Free SMS And Earn Part Time Money







7/22/09

"మల్లన్న" ఆగస్టు 15న రిలీజ్



విక్రమ్,శ్రియ కాంబినేషన్లో రెడీ అయిన మల్లన్న చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయటానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం కలైపులి ధాను భారీ సాంకేతిక విలువలతో జోడించారు. దాదాపు తొమ్మది వందల ధియోటర్లలలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సుశీగణేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మల్లన్న డేట్ ప్రకటించటంతో మిగతా ఆగస్టు నెలలో రిలీజ్ చేద్దామనుకున్న తమిళ,తెలుగు చిత్రాలు కొన్ని ప్రక్కకు తప్పుకునే అవకాశం ఉంది.ఆగష్ఠు నెల మాత్రం పెద్ద సినిమాలతో ప్రేక్షకులని అలరించబోనుంది ఒక పక్క మెగాతనయుడి "మగధీర" వెనువెంటనే నాగ్ తనయుడి "జొష్" భారీ అంచనాలతో ఒకరి తరువాత ఒకరు పోటిపడుతున్న నెల వరుసగ మూడు గ్రహణాలతో భారీ ప్రమాదలు ఏర్పడతాయని అంచనాలు వేస్తే అన్ని తిరగబడి ప్రశాంతంగా ముగిసిపోయింది ఈ సినిమాల పరిస్తితి ఏంటో రీలిజ్ తరువాత చూడల్సిందే

సాక్షి ఎబౌట్ నాగ చైతన్య

మొత్తం చదవడానికి ఇమెజ్ క్లిక్ చెయ్యండి


దిల్ రాజుపైనా నిషేధం

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుపై కూడా ఫిలిం ఛాంబర్ నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణయం ఫిలిం ఛాంబర్ ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్ర పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఇటీవలే మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్‌కి సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు ఈ ఆంక్షలను ఉల్లంఘించి తన జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ లైవ్‌ని మా టీవీకి ఇచ్చారు. దీంతో దిల్‌ రాజు తీరుపై ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్‌కు మాత్రమే పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన మగధీర ఆడియో పంక్షన్ కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మా టీవీలో లైవ్ ఇచ్చారు. అటు అల్లు అరవింద్, ఇటు దిల్‌ రాజు ఇద్దిరిపై ఏక కాలంలో ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోవచ్చిన తెలుస్తోంది.




Powered by web analytics software.