Free SMS And Earn Part Time Money







2/27/11

mahesh ok 4 mani


ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో తాను మణిరత్నం తో సినిమా చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసారు. ఆయన ఏం ట్వీట్ చేసారంటే.. పెద్ద న్యూస్ ఏమిటంటే..మణి సార్ ని కలవటం. అవును..లెజండరీ మణిరత్నం ని కలవటం. నా కల నెరవేరిందనిపించింది. ఆయన సినిమా చేస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా ఆనందకరమైన రోజు. ఎప్పుడూ మీ సపోర్ట్ కావాలి అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు..శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.
Powered by web analytics software.