. ఇందుకోసం చెన్నై‌తో పాటు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఆమె పర్యటించనుంది.

ఈ విషయమై విద్యాబాలన్ మీడియాతో మాట్లాడుతూ నిజ జీవిత గాథల్ని తెరకెక్కించేటపుడు కొన్ని ప్లాబ్లంస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుందని, ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయని అంటోంది. ఆ ఆలోచనతోనే సిల్మ్ స్మిత కుటుంబ సభ్యులు, బంధువులను కలుస్తున్నట్టు బాలన్ చెప్పుకొచ్చింది
Powered by web analytics software.