Free SMS And Earn Part Time Money







2/6/11

అనుష్క వల్ల ఖలేజా రగడ ఆడతాయి


మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం తమిళంలో త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి భద్ర అనే టైటిల్ పెడుతున్నారు. రవితేజ నటించిన భద్ర టైటిల్ తో తమిళంలో ఈ మధ్యకాలంలో ఏ చిత్రమూ రాలేదు. దాంతో ఈ టైటిల్ ని ఫిక్స్ చేసి సినిమాని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా అనూష్క ఈ చిత్రం డబ్ చేయటానికి ప్రధానాంశం. మరో ప్రక్క నాగార్జున తాజా చిత్రం రగడను కూడా తమిళంలో వింబు టైటిల్ డబ్బింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ చిత్రం డబ్బింగ్ చేయటానికి ప్రధాన కారణం అనూష్క క్రేజ్ కారణం. అలాగే రగడలోని ప్రియమణి కూడా తమిళనాడులో మంచి క్రేజే ఉంది. మరో ప్రక్క ఈ రెండు చిత్రాలు కూడా భాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగిన విజయం సాధించలేదు. అయితే ఈ చిత్రాల పుణ్యమా అని ఇప్పుడు అనూష్కతో సినిమా ప్లాన్ చేసేవారికి తమిళ డబ్బింగ్ రైట్స్ కూడా బాగా పలుకుతాయనే నమ్మకం కలుగుతోంది.

నయనతార నేను వెరైటి సినిమాలో నటిచామని అందరూ అంటారు


నయనతార కన్నడంలో నటించిన ఓ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తూండగా దాని ఆడియోను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆ వివరాలు. ఉపేంద్ర, నయనతార జంటగా రాక్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉపేంద్ర దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించి నిర్మాత సురేష్‌బాబుకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్రం దర్శకుడు,హీరో అయిన ఉపేంద్ర మాట్లాడుతూ ఈ చిత్రం చూశాక అందరూ ఒకేమాట అంటారు. కన్నడంలో ఈ చిత్రానికి సూపర్ అన్న పేరును ప్రేక్షకులే ఇచ్చారు. అలాగే తెలుగులో వావ్ అని అదిరింది అని, చాలా బాగుందని, ప్రపంచమంతా ఇందులోనే ఉందని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఎవరు ఎలా ఊహించుకున్నా అది కరక్టే. ఈ చిత్రం చూశాక అందరూ అదే మాటను అంటారు. సబ్జెక్టు డిమాండ్‌నుబట్టి చిత్రం వెరైటీ లుక్‌తో ఉంటుంది అని తెలిపారు.

త్రీ ఇడియట్స్ కి ధీటుగా మరో చిత్రం


ఇటివల విక్రమ్ ను విలన్ చేసి అయన కెరీర్ లో ఓ అట్టర్ ప్లాప్ ను ఇచ్చిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం విక్రమ్ ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

అయితే ఈ చిత్రంలో మరో ఇద్దరు తమిళ కధానాయకులు విజయ్, విశాల కూడా నటించానున్నారట. చారిత్రక నేపద్యమున్న ఈ చిత్రం మొత్తానికి మణిరత్నం రూపొందిస్తున్న మరో మల్టీ స్టారర్ చిత్రంగా నిలవనుంది.

మరో శివ తీయబోతున్న రాంగోపాల్ వర్మ


నాగార్జున , రాంగోపాల్ వర్మ కలయికలో వచ్చిన 'శివ' ఓ ట్రెండ్ సెట్టర్ ఫిలింగా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు వర్మ నాగార్జున తనయుడు నాగచైతన్యతో ఓ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'బెజవాడ రౌడీలు' పేరుతొ వర్మ తెర కెక్కించనున్న చిత్రంలో చైతన్య కధానాయకుడిగా నటిస్తారని సమాచారం.

ఈ మేరకు కధ విన్న నాగ్ ఈ కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.సో ఇక 'శివ ' నాగార్జున కెరీర్ లో ఎలా మైలురాయిగా నిలిచిందో 'బెజవాడ రౌడీలు' కూడా నాగచైతన్య కెరీర్ లో అలాంటి మెమరబుల్ చిత్రంగా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

తిరుగుబోతు కాబోతున్న బియాంకా దేశాయ్


'కాఫీబార్', 'అదే నువ్వు అదే నేను' ఫేం బియాంక దేశాయ్ కధానాయికగా కన్నడంలో రూపొందిన ఓ చిత్రాన్ని తెలుగులోకి 'తిరుగుబోతు' పేరుతొ అనువదిస్తున్నారు నిర్మాతలు పి.నరసింహ, ప్రభాకర్ లు. కిరణ్ గోవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోగా రాజ్ నటించారు.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురుంచి నిర్మాత మాట్లాడుతూ 'కన్నడంలో ఘనవిజయం సాధించిన చిత్రమిది. ఓ క్రిమినల్ తనను లవ్ చేసిన అమ్మాయిని మరో క్రిమినల్ కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాపర్ బారి నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడించి అనేది చిత్ర కధాంశం. ఈ చిత్రంలో తెలుగు నటులు సుబ్బరాజు, ఆర్తిపూరి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు

వారపత్రిక పై ప్రభుదేవ లవర్ మండిపాటు


మీడియాకు దూరంగా వుండే నయనతార ఇటీవల ప్రభుదేవా తో ప్రేమాయణంతో నిత్యం వార్తల్లోనే నానుతున్నారు. అయితే ఇటీవల సంతోషం సినీ వారపత్రిక నయనతార తమ పత్రికకు ప్రత్యెక ఇంటర్వ్యూ ఇచ్చిందంటూ ఓ ఆర్టికల్ ను ప్రచురించారు. ప్రభు తో వివాహం తర్వాత తను సినిమాలకు స్వస్తి చెబుతున్నానని, ప్రస్తుతం బాలకృష్ణ తో నటిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రం తన చివరి చిత్రమని ఆ ఇంటర్వ్యూ లో ప్రచురించారు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన వెబ్ సైట్ లు, ఎలక్ట్రానిక్ మీడియా తమదైన శైలిలో నయనతార పై న్యూస్ ఫోకస్ చేసారు. ఇది తెలిసిన నయనతార సంతోషం సినీ వారపత్రిక పై మండి పడుతుంది. అసలు ఇటీవల కాలంలో నేను ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఈ విషయం గురుంచి నయనతార మాట్లాడుతూ 'బాపు గారి దర్శకత్వంలో చేయడం హ్యాపీగా వుంది. ఇక నా వ్యక్తిగత విషయాలు మీడియాతో పంచుకోవడం ఇష్టం వుండదు. శ్రీరామరాజ్యం చిత్రంలో నా లైఫ్ టైం బెస్ట్ పాత్రను చేస్తున్నాను. ఇక నా భవిష్యత్ ప్రణాలికలు త్వరలోనే తెలియజేస్తాను' అని చెప్పుకొచ్చారు.

నితిన్ ‘గబ్బర్ సింగ్’తమ్ముడైపోతాడు


పవన్ కళ్యాణ్ అంటే హీరో నితిన్ పడి చచ్చిపోతుంటాడు. తొలిప్రేమ, ఖుషీ చిత్రాలని లెక్కలేనన్ని సార్లు చూసిన నితిన్ తను హీరో అయ్యాక కూడా పవన్ ని అంతే ఇష్టంగా అభిమానిస్తున్నాడు. పవన్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలనేది నితిన్ చిరకాల వాంఛ. తాను హీరోగా బిజీగా ఉన్న రోజుల్లో కూడా పవన్ సినిమాలో చిన్న పాత్రయినా చేయడానికి రెడీ అని నితిన్ అన్నాడు. ఇప్పుడైతే అవకాశాలే లేక ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ సినిమా ఛాన్సొస్తే మరింత హ్యాపీ అవుతాడు. ‘దబాంగ్’ని ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ కథలో తనకి సవతి సోదరుడిగా ఎవరు బాగుంటారని చూస్తున్నాడు. శర్వానంద్, శివాజీ, శ్రీకాంత్..ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరూ నితిన్ పేరు చెప్పట్లేదు. ఆ క్యారెక్టర్ తనకిస్తే పవన్ కి తమ్ముడిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని నితిన్ తన సన్నిహితులతో అంటున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పవన్ కి చేరవేస్తే నితిన్ ‘గబ్బర్ సింగ్’తమ్ముడైపోతాడు

తాత సినిమా చేయలేడా ఇష్టంలేద జూనియర్ పై టాలీవుడ్ టాక్


ప్రముఖ నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు పిలిచి దర్శకుడు రాజమౌళికి ఆఫర్ ఇస్తానంటే ఆయన వెంటనే కాస్త కూడా ఆలోచించకుండా నో చెప్పేయటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అదెలా జరిగిందంటే జూనియర్‌ ఎన్టీఆర్‌తో తన పాత చిత్రం 'రాముడు-భీముడు' తీయాలని రామానాయుడుకి ఎప్పుడు నుంచో ఆలోచన ఉంది. ఇదే విషయం గురించి ఎన్టీఆర్ వద్ద గతంలో ఆయన ప్రస్తావించారు. తన తాత నటించిన 'రాముడు-భీముడు' అయితే తనకి ఇష్టమేనని ఆయన ఓకే అన్నారు. అయితే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అయితేనే ఓకే అంటానన్నాడు. దాంతో నాయుడు గారు వెంటనే రాజమౌళికి కబురు పెట్టారు. ఈగ షూటింగ్ నిమిత్తం సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఉన్న రాజమౌళి వెంటనే వచ్చి ఆ ప్రపోజల్ విన్నారు. అయితే డైరక్ట్ గా కాదనకుండా తనకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయని తప్పించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ అంతకు ముందే రాజమౌళితో ఈ విషయం మాట్లాడాడని,తాను డైరక్ట్ గా కాదనకుండా రాజమౌళిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ తప్పించుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే 4heroes


చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజను మా టీవీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నట్లు 'మా' టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ప్రకటించారు. 'మా' టీవీ మరో రెండు చానళ్లను ప్రారంభించింది. ఇప్పటికే మా, మా మ్యూజిక్‌తో అలరిస్తున్న 'మా' సంస్థ... కొత్తగా మా జూనియర్స్, మా సినిమా అనే చానళ్లను తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ సందర్భంగా 'మా' టీవీ భాగస్వామి నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే. నేటి తరం టీవీ ప్రేక్షకులకు ఏ తరహా వినోదం కావాలన్న దానిపై మాకు మూస అభిప్రాయాలే ఉంటాయి. ఓ యంగ్ మైండ్ మా బోర్డ్ సభ్యుల్లో ఉంటే బాగుంటుందని ఎన్నాళ్లుగానో చెబుతున్నాను. అది ఈనాటికి కుదిరింది అన్నారు.

ప్రియమణి, విమలారామన్‌లిద్దరితో బాగా ఎక్స్‌పోజింగ్ చేయించార??


ఇపుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో ఓవర్‌ఎక్స్‌పోజింగ్ చేయించడం మామూలైపోయింది. సుమంత్ హీరోగా తెరకెక్కిన రాజ్ చిత్రంలో ఇదే జరిగిందంటున్నారు. సుమంత్ ఎన్నాళ్లగానో హిట్ కోసం తహతహలాడుతున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తాజాగా "రాజ్" చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సుమంత్. ఈ చిత్రంలో సుమంత్ సరసన నటిస్తున్న ప్రియమణి, విమలారామన్‌లిద్దరితో బాగా ఎక్స్‌పోజింగ్ చేయించారని ఫిలిమ్‌నగర్ టాక్. ఈ ముద్దుగుమ్మల అందాల ఆరబోతతో సుమంత్ "రాజ్" హిట్టవడం ఖాయం అంటున్నారు

సినిమాలోను ఫంక్షన్స్ లోను ఒకటే దుస్తులు


టాలీవుడ్ సినీ హీరోయిన్లు బాలీవుడ్ హీరోయిన్ల తలదన్నుతున్నారు. తొడలు పైదాకా కనిపించేవరకూ పొట్టి దుస్తులు వేసుకుని నటించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అదేమని అడిగితే ఇప్పటి ట్రెండ్‌ను అనుసరించి పోవాలనీ, తమకన్నా కాలేజీ అమ్మాయిలు ఇంకా ఎక్కువే చేస్తున్నారని రొటీన్ డైలాగులు చెప్పడమూ అలవాటుగా మారింది. తొలుత ఈ అలవాటును బాలీవుడ్ సుందరాంగులే టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. సినిమాల్లో బికినీలు వేసిన వారికి ఫంక్షన్లకు కురుచ దుస్తుల్లో కనిపించడం పెద్ద ఎబ్బెట్టుగా ఏమీ అనిపించలేదు. దీంతో ఏకంగా ఆయా సినీ ఫంక్షన్లకు ఏకంగా పొట్టి దుస్తులు వేసుకుని దర్శనమివ్వడం మొదలెట్టారు.
Powered by web analytics software.