Free SMS And Earn Part Time Money







2/9/11

నానుతున్న త్రీ ఇడియట్స్ బన్


‘త్రీ ఇడియల్స్ రీమేక్ చుట్టూ తిరిగి మళ్లీ ముందు అనుకున్న చోటికే వచ్చి ఆగేట్టుంది. శంకర్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా, తమిళంలో విజయ్ హీరోగా చేద్దామని మొదలు పెట్టిన ఈ చిత్రం నుంచి విజయ్, మహేష్ ఇద్దరూ ఒకేసారి వాకౌట్ చేశారు. దాంతో సూర్యతో ఈ చిత్రాన్ని రెండు భాషల్లోను తీసేద్దామని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో సూర్య పేచీ పెట్టడం, మళ్లీ ఈ చిత్రం చేయడానికి విజయ్ ముందుకు రావడంతో తమిళ త్రీ ఇడియట్స్ ‘నాన్ బన్’ముందుకి కదిలింది. అయితే విజయ్ కి తెలుగులో మార్కెట్ లేదు కాబట్టి ఇప్పుడు తెలుగు వరకు వేరే హీరో ఖచ్చితంగా అవసరమయ్యాడు. దాంతో జెమిని ఫిల్మిం సర్క్యూట్ వారు మళ్లీ మహేష్ బాబు దగ్గరకే వెళ్లి మంతనాలు మొదలు పెట్టారని, కేవలం అరవై రోజుల డేట్స్ ఇస్తే సినిమా చేసేసుకుంటామని అంటూ, మహేష్ కే మతిపోయే రేంజ్ ఆఫరిచ్చారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రిన్స్ నుంచి ఇంకా అవుననీ, కాదనీ బదులు రాలేదని తెలిసింది..

కోలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ :surya


2005లో మురగదాస్ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రం ‘గజిని’, తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో సూర్య షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ పేషెంట్ గా ఓ డిఫరెంట్ క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ చిత్రం తర్వాత సూర్య ‘మాట్రాన్’ అనే తమిళ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. గతంలో సూర్యతో‘వీడొక్కడే’ చిత్రాన్ని రూపొందించిన కెవి ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా..హ్యారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు..ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సూర్యకి జోడీగా కాజల్ నటిస్తోంది. 2012లో రిలీజ్ కానున్న ఈ చిత్రం కథ, కథనాలు పక్కాగా ఉండటంతో పాటు హ్యారీష్ జయరాజ్ సంగీతం అందించడంతో ఈ చిత్రం ఓ కొత్త సెన్సేషన్ అవుతుందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.

కోలీవుడ్ పై కి త్రిష కి రోత పుట్టి టాలీవుడ్ పై గాలి పుట్టింది


బక్కపలచని భామ త్రిషకు కోలీవుడ్ అంటే రోత పుట్టినట్లు ఉంది. ఈమధ్య ఎప్పుడు చూసినా హైదరాబాద్‌కు తరచూ చెక్కెర్లు కొడుతూ ఇక్కడే కాలక్షేపం చేస్తోందట. పనిలోపనిగా హైదరాబాద్‌లో ఓ తెలుగు వ్యాపారస్తునితో చాలా క్లోజ్‌‌గా ఉంటోందట. పార్టీలు, ఫంక్షన్లకంటూ తెగ తిరుగుతోందట. అటువైపు... ఇటువైపు పెద్దలు ఒప్పుకుంటే ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. గ్రీన్ సిగ్నల్ కోసం నానా తంటాలు పడుతున్నట్లు టాలీవుడ్ సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇది నిజమా... త్రిషా..? అని ఆమెను కదిలిస్తే... ఎవరా మాటంది..? ఈ ఇండస్ట్రీలో గాలి కబుర్లు పుట్టించండం మామూలేగా అని ఎగిరెగిరి పడిందట. అయినా తన పెళ్లి విషయాన్ని అంతగా దాచిపెట్టుకోవాల్సిన పనిలేదనీ, ఏదైనా ఓపెన్‌‌గా ఉంటానని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందట. అంతగా చెపుతుంది కదా... ప్రస్తుతానికి నమ్మేద్దాం

అప్పల్రాజు వల్ల గగనం పడిపోతుందని టాక్


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని దిల్ రాజు రిక్వస్ట్ చేసి మరీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రం వాయిదా వేయించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునేదాని ప్రకారం అప్పలరాజు చిత్రం ఈ వారం విడుదల అనుకుని మొదట అనుకున్నా ఆ తర్వాత గగనం చిత్రం దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు..స్వయంగా వర్మని కలసి మాట్లాడాడని చెప్తున్నారు. వర్మ కూడా గగనం నాగార్జున చిత్రం కావటంతో వాయిదా వేయటానికి సరేనన్నాడని వినికిడి.

ఇక గగనం చిత్రం ఓ ప్రయోగాత్మక చిత్రమని దానిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని దిల్ రాజు, నాగార్జున మొత్తుకుంటున్నారు. మరో ప్రక్క అప్పలరాజు చిత్రంలో సినీ పరిశ్రమలోని ప్రముఖలపై సెటైర్స్ ఉండటం, మర్యాద రామన్న తర్వాత సునీల్ చేస్తున్న చిత్రం కావటం, కామిడీ నటులు అంతా కూడగట్టుకుని పోస్టర్స్ పై కనపటం ఈచిత్రానికి ప్లస్ గా మారింది. ఇక గగనం చిత్రం 11న విడుదల కానుంది.అప్పలరాజు చిత్రం ఈ నెల 18 న విడుదల అవనుంది.

తెలివి మిరిన హిరోయిన్స్







బాలీవుడ్ సెక్స్ బాంబ్ సెలీనా పెళ్ళి కుదిరింది


మంచు లక్ష్మి తెలుగు భరించలేక



ఆ మధ్య ‘జీటీవీ’లో ‘లక్ష్మీ ప్రసన్న టాక్ షో’ పేరుతో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహిరించిన మంచు లక్ష్మీ, ఇప్పుడీ షోని కొంచం అటు ఇటు మార్చి ‘ఈటీవీ’కి షిఫ్ట్ చేసింది. ‘ప్రేమతో మీ లక్ష్మీ’ పేరిట ఆ టాక్ షో ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమవుతుంది తొలి ఎపిసోడ్ ఈ10న టెలికాస్ట్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జరిపిన టాక్ షో ఆరోజు ఎయిర్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని ఈటీవీ భారీగా చేబట్టింది. ఈనాడు, ఈటీవీ..రెండు మాధ్యమాలలోనూ ప్రమోషన్ని దంచుతున్నారు. గతంలో జీటీవీలో నిర్వహించిన షో క్వాలిటీ పరంగా బాగానే ఉన్నప్పటికీ, లక్ష్మి తెలుగుని భరించడం మాత్రం కాస్త కష్టమే! తండ్రి మోహన్ బాబు తెలుగు భాషని ఎంత స్పష్టంగా, అందంగా పలుకుతాడో అందరికీ తెలుసు. అందుకే, డైలాగ్ కింగ్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే, నటన విషయంలో తండ్రి పోలికలు తెచ్చుకున్నా, భాష విషయంలో మాత్రం ఆయన పోలిక ఆమెకు ఏమాత్రం రాలేదు. ఈ విషయంలో లక్ష్మి కాస్త సాధన చేయాలి!

మహెష్ బాబు పై సమంతా అలిగింది


మూడు సంవత్సరాల విరామం తర్వాత ప్రిన్స్ మహేష్ ఖలేజా అంటూ తన అభిమానుల ముందుకు రావడం జరిగింది. కొన్నికారణాల వల్ల ఖలేజా సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లాపడిన విషయం తెలిసిందే. దాంతో ఖలేజా తర్వాత సినిమా త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలని ప్రిన్స్ మహేష్ అనుకుంటూ ఉంటే దూకుడు సినిమా టైటిల్లో ఉన్న దూకుడు షూటింగ్ విషయంలో లేదని భాద పడుతున్నాడని సమాచారం. మొదటగా దూకుడు సినిమాని ఏప్రిల్‌కి విడుదల చేయాలని భావించినా ఇప్పుడు ఆసినిమా వేసవిలో విడుదల అయ్యే చూచనలు కనిపించడం లేదంట. దాంతో ప్రిన్స్ మహేష్ ఒక్కసారిగా దూకుడు సినిమాకి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేయాలని శ్రీను వైట్లని ఆదేశించినట్లు సమాచారం. సహాజంగా సినిమాలు తీసే సమయంలో హీరోకి అన్ని వసతులు ఏర్పాటు చేసిగానీ, అవుట్ డోర్ షూటింగ్‌లు పెట్టుకోరు. కానీ ప్రిన్స్ మహేష్ దగ్గరుండి మరీ చెప్పడంతో అలాంటి పార్మాలిటీస్ అన్ని లేకుండానే దూకుడు సినిమా గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకోని రావడం జరిగింది. దీంతో సమంత కొంచెం ఇబ్బందులు పడిందని సమాచారం. ఇన్నాళ్శు షూటింగులుకి ఏఇబ్బంది లేకుండా సాఫీగా చేసుకున్న సమంతకి ఈగుజరాత్ షెడ్యూల్ కొంచెం ఇబ్బందిని కలిగించిందంట. దానికి కారణం గుజరాత్ షెడ్యూల్ లో సమంతకి అరకోక వసతులు కల్పించారంట. ఇది మాత్రమే కాకుండా కంటిన్యూస్ షెడ్యూల్ తో ఒళ్శంతా గుళ్శ చేశారని తన ట్విట్టర్ ఫాలోవర్స్‌తో చెప్పుకోని బాధపడింది.

విప్పి చూపటంలో హద్దులున్నయంటోంది మిరపకాయ్ హిరోయిన్


గ్లామర్‌ విషయంలో నాకు పట్టింపులేం లేవు. కానీ మరీ అసభ్యంగా ఉంటే నా వల్లకాదు. డబ్బు సంపాదించుకొనేందుకు ఈ రంగంలోకి రాలేదు. హీరోయిన్స్ పోస్టర్‌ మీద అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు. తెర మీద ప్రతిభ చూపించాలి. లేదంటే రెండో సినిమాకే వెనక్కి వెళ్లిపోవాల్సివస్తుంది అంటూ లెక్చర్స్ ఇస్తోంది రిచా గంగోపాధ్యాయ. లీడర్ తో పరిచయమైన ఈ భామ మిరపకాయ్ చిత్రంతో నిలదొక్కుకుంది. రెండో చిత్రం నాగవల్లి నిరాశపరిచినా ఈమె నటనకు మంచి మార్కులె పడ్డాయి. ఇక ఆమె తనకు వచ్చే ఆఫర్స్ గురించి చెబుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. నటిగా నిలదొక్కుకోవాలి అని ఆశ పడుతున్నా. అందుకు ఒకే ఒక దారి ఉంది...మంచి పాత్రలు పోషించడం. అంతే తప్ప..అవకాశాల కోసం వెంపర్లాడను అంది. ఇక మిరపకాయ్లో తనకు వచ్చిన అవకాశం గురించి చెబుతూ..అలాగే తనకు ఆ పాత్ర ఎలా వచ్చిందో చెపుతూ...దర్శకుడు హరీష్‌ శంకర్‌ వినమ్ర పాత్ర నా కోసమే రాసుకొన్నారు. అయితే 'లీడర్‌' పంక్షన్ లో నన్ను చూసి 'అమెరికా అమ్మాయివి కదా. లంగావోణీ పాత్ర నీకు నప్పదేమో. వైశాలిగా చేయ్‌' అన్నారు. కానీ నాకు వినమ్ర పాత్ర నచ్చింది. నేను ఎందుకు చేయలేను...అని సవాల్‌గా తీసుకొన్నాను. అప్పటికి షూటింగ్‌కి ఇంకా సమయం ఉండడంతో నా పాత్ర తీరుతెన్నులను బాగా పరిశీలించాను అందుకే క్లిక్కయింది అంటోంది

నగ్నంగా కనిపిస్తే విధ్యాభాలన్ ని చిత్రీకరిస్తా:ఎం ఎఫ్ హుస్సేన్


విద్యాబాలన్ ఊ... అంటే ఆమె నగ్న చిత్రాన్ని గీస్తానంటున్నాడట ప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్. అపురూప సౌందర్యాలను కలిగిన స్త్రీలు బహు అరుదుగా ఉంటారని, అటువంటి అందాలను తాను విద్యాబాలన్‌లో చూశానని హుస్సేన్ అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు... తన మస్తిష్కంలో వెలుగుచూసిన కోరికను బాలీవుడ్ ప్రౌఢ సుందరి విద్యాబాలన్‌కు సందేశం ఇచ్చాడట. విద్య ఒప్పుకుంటే ఆమె నగ్న సౌందర్యాన్ని తన కుంచెతో అత్యంత రమణీయంగా చిత్రిస్తానని చెప్పాడట.
Powered by web analytics software.