Free SMS And Earn Part Time Money







2/7/11

3 maar working stills









ప్రేమ లో కాజల్ , ప్రభాస్


సినిమా హీరోహీరోయిన్లు నిజజీవితంలో జోడీగా ఉండటం జరుగుతూనే ఉంది. లేటెస్ట్‌గా కాజల్‌, ప్రభాస్‌లు వివాహం చేసుకుంటున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమన్నాయి. గతంలో కోలీవుడ్‌లో సూర్య, జ్యోతిక హిట్‌పెయిర్‌‌లా ఎలా చెప్పుకునేవారో ఇప్పుడు టాలీవుడ్‌లో వీరిద్దరినీ చెప్పుకుంటున్నారు. డార్లింగ్‌ షూటింగ్‌లో సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందిట. ఆ ప్రేమ దినదినం వృద్ధి చెందుతూ పాకాన పడిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. షూటింగ్‌లో వీరి ప్రవర్తన చూస్తుంటే ప్రేమలోకంలో పీకల్లోతు కూరుకుపోయినవారు ఈ లోకంతో పనిలేనట్లుగా ఎలా ఉంటారో అలా ఉంటున్నారట. అంతగా ప్రేమ ముదిరిపోవడంతో వీరిద్దరు త్వరలోఒక్కటి కానున్నట్లు సమాచారం.

వరస సినిమా లతో జూనియర్ కి పోటిగా నాగచైతన్య


నాగచైతన్య మరోసినిమాతో ముందుకు రాబోతున్నాడు ఇప్పటీవరకు ప్రేమకధలతో అలరించిన నాగచైతన్య ఇప్పుడు మాస్కధన0తో రాబోతున్నాడు ఈచిత్రంలో నాగచైతన్య :"ఆటోనగర్ సూర్య" కెరెక్టర్ తో మాస్ హిరోగా అందరిదౄష్టి ఆకర్షిద్దామనుకుంటున్నాడు. నాగచైతన్య,నాగర్జున ఈకధని విన్నాక ఎంతోనచ్చి వెంటనే ఒకే చేశారు దేవకట్టా ఈసినిమాకి దర్శకుడు ఇంతకుముందు దేవకట్టా ప్రస్థానం మూవీతో శర్వానంద్ కి మంచిసినిమా అందించాడు ఈసినిమా పి.ఆర్. మూవీస్ నిర్మించనుంది. అచ్చిరెడ్డి నిర్మాతగా మ్యాక్స్ ఇండియా బ్యానర్. మిగిలిన తారగణం ఎంపిక జరగాల్సిఉంది నాగచైతన్య సుకుమార్ తో చేస్తున్న ప్రాజెక్ట్ తరవాత ఈసినిమా ఉండచ్చు.

సూపర్ సరిగ్గ ఆడలేదు:అనుష్క



నా పెళ్ళి నా ఇష్టమంటున్న త్రిష




ట్రైన్ లో నలుగురు కుర్రాళ్ళతో ఒక తెలుగమ్మాయి[పంజాబి]


ఒక ఊరిలో, కోకిల వంటి చిత్రాల్లో నటించి ఫేడ్ అవుట్ అయిన కధానాయిక సలోనిని మర్యాదరామన్న చిత్రంతో వెలుగులోకి తెచ్చారు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ చిత్రం తర్వాత సలోని కెరీర్ కు డోకా ఉండదని అనుకున్నారు అందరూ. కానీ ఈ తారను మర్యాదరామన్న తర్వాత కూడా పెద్ద క్రేజీ ఆఫర్లెమీ వరించలేదు. ఇక సహనం నటించిన ఈ ముద్దుగుమ్మ కొత్త హీరోలతో రూపొందుతున్న తెలుగమ్మాయి చిత్రంలో నటిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ఇది లేడి ఓరియంటెడ్ సినిమాగానే చెప్పాలి. అయితే తెలుగమ్మాయి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పంజాబీ కధానాయిక సలోనిని ఎంపిక చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో వానపల్లి బాబురావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కధ గురించి దర్శకుడు చెబుతూ నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి సికింద్రాబాద్ నుంచి గోదావరి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి సామర్లకోట వరకు వెళతారు. ఈ రైలులోనే సినిమా సగభాగం వుంటుంది. ఆ రైలులో జరిగే సంఘటనలు వినూత్నంగా ఉంటాయి. పూర్తి వినోదాత్మకంగా, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. తెలుగమ్మాయి ఎలా ఉండాలో తెలియచెప్పే చిత్రమిది అని దర్శకుడు రాజావన్నెం రెడ్డి చెప్పుకొచ్చారు.

అప్పల్ర్రాజు విడుదల అవుతుందా???


తెలుగు సినీ పరిశ్రమ బంద్ అప్పల్రాజు కొంపముంచిందనే చెప్పాలి. షూటింగ్ ప్రారంభం రోజే రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తానని బాహాటంగా ప్రకటించాడు. కానీ బంద్ కారణంగా చిత్రీకరణ ఆగిపోవడంతో చిత్రం సంక్రాంతికి విడుదల కాలేదు. ఇక చిత్రాన్ని పిబ్రవరి 4 న విడుదల చేస్తున్నామని చెప్పారు వర్మ.

కానీ జై బోలో తెలంగాణ చిత్రం ముందు తన జిమిక్కులు పనిచేయవని పిబ్రవరి 14కు వచ్చాడు వర్మ. కానీ ఇప్పుడు మళ్లీ తన డేట్ ను పిబ్రవరి 18కు మార్చుకోని మరోసారి విడుదలను వాయిదా వేసుకున్నాడు. సునీల్ హీరోగా నటించిన ఈ చిత్రం కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారైనా అప్పల్రాజు మాట మీద నిలబడి 18వ తేదికి వస్తాడా లేదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి

లావు,బరువు,విడాకులు ఇన్ని సమస్యలున్నా ఆర్తి అగర్వాల్ కు అమ్మ రాజశేఖర్ "ముద్ర"


ఒకప్పుడు అగ్రహీరోలందరితోనూ నటించి క్రేజీ తారగా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిపోయింది. తరుణ్ తో ప్రేమాయణం, పెళ్లి, విడాకులు, బరువు పెరగడం తదితర కారణాలవల్ల ఈ తారకు బిగ్రేడ్ సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తునాయి. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి అక్కడ కాలక్షేపం చేసి విడాకులు తీసుకొని మళ్ళి ఇండియా కు తిరిగివచ్చిన ఈ భామ టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచుస్తువుంది.

కానీ చిన్న సినిమాలు మాత్రమే ఆమెను వరిస్తునాయి. ఇపుడు ఈ భామ తాజాగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ముద్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కూడా ఓ ముఖ్యపాత్రను చేస్తుండగా, ఆయన సరసన ఆర్తి అగర్వాల్ నటిస్తునారు. డాన్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై డి.లివింగ్ స్టన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక ఈ అమ్మ రాజశేఖర్ ముద్ర పైనే ఈ అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది

అందరూ దర్శకులు నాకు అపురూపం అంటోన్న ఇలియాన


సెట్లో ప్రతిరోజూ నాకు కొత్తగానే ఉంటుంది. నా కెరీర్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే సెట్లో ఉన్నప్పుడు దర్శకుల పనితీరును గమనిస్తూ ఉంటాను. ప్రతి సన్నివేశం చేసేటప్పుడు వారు నాకు నేర్పించే విషయాలను అపురూపంగా విని ఫాలో అవుతాను అంటోంది ఇలియానా. అలాగే దర్సకులు వై.వి.యస్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, త్రివిక్రమ్, విజయభాస్కర్, ఆదిత్య... ఒకరిద్దరని కాదు... నేను పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను అంటోంది. ఇక నేను ప్రతిరోజూ షూటింగ్‌కి వెళ్ళగానే ముందు అక్కడి పరిసరాలను గమనిస్తాను. దానికి తగ్గట్టు మనసును సమాయత్తపరచుకుంటాను అని వివరించింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. అలాగే పూరి దర్సకత్వంలో ఆమె చేసిన నేను నా రాక్షసి చిత్రం రిలీజుకు రెడీగా ఉంది. త్వరలో శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ రీమేక్ లో చేస్తోంది. ఆయన గురించి చెబుతూ..శంకర్ తో షూటింట్ చేయటం చాలా గ్రేట్. అంత పెద్ద దర్శకుడుతో పనిచేయటం అనేది నేను ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. అందుకే నేను సెట్స్ మీద రిలాక్స్ గా ఉన్నాను అంది.

సెక్సీ అని కొందరు మనసులో పెట్టుకొని పిలుస్తారు:స్టార్ హిరోయిన్


నన్ను ఎవరైనా సెక్సీ అని పిలిస్తే మండిపోతుంది అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ విషయమై ఆమె మాట్లాడుతూ....నన్ను చూసిన వారు ఎవరైనా నువ్వు అందంగా ఉన్నావని అంటే హ్యాపీ ఫీలవుతాను. అదే సెక్సీ అని పిలిస్తే కసురుకుంటాను అని చెప్పుకొచ్చింది.అదేంటి చాలామందికి సెక్సీ అనిపించుకోవటం ఇష్టం కధా అంటే...నిజానికి సెక్సీ అనే పదం అంటే హేట్ చేయ్యాల్సిందేం కాదు..చాలా మంది నైస్, క్యూట్ బదులుగా దానిని వాడతారు. అయితే కొందరు మాత్రం మనస్సులో వేరే ఏదో పెట్టుకుని 'సెక్సీ' అని పిలుస్తారు. వారు పలికే తీరు చూస్తే అసహ్యమేస్తుంది అంది. అలాగే తన సెక్సీ ఫిగర్ ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అంది. ముఖ్యంగా బాగా వర్కవుట్‌లు చేస్తాను. ఏది పడితే అది తినను. అంతెందుకు లిఫ్ట్ ఎక్కువగా వాడకుండా ఉంటానికి ట్రై చేస్తాను. మెట్లు ఎక్కే అవకాశం ఉంటే వాటినే వినియోగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. కాబట్టి ఆమె కనిపిస్తే..సెక్సీ అని మాత్రం పిలవకండి.

శౄతిహసన్ కుటుంబం నుంచే ఆమెకు పోటి


అక్షరహాసన్ అంతా సిద్దం చేసుకొని రెడిగా ఉంది తన సినిమా కెరీర్ ని ఆరంభించటానికి యంగర్ డాటర్ ఆఫ్ కమల్ హసన్ శౄతిహసన్ చెల్లెలు అక్షర హాసన్ మొదట సినిమాలలో టెక్నీషియన్ గా వద్దామనుకుంది కాని ఆమె అక్క ని చూసి మనసు మార్చుకొని హిరోయింగా రావటానికి సిద్దమయింది. వాళ్ళ అక్క లానే అక్షరహాసన్ కూడ బాలీవుడ్ సినిమాతోనే ఎంట్రి ఇద్దామనుకుంటోంది శౄతిహసన్ మొదట బాలీవుడ్ లో లక్ సినిమాతో ఎంటర్ అయ్ ఇప్పుడిప్పుడే అన్ని బాషాలలొ నటించటానికి ఆఫర్లు వస్తున్నాయి. ఆక్షరహాసన్ వాళ్ళ అక్క శ్రుతి కన్న మోస్ట్ బ్యుటిఫుల్ "looks" కలదని బాలీవుడ్ వర్గాలు ఇప్పటికే అనుకుంటున్నాయి [అయితే సినిమా చాన్సులు త్వరగానే వస్తాయి అనుకోవచ్చు] All The Best Akshara hasan

ఆ హిరోయిన్ హిరోలకు నాన్ స్టాప్ బాదుడు....


ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ స్దాయికి ఎదిగిన అందం సోనాక్షిసిన్హా. లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ 'దబాంగ్‌' చిత్రంతో ఆమె ఇప్పుడు అందరి పెద్ద హీరోల సినిమాల్లో బుక్ అవుతోంది. అయితే ఆమెకు ఓ బలహీనత ఉంది. అది...కంటిన్యూగా ఎదటువారి ఏమనుకుంటారు అన్న ఆలోచన లేకుండా మాట్లాడటం. దాంతో హీరోల పరిస్ధితి మింగలేక కక్కలేక అన్నట్లు తయారైంది.ఈ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటోంది. ఆమె మాట్లాడుతూ...'ఏదీ దాచుకోను, అబద్దాలు చెప్పలేను. నా చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ పొల్లుపోకుండా చెబుతుంటా. అందులో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. ఒక్కోసారి స్పీచ్‌లు తట్టుకోలేక స్నేహితులు గోలపెడుతుంటారు. అవన్నీ ఎందుకు చెబుతుంటావని తిడుతారు కూడా. ఏదైనా విషయాన్ని నా కడుపులో దాచుకోవటం వల్లకాదు. నలుగురితో పంచుకొని, హాయిగా భారాన్ని దించుకుంటా. అది నా బలహీనత' అంటోంది. ఏ బలహీనత అయినా భరిచవచ్చు కానీ ఈ నాన్ స్టాప్ బాదుడు అంటే కష్టమేగా అని ఆమె గురించి తెలిసున్న వారు అంటున్నారు.

"a" సర్టిఫికేట్ పై హిరోయిన్ మండిపాటు పర్వలేదనుకున్న డైరక్టర్


ఎ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన సినిమా హిట్ అయ్యేదాన్ని అది ఆపలేదు. సినిమాకు స్టోరీనే ప్రాణం. అది మాత్రమే సినిమాను ఆడిస్తుంది. సెన్సార్ బోర్డ్ ఇచ్చే సర్టిఫికెట్ మీద హిట్,ప్లాప్ అనేవి ఆధారపడి ఉండవు. సినిమా బాగుందనే టాక్ స్ప్రెడ్ అయితే ప్రేక్షకులు వాళ్లంతట వాళ్లే థియేటర్‌కు వస్తారు అంటోంది ప్రియాంచోప్రా. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాజా చిత్రం ।7 ఖూన్ మాఫ్ కి ఎ సర్టిఫికేట్ ఇచ్చారని కోపంతో మండిపడుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ విషయంపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ..మా సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఫర్వాలేదు. సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పలేదు. అదే చాలు. నేనొక సినిమా తీసేటప్పుడు ఫలానా సర్టిఫికెట్ పొందాలని టార్గెట్ చేసుకుని తీయను. నేనకున్నది తెరకెక్కిస్తా. ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఆమోదిస్తా .అయినా సినిమా ప్రారంభించినప్పట్నుంచి దీనికి ఎ సర్టిఫికెటే వస్తుందని మేం అనుకున్నాం. అందుకని ఆశ్చర్యపడలేదు అంటున్నారు విశాల్ భరద్వాజ్.

వస్తాడు నా రాజుకి "U"సర్టిఫికేట్


పద్మశ్రీ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం ఫై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన 'వస్తాడు నా రాజు ' సినిమాకు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. తాప్సీ విష్ణుతో జోడి కడుతున్నా ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఫిబ్రవరి 11 న విడుదలకు సిద్దం అయ్యింది.

విష్ణు కిక్ బాక్సర్ వెంకటప్ప నాయుడు అలియాస్ వెంకీగా నటిస్తున్నాడు. వెంకికి ప్రేమంటే టైం పాస్ వ్యవహారం అని చిన్నచూపు. మరో వైపు కలల లోకంలో మనసైన రాజు కోసం కలలు కనే కధానాయికగా తాప్సీ నటిస్తుంది. బిన్న మస్తత్వాలు ఉన్న హీరో హీరోయిన్ మద్య ప్రేమ ఎలా చిగురించింది, చివరికి ఎలా సాకారమైనది తెర మీదే చూడాలి అంటున్నారు తొలిసారి దర్శకుడుగా పరిచయం అవుతున్న హేమంత్ మధుకర్.

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా చెబుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు

అమీర్ ఖాన్ హౄతిక్ రోషన్ కాబోతున్నాడు


మొత్తనికి దూం-3 తెరకెక్కనుంది సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇందులో "దూం" "దూం 2" లో జాన్ అబ్రహం - హౄతిక్ రోషన్ చేసినా పాత్రని చేయనున్నాడు. అభిషేక్ బచ్చన్ ఉదయ్ అదే సేం రొల్స్ లో కంటిన్యూ అవుతున్నారు .నిర్మాత మాట్లడుతు ఎంతో ఎక్జైటింగ్ గా అమీర్ ఖాన్ దూం -3 లో నటిస్తున్నాడు అని చెప్పటానికి ఆనందంగా ఉందని ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివరన ప్రారంభమై 2012 డిసెంబర్ కి రిలీజ్ అవుతుందని చెప్పాడు అమీర్ ఖాన్ మాట్లదుతు దూం -3 ప్రొజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది అందులో నేను నటించటం చాల ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు

నేను నాన్నని ఏ విషయం అడగను:శౄతి హసన్







కాజల్ తో జత కట్టిన నాగ చైతన్య



నమిత వన్ని ఒరిజినల్స్ అట....!!!


NTR ఫ్యాన్స్ కి 2011 సినిమా పండగలు ఎక్కువవుతున్నాయి


వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అదే ఊపులో ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ‘శక్తి’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఫిబ్రవది 28న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా, ఏప్రిల్ 1బోయపాటి శ్రీను దర్శకత్వంలో కెయస్ రామారావు నిర్మించే చిత్రాలు ప్రారంభం కానున్నాయన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో రేర్ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఆర్య, జగడం, ఆర్య2 వంటి డిఫరెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రేర్ మూవీ కి నిర్మాత ఎవరన్నది కూడా త్వరలోనే తెలియవచ్చు. ఇప్పటివరకు జూ ఎన్టీఆర్ కమిట్ అయిన చిత్రాల తర్వాత ఈ సినిమా వుంటుందా లేక వీటితో పాటు సుకుమార్ సినిమా కూడా జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్

తాత జూనియర్ యన్.టి.ఆర్ వెనక మనవడు ఇలియాన వెనక


ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు దగ్గుబాటి సురేష్ కుమారుడ, నటుడు ‘రాణా’ అందాల నటి ‘ఇలియానా’ మత్తులో పడ్డాడా?అంటే అవుననే చెబుతోంది ఇలియానా.! రాణా నా పిచ్చిలో పడ్డాడని ఇలియానా స్వయంగా చెప్పటం సినీ పరిశ్రమలో కొంచెం సంచటనంగానే ఉంది. ‘నేను నా రాక్షసి’ లో రాణా, ఇలియానా నటించిన తరువాత, శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘త్రీ ఇడియట్స్’ షూటింగ్ ఊటీలో జరుగుతున్న సమయంలో ‘రాణా’ గురించి ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రాణా నీతో పనిచేయటం నాకెంతో ఆనందంగా ఉంది. నీ పిచ్చి ప్రేమను మిస్ అయినందుకు నేనెంతో బాధపడుతున్నానని వ్రాసింది. అంటే దీని అర్థం ‘రాణా’ ఇలియానా ప్రేమలో పడి పిచ్చివాడైపోయాడని ఇలియానే స్వయంగా చెబుతోంది. ‘నేను నా రాక్షసి’లో రాణాకు ఇలియానాతో నటించే అవకాశం వచ్చిన తర్వాత రాణా గాలిలో తేలిసోతున్నాడని, ఇలియానా కోసం రాణా లక్షలు ఖర్చు పెడుతున్నాడని ఫిలింనగర్ లో విపరీతంగా చెప్పుకుంటున్నారు.
@RanaDaggubati working with u was loads of fun! Gonna miss the madness! ;)
Powered by web analytics software.