Free SMS And Earn Part Time Money







2/28/11


ఐపీఎల్‌ తరహాలో మన తారలంతా కలిసి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) పేరుతో క్రికెట్‌ ఆడబోతున్న విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన నాలుగు జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. అంతకంటే ముందు మార్చి 5న సౌత్‌ సూపర్‌స్టార్స్‌ - ముంబయి హీరోస్‌ మధ్యన స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ విశాఖపట్టణంలో నిర్వహించబోతున్నారు. దక్షిణాది జట్టుకు వెంకటేష్‌ నాయకత్వం వహిస్తారు. ముంబయి హీరోస్‌ జట్టుకి సల్మాన్‌ఖాన్‌ కెప్టెన్‌. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటేష్‌ మాట్లాడుతూ ''ఈ మ్యాచ్‌ 20-20 తరహాలో ఉంటుంది. ఇది కేవలం సరదాగా సాగే మ్యాచ్‌. అసలు ఆట జూన్‌లో ఉంటుంది. సినిమా నటులు ఎక్కువ మంది క్రికెట్‌ అంటే ఇష్టపడుతున్నారు. అందుకే క్రికెట్‌ మ్యాచ్‌నే ఎంచుకున్నాం'' అన్నారు. భారత్‌- ఇంగ్లాడ్‌ల మధ్య ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఎలా ఉందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ''మ్యాచ్‌ చాలా ఉత్కంఠగా సాగింది. ప్రపంచకప్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌లో 350 స్కోరు చేస్తేగానీ విజయం దక్కేలా లేద''ని చెప్పారు. ''ఈ పోటీల కోసం ఇంకా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు మొదలుపెట్టలేదు. కానీ ఎవరికి వారు ప్రాక్టీస్‌ చేస్తున్నార''న్నారు తెలుగు టీమ్‌ యజమాని, హీరో మంచు విష్ణు. సౌత్‌ సూపర్‌స్టార్స్‌ జట్టులో సూర్య, సుదీప్‌, విష్ణు, సిద్ధార్థ్‌, శరత్‌ కుమార్‌, తరుణ్‌ తదితరులు ఆడతారు. శ్రియ, ప్రియమణి, తాప్సి, సమంత టీమ్‌ ప్రచారకర్తలుగా ఉంటారు

అనుష్క తో పరిసరాలు తెలియని శౄంగారం


బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ జన్మదిన వేడుకల్లో పరిసరాలు మరిచి, తమ చుట్టూ ఉన్న సహ నటీనటులను విస్మరించి బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, అనుష్క శర్మ ముద్దుల్లో మునిగి తేలిపోయారట. బ్యాండ్ బాజా బారాత్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు వారిద్దరు కూడా ఆ ఊహాగానాలను ఖండిస్తూ వచ్చారు. కానీ, అవి ఊహాగానాలు కావని, వాస్తవమేనని ఆ జంటే పది మందిలో ముద్దుల మురిపాల్లో తేలిపోయి తేల్చేశారు. చేతులో చేతులు వేసుకుని రణవీర్, అనుష్క షాహిద్ కపూర్ బర్త్ డే వేడుకలకు వచ్చేశారు. అనుష్క నడుం చుట్టూ చేయి వేసి రణవీర్ తిరుగుతూ వచ్చాడట. కలిసి నృత్యం చేశారు. కాస్తా మద్యం కూడా సేవించారు. ఇంకేముంది, ఇరువురి మధ్య ప్రేమ పురులు విప్పింది. అంతే, ఇరువురు పెదవులతో పెదవులు కలిపి ముద్దులు పెట్టుకున్నారు. అందరి నోళ్లల్లో నానుతామని తెలిసి కూడా వారు ఈ పని చేశారు.

రణ్ బీర్ కత్రినా మ్యారేజ్ వచ్చే ఏడాదేనా???


బాలీవుడ్ తార కత్రినా కైఫ్ నటుడు రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి వివాహం జరగవచ్చునని అంటున్నారు. అయితే, ఆ వార్తలను కత్రినా కైఫ్ కొట్టేస్తూ ఇంకా కొంత సమయం పెళ్లి కోసం ఆగవచ్చునని బుకాయిస్తోంది. అయితే, పెళ్లికి ఈ బాలీవుడ్ జంట తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ ఇప్పటికే తన తల్లిదండ్రులు, నాయనమ్మ కృష్ణరాజ్ కపూర్ అనుమతి తీసుకున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కత్రిన తమ కోడలు అవుతుండడం పట్ల రణబీర్ తల్లిదండ్రులు నీతూ సింగ్, రిషీ కపూర్ ఆనందంగా ఉన్నారట. తమ కుమారుడిది మంచి చాయిస్ అని పొగిడేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. కత్రినాను రణబీర్ కపూర్ తన నాయనమ్మ కృష్ణ రాజ్ కపూర్ వద్దకు వెంట పెట్టుకుని వెళ్లి విషయం చెప్పాడట. పాపం, కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌ ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందా, ఏమో.

రాం గోపాల్ వర్మ మిడియా పై గుర్రు సినిమా


ఓ తెలుగు టీవీ చానెల్‌పై గుర్రుగా ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మీడియాపై తన కసి తీర్చుకోనున్నట్లు సమాచారం. ఆ టీవీ చానెల్ తనను అవమానపరిచిందంటూ వర్మ గగ్గోలు పెడుతున్నారు. అందరినీ తన సినిమాలతో ఏకి పారేసే వర్మ ఓ టీవీ చానెల్ తనను ఏకేయడంతో బిత్తరపోయినట్లే కనిపిస్తున్నారు. బెజవాడ రౌడీలు సినిమా కూడా రూపు దిద్దుకుంటోంది. ఇది కల్పిత వాస్తవ కథ కాదట, పూర్తిగా కల్పిత గాథనే అని ఆయన అంటున్నారు. విజయవాడకు చెందిన పలువురు రాజకీయ నాయకులు బెజవాడ రౌడీలు టైటిల్‌ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన రక్తచరిత్ర లాగా కల్పిత వాస్తవ గాథ అని కాకుండా పూర్తిగా కల్పిత కథ అని ముందు నుంచే చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే, ఆయన మీడియాపై తీయబోయే సినిమా కల్పిత కథనో, వాస్తవ కథనో తెలియదు. దీనికి సంబంధించి వర్మ ఆలోచన చేస్తున్నప్పటికీ చేస్తారో, లేదో కూడా తెలియదు.

రాణ ఇచ్చినా బ్యాచ్ లర్ పార్టికి అల్లు అర్జున్[అల్లు అర్జున్ కోసమే రాణ పార్టి]


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరి కొద్ది రోజుల్లో బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం మార్చి 6న హైటెక్స్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈమధ్యే తన చివరి బ్యాచ్ లర్ పార్టీని ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. హీరో రాణా స్పెషల్ గా ఎరేంజ్ చేసిన ఈ పార్టీకి రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, నాగచైతన్య, శర్వానంద్, నవదీప్, నాని సుమంత్, డైరెక్టర్ క్రిష్, సెల్వరాఘవన్, లక్ష్మీప్రసన్న, అర్చన, మధుశాలినిలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అల్లు అర్జున్ ఫ్రెండ్స్ ఈ పార్టీకి హాజరయ్యారు. పారిశ్రామిక రంగానికి చెందినవారు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. అందురూ యువ హీరోలు, యువ హీరోయిన్లు పాల్గొన్న ఈ పార్టీని చాలా గ్రాండ్ గా ఎరేంజ్ చేశారని, కాస్ట్ లీ డ్రింక్స్ తో పార్టీని చాలా ఆనందంగా జరుపుకున్నారని తెలిసింది.

ఇషా చావ్ల తో రాం చరణ్ రొమేన్స్


సినీ పరిశ్రమలో కుర్ర హీరోలు, హీరోయిన్లు సహజంగా రొమాన్స్ పడటం, వాటిని పత్రికలు మీడియా హైలెట్ చేయటం సాధారణంా జరుగుతున్న మేటరు. అయితే హీరో రామ్ చరణ్ తేజ్ ఒక అందాల భామతో వెండితెరపై రొమాన్స్ చేయనున్నారు. ఇంతకి రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోయే ఆ హీరోయిన్ ఏవరంటే? ఈ మధ్యనే రామ్ చరణ్ ‘ప్రేమకావాలి’ సినిమాలో నటించిన హీరోయిన్ ఇషా చవ్లాపై మనసు పారేసుకున్నట్లుంది. తన తదుపరి చిత్రానికి హీరోయిన్ గా ఈ అందాల భామను రికమెండ్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ కి జంటగా ఇషాచవ్లా బాగా ఉంటుందని రామ్ చరణ్ తో పాటు, సినీ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారట. ‘ఇషా చవ్లా’ నటించబోయే ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇషా చవ్లాను రికమెండ్ చేసింది రామ్ చరణేనని ఆమె స్నేహితులు కూడా ఖచ్చితంగా చెప్పటంతో, ఇషా చావ్లా జాతకమే మారిపోతుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఇషా చావ్లా తెగ సంబరపడిపోతుందని సమాచారం.

సల్మాన్ కి హ్యాండ్ ఇచ్చిన కత్రినా


సల్మాన్ ఖాన్‌కు లవ్ కలిసొచ్చినట్లు లేదు. ఎవర్ని ప్రేమించినా చివరికి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. చాలాకాలం క్రితం ఐష్‌ను ప్రేమిస్తే అది కాస్తా బెడిసి కొట్టి ఆ అందాల రాశిని అభిషేక్ తన్నుకెళ్లాడు. ఐష్ పెళ్లయిన పిమ్మట అతని కంట్లో పడ్డ మరో లేడీలవ్ కత్రినా కైఫ్. అయితే ఈమెతో సల్లు నడిపిన ప్రేమాయణం కూడా గత కొంతకాలంగా అతుకుల బొంతలా మారిపోయింది. ప్రస్తుతం కత్రినాకైఫ్ సల్మాన్‌ను తప్పించుక తిరుగుతున్నట్లు భోగట్టా. ఈ సంగతి అటుంచి బాలీవుడ్ కుర్రహీరో రణబీర్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు బాలీవుడ్ సినీజనం ఒహటే చెప్తున్నారు. ఈ విషయం తెల్సిన సల్మాన్ పళ్లు పటపట కొరుకుతున్నాడట. దీంతో సల్మాన్ పేరు చెపితే కత్రినా గడగడా వణికిపోతోందట. త్వరగా పెళ్లి చేసేస్కుంటే ఐష్‌ను వదిలేసినట్లు తనను కూడా వదిలిపెట్టేస్తాడని రణబీర్ వద్ద తెగ గొడవ పెడుతోందట. రణబీర్ తన తల్లిదండ్రులను ఒప్పించడానికి నానా తంటాలు పడుతున్నాడట. వాళ్లేమో... ఎందుకొచ్చిన గోలరా బాబూ.. అనే టైపులో ప్రవర్తిస్తున్నారట. అయితే రణబీర్ మాత్రం చేస్కుంటే కత్రినానే చేస్కుంటానని తెగేసి చెప్పినట్లు భోగట్టా. ఇంత జరుగుతుంటే సల్మాన్ చూస్తూ ఊరుకుంటాడా...?

దీపికా ఎక్స్ పోజింగ్ తట్టుకోలేని రాణ


దగ్గుబాటి రాణ అభిషేక్ బచ్చన్ కలిసి నటిస్తున్న చిత్రం "దం మారో దం"లో హిరోయిన్ లిద్దరు పచ్చి పచ్చి గా రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేశారనివినిపిస్తోంది కాని ఇందులో విశేషామేమిటంటే బిపాషా బసు కంటే దీపికా పదుకొనే మరింత ఘాటుగా కనిపిస్తోందట ఈ కధ మాఫియా రిలేటడ్ గా ఉండటంతో హిరోయిన్ ల ఎంపిక జరుగుతున్నప్పుడు డైరక్టర్ ముందుగానే హిరోయిన్స్ కి కొన్ని స్ట్రిట్ రూల్స్ పెట్టే సరికి అవి తూచ తప్పక ముందే ప్రిపేర్ అయి మరి ఎక్స్ పోజ్ చేస్తున్నారు ఈ చిత్రం లో మరో విశేషమేమిటంటే హిరోయిన్ దీపికా ఒక పచ్చి బూతు సాంగ్ కి అంతే పచ్చిగా ఎక్స్ పోజ్ చేసిందట ఈ పాట కోసం నడుముపై "దం మారో దం"అని టేటూ కూడ వేయించుకుందట ఈ ఒక్క పాతలో ఇంత ఇరగదీస్తే సినిమా అంత ఎంత ఇరగదీశారో హిరోయిన్స్ మరి అంతట హాట్ సెక్స్ ని తట్టుకొ[దగ్గుబాటి రాణ] గలిగాడ అని టాలీవుడ్ వర్గాల గుసగుస

పౌరణికాలు అచ్చిరాని బాలయ్య ఇద్దర్ని చంపేశాడ???


యువరత్న బాలకృష్ణ సినిమాల్లో దుఖ:రసాన్ని పోషించటం అందరూ చూస్తుంటారు. కానీ నిజ జీవితంలో బాలకృష్ణ కన్నీరు కార్చారని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. బాలకృష్ణ విడిగా ఎంతో ధైర్యం మొండిగా ఉంటాడని ఫిలిం పరిశ్రమకు తెలుసు. అయితే ప్రముఖ సినీ రైటర్, సాహిత్యవేత్త, ముళ్లపూడి వెంకటరమణ గురువారం(24.02.11)మరణించాడని వార్త వినగానే, బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యి, ఒక్కసారి మౌనముద్రలో మునిగిపోయి, కంటి వెంట కన్నీరు కార్చాడని బాలకృష్ణ సన్నిహితులు చెప్పారు. ‘శ్రీరామ రాజ్యం’ సినిమాకు ముళ్లపూడి గారు రైటర్ గా బాపు దర్శకుడిగా, బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ముళ్ళపూడి వెంకటరమణ మరణం బాలకృష్ణను కలిచివేసిందని సినీ జనాలు అనుకుంటున్నారు.
బాలకృష్ణ ఎందుకో పౌరాణికాలు అచ్చిరావటం లేదని, గతంలో ‘విరాటపర్వం’ సినిమా మొదలు పెట్టినప్పుడు పాంచాలి పాత్రకు ‘సౌందర్య’ను బుక్ చేశారు. ఆ తర్వాత సౌందర్య హెటికాప్టర్ ప్రమాదంలో మరణించడం వలన ఆ సినిమా ఆగిపోయింది. ఈ రోజు శ్రీ రామ రాజ్యం సినిమాకు రచన చేసిన ముళ్లపూడి గారు వెళ్లటం, బాలకృష్ణ సెంటిమెంటుగా ఫీలయ్యి బాధపడుతున్నాడని ఫిలింనగర్ న్యూస్..

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యెల్లొ ఫ్లవర్స్ రెండవ చిత్రం


'కిక్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సమర్పణలో 'మిరపకాయ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన ఎల్లోఫ్లవర్స్‌ బేనర్‌లో 'కిక్‌' సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రమేష్‌ పుప్పాల తమ ద్వితీయ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత రమేష్‌ పుప్పాల మాట్లాడుతూ - ''మా బేనర్‌లో వచ్చిన తొలి చిత్రం 'మిరపకాయ్‌'ను 114 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకునేలా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అతిత్వరలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మా ద్వితీయ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం. సురేందర్‌రెడ్డి చెప్పిన స్టోరీ లైన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. ప్రముఖ యువ హీరో ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తారు'' అన్నారు. కో-ప్రొడ్యూసర్‌ వి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''కిక్‌లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన మా ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ సమర్పణలో సురేందర్‌రెడ్డితో ఈ చిత్రం చేయడం హ్యాపీగా వుంది. భారీ తారాగణంతో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ చిత్రం రూపొందుతుంది'' అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌, కో-ప్రొడ్యూసర్‌: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: రమేష్‌ పుప్పాల, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.

బ్రహ్మి రవితేజ ఒకే పక్క పై

బ్రహ్మి రవితేజ ఒకే పక్క పై [veera working stills]

శక్తి సినిమా టైటిల్ కార్డ్స్ లో జూనియర్ NTR పేరు మారనుందా??


జూనియర్ యన్.టి.ఆర్ గా పిలవ బడే ఇతడికి మరో పేరు ఉంది అది యంగ్ టైగర్ చిరంజీవి కి మెగస్త్టార్ ఎలా ఫ్యాన్స్ ద్వార వచ్చిందో అలాగే జూనియర్ NTR కి అలా వచ్చినా పేరే యంగ్ టైగర్ కాని శక్తి సినిమా ప్రొడ్యుసర్ తన శక్తి సినిమా ఆడియో ఫంక్షన్ లో జూనియర్ NTR కి మరో పేరు అందించాడు అది ఏమిటంటే "నవ నట సార్వబౌముడు "

మళ్ళి రాజమౌళి తో సునిల్


సునిల్ అంటే గుర్తుకొచ్చేది[మొదట్లొ]కెలెడియన్ గా లేదా అందాల రాముడు సినిమా తో మంచి డ్యాన్సర్ గా కాని ఇప్పుడిప్పుడే సునిల్ బిజీ హిరోగా మారుతున్నాడు రాజ మౌళి దర్శకత్వం వహించిన తరవాత పెద్ద హిరోలెవ్వరికి మంచి చిత్రాలు లభించలేదు కాని సునిల్ కి అందుకు విరుద్దంగా రాం గోపాల్ వర్మ వంటి పెద్ద డైరెక్టర్ తో చాన్స్ కొట్టేసాడు ఈ సినిమా తో సునిల్ హిరోఇజం ఆగి పోతుందని కొందరు విమర్శకులు అనుకున్నారు.వారి విమర్శలు తారుమారు చేస్తు సునిల్ మరోసినిమా చేయబోతున్నాడు దిల్ రాజు సునిల్ తో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు

ఈసినిమా ముందుగా శాన్వి ప్రొడక్షన్ వారు తీయవల్సి ఉండగా వారి ఇతర ఫిలంస్ తో బిజిగా ఉండటంతో ఆ చాన్స్ దిల్ రాజు తీసుకున్నాడు ఈ సినిమా మరి కొద్ది రోజులలో సెట్స్ పై కనపడబోతోంది ఈ సినిమా యస్.యస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా కొత్త కొత్త లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోబోతోంది రాజస్థాన్ లో కూడ ఈ సినిమా పేరు నెపొలియన్

రజనీతో పోటి పడిన జూనియర్ యన్.టి.ఆర్


దక్షిణాది సినీరంగంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు ఎవరయ్యా అంటే..?రజనీకాంత్ ఒక్కడే..!అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే పోయిన సంవత్సరం ‘అదుర్స్’, ‘బృందావనం’ సినిమాలు పెద్ద హిట్ అవ్వటం, రజనీకాంత్ సినిమాలకు ధీటుగా జూ ఎన్టీఆర్ సినిమాలకు కలెక్షన్స్ రావడంతో, ఎన్టీఆర్ రజనీకాంత్ తో సమాన స్థాయిని పొందాడు. నటనలో కాదులెండి కేవలం రెమ్యునరేషన్ విషయంలో. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడు, తన తదుపరి చిత్రానికి 9కోట్లు తీసుకొని, వచ్చే నెలలో జరగబోయే షూటింగ్ లో పాల్గొంటున్నాడని, సినీ సర్కిల్స్ లో గుసగుసలు. తమిళ సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ కూడా తన రెమ్యునరేషన్ విషయంలో ఇలాంటి గ్రాఫ్ నే అవలంభించాడు. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోయే సినిమాకు ఎన్టీఆర్ కు 9కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ 9కోట్ల రెమ్యునరేషన్ లో బెంగళూరు హక్కులు కూడా ఉన్నాయి. తెలుగు స్టార్స్ కు బెంగుళూరులో మంచి మార్కెట్ ఉంది. జూ ఎన్టీఆర్ కు కూడా బెంగుళూరు మార్కెట్ కొన్ని కోట్లు ఉందని ఫిలింనగర్ న్యూస్. ‘ఎన్టీఆర్ ‘శక్తి’ఆడియో వేడుకను ఘనంగా జరుపుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సినిమాకు బెంగళూరు కు సంబందించి 7కోట్లకు పైగానే బిజినెస్ అయ్యింది. ఈ బిజినెస్ తో జూ ఎన్టీఆర్ కు తన రెమ్యునరేషన్ ను పెంచడానికి ఎంతో ఉపయోగపడింది. కావున సౌత్ ఇండియా హీరోలలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టాడు. ‘బృందావనం’అదుర్స్’కు వచ్చిన గ్రాస్ 30కోట్ల పైగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ‘శక్తి’ సినిమాకు నైజాం తరుపున 10కోట్ల బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. అందుకే జూ ఎన్టీఆర్ తదుపరి సినిమాకు 9కోట్లు అడగటం, ఇవ్వటం జరిగాయి.

చనిపోయినా తరగని ఇమేజ్ [సెక్స్ బాంబ్]


హాలీవుడ్ జనాభాకు బాగా అత్యంత ప్రీతి పాత్రమైన పేరు మార్లిన్ మన్రో. ముప్పయి ఆరు సంవత్సరాల వయసులోనే చనిపోయినటువంటి మార్లిన్ మన్రో ప్రపంచం మొత్తం మీద ఓ బ్రాండ్‌ని సంపాదించుకుంది. ఏమిటా ఆ బ్రాండ్ అనిఅనుకుంటున్నారా..అదేనండీ బాంబ్ షెల్ అనే బ్రాండ్. మార్లిన్ మన్రో చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ హాలీవుడ్‌లో ఇప్పటికి కూడా మార్లిన్ మన్రో అంటే చచ్చిపోయేంత అభిమానులు ఉన్నారు. ఇటీవల కాలంలో యుయస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేబుల్ నెట్ వర్క్ అయినటువంటి రీల్జ్ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. పోల్ ఏంటంటే 'హాలీవుడ్ బాంబ్ షెల్ ఎవరు అనేది'..ఈ పోల్‌ని బ్రిటిష్ యాక్టరస్ ఎలిజిబెత్ టేలర్ దగ్గరుండి మరీ పర్యవేక్షించడం జరిగింది. మొత్తం ఎనభైవేల మంది అభిమానులు పాల్గోన్నటువంటి ఈ పోల్‌లో ఎక్కువమంది మార్లిన్ మన్రోకి హాలీవుడ్ సెక్స్ బాంబ్ గా ఓటువేసి మొదటి స్దానం కల్పించడం జరిగింది.

ఒకేసారి బొద్దుగా సనంగా అవలేక తంట పడుతున్న స్టార్ హిరోయిన్


కథానాయిక అనుష్కకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే, ఓసారి సన్న పడాలి... మరోసారి కాస్త ఒళ్లు తెచ్చుకుని బొద్దుగా తయారవ్వాలి. ఎందుకంటారా... తానిప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నటిస్తోంది కదా... తమిళ ప్రేక్షకులేమో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటేనే ఇష్టపడతారు. సన్నగా నాజూగ్గా వుంటే వాళ్లకి నచ్చదు. మన తెలుగు వాళ్లకైతే, బొద్దుగా వుంటే నచ్చదు. మెరుపు తీగలా, సన్నజాజి తీగలా వుండాలి. ఇప్పుడీ ఇబ్బందిని అనుష్క ఎదుర్కుంటోంది.
‘కోలీవుడ్ కి, టాలీవుడ్ కీ ఒకేసారి డేట్లు ఇస్తే ఇక మా పని అయిపోయినట్టే. బాడీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని రెండు షూటింగులకీ కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. సినిమాలో హీరోలతో కెమిస్ట్రీ పండాలంటే శరీర సౌష్టవం కూడా ముఖ్యమే. తమిళ్ సినిమా షూటింగుకి రెడీ అయ్యే ముందు బాగా తిని ఒళ్లు పెంచాలి. మళ్లీ తెలుగు షూటింగుకి వచ్చే ముందు డైటింగులు, వర్కౌట్లు చేసి సన్నబడాలి. ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఇలా వుంటాయి మా బాధలు’అంటోంది. అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట ఈ యోగా టీచర్. ప్రస్తుతం అనుష్క, తమిళంలో విజయ్ తో నటించిన ‘పులివేట’లో అనుష్క స్టిల్స్ హాట్ హాట్ గా మారాయి. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే రజనీకాంత్ నటిస్తున్న ‘రాణా’చిత్రంలోనూ మంగళూరు భామ ఛాన్స్ లు మీద ఛాన్సులు కొట్టేసినట్టు కోలీవుడ్ సమాచారం

బ్రహ్మిగాడి కధ


వరుణ్ సందేశ్ కొత్త సినిమా తెరపైకి రావటానికి రెడి అవుతోంది వరుణ్ సందేశ్ పూనం కౌర్ మరియు అస్మిత ప్రధాన నటినటులుగా ప్రారంభం అవుతున్న ఈ సినిమా పేరు బ్రహ్మిగాడి కధ ఈ సినిమా ని పి.రాం మోహన్ రావు నిర్మిస్తున్నాడు ఈ సినిమా దర్శకత్వం ఈశ్వర్ రెడ్డి ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతు ఈ సినిమా కధ రొమేంటిక్ ఫ్యామిలి డ్రామ తో సాగుతుందని చెబుతున్నాడు ప్రె ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా సినిమా యొక్క పూర్తి క్రూ ని ప్రకటించాల్సి ఉంది వరున్ సందేశ్ కి కొత్త బంగారు లోకం తరవాత "కుదిరితే కప్పు కాఫి " యావెరేజ్ అవటంతో ఈ సినిమా పై అన్ని ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమా తో తన కెరీర్ మంచి హిట్ కొడుతుందని అంటున్నాఉ......!!!!!

i hate balayya కుపి లాగిన బాలయ్య


ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బాలయ్య ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని సిడ్నీ నుంచి నడుపుతున్నట్లు పోలీసులు కనుక్కున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయలేదు. నిర్వాహకులకు పోలీసులు నోటీసులు పంపించారు. సిడ్నీలోని తెలుగువారే ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఫిర్యాదు వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తానో సినిమా ఆర్టిస్టునని, సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నానని, సమాజంలో తనకో హోదా ఉందని ఆయన చెప్పుకున్నారు. తాను సినీ పరిశ్రమలో 30 ఏళ్లుగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఓ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడినని ఆయన అన్నారు. ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు. తన పార్టీ క్యాడర్, అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను కోరారు.

చరణ్ ని తొక్కలేక వరుణ్ తేజ్ ని తొక్కుతున్న అల్లు అరవింద్


సినీ పరిశ్రమలో ఏది చేయాలన్న ఒక వ్యక్తికే సాద్యం అవుతుంది. ఆ వ్యక్తి ఏవరోకాదు! అల్లు అరవింద్, మెగాస్టార్ బావమరిది. సినీ పరిశ్రమలో తనకు ఎదురు తిరిగినా, సినీ వ్యాపారంలో అడ్డువచ్చిన, తన మేథా శక్తితో వాళ్లని అవలీలగా ఎదుర్కొంటాడు. కానీ అల్లు అరవింద్ ఎవరినో అణగతొక్కటం అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు తన కుటుంబంలోనే తన దగ్గర బందువునే అడ్డుకోవటంతో ఫిలిం పరిశ్రమలోని ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘నాగబాబు’ తన కుమారుడు ‘వరుణ్ తేజ్’ను హీరో చేయాలని, అన్నిఏర్సాట్లు చేసుకున్నాడు. నాగబాబు ప్రపోజల్ కు మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్, ఆశ్శీస్సులు నిండుగా ఉన్నాయి అయితే ‘వరుణ్ తేజ్’ను వెండితెరకు పరిచయానికి అడ్డుతగులుతుంది ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ని ఫిలింనగర్ లో చెప్పుకోవటమే కాకుండ, నాగబాబు స్నేహితుల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అల్లు అరవింద్ మెగాస్టార్ ను ఒప్పించి, తనదైన శైలిలో వరుణ్ తేజ్ ను వెండితెర ప్రవేశానికి ఆటంకంగా నిలిచాడట. అల్లు అరవింద్ కు వరుణ్ తేజ్ ను వెండితెరకు పరిచయం చేయకుండేందుకు అడ్డుకుంటున్నాడట. అరవింద్ ఉద్దేశం ఏంటి? ఫిలింనగర్ న్యూస్ ప్రకారం మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తేజ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ తగ్గిందని అరవింద్ అభిప్రాయపడుతున్నాడట. అల్లు ఈ సమయంలో వరుణ్ తేజ్ సినీ రంగప్రవేశం చేస్తే అల్లు అర్జున్ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉంటుందని అల్లు అరవింద్ ఆలోచనలు. కావున అల్లు అర్జున్ ని పూర్తి స్థాయిలో స్టార్ ను చేసిన తర్వాత, వరుణ్ తేజ్ గురించి ఆలోచిద్దామనే అభిప్రాయం ఉన్నట్లు పుకార్లు. పైగా వరుణ్ తేజ్ ఎంతో గ్లామరస్ గా సినిమాకి సరిపోయే ఫిజిక్ ఉండటంతో, వరుణ్ తేజ్ సినీరంగంలోకి వస్తే అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఉంటుందని, వరుణ్ తేజ్ కు సినీ ప్రవేశానికి ఆటకంగా అల్లు అరవింద్ ఉన్నాడని ఫిలింనగర్ కబుర్లు.

కామెంట్లు చేసేవారికి థ్యాంక్స్. :ileana


ఫ్లాప్‌లు నన్నేం చేయలేవు. ఒకవేళ అవి ఎదురైతే... వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. రెండుమూడు ఫ్లాపులకే కరిగిపోయే ఇమేజ్ కాదు నాది. కిక్ కి ముందు ఇలియానా పనైపోయిందని చాలామంది అన్నారు. అలాగే శక్తి కి ముందు కూడా ఇప్పుడు కొంతమంది అంటున్నారు. ఇలాంటి కామెంట్లు ఎదురైనప్పుడల్లా... సముద్ర కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడినట్లుగా ఉంటోంది నా కెరీర్. అందుకే అలాంటి కామెంట్లు చేసేవారికి థ్యాంక్స్. నా శక్తి ఏంటో తెసుస్తుంది. త్వరలో నా సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పుకొచ్చింది ఇలియానా.ప్రస్తుతం ఇలియానా.. ఎన్టీఆర్‌తో శక్తి , రాణాతో నేనూ నా రాక్షసి , పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తోంది. రెమ్యునేషన్ కూడా పెంచిన ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రవేశించి హిట్స్ కొడతానని నమ్మకంగా చెప్తోంది

tv9 రాం గోపాల్ వర్మ క్రిమినల్ కేసు [


రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా చరిత్రకి తనదైన ముద్ర వేసినటువంటి దర్శకుడు. అలాంటి రామ్ గోపాల్ వర్మపై ఇటీవల టివి9 ఓ కధనం ప్రసారం చేసింది. దానిపేరు రామ్ ఢమాల్ వర్మ. సాధారణంగా మెరుగైన సమాజం కోసం ఛానెల్ పెట్టుకున్నామని తమ గురించి చాలా గోప్పగా చెప్పుకునే ఛానెల్స్ మాత్రం వాళ్శకి ఎవరైనా గిట్టని వారిపై మాత్రం ఎప్పటికప్పుడు బురద చల్లుతూ ఓ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పోందుతున్నారనేది వాస్తవం. సమాజంలో వాళ్శు టాప్ రేటేడ్ ఛానెల్ అనే డిగ్నిటీ మర్చిపోయి ఒక్కోసారి వారియొక్క పర్సనల్ విషయాలపై ఎక్కువ ఆశక్తి చూపిస్తూఉంటారు. ఇటీవల కాలంలో దీనికి ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ. ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి అప్పల్రాజు సినిమాపై ఓ ఛానెల్ విరుచుకుపడింది. రామ్ ఢమాల్ వర్మ అంటూ అతనిపై గంట సేపు ప్రోగ్రాం వేసి వర్మ మీద ఉన్నటువంటి కసిఅంతా తీర్చుకున్నారు. వర్మపై వారికి ఏ పర్సనల్ గ్రడ్జ్ ఉందేమో తెలీదు గానీ, తనపై వచ్చినటువంటి విమర్శలకు సరదాగా కౌంటర్స్ ఇచ్చేటటువంటి వర్మ ఈసారి మాత్రం ఆఛానెల్‌పై విరుచుకుపడ్డారు. ఏకంగా ఆఛానెల్‌పై క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా సిద్దమయ్యారని సమాచారం.


తీన్ మార్ లో చిరు ది ఒకటుంది :ఎంటది


పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ సినిమా విడుదలకి దగ్గరయ్యే కొద్దీ కొత్త కొత్త విశేషాలు బయటకి వస్తూ చిత్రంపై క్రేజ్ ని పెంచేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని ‘చిలుకా క్షేమమా’పాట రీమిక్స్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన ఈ పాటంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. చిరంజీవి పాటల్లో తనకేది ఇష్టమైన పాటని అడిగితే ‘చిలుకా క్షేమమా’ గురించి పలు మార్లు పవన్ చేప్పాడు. ఇప్పుడా పాటని మణిశర్మ చేత రీమిక్స్ చేయించుకుని తన ఇష్టాన్ని మరోసారి చాటుకుంటున్నాడు. రీమిక్స్ స్సెషలిస్ట్ గా పేరు పడ్డ మణిశర్మ ఈ పాటకి సరికొత్త రంగు,రుచి, వాసనలని ఇస్తాడని ఆశించవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, గుడంబా శంకర్ చిత్రాలకు చక్కటి సంగీతాన్ని అందించి ప్రేక్షకుల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. పవన్ సినిమాల్లో రీమిక్స్, ఇంగ్లీష్ పాటలుంటే అవి హిట్ అయిన సందర్బాలెక్కువగా ఉన్నాయి. ఆ సెంటిమెంట్స్ అన్నీ ‘తీన్ మార్’లో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. అల్లు అర్జున్ వివాహ వేడుక ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ సాంగ్స్ షూటింగ్ లో పాల్గొంటాడు.

ఫ్లాప్ అయినా హాట్ హాట్ ఫొటో షూట్


త్రిష ఈమధ్య రెచ్చిపోయి మరీ పత్రికలకి పోజులిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మేగజైన్లకే కాకుండా, ముంబై నుంచి వచ్చే మేగజైన్లకి కూడా హాట్ హాట్ పోజులిస్తూ అందరి మతులూ పోగొడుతోంది. ఈ ఫొటో సేషన్లకి ప్రత్యేకంగా టైం కూడా కేటాయిస్తోంది. త్రిష ఇప్పుడు ఎందుకిలా రెచ్చిపోతూ పోజులిస్తోందన్న విషయాన్ని ఎంక్వైర్ చేస్తే అసలు విషయం బయటపడింది. తన సెక్సీ లుక్కులతో బాలీవుడ్ దృష్టిలో పడడానికట! తను నటించిన తొలి హిందీ సినిమా 'కట్టా మీటా' పెద్ద ఫ్లాప్ అవడంతో ఈ చెన్నై భామ ఆమధ్య బాగా అప్ సెట్ అయింది. మళ్లీ అంతలోనే తేరుకుని, ఏది ఏమైనా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిందట. అందుకని అక్కడ సినిమా అవకాశాలు పొందడానికి ఇప్పుడిలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. 'సౌత్ కీ, హిందీకీ కాస్త తేడా వుంది. అక్కడ సక్సెస్ కావాలంటే బాగా హాట్ గా కనపడాలి. లేకపోతే కష్టం. అందుకే ఈ ప్రయత్నాలు' అంటోంది నవ్వుతూ. మరి, వ్రతం చెడినా త్రిషమ్మకు ఫలితం దక్కుతుందో, లేదో చూద్దాం!

నమిత గ్లామర్ ని సైతం పట్టించుకోలేదు యువత


గ్లామర్ అందాలను ఆరబోసే పాత్రల్లో నటించేందుకు ఉత్సుకత చూపే నమిత మళ్లీ అటువంటి పాత్రలో నటించింది. ఆమధ్య కిరణ్ రాథోడ్ "హైస్కూల్" చిత్రంలో స్టూడెంట్‍తో రొమాన్స్ చేసినట్లు నటించినట్లుగానే నమిత కూడా 'హైస్కూల్ 2'తో ముందుకొచ్చింది. కానీ ప్రేక్షకులు బడ్జెట్ మూడ్‌‌లో ఉన్నారేమోగానీ పట్టించుకోలేదు. ఇంతకీ ఈ సినిమాలో నమిత పాత్ర ఏంటయా... అంటే, విధవరాలి పాత్ర. విధవరాలైన మహిళను సమాజం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందన్న నేపథ్యంతో తెరకెక్కిన ఈ హైస్కూల్ 2 చిత్రంలో నమిత కావల్సిన మేరకు గ్లామర్ అందాలను ఒలికించింది. కానీ ప్రేక్షకులు ఎందుకనో ఈ చిత్రాన్ని అంతగా పట్టించుకోలేదంటున్నారు సినీ విశ్లేషకులు. పాత్ర ఎంపికలో లోపమా...? హైస్కూల్ 2 టైటిల్ శాపమా...? ఏమిటో మరి.

ఆది శంకరాచార్యుని చరిత్రను సెల్యూలాయిడ్‌ కావ్యంగా తీర్చే ప్రయత్నం:జె.కె.భారవి......!




అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు వంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జె.కె.భారవి ఈ సారి పెన్నుతో పాటు మెగాఫోన్‌ పట్టుకోబోతున్నారు. భారతీయ సనాతన ధర్మం అడుగంటుతున్న దశలో ఒక సంచలన ఉద్యమస్ఫూర్తిగా ఆవిర్భవించి... అద్వైత విప్లవంతో హిందూ ధర్మాన్ని అఖండంగా అప్రతిహతంగా నిలబెట్టిన జగద్గురువు ఆది శంకరాచార్యుని చరిత్రను సెల్యూలాయిడ్‌ కావ్యంగా తీర్చిదిద్దడానికి జె.కె. కంకణం కట్టుకున్నారు. గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ నిర్మాణంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ అద్భుత చిత్రానికి టాగ్‌లైన్‌... 'ఎ ఫిల్మ్‌ ఫర్‌ యూత్‌'. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు 4 మార్లు పాదయాత్ర చేసి తన ప్రవచనాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆది శంకరుడు జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఇంత లేత వయస్సులోనే శంకరుడు అంచెలంచెలుగా జగద్గురువుగా ఎలా మారాడనే అంశమే ఈ చిత్ర కథనం. 'ఎంగస్టర్స్‌' తలచుకుంటే కానిది ఏదీ ఉండదనేది ఈ కథలో సందేశం. 'యూత్‌'కి ఓ కౌన్సిలింగ్‌ క్లాస్‌లా పర్సనాలిటీ డవలెప్‌మెంట్‌కి పనికి వచ్చేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం స్క్రీన్‌ప్లే నచ్చి... ఇప్పటకి ఐదుగురు హీరోలు... ఈ సినిమాలో నటించడానికి అంగీకరించడం విశేషం. ఒక అద్భుత పాత్ర కోసం జె.కె.భారవికి అత్యంత సన్నిహితుడైన మరో హీరోతో సంప్రదింపులు జరుగుతున్నట్టు భోగట్టా. ఆరుగురు హీరోలతో...ముగ్గురు హీరోయిన్లతో... అనేకమంది సీనియర్‌ నటీనటులతో, 'తారమేళా'లా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకాబోతున్న 'శ్రీ జగద్గురు ఆదిశంకర'. తెలుగు చలన చిత్ర చరిత్రలో రియల్‌మల్టీ స్టారర్‌గా నిలిచిపోతుంది. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు జె.కె.భారవి ప్రత్యేక దీక్షాధోరణి స్వీకరించబోతున్నట్టు తెల్సింది. త్వరలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

2/27/11

shakti audio function details




దీపికా పదుకొనె తో రణ్ బీర్


sneha ullal dropped in tamil vaanam remake of telugu vedam


తెలుగులో విజయం సాధించిన వేదం చిత్రాన్ని తమిళంలో వానం టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగితి తెలిసిందే. ఈ చిత్రంలో మొదట స్నేహ ఉల్లాల్ ని దీక్షాసేధ్ పాత్రలో తీసుకున్నారు. తెలుగులో అల్లు అర్జున్ ప్రియురాలి పాత్ర అది. అల్లు అర్జున్ పాత్రను శింబు చేస్తున్నారు. అయితే ఇప్పుడామెను తొలగించి జాస్మిన్‌ను పరిచయం చేస్తున్నారు.జాస్మిన్ ఓ డిల్లీ మోడల్. శింబు, భరత్ అనుష్క తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన క్రిష్ ఇక్కడ కూడా దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, స్నేహా ఉల్లాల్ కాంబినేషన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు చిత్రీకరించారు. ఇప్పుడా సన్నివేశాలను నుంచి తొలగించి శింబు, జాస్మిన్‌లతో చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ నాలుగు రోజులలో పూర్తవుతుందని చిత్రాన్ని ఏప్రిల్‌లో వేసవి విడుదలగా ఈ చిత్రాన్ని ప్లాన్ దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

Mohan babu in bejawada rowdilu


రక్త చరిత్రలో ఎన్టీఆర్ పాత్రకు అప్పట్లో మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ అడిగన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు అప్పుడు ఆ పాత్రను రిజెక్టు చేస్తే శతృఘ్నసిన్హా చేసారు.ఇప్పుడు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ త్వరలో రూపొందించనున్న బెజవాడ రౌడీలు చిత్రంలో మోహన్ బాబుకి కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. మోహన్ బాబు కూడా వర్మ దర్సకత్వంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న..వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న దొంగలముఠాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు. నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.

bejawada rowdilu tittle song free download

మగధీర హింది హిరో ఎవరంటే


రామ్ చరణ్ తేజ్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన మగధీర చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రను రణబీర్ కపూర్ చేస్తున్నాడు. గజనీ నిర్మాత మధు మంతెన ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకుకెళ్థున్నారు. మెఘల్ సామ్రాజ్యంలో జరిగే కథగా ఈ ప్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళినే ఈ చిత్రానికి దర్శకుడుగా ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు దాదాపు తొంభై కోట్లు వరకూ ఖర్చు అవుతుందని ప్రాధమిక అంచనా. ఇక హిందీలోనూ ఈ చిత్రం అధ్బుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుంది.

mahesh ok 4 mani


ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో తాను మణిరత్నం తో సినిమా చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసారు. ఆయన ఏం ట్వీట్ చేసారంటే.. పెద్ద న్యూస్ ఏమిటంటే..మణి సార్ ని కలవటం. అవును..లెజండరీ మణిరత్నం ని కలవటం. నా కల నెరవేరిందనిపించింది. ఆయన సినిమా చేస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా ఆనందకరమైన రోజు. ఎప్పుడూ మీ సపోర్ట్ కావాలి అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు..శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

shakti first look and story


జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన చిత్రం 'శక్తి'. ఈ చిత్రం కథ గురించి చెబుతూ దర్సకుడు మెహర్ రమేష్..ఈ చిత్రం కథ శక్తి పీఠాల నేపధ్యంలో సాగుతుంది అన్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహమణ్యం ఈ చిత్రంలో శక్తి పీఠాల ప్రాశస్త్యం గురించి వివరిస్తారని చెప్పారు. ఇక ఎన్టీఆర్ రోల్ ..ఐదు డైమన్షన్స్ లలో ఉంటుందని అన్నారు. ఇక శక్తి చిత్రం మార్చి 30 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో నిన్న (ఆదివారం) రాత్రి హైదరాబాద్ లో ని హైటెక్స్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, ఇలియానా, మెహర్ రమేష్, అశ్వనీదత్ జాకీ షరీఫ్, సుమ, దయానంద్, మణిశర్మ, నాని, మంజరి, మంజు భార్గవి, మెహర్ రమేష్, బోయపాటి శ్రీను, కే.ఎస్.రామారావు, గణేష్ తదితరులు హాజరయ్యారు.తోలి సీడీని ఎన్టీఆర్ విడుదల చేసి మణిశర్మ కి ఇచ్చాడు. ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి, జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.



2/26/11

dongala muta trailer

ఆదిశంకరుడుగా నటించటానికి సిద్దార్ద


గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు,మంజునాధ వంటి భక్తి రస చిత్రాలకు రచన చేసిన జె.కె.భారవి త్వరలోడైరక్టర్ గా మారబోతున్నారు. ఆయన దర్శకత్వంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం రూపొందబోతోంది.ఈ చిత్రానికి హీరోగా అంటే ఆదిశంకరుడుగా నటించటానికి సిద్దార్దని సంప్రదించారని తెలిసింది. ప్రముఖ దర్సకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందే ఈ చిత్రంలో సిద్దార్ధ అయితే ఫెరఫెక్ట్ గా సూట్ అవుతాడని అంటున్నారు. రాఘవేంద్రరావు కుమారుడు డైరక్ట్ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రంలో సిద్దార్ద చేసి ఉన్నాడు.కాబట్టి సిద్దార్ధ ఓకే అంటాడని భావిస్తున్నారు.
అయితే రాఘవేంద్రరావు దర్శకత్వం అయితే ఓకే గానీ భారవి దర్శకత్వంలో నటిస్తే ఎంతవరకూ తనకు ఉపయోగపడుతుందని సిద్దార్ధ బావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం యువతకు పర్శనాలిటి డవలప్ మెంట్ క్లాస్ లుగా ఉంటుందంటున్నారు. ఈ విషయంపై భారవి మాట్లాడుతూ ''ఆది శంకరుడు జీవించింది 32 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఆయన జగద్గురువుగా ఎలా మారారు అనేది చిత్ర కథాంశం. యువతకి ఆయన జీవితం ఆదర్శం కావాలి అనే సందేశంతో రూపొందిస్తున్నాం. ఆరుగురు హీరోయిన్స్ , ముగ్గురు హీరోలు ఈ చిత్రంలో నటిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

బోయపాటి తో రాం చరణ్


మగధీర’ లాంటి విజయాన్ని చవి చూసిన తర్వాత ‘ఆరెంజ్’లాంటి ప్లాప్ ని చవిచూశాడు రామ్ చరణ్.'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత ఏ సినిమా చేయాలన్న విషయంలో రామ్ చరణ్ తేజ మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్నట్టుగా 'మెరుపు సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా లేదు. మాస్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో చరణ్ రకరకాల కథలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో 'సింహా' చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన కథ చరణ్ కు ఎంతగానో నచ్చిందనీ, దాంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది. ఇది పక్కా మాస్ సినిమాగా రూపొందుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎవరు నిర్మిస్తారూ అన్నది త్వరలో తెలుస్తుంది. బోయపాటా ఇప్పటివరకు దర్శకత్వం వహించిన భద్ర, తులసి, సింహా మూడు హిట్టఅయిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో చేస్తే హిట్ ఖాయం అని భావించి, కథ నచ్చి చరణ్ ఈ చిత్రం చేయాలనుకొంటున్నాడట. వీరి కాంబినేషన్ లో పక్కా మాస్ మసాలా చిత్రం రానుందని మెగాఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. బోయపాటి ప్రస్తుతం యన్టీఆర్ తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఈమధ్యే లాంచనంగా ప్రారంభమైంది.

కెల్లీ బ్రూక్ ఇచ్చినటువంటి ఆపోజలు మరీ దారుణం





హాలీవుడ్‌లో కెల్లీ బ్రూక్ ది ప్రత్యేకమైన స్దానం. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో కెల్లీ బ్రూక్ ఓ డియోడ్రెంట్ ప్రమోషన్ లో భాగంగా ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. కెల్లీ బ్రూక్ ఇచ్చినటువంటి ఆపోజలు యావత్ యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆజాను బాహురాలైనటువంటి కెల్లీ బ్రూక్‌ని ఆయాడ్‌లో చూసినటువంటి అభిమానులు అవాక్కయ్యారు. దానికి కారణం కెల్లీ బ్రూక్ ఆయాడ్‌‍లో నిజంగా ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా కెల్లీ బ్రూక్ నటించినటువంటి ఆన్ లైన్ గేమ్ ఫాలిన్ ఏంజిల్ కూడా బాగా ప్రాచుర్యం పోందింది. ఈ ఆన్ లైన్ గేమ్‌లో కెల్లీ బ్రూక్ అభిమానులు పజిల్స్‌కి ఆన్సర్స్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈఆన్ లైన్ గేమ్ అన్ని కూడా కెల్లీ బ్రూక్ నటించినటువంటి డియోడ్రెంట్ యాడ్ క్యాంపెయిన్‌లోభాగమేనని చివరకు అభిమానులు తెలుసుకున్నారు. ఈసందర్బంలో కెల్లీ బ్రూక్ సరదాగా మాట్లాడుతూ అందరూ నన్ను స్వర్గంలో నుండి దిగివచ్చిన దేవకన్యలా అంటున్నారు. ఈదేవకన్యని ఇక్కడున్న వాళ్శలో ఎవరు నన్ను టెంప్ట్ చేస్తారో తెలుసుకోవాలని ఉద్దేశ్యంతో ఉన్నానని నవ్వుతూ అన్నారు. ఇకపోతే ఈయాడ్‌లో నటించినందుకుగాను కెల్లీ బ్రూక్‌కు వన్ మిలియన్ పౌండ్స్ చెల్లించారని సమాచారం.

తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya


ఈ మధ్య కాలంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా బాలకృష్ణ మీదో లేదా జూ.ఎన్టీఆర్ మీదో జోక్ వస్తోంది. సర్దార్జీల జోక్ లను బాలకృష్ణకు అనువర్తించి ఈ జోక్ లను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ పై ఇలాంటి జోక్ లు వికృతమైన ఫోటోలతో http://www.ihatebalayya.com/ అనే వెబ్ సైట్ రన్ అవుతోంది. ఈ విషయం తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్నవారితో పాటు వెబ్‌సైట్ నిర్వాహకుల ను పట్టుకుని కేసు పెట్టడానకి వెతుకుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

సెక్సీ గా ఉంటేనే నన్ను చూస్తారు :charmi


మొదట్లో చాలా పద్ధతిగా ఫ్యామిలీ లుక్ తో కనిపిస్తూ కొన్ని సినిమాలు చేశాను. వాటి ఫలితం ఏమైందో మీకు తెలుసు. అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. అందరికీ తెలుసు ఛార్మి చాలా అందంగా ఉంటుంది, గ్లామర్‌గా కనిపిస్తుంది అని. అలా భావించి థియేటర్లకు వచ్చేవారికోసమే సెక్సీ గా కనిపిస్తాను. వాళ్లని కూడా సంతృప్తిపరచాలి కదా అంటోంది చార్మి. ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకునే మంగళ చిత్రంలో 'ఐస్‌.. ఐస్‌..' అనే పాట పుట్టింది అంది. అలాగే ఈ పాటలో శృంగారం శృతి మించింది అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ నా శరీర తత్వానికి హిప్‌ మూవ్‌మెంట్‌ ఒక్కటే నప్పుతుంది. అది కూడా వేయకపోతే...నాకు నృత్యం చేశాననే సంతృప్తి మిగలదు నిక్కచ్చిగా చెప్పింది. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న మంగళ చిత్రం మార్చి 2న విడుదల అవుతోంది..సి.హెచ్.వి.శర్మ, ఓషో తులసిరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

విమలా రామన్ బాత్‌టబ్ దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయి


టాలీవుడ్ సక్సెస్ హీరోయిన్ విమలా రామన్ బాత్‌టబ్ దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో కుర్రకారు ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు తెగ ఎగబడ్డారట.

ఈ విషయం అలా అలా విమలకు చేరిందట. దీంతో సదరు ఫోటోలను ఆమె కూడా చూసి అవాక్కయిందట. అయితే అందరూ చెప్పినట్లుగా ఆ ఫోటోలు నావి కాదనో... మార్ఫింగ్ చేశారనో... ఏదీ చెప్పలేదట. అంటే ఆ ఫోటోలు ఆమెవేనా..?

ఇదిలావుంటే ఉన్నట్లుండి ఆ ఫోటోలు కాస్తా నెట్ నుంచి మాయమయ్యాయట. మరి ఆ ఫోటోలను పెట్టింది ఎవరో.. తిరిగి తీసేసింది ఎవరో...? నెట్‌లో ఇటువంటివి ఇటీవల మామూలై పోయాయనుకోండి.


యద అందాలు తగ్గించే పనిలో కరీనా


ఆ పని చేయనంటున్న స్టార్ హిరోయిన్


Powered by web analytics software.