Free SMS And Earn Part Time Money







7/30/09

మగదీర రివ్యు

మగదీర మేనియా ఏటుచూసిన మగదీర మేనియా ఆంద్రప్రదేశలో ఏ ప్రాంతంకెళ్ళినా ఏ సిని, మెగా అభిమానినడిగినా మగదీర మూవీ చూసిన తరువాతే ఏదైన అన్నట్టు ఉన్నారు ఉన్నారు ఏంటి మిడియా చూస్తే చాలు ఏ టి.వి. పెట్టిన రాంచరణ్ ఇంటర్వ్యులు రాజమౌళి అద్భుతాలతో బంగారుకోడిపెట్ట స్టెప్లతో హొరెత్తుతున్నాయ్ తెలుగుసినిమాలో మొట్ట మొదటి సారిగా వినియోగించిన త్రిడి ఎఫెక్ట్తో విడుదల అవుతోన్న ఈ సినిమా అంచనాలు తెలుగుసినీ ఇండస్ట్రీ కనివిని ఎరుగని రీతిలో ఉంటాయి అన్నది నిజం అనిపించేలా 1500 ప్రింట్లతో విడుదలయ్యింది తెకుగుసినిమాలో ఎన్నడులేని విధముగా 40కోట్ల బడ్జెట్ తో అద్భుతం సౄష్టించనుంది ఇంతటి భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ చిత్రం విడుదలకు రాక మునుపే గందర గోళం నెలకొంది తిరుపతిలో సినిమా ఆడనీయకుండ చేయడం అభిమానులని నిరాశకు గురిచేసే విషయం

మగధీర రివ్యు :

ఫిల్మ్ మగదీర

యాక్టర్స్ ::రాంచరణ్ ,కాజల్,చిరంజీవీ,బ్రహ్మనందం,శ్రీహరి ,సునిల్ ,దేవ్ జిల్ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావ్ సంగీతం కీరవాణి

డైరక్టర్ రాజమౌళి

ఫైట్స్ రాం లక్ష్మణ్ ,పిటర్ హైన్స్


సినిమా విడుదల ముందే ఎంతో ఎక్స్పక్టేషనస్ తో విడుదలాయిన ఈ చిత్రం మొత్తనికి వెండితెరమీద విడుదలయింది ఈ
సినిమా లో రాంచరణ్ పేరు హర్ష యంగ్ మెన్ బైక్ రేస్ ,బెట్స్ ద్వర డబ్బు సంపాదిస్తుంటాడు ఇలాంటి ఎడ్వెంట్యుర్స్ అంటే బాగ ఇష్టపడే కుర్రాడు అనుకోకుంద ఒకరోజు ఇందు [కాజల్] చెయ్యి అతనికి తగిలి అతని ఆత్మ ప్రెసెంట్ పోయి పాస్ట్ గుర్తుకొస్తుంది

పాస్ట్ కధ ఏమటంటే :1609లో రాంచరణ్ పేరు కాల బైరవ ఇతను ఉడైదరలో సోల్జర్స్ కి ట్రైనింగ్ ఇచ్చె జాబ్ సైనాధిపతి రణదీర్ యువరాణి మిత్రదేవి ని ప్రేమిస్తాడు కాని యువరాణి కాలబైరవుడ్ని ప్రేమిస్తుంది అది వీరి ఇద్దరిమద్య బీకరయుద్దంగా మారి ఆ యుద్దంద్వార పాస్ట్ లో వీరి జీవితాలు ముగుసిపోతాయ్ షెర్ ఖాన్ ఒక ముస్లీం వీరి ప్రేమకి యుద్దానికి దీని అంతటికి సాక్షంగా ఉంటాడు
వీళ్ళు ఇరువురు మళ్ళి జన్మిస్తారు [హర్ష ,ఇందు ]ఇంకా చాల క్యేరెక్టర్స్ పాస్ట్ నుంచి ప్రెసెంట్ లో కూడ ఉంటాయ్ వీళ మద్య సంభందాలు ఏంటి సినిమాలో చూడండి

7/28/09

రామ్ చరణ్-స్కిల్స్

చిన్నప్పుడు నేర్చుకున్న హార్స్ రైడింగ్ విన్యాసాలను మగధీర చిత్రంలో చూపిన రామ్ చరణ్ ఈ సారి మరోసారి తనలో దాగిన మరో స్కిల్ ని వెలికితీయటానికి రెడీ అవుతున్నాడు. అది మరేదో కాదు స్కై డైవింగ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో స్కై డైవింగ్ కి సంభందించిన కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసారని సమాచారం. ఇన్నాళ్లు హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలు రూపొందించే దర్శకులు ఇప్పుడు వారిలో దాగిఉన్న స్కిల్స్ ని ఉపయోగించుకునే దిశలో కథనాలు అల్లుతున్నారు. ఇక ఈ కొత్త చిత్రంలో అధికభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ స్కై డైవింగ్ ని ఇప్పటికే నేను నేర్చుకునేర్చుకున్నాను. ఆ విన్యాసాలను నేను భాస్కర్ చిత్రంలో ప్రదర్శంచబోతున్నాను. వాటిని న్యూయార్క్ లో చిత్రీకరిస్తారు..అని చెప్పాడు. ఇక ఈ నూతన చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది.

7/27/09

మైఖేల్ జాక్సన్‌ డెత్ రిపోర్ట్


పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ జాక్సన్‌ డెత్ రిపోర్ట్ ఎట్టకేలకు మిస్ట్రరిఎ వీడిపోయింది. మైఖల్ జాక్సన్ పర్సనల్ డాక్టర్ ముర్రె పోలిసులముందు ఒప్పుకున్నాడు ప్రొపొఫోల్ అనే ఇంజక్షన్ వికటించడంవల్లే చనిపోయాడని చెప్పాడు.ఇంజక్షన్ ఇచ్చిన తరువాత మైఖ్ నిద్రలోకి వెళ్ళిపోయాడని అటువంటి సమయంలో దగ్గర ఉంచవల్సిన ఆక్సిజన్ కూడ ఉంచలేదని ముర్రె స్వయంగా ఒప్పుకున్నాడు మైఖ్ చనిపోయిన తరువాత కూడ మైఖల్ జీవితంలో మనకు తెలియని ఎన్నో నిజాలు బయల పడ్డాయ్ ఎన్నో వదంతులు వినపడ్డాయ్

పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ జాక్సన్ కు నాలుగో బిడ్డ ఉన్నాడని

పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ దయ్యమయ్యాడని

మైఖల్ జాక్సన్ అప్పులో ఉన్నాడని

మైఖల్ చెతబడులు చేస్తాడని

చిన్న పిల్లలని వేధిస్తాడని ఇంకా ఎన్నో వదంతులు వచ్చాయ్

ఇవన్ని నిజమో కాదో తెలీదుగాని మైఖల్ చనిపోలేదు చంపబడ్డాడన్నాది నిజం ఎందుకంటే మైఖల్ పర్సనల్ డాక్టర్ ముర్రె స్వయంగ ఒప్పుకోవడం ద్వార అందరికి తెలిసింది. ఇది మాత్రం యం.జే.ఫ్యాన్స్ కి భరించలేని నిజం .


7/26/09

జు.యన్.టి.ఆర్ మందుపార్టి వీడియో --సాక్షి లొల్లి

సాక్షిలో జూనియర్ యం.టి.ఆర్ మందు పార్టి దీని వల్లే కారు స్పీడ్ గా నడిపి ఏక్సిడెంట్ చేశాడని ఒక కదనం వెలువడింది, దానితో పాటు ప్రసారం చేసిన ఈ వీడియో ప్రకంపనాలు స్రుష్టిస్తోంది ఈ వీడియో యాక్సిడెంట్ ముందు కాదని అప్పటికి వీడియోలో ఉన్నట్టుగా తన క్రాఫ్ లేదని అది ఆరు నెలల కింద చిత్రీకరించినది అని రాజీవ్ కనకాల వెల్లడించారు ఎది ఎమైన ఎదో చిన్న కుర్రాడు సరదాగా ఎంజొయ్ చెస్తున్నాడు దాన్ని కూడా రాజకీయం చెయ్యడం సాక్షికే చెల్లింది


7/25/09

రాంచరణ్,జెనిలియాతో నటించాలని ఉందా

రామ్ చరణ్ తేజ, జెనీలియా కాంబినేషన్లో ప్రారంభంకానున్న చిత్రంలో నటించటానికి ఆసక్తి ఉన్న యువతీ, యువకులను ఆహ్వానిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగేంద్రబాబు తమ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ కాస్టింగ్ కాల్ కేవలం అమెరికాలో ఉండేవారికి మాత్రమే ఇక వారి రిక్వైర్ మెంట్స్ చూడటానికి బాగా ఉండి 18, 22 వయస్సుల మద్య ఉన్న అమ్మాయిలు ఇరవై మంది కావాలి. అలాగే అదే వయస్సులో ఉన్న పదిహేను మంది మగపిల్లలు కావాలి. వీటితో పాటు 35 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న మగవాళ్ళు ఐదుగురు కావాలి.
అంతేవయస్సుతో ఉన్న ఆడవాళ్ళు కూడా ఐదుగురు కావాలి. చిన్న పిల్లలు 5 నుంచి 12 సంవత్సరాల లోపు వారు ఐదుగురు కావాలి. ఫైటర్స్ (మంచి లుక్ ఉన్న బాడీతో)పది మంది కావాలి. ఇక మరొక్క సారి ఈ కాస్టింగ్ కాల్ కేవలం అమెరికాలో ఉన్నవారికి మాత్రమే నని గుర్తు పెట్టుకోండి ఇక ఆసక్తి ఉన్నవారు తమ ఫ్రొఫైల్స్ ని ఫుల్ సైజ్, మిడ్ సైజ్, క్లోజ్ ఫొటోలతో పంపండి. మంచి అవకాశం...మిస్సవకండి...మీరు మెయిల్ చేయాల్సిన ఎడ్రస్.
..artistes.anjana@gmail.com బెస్టాఫ్ లక్



తన బెడ్‌రూమ్‌ నిండా సల్మాన్‌ఖాన్‌ పోస్టర్లున్నాయన్న:అసిన్



గజనీ చిత్రంతో బాలీవుడ్ లో హాట్ స్టార్ గా మారిన అసిన్ తాజాగా నా బెడ్ రూమ్ చెక్ చేసుకోండంటూ సవాల్ విసురుతోంది. తన బెడ్‌రూమ్‌ నిండా సల్మాన్‌ఖాన్‌ పోస్టర్లున్నాయన్న వార్త అంతటా వినపడుతూండటంతో ఈ విధంగా ప్రతిస్పందిస్తోంది. కావాలంటే వచ్చి నా రూమ్‌ చెక్‌ చేసుకోండి. నా ఫ్లాట్‌ మొత్తం మీద నా సొంత ఫోటోలే ఉండవు. అలాంటిది వేరొకరి ఫోటోలెలా ఉంటాయి. ఈ రూమర్‌ ఎలా మొదలవుతుందో నాకర్థం కాదు. సల్మాన్‌ ఈ రూమర్‌ని తేలిగ్గానే తీసుకుంటాడనుకుంటా అంటోది. సల్మాన్ తో ఆమె లండన్ డ్రీమ్ చిత్రం చేసిన సందర్భంగా ఆమెపై రకరకాల రూమర్స్ వచ్చాయి. అవి తనకు నవ్వు తెప్పిస్తున్నాయంటోంది. ఇక సల్మాన్ ఆమెకు ప్లాట్ ని గిప్ట్ గా ఇచ్చాడన్న మేటర్ పై కూడా మండిపడుతోంది.'సల్మానే ఇచ్చాడంట' అనే ప్రచారం సంగతో అని అడిగితే చాలా తెలివిగా సమాధాన మిస్తోంది. మీరే చెప్తున్నారుకదా..ఇచ్చాడంట.. అంటే మీరే అది నిజం కాదు అని కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట. అయినా అలా అనుకుంటూ పోతే ఒకటేమిటి.. సల్మాన్‌ నాకు 120 కానుకలు ఇచ్చాడని చెబుతారు. ఆఖరుకి అతను నాకు ప్రపోజ్‌ చేశాడని కూడా ఈ రూమర్స్ పుట్టించేవాళ్లు అంటారు. అయితే మీరు నమ్మని నిజం సల్మాన్ ఇప్పటివరకూ నాకు ఎలాంటి కానుకలూ ఇవ్వలేదు..అనితేల్చి చెప్పింది ఈ అందాల భరణి


7/24/09

మెగాస్టార్ చిరంజీవితో ఆర్తీ అగర్వాల్ కొద్దిసేపు..

పీఆర్పీ తరపున పోటీచేసిన రచయిత,నటుడు పోసాని కృష్ణమురళి హీరోగా,ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా జెంటిల్మెన్ చిత్రం ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.నిన్న మొన్న మెంటల్ క్రిష్ణ అని కొత్త కొత్త తిక్క తిక్క పేర్లు పెట్టి విఫలమవడంతో జెంటిల్మెన్ అని పేరు మార్చి హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ఆహ్వనించాడు దానికి చిరంజీవి వచ్చాడు . ఈ సందర్భంగా మెగాతో ఆర్తీ కొద్దిసేపు...ముచ్చటించిండి
ఆర్తీ: సర్.. నేను మీ సరసన స్నేహలతా రెడ్డిగా నటించాను. గుర్తుందా...?

మెగా: (నవ్వుతూ) ఇంద్ర, స్నేహలతా రెడ్డిని ఎలా మరిచిపోతాడు.

ఆర్తీ: మీతో డ్యాన్స్ చేయాలంటే ఏ హీరోయిన్ అయినా షేక్ అయిపోవాల్సిందే...?

మెగా: చిరు నవ్వు

ఆర్తీ: మ్.. సర్... ఇంతలో మెగాస్టార్ అందుకుని...

మెగా: ఆర్తీ... నువ్వు స్నేహలతా రెడ్డిగా నటించిన సమయంలో ఎలా ఉన్నావో.. నేటికి అలానే ఉన్నావ్. కీపిటప్


ఆర్తీ: చాలా థాంక్స్ సర్ మెగా: చిరునవ్వు




రజనీకాంత్ జీవిత విశేషాల 'తలైవర్'

సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత విశేషాలను తెలియజేస్తూ 'తలైవర్' పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. రజనీ వీరాభిమాని కవిన్ కార్తీక్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీని రజనీ స్వయంగా చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో రిలీజ్ చేశారు.

రజనీ తొలినాళ్లలో బెంగుళూరులో బస్ కండక్టర్ గా పనిచేసినప్పటి నుంచి...సూపర్ స్టార్ డమ్ ను కైవసం చేసుకున్నంతవరకూ ఆయన జీవితంలోని కీలక దశలను ఆవిష్కరిస్తూ ఈ డాక్యుమెంటరీ రూపొందింది. డాక్యుమెంటరీ ఆలోచన రాగానే కార్తీక్ నేరుగా రజనీని కలుసుకుని ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశారు.కొంత కీలక సమాచారాన్ని ఆయన వద్ద నుంచి సేకరించారు. రజనీ జీవిత విశేషాలతో పాటు ఆయన సన్నిహిత మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు ఛో రామస్వామి ఇంటర్వ్యూ కూడా ఇందులో చోటుచేసుకుంది. ఈ ముఖాముఖీలో రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై ముచ్చటించారు. మరో నెలలో ఈ డాక్యుమెంటరీ డివిడి రూపంలో మార్కెట్ లోకి రానుంది.



7/23/09

మగదీర " కాజల్ కబుర్లు "

మగధీర చిత్రంలో హీరోయిన్ కాజల్ ని రామ్ చరణ్ ఛేజ్ చేసే సన్నివేశం బాగా వచ్చింది.ఆమె సిటీ బస్సులో వెళ్తూంటే రామ్ చరణ్ గుర్రంపై వెంబడిస్తూంటాడు. బిజీ ట్రాఫిక్ లో హైదరాబాద్ రోడ్లపై ఈ సీన్ జరుగుతుంది. చరణ్ ఆ ట్రాఫిక్ లోనే ఆమెను ఛేజ్ చేస్తూంటాడు. కథా పరంగా రామ్ చరణ్ కి అప్పుడే.తాను ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న అమ్మాయి కాజల్ అని తెలుస్తుంది.దాంతో ఆ ఎమోషన్ ని కంటిన్యూ చేస్తూ దగ్గరలో ఉన్న గుర్రంపై ఆ స్వారీ మొదలెడతాడు. ఆ సన్నివేశం చాలా ఫన్నీగా ఉంటుంది. ట్రాఫిక్ లో అంతా విచిత్రంగా చూస్తూంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ సన్నివేశం చిత్రీకరించారు...అంటూ చెప్పుకొచ్చింది కాజల్. మగధీరలో తనకు నచ్చిన సన్నివేశంగా ఈ సన్నివేశం వివరించింది.
ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో ఫస్ట్ ఆఫ్ కాజల్ ఫ్యాషన్ డిజైనర్ గానూ,సెకండ్ ఆఫ్ రాకుమార్తెగాను కనిపించి కనువిందు చేయనుంది. అలాగే ఈ చిత్రంలో తాను నటించటం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది. రోజకు పధ్నాలుగు గంటలు చొప్పున పనిచేయాల్సి వచ్చిందంటోంది. అలాగే ధీర..ధీర..మగధీర అనే పాటలో క్లాసికల్ డాన్సర్ గా కనపడటం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసానని చెప్తోంది. అంతేగాక ప్రిన్సెస్ గా నటించటానికి నేను నా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. బలమైన భావోద్వేగాలు ఉన్న సన్నివేశాలు ఉండటంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం కళ్ళతోనే కొన్ని ఎమోషన్స్ పలకాల్సి వచ్చేది. అందుకోసం నేను ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసేదాన్ని. రాజకపూర్, నర్గీస్ నటించిన చిత్రాలు చూసి వారి మధ్య కెమిస్ట్రీ తెరపై పండటానికి కారణాలు పరిశీలించేదాన్ని. అలాగే మేకప్ కోసం రోజుకు రెండు గంటలు పట్టేది. ఈ రోజు నాలుగు వందల ఏళ్ళ సన్నివేశం చేస్తే మరుసటి రోజు కాలేజి అమ్మాయిగా ఈ కాలం సీన్ చెయ్యాల్సి వచ్చేది అంటూ తన అనుభవాలును కాజల్ గుర్తు చేసుకుంది.


7/22/09

"మల్లన్న" ఆగస్టు 15న రిలీజ్



విక్రమ్,శ్రియ కాంబినేషన్లో రెడీ అయిన మల్లన్న చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయటానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం కలైపులి ధాను భారీ సాంకేతిక విలువలతో జోడించారు. దాదాపు తొమ్మది వందల ధియోటర్లలలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సుశీగణేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మల్లన్న డేట్ ప్రకటించటంతో మిగతా ఆగస్టు నెలలో రిలీజ్ చేద్దామనుకున్న తమిళ,తెలుగు చిత్రాలు కొన్ని ప్రక్కకు తప్పుకునే అవకాశం ఉంది.ఆగష్ఠు నెల మాత్రం పెద్ద సినిమాలతో ప్రేక్షకులని అలరించబోనుంది ఒక పక్క మెగాతనయుడి "మగధీర" వెనువెంటనే నాగ్ తనయుడి "జొష్" భారీ అంచనాలతో ఒకరి తరువాత ఒకరు పోటిపడుతున్న నెల వరుసగ మూడు గ్రహణాలతో భారీ ప్రమాదలు ఏర్పడతాయని అంచనాలు వేస్తే అన్ని తిరగబడి ప్రశాంతంగా ముగిసిపోయింది ఈ సినిమాల పరిస్తితి ఏంటో రీలిజ్ తరువాత చూడల్సిందే

సాక్షి ఎబౌట్ నాగ చైతన్య

మొత్తం చదవడానికి ఇమెజ్ క్లిక్ చెయ్యండి


దిల్ రాజుపైనా నిషేధం

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుపై కూడా ఫిలిం ఛాంబర్ నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణయం ఫిలిం ఛాంబర్ ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్ర పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఇటీవలే మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్‌కి సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు ఈ ఆంక్షలను ఉల్లంఘించి తన జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ లైవ్‌ని మా టీవీకి ఇచ్చారు. దీంతో దిల్‌ రాజు తీరుపై ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్‌కు మాత్రమే పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన మగధీర ఆడియో పంక్షన్ కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మా టీవీలో లైవ్ ఇచ్చారు. అటు అల్లు అరవింద్, ఇటు దిల్‌ రాజు ఇద్దిరిపై ఏక కాలంలో ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోవచ్చిన తెలుస్తోంది.




7/19/09

శివ రీమెక్ లో నాగర్జున తనయుడు



నాగార్జున హీరోగా, రామ్‌గోపాల్‌ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని వెంకట్‌ 'శివ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఈ సినిమా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది.

మళ్ళీ అదే చిత్రాన్ని నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్‌'లో కీలక పాత్ర పోషించారు. ఇంకా "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డ్ హ్యాండ్ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం చేపట్టా
రు





'శంకరాభరణం', 'శృతిలయలు' లా తీద్దామనుకుని కలవరపడ్డారు



'శంకరాభరణం', 'శృతిలయలు' వంటి సినిమాలు తీసే రోజులా ఇవి?(ఒకవేళ తీసినా ఆ స్థాయి సంగీతం సపొర్ట్ లేకుండా......) కావనుకునే కళాతపస్వి కె.విశ్వనాథ్ కెమెరా వెనక్కి వెళ్లడం మానేశారు. 'రాధాగోపాళం', 'సుందరాకాండ' వంటి చేదు అనుభవాలు బాపూకి కూడా తప్పలేదు. విశ్వనాథ్ సినిమాలా తన తాజా చిత్రం ఉందని అనిపిస్తే అందుకు గర్విస్తానని దర్శకుడు సతీష్ కాసెట్టి ముందే చెప్పుకొచ్చారు. అయితే విశ్వనాథ్ తీసిన నాలుగైదు సినిమాల ఇన్ ఫ్లుయెన్స్ సతీష్ తీసిన 'కలవరమేయే మదిలో' చిత్రంపై కనిపిస్తుంది. అనాటి కళాఖండాలను గుర్తుచేసే ప్రయత్నం పొరపాటు కాదు. అయితే అలాంటి 'మిక్సింగ్'తో సినిమా తీసినంత మాత్రాన సరిపోదు. ఇవాల్టి యువతరం నాడిని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే పనితనం, సన్నివేశాల బలం వంటివి అనివార్యం. వీటికి కనెక్టివిటీగా వినోదం అనేది కూడా తగిన మోతాదులో ఉండాలి. ఉదాహరణకు కథానాయిక హీరో మహేష్ వీరాభిమాని అనే పాయింట్ మీదే సినిమా మొత్తం నడిపి వినోదాల పంట పండించిన 'అష్టాచమ్మ'ను చెప్పుకోవచ్చు. అందులో కథానాయిక స్వాతి చేసిన అల్లరి సినిమాను విజయపథంలోకి తీసుకెళ్లింది. అదే స్వాతి ఇప్పుడు 'కలవరమాయే మదిలో' అన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆమె నుంచి అలాంటి స్పాంటేనియస్ అల్లరి, చిలిపిదనాన్నే ఆశించడం సహజం. ఆరంభంలో స్వాతి తనను తాను పరిచయం చేసుకుంటూ తన ఆశలు, ఆశయాలు గడగడా చెప్పేస్తుంటే...ఇంకేం...బోలెడంత ఎంటర్ టైన్ ఇందులోనూ ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కొంతసేపు అలాంటి నడకే నడిచినా ఆ తర్వాత స్వాతి ఒకదాని వెంట మరో కష్టాల కలవరంతో అల్లల్లాడుతుంది. ఆ కష్టాలు చూసి అనుకొన్నదొకటి..అయినది మరొకటి అనే 'కలవర' పాటు వీక్షకులకూ సో(పా)కుతుంది. శ్రేయ (స్వాతి) తన తల్లి (ఢిల్లీ రాజేశ్వరి)తో కలిసి ఉంటూ ఓ ఆడిట్ ఆఫీసులో పనిచేస్తుంటుంది. శ్రేయకు పాడటం అంటే ప్రాణం. ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ లో తాను పాడాలనేది ఆమె డ్రీమ్. అయితే శ్రేయ తల్లికి మాత్రం శ్రేయ సింగర్ కావాలనుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది లెండి. అమ్మ కోసం జాబ్ చేస్తూ డబ్బుల సంపాదన కోసం ఓ స్టార్ హోటల్ లో శ్రేయ పాటలు పాడుతుంటుంది. లండన్ తిరిగి స్వదేశానికి వచ్చిన శ్రీను (కమల్ కామరాజు) ప్రతిరోజూ ఆ హోటల్ లో శ్రేయ పాట వింటుంటాడు. అందరూ చప్పట్లు కొట్టినా అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంటాడు. ఇది శ్రేయకు నచ్చదు. అతనితోనే అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. శ్రేయ ఆశయానికి అతను ప్రోత్సాహం అందిస్తుంటాడు. సంగీత విద్యాంసుడైన రావు (విక్రమ్ గోఖలే) ఒకరోజు తన సహచరుడైన శాస్త్రితో (తనికెళ్ల భరణి) కలిసి ఆ హోటల్ కు వచ్చి శ్రేయ పాట వింటాడు. ఆగ్రహంతో ఊగిపోతూ 'నువ్వు పాడేది కూడా ఓ పాటేనా?' అని గద్దిస్తాడు. దీంతో శ్రేయ చిన్నబోతుంది. తనకు పాడటమే రాదన్న రావు వద్దే సంగీతం నేర్చుకోవాలని శ్రేయ నిశ్చయించుకుంటుంది. అయితే ఆమె కోరికను రావు తోసిపుచ్చుతాడు. సంగీతం నేర్పేదిలేదంటాడు. శాస్త్రిని మంచి చేసుకుని పనిపిల్లగా రావు ఇంట్లోకి శ్రేయ అడుగుపెడుతుంది. ఒకవైపు శాస్త్రిని ఒప్పించేందుకు పడేపాట్లు, మరోవైపు శ్రీనును ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలతో కథ నడుస్తుంటుంది. షడన్ గా స్టోరీలో ఓ ఊహించని 'మలుపు' చోటుచేసుకుంటుంది. ఇక స్టోరీ ట్రాక్ మారుతుంది. శ్రేయను కలవర పరచిన ఆ ట్విస్ట్ ఏమిటి? రెహ్మాన్ కంపోజిషన్ లో పాడాలనే శ్రియ డ్రీమ్ ఎలా నెరవేరిందనేది మిగతా కథ.



మంచుమనోజ్ ప్రయాణం ఎంతవరకో యస్.యం.యస్,చేయండి56006767కి

మంచు మనోజ్కుమార్ హీరోగా కథకుడు వీరు పోట్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుంకర రామబ్రహ్మం ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రెండవ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాతో షీనా హీరోయిన్గా పరిచయవుతోంది. చిత్రం ప్రోగ్రెస్ను నిర్మాత వివరిస్తూ 'ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తయింది
.
మనోజ్ కుమార్ తన నిజ జీవితంలో లాగా సరదగా, చలాకీగా ఉండే కుర్రాడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు,వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది.
ఈ చిత్రానికి (ఎ) అజయ్ గాడి విజయగాథ, (బి) బిందాస్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండు టైటిల్స్ లో ప్రేక్షకులు దేనికి ఎక్కువ ఓటేస్తే ఆ టైటిల్ ఖరారు చేస్తారట. ఇందుకోసం ఎ కానీ బి కానీ టైప్ చేసి 56006767 నెంబర్ కు ఎస్.ఎం.ఎస్.చేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తారు. యూత్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రుపొందుతోంది.మనోజ్ దర్శకుల హీరో అనీ వీరుపోట్లఅతనితో చేసిన ప్రతి దర్శకుదు తెగ పొగుడుతున్నారు.ఈ సినిమాలో మనోజ్ పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉండబోతోంది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం వీరుపోట్ల అందిస్తున్నారు, భవనచంద్ర పాటలు, రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, బోబో శశి సంగీతం అందిస్తున్నారు.ప్రయాణంతో మంచి హిట్ వస్తుందీనుకున్న రాలేదు మరి ఈ సినిమా ప్రయాణం ఎంతవరకో చూసిన తరువాతగాని చెప్పలేం.

7/18/09

జొష్ ఆడియో ఫంక్షన్లొ వెంకి, బాలయ్యబాబు, మోహన్ బాబు సెటైర్లు



నిన్న నాగ చైతన్య జొష్ ఆడియో ఫంక్షన్ చూసాను చాల బాగ జరిగింది సినీ రంగానికి చెందిన దిగ్గజాలు అక్కినేని,రామానాయుడు , స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా అతిరధ మహరధులనదగ్గ సినీ ప్రముఖులు హాజరయ్యరు ఇక ఈ ఫంక్షన్ కి హైలెట్స్

మోహన్ బాబు : అక్కినేని గొప్పతనం చెబుతు మద్యలో అరుస్తున్న అభిమానులని ఉద్దేశించి "సైలెన్స్ ...మన అభిమానులు డిసిప్లైన్ ఉన్నవాళ్ళు మిగతా వారిలా సంస్కారం లేని వారు కాదు " (మద్యలో ఈ మిగతా వారేవరు .....ఇంకెవరు మన ....) మద్యలో నాగర్జున వచ్చి జాగ్రత్త అని నవ్వుతూ చెప్పివెళ్లాడు "ఎంటయ్యా మద్యలో వస్తావ్ అని మోహన్ బాబు జవాబిచ్చాడు

బాలకృష్ణ : ఎప్పటి లాగే తనదైన స్టైల్ లో "మా నాన్న గారు ......ఆ రొజుల్లొ .............బాబాయ్ అక్కినేని గారితో బాటు పైనున్న మా నాన్న గారి ఆశీస్సులు కూడా చైతన్యకి వుండాలి అంటు కొంత సేపు సాగదీస్తు వెరైటీగా ప్రసంగించారు

వెంకటేష్ : ఒక కింగ్ ఒక శివ తో బాటు ఒక చంటి లాంటి వాడు కలిస్తే ఎలా వుంటాదో అలా వుంటాడు చైతు


నాగేశ్వర రావు గారికి వయసు మీద పడటం వలన కొంచం చాదస్తం పెరిగినట్టుంది హెడ్మాస్టర్లా.... సైలెన్స్ సైలెన్స్ అంటు ప్రేక్షకులని గదిమారు ......



Powered by web analytics software.