Free SMS And Earn Part Time Money







1/27/11

దిజాస్టర్ సినిమాకి అవార్డులు[నంది,జాతీయ] రివార్డులు


2010 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ నంది అవార్డ్ అందుకోవడం ఖాయమని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ‘సింహా’ చిత్రంలో ప్రదర్శించిన అభినయానికి ఈ అవార్డు వస్తుందనుకుంటున్నారేమోననే అనుమానాలొస్తే ఆ సినిమాకి రాదనీ అనేస్తున్నారు. మరి 2010లో బాలకృష్ణది ‘సింహా’ మాత్రమే విడుదలైంది కదా అనే అనుమానాలు రావచ్చు. కానీ విషయం ఏమిటంటే బాలకృష్ణకి ‘పరమవీర చక్ర’ సినిమాతో నంది అవార్డు రావడం ఖాయమట. ఈ సినిమా విడుదలయింది ఈ జనవరిలోనే అయినా కానీ సెన్సార్ మాత్రం 2010లోనే చేయించేశారు. సినిమా ఏ సంవత్సరంలో విడుదలైనా నంది అవార్డు ఇవ్వడానికి కన్సిడర్ చేసేది సెన్సార్ అయిన తేదీనే కాబట్టి ఆ విధంగా ‘పరమవీర చక్ర’ కి బాలయ్య నంది అందుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. అసలే దాసరి దర్శకుడు కాబట్టి నంది అవార్డు తెచ్చుకోవడం కూడా పెద్ద విషయమేమీ కాదు. ‘మేస్త్రీ’లోని తన నటనకే ఉత్తమ నటుడి అవార్డు తెచ్చుకున్న దాసరి బాలకృష్ణకి నంది అవార్డు రావడానికి ఆమాత్రం లాబీయింగ్ చేయలేడా ఏంటి..?ఇప్పటికే బాలయ్య మనసు గెలుచుకునేందుకు ఆ ప్రయత్నాల్లో పడ్డ దాసరి అందుకే పదే పదే ఈ సినిమాకి జాతీయ అవార్డు వస్తుందని నొక్కి చెబుతున్నాడు.

మార్లిన్ మన్రో పాత్ర చేయాలంటే నాకు చాలా భయంగా ఉంది


అమెరికా సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు మార్లిన్ మన్రో. అమె చనిపోయిన తర్వాత కూడా అమె పేరు చరిత్రలో అలా నిలచిపోయింది. ఇప్పుడు హాలీవుడ్‌లో గత కొంతకాలంగా మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈప్రయత్నంలో భాగంగా ఈపాత్రకు నోమి వాట్స్ త్వరలో నటించనుందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఐతే నోమి వాట్స్ మాత్రం ఈవిషయంపై మట్లాడుతూ మార్లిన్ మన్రో పాత్ర చేయాలంటే నాకు చాలా భయంగా ఉందని తన మనసులోని భావాలను పంచుకున్నారు. మార్లిన్ మన్రో పాత్రలో ఇమిడిపోయి నటించాలంటే చాలా ధైర్యంకావాలని అన్నారు. దీనికి కారణం ప్రపంచం మొత్తం మీద మార్లిన్ మన్రో అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా మార్లిన్ మన్రో స్టయిల్‌ని కూడా ఇమిటేట్ చేయాలంట్ చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. నోమివాట్స్‌తో పాటుగా మిచెల్లీ విలియమ్స్ కూడూ ఈసినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించనున్నారు. ఈసినిమాలో మిచెల్లీ విలియమ్స్ చేసేటటువంటి అద్బుతమైన రోల్ మై వీక్ విత్ మార్లిన్ అంటూ మార్లిన్ మన్రో గురించి తన అనుభవాలను మనతో పంచుకుంటారన్నమాట.

మహేష్ ఏం ఆలోచిస్తున్నాడు


అమీర్ ఖాన్ నటించి, బాలీవుడ్ లో విజయఢంకా మ్రోగించిన..త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని రోబో డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ, భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ ఇడియట్ గా మహేష్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అందరూ మహేష్ ఈ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడని కూడా అంతా అనుకున్నారు..కానీ చివరికి ఈ చిత్రం మహేష్ చేయడంలేదని కన్ ఫర్మ అయిపోయింది. ఐతే ప్రస్తుతం శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘దూకుడు’లో నటిస్తున్న మహేష్ మరొక తమిళ చిత్రంలో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాియి..అదీ సెకండ్ హీరోగా..

‘విలన్’ పరాజయంతో పట్టువదలని విక్రమార్కుడిలా..తమిళ రచయిత కల్కీ కృష్ణమూర్తి రచించిన..ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని సెకండ్ హీరోగా సెలక్ట్ చేసుకుని, మహేష్ ని సంప్రదిస్తే..ఇంత వరకు మణికి మహేష్ బాబు ఏం చెప్పకుండా..విసిగించడంతో చేసేది లేక మణిరత్నం కూడా ఆ పాత్రను సూర్యకు కేటాయించినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు ఓ ప్రధాన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేశారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..శంకర్, మణిరత్నంలతో ఒక్క చిత్రం చేసినా చాలు అని నేటి హీరోలంతా అనుకంటుంటే..కోరి మరీ తన వద్దకు వచ్చిన ఈ అగ్ర దర్శకులతో అవకాశంను..ప్రిన్స్ ఎందుకు కాదనుకుంటున్నట్లో.అమీర్ ఖాన్ నటించి, బాలీవుడ్ లో విజయఢంకా మ్రోగించిన..త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని రోబో డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ, భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ ఇడియట్ గా మహేష్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అందరూ మహేష్ ఈ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడని కూడా అంతా అనుకున్నారు..కానీ చివరికి ఈ చిత్రం మహేష్ చేయడంలేదని కన్ ఫర్మ అయిపోయింది. ఐతే ప్రస్తుతం శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘దూకుడు’లో నటిస్తున్న మహేష్ మరొక తమిళ చిత్రంలో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాియి..అదీ సెకండ్ హీరోగా..

‘విలన్’ పరాజయంతో పట్టువదలని విక్రమార్కుడిలా..తమిళ రచయిత కల్కీ కృష్ణమూర్తి రచించిన..ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని సెకండ్ హీరోగా సెలక్ట్ చేసుకుని, మహేష్ ని సంప్రదిస్తే..ఇంత వరకు మణికి మహేష్ బాబు ఏం చెప్పకుండా..విసిగించడంతో చేసేది లేక మణిరత్నం కూడా ఆ పాత్రను సూర్యకు కేటాయించినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు ఓ ప్రధాన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేశారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..శంకర్, మణిరత్నంలతో ఒక్క చిత్రం చేసినా చాలు అని నేటి హీరోలంతా అనుకంటుంటే..కోరి మరీ తన వద్దకు వచ్చిన ఈ అగ్ర దర్శకులతో అవకాశంను..ప్రిన్స్ ఎందుకు కాదనుకుంటున్నట్లో.

సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు ఒప్పుకుంటెనే అ పాత్ర చేస్తాను:విద్యా


సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న "డర్టీ పిక్చర్" లో విద్యాభాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. హోమ్లీ ఇమేజ్ సంపాదించుకున్న మీరు శృంగార తారగా నటించడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అని విద్యా బాలన్ ని అడిగితే హోమ్లీ ఇమేజ్‌ని నేను కోరుకోలేదు. నేను చేసిన ప్రాతలు చూసి ప్రేక్షకులు ఆ ఇమేజ్ ఇచ్చారు. కానీ నాకు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. నటిగా నాలోని అన్ని కోణాలను ఆవిష్కరించు కోవాలనుకుంటున్నా. అందుకే డర్టీ పిక్చర్ కి ఓకే చెప్పా అని సమాధానమిచ్చింది. మిలన్‌ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్నఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం ఆ మధ్య అలాగే పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. దానికి కారణం చెబుతూ.. "నిజ జీవిత గాథల్ని తెరకెక్కించేటపుడు కొన్ని ప్రాబ్లంస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయి. ఆ ఆలోచనతోనే సిల్మ్ స్మిత కుటుంబ సభ్యులును, బంధువులను కలిసాం. వారి నుంచి వచ్చే అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటానకి ప్రయత్నిస్తాం. అలాగే వారందరినీ కలుసుకొని వారి నుంచి అనుమతి తీసుకున్నాకే ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకొన్నాను అంది. ఇక ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తోంది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

రంజిత వెంట తమిళ నిర్మాతలు


సినీ పరిశ్రమలో గాని, సొసైటీలో గాని డబ్బు సంపాదించటానికి ఎన్నో అవినీతికి మార్గాలు ఉన్నాయి. అయితే నైతిక విలువలను, దేశభక్తిని వదులుకున్నవారికే ఈ సమాజంలో పెద్ద పీఠం వేస్తుంది. వారే ఈ దేశాన్ని కూడా పరిపాలిస్తున్నారు. అవినీతి ఎంత చేసి పైకొస్తే వారే అంత పెద్ద మనుషులుగా తయారవుతన్నారు. సెక్స్ కుంభకోణం, సంచలనాన్ని కలిగించి అందరి దృష్టిలో పడిన రంజిత వెంట ప్రొడ్యూసర్స్ పరిగెత్తుతున్నారు. అంటే సినిమాలో నటించమని నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారని వార్త. ప్రస్తుతం రంజితకు ఉన్న క్రేజ్ ను సినిమాలో పెట్టి క్యాష్ చేసుకుందామని నిర్మాతల దురాలోచన అన్నమాట. అయితే రంజిత మాత్రం రోజుకు 5లక్షల డిమాండ్ చేస్తుంది. అయినా ఆ రేటుకు నిర్మాతలు ఒప్పుకుంటున్నారని కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోజుకు 5లక్షల డిమాండ్ చేసే నటుడు కోలీవుడ్ లో ఒక్క ‘వడివేలు’ మాత్రమే ఉన్నారు. టాలీవుడ్ లో ఇంత మొత్తం తీసుకున్న నటుడు కానీ, నటిగానీ లేరని చెప్పచ్చు. ఏమైతేనెం రాసలీల రంజితకు ఇప్పుడు సినిమా నటిగా మరలా పుంజుకొందని చెప్పొచ్చు.

జూనియర్ సరసన శౄతిహసన్ రొమేన్స్


యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనుందని వినికిడి. కాగా ఈ సినిమాకి కమల్ హాసన్ డాటర్ ‘శృతి హాసన్’ ని హీరోయిన్ గా ఎంపిక చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. శృతీ హాసన్ రీసెంట్ గా సిద్దార్థ సరసన అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నటించిన విషయం విధితమే.

యంయం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడని వినికిడి. కె యస్ రామారావు నిర్మాతగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో రూపొందించబోయే ఈ చిత్రానికి ‘గర్జన’ అనే టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఓ ప్రెస్ మీట్ ఏర్సాటు చేసి ప్రకటించనున్నారని సమాచారం.

శంకర్ "త్రీ ఇడియట్స్"షూటింగ్ సీక్రెట్ గా ప్రారంభిచాడు


రోబో చేసిన ఊపు మీదున్న శంకర్ ఏదో పికేయాలనట్టు త్రీ ఇడియట్స్ ని నెత్తిన వేసుకొని ఆరు నెలల నుండి తంటాలు పడుతూ వచ్చాడు ఇప్పుడు అ తంటాలన్ని ఒక కొలిక్కి వచ్చాయి తెలుగు , తమిళం లలో మహేష్ విజయ్ లతో మొదలుపెట్టిన ఈ చిత్రం సూర్య తో ముగుస్తోంది సూర్య ఒప్పుకున్నాడు కదా అని మన శంకరన్న ఉరుకుంటాడ ఇలా సాగతీస్తూ పోతే సినిమా వచ్చేదెమో కాని నా స్టాండర్డ్స్ పడిపొతాయెమో అనుకున్నాడొ గాని శంకర్ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిచేశాడు[సూర్య లేకుండానే]అదేమంటే ఇది అన్ అఫీషియల్ అఫీషియల్గా సుర్యా వచ్చిన తరువాత ఘనంగా ప్రారంభిస్తామంటున్నాడట ఇంతకీ ఈ షూటింగ్ ఎక్కడ జరిగిందంటే ఉటి లో ఎవరికి తెలియకుండా శ్రీకాంత్ ,జీవా లతో ప్రారంభిచేశాడు

ఏమి పనిలేక సినిమా ఓపెనింగ్స్ లో రోశయ్య


అల్లరి నరేష్ కథానాయకుడిగా వీరభద్రచౌదరి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ‘అహనాపెళ్లంట’ చిత్రం పాటలను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని రోశయ్య ఆవిష్కరించి, తొలి ప్రతిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కిషోర్‌కి అందించారు. అనంతరం ఈ కార్యక్రమానికి రోశయ్య పై విధంగా స్పందించారు. దర్శకుడు మాట్లాడుతూ- "అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇది. రఘు కుంచె సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. నరేష్ సినిమాలో పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలుస్తుంది. నాకీ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్స్" అని చెప్పారు. ‘బంపర్ ఆఫర్’ తర్వాత చేస్తున్న సినిమా ఇదని, మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని, నరేష్ కెరీర్‌లోనే ఇది పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని సంగీత దర్శకుడు కుంచె రఘు అన్నారు. షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత గరికపాటి కిషోర్ తెలిపారు. రీతూ బర్మేచ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి, డా.బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్ ‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నాగినీడు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సేపన, కెమెరా: లోక్‌నాథ్, నిర్మాణం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్.

అనుష్క ఫ్లాట్ లో ఐ.టి రైడింగ్


తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుష్క ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్లు అంతటా వినపడుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఆమె ప్లాట్ పై ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పుకుంటున్నారు. ముంబైలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఇళ్ళపై జరిగనట్లుగానే ఈ దాడులు కూడా జరిగినట్లు వినికిడి. అయితే అధికారులకు పెద్దగా ఏమీ దొరికినట్లు లేవని, దాంతో హంగామా అదీ లేకుండానే సైలెంట్ గా వెళ్ళిపోయినట్లు చెప్పుకుంటున్నారు.అనుష్క మొదటి నుంచి లెక్కలు, పత్రాలు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయటం కలిసి వచ్చిందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం అనుష్క సినిమాకు కోటి రూపాయల వరకూ ఛార్జ్ చేస్తోంది. వీటి వివరాలు లెక్కలూ అడిగినట్లు తెలుస్తోంది. అలాగే అనుష్క..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో చాలా ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం ఉందని వాటి వివరాలు సైతం అడిగినట్లు చెప్తున్నారు. అనుష్క తరుపున కొందరు సమాధానాలు ఇచ్చినట్లు కొన్ని పత్రాలు మాత్రం క్లారిఫికేషన్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై అధికారికంగా ఏ వార్తా లేదు.

హాట్ కిస్ కి కసరత్తు చేస్తున్న కత్రినా[హౄతిక్-కత్రినా]


బాలీవుడ్‌లో కత్తిలాంటి ఆకృతితో సెక్సీ నాభీ నృత్యాలను చేయడంలో ఆరితేరిపోయిన కత్రినాకైఫ్ ఇపుడు మరో హాటెస్ట్ ఫీట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందట. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జిందగి న మిలేగి దుబారా" చిత్రంలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు కత్రినా హీరో హృతిక్ రోషన్ పెదవులను రెండు నిమిషాల పాటు వదలకుండా చుంబించాలట. ఈ విషయాన్ని దర్శకుడు కత్రినాతో చెప్పేసరికి.. "హృతిక్‌తోనే కదా.. ఐతే ఓకే" అనేసిందట. హృతిక్ రోషన్ మాత్రం తేనెలొలికే ఆ రెండు పెదవులను చుంబించడానికి అడ్డు చెపుతాడా ఏంటి...? కత్రినా ఓకే అయితే నేను డబుల్ ఓకే అనేశాడట. అన్నట్లు ఈ సీన్ కోసం కత్రినా తన రెండు పెదవులు మరింత సెక్సీగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటోందట. ముద్దంటే మాటలా మరి... హీటెక్కించొద్దూ....
Powered by web analytics software.