Free SMS And Earn Part Time Money







1/28/11

పోకిరి లాంటి సినిమా కోసం హింది హిరోలు కర్చిఫ్లు రెడి చేసుకుంటున్నారు


మహేష్ బాబు పూరిజగన్నాధ్ కాబినేషన్ అంటేనే ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్ అవుతున్నారో అంతకూ రెండింతలు పరభాష హిరోలు ఉబలాటపడుతున్నారు "పోకిరి"సినిమాని వారి భాషలలోకి అనువదించుకొని హిట్లు కొట్టిన హిరోలంతా ఇప్పుడు మహేష్ పూరి తీయబోతున్న ది బిజినెస్ మెన్ చిత్రం రైట్స్ కోసం వేచి చూస్తున్నారు మళ్ళి అటువంటి సినిమా వారి కెరీర్ లో దొరకదన్నట్టు ఉబలాటపడి కర్చిఫ్ లు సిద్దం చేసుకుంటున్నారు ఎంత ఉబలాటపడుతున్నారో అంత కంత భయపడుతున్నారు కూడ వీరిద్దరి కాబినేషన్ అంటే మరో పోకిరి కావాలని అవేశం తో పూరి డిజాస్టర్ ఇచ్చాడో మరో ఆంధ్రవాల మహేష్ కి మరో ఖలేజా రిపీట్ అవుతాయి జర జాగ్రత్త హిరోలు అని మిడియా కోడై కూస్తోంది

అప్పటి లవకుశని మరిపించేవిధంగా శ్రీ రామ రాజ్యం తీస్తానంటున్న బాపు


శ్రీ రామ రాజ్యం యూనిట్ ఎవరికి ఏ ఏ పాత్రలు డిసైడ్ అయిపోయాయి జూన్ 10 న రిలీజ్ గ్యారెంటి అ వివరాలు సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంలో యూనిట్

దర్శకుడు బాపు
యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా
సీతగా నయనతార
వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు
లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్
బాలాంజనేయునిగా పవన్ శ్రీరామ్
జనకునిగా మురళీమోహన్,
కైకేయిగా సన, కౌసల్యగా కె.ఆర్.విజయ
చాకలి తిప్పనిగా బ్రహ్మానందం
ఈ చిత్రలో రామయణం గురించిన అన్ని విశేషాలు అనగా :లవకుశ జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం మొదలైనవి అన్ని చూపించటం జరుగుతుంది అంతే గాక శ్రీరాముని జననం నుండి రావాణాసుర సంహారం వరకూ పది నిమిషాల పాటలో కథంతా ఉంటుంది.ఇందులో 8 పాటలు, బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయని డైరక్టర్ బాపు చెబుతునారు అంతే గాక గతంలో రామారావుగారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్యకావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశకంటే గొప్పగా శ్రీరామరాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అని చెబుతున్నాడు.......!!!!

కొత్త హీరోయినలకి ఇంకా అర్దం అవక ఎక్స్ పోజింగ్ పెంచుతున్నారు


సినిమా లు పోతునాయ్ అబ్టే పోవమరి నటన తెలియక పోయినా ఉత్తరాది భామలు ఎక్స్ పోజింగ్ కి ఏ అడ్డంకు పెట్టరని అందునా మన తెలుగు వారికి కధతో పనిలేదు హిరోయిన్ అందచందాలు ఉంటే సరిపోతాయ్ అనుకునే డైరక్టర్స్ కి మంచి బుద్దివచ్చేటట్టు ఓన్లీ హిరోయిన్ ఎక్స్ పోజింగ్ ఉండి కధ అసలు లేని కొమరంపులి,నుంచి నిన్న మొన్న వచ్చిన వాంటెడ్ వరకు హిరోయిన్ అందాల ఆరబోత అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్ని నెత్తిన గుడ్డేసుకునేలా చేశారు మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఫ్లాప్ ల వల్ల హిరోలకు పోయేదేమి లేదు అంతా నిర్మాతలకు హిరోయిన్స్ కి మాత్రమే తడిసి మోపెడవుతుంది నిర్మాతలకు డబ్బు పరంగా హిరోయిన్స్ కి చాన్స్ ల పరంగా దెబ్బ అంతే కాపోతే బిగ్ ఇమేజ్ ఉన్న పవంకల్యాణ్ పక్కన నటించిన హిరోయిన్ దగ్గరనుంచి కొత్తగా వచ్చిన హిరోయిన్లందరికి ఒక్క చాన్స్ లేకుండా బికినీలు వేయటానికి కూడ రెడి అవుతున్నారు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే వాంటెడ్ చిన్నది కొమరం పులి చిన్నది బికిని వేయటానికి రెడీ అయిపోయారు ఇంత జరిగిన వీల్లకి అర్దం కాలేదు మంచి కధ యాక్టింగ్ లేక ఫ్లాప్ అయిందని ఎక్స్ పోజింగ్ తగ్గిందంకుంటున్నారు [హీరోయిన్ లు చేసి ఐటం సాంగ్స్ చేసేవారు చేస్తే ఇంక ఎక్స్ పోజింగ్ కి

దేవికి ఈ సినిమా ఓ ఛాలెంజ్ [చిక్కుగా]గా నిలవబోతోంది. Gabbar singh


పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ గా రీమేక్ చేయబోతున్న ఒరిజినల్ ‘దబాంగ్’సినిమాయే కాదు మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో ఎక్కువ అవార్డులు ‘దబాంగ్’కే రావడం విశేషం. 2010 సంవత్సరానికి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా ‘దబాంగ్’ ఎంపికైంది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా సాజిద్-వాజిద్, సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ‘మున్నీ బద్నామ్..’ ఈ పాట పాడిన మమతా శర్మను అప్ కమింగ్ సింగర్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సందీప్ శిరోద్కర్ కు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డులకు ఎంపిక చేశారు. ఇవే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి సంగీత విభాగంలో మరికొన్ని అవార్డులు గెలుచుకుంది ‘దబాంగ్’. మరి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మ్యూజిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో మరి. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నట్టు తెలిసింది. తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవికి ఈ సినిమా ఓ ఛాలెంజ్ [చిక్కుగా]గా నిలవబోతోంది. హిందీలో మ్యూజికల్ హిట్ అయిన చిత్రానికి తెలుగులో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.. మరి ముఖ్యంగా 'మున్నీ బద్నాం 'సాంగ్ రీమేక్ అంటే మాటలు కాదు దేవి శ్రీ ప్రసాద్ కిది అవార్డులు తేస్తుందో చీవాట్లు తెస్తుందో వేచిచూడాలి

పాత స్నేహం తో పద్మ శ్రీ కొట్టేసిన తార


ఎంతో ప్రతిష్టాత్మక బిరుదులు పద్మశ్రీలు, పద్మ భూసణులు, పద్మవిభూషణలు, భారతరత్నలు..ఈ పద్మశ్రీలు, పద్మ భూసణులు, పద్మవిభూషణలు, భారతరత్నలు ఏ వ్యక్తికైనా వచ్చాయంటే ఆ వ్యక్తి ఎంతో కొంత ప్రజాసేవ ఐనా చేసి ఉండాలి, లేదా ఏదో ఒక రంగం నిష్ణుతుడై ఉండాలి. కానీ ఈ పద్మశ్రీలు, పద్మ భూసణులు, పద్మవిభూషణలు, భారతరత్నలు బజారులో కూరగాయలు కొనుక్కొనే రీతిలో బడా పెద్ద మనుషులు కొనుక్కొంటున్నారు. కొద్దమందికి మాత్రమే(సామర్థ్యం ఉన్న వ్యక్తులకు) ఈ పద్మాలు ఇచ్చి మిగిలినవన్నీ అమ్ముకోవటమో లేక రికమెండ్ ప్రభావంతో ఇవ్వటమో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న తంతు. ఈ తంతు ఇప్పుడు మళ్లీ జరిగింది. ఏ కొద్ది మందికో అర్హులైన వారికి పద్మాలు ఇచ్చి పాత పద్దతులలోనే అవార్డులను పంచారు. ఈ పంచే అవార్డులలో సినీ నటి టబు ఉన్నారని ఫిలింనగర్ లో ఒకటే గోల. ఇంతకీ టబుకు పద్మశ్రీ ఇప్పించే అవకాశం ఎలా దొరికొంది?ఎవరు రికమెండ్ చేశారు? ఫిలింనగర్ న్యూస్ ప్రకారం టబుకి పద్మశ్రీని రికమెండ్ చేసింది మన యువ సామ్రాట్ నాగర్జున టబు కి నాగర్జునకి జరిగిన ప్రేమ వ్యవహారం ఇండస్ట్రి అంత తెలిసిందే ఒకప్పుడు వీరి విషయం ప్రతిది సినీ ఇండస్ట్రీలో గుప్పుమనేది కొద్దిరోజుల తరవాత ఆగిపోయింది అది మళ్ళి లాకుంటున్నాట్టు ఉనాడు మన బాబు సినీ ఇండస్ట్రీ లో పెద్దగా చెప్పుకుంటున్న వారిలో ఒకేఒకరు మన నాగేశ్వర రావు అతని ద్వార సుబ్బిరామిరెడ్డి కి చెప్పించి టబు కి పద్మ శ్ర తెప్పించాడని టాక్ ఇలా పంచుకుంటు పోతే అవార్డ్లు వచ్చిన ఒకటే రాక పోయిన ఒకటే అప్పట్లో టబు ఇప్పుడు అనుష్క మరి కొన్ని సినిమాలు హిట్ కొడితే అనుష్క కూడ ఇప్పించేస్తాడేమో పద్మం

మెగాస్టార్ కోసం పెళ్ళి వద్దనుకున్న జూనియర్


ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ గా చలామనిఅవుతున్న జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల నిశ్చితార్థం అయిన విషయం విదితమే. అయితే అల్లు అర్జున్ పెళ్లి మార్చి 6న ఖాయమైపోయింది. నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న బన్నీ నాలుగు నెలలు తిరగకుండానే పెళ్లిపీటలెక్కేస్తున్నాడు. కానీ అతనికంటే ఎనిమిది నెలలు ముందు ఎంగేజ్ మెంట్ అయిన జూ ఎన్టీఆర్ కి మాత్రం ఇప్పటిదాకా పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాలేదు. గత ఏడాది మేలోనే పెళ్లి చేసుకుంటున్నాడని ఎన్టీఆర్ గురించి వార్తలొచ్చాయి. అయితే నవంబర్ 18న పెళ్లి ఖాయమని ఎన్టీఆర్ క్యాంప్ నుంచే న్యూస్ వచ్చింది. పెళ్లి కోసమని షూటింగులు కూడా త్వరత్వరగా కానిచ్చేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా సినిమాలు అంగీకరిస్తూ వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అందరిలా కాకుండా తనకంటు ఒక పంధతో కధ కి కధ కి మధ్య ఎన్నో డిఫరెంట్స్ తో దూసుకెల్తున్నాడు 2010 లో బౄందవనం తో హిట్ కొట్టిన జోరుతో వరసగా నాలుగైదు సినిమాలు 2011 లో చేసేసి మెగాస్టార్ అనిపించుకుందామని చూస్తున్నాడు మిగిలిన హిరోలు ఒకటి,రెండు సినిమాలతో ఆగిపోతుంటే జూనియర్ మాత్రం పెళ్ళి ఆపుకొని మరి మెగాస్టార్ కోసం కౄషి చేస్తున్నాడు అంతేకాకుండ మిగిలిన హిరోలందరు ఏదో ఒక లోపంతో వెనకంజు లో ఉన్నారు జూనియర్ మాత్రం ఏటువంటి పాత్రనైన అలవోకగా చేస్తాడని అందరితో అనిపించుకుంటు మెగాస్టార్ కి చేరువ అవుతున్నాడు ..........!!!

సెక్స్ కోసం పరితపించిపోయే అందాల తారWho???


బ్రాడ్ పిట్ మాజీ భార్య అందాల తార జెన్నిఫర్ ఆనిస్టన్ రాబోయే సినిమాలో సెక్స్ కోసం పరితపించిపోయే డెంటిస్ట్‌గా నటిస్తున్నారు. ఈసందర్బంగా జెన్నిఫర్ ఆనిస్టన్ మాట్లాడుతూ నేను ప్రస్తుతం నటిస్తున్నటువంటి సినిమా హారిబుల్ బాసెస్. ఈసినిమాలో నాక్యారెక్టర్ పేరు డాక్టర్ జులియా హారిస్. ఇందులో నేను సెక్స్ కోసం పరితపించిపోయే డెంటిస్ట్ డాక్టర్‌గా మొట్టమొదటి చేయడం జరిగింది. సెక్స్ కోసం తన తోటి ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసే ఈక్యారెక్టర్ నాకు చాలా నచ్చడంతో ఈసినిమా ఒప్పుకోవడం జరిగిందన్నారు.
అంతేకాకుండా ఈస్టోరీ విన్నవెంటనే నాకు చాలా ద్రిల్ల్‌గా అనిపించి సినిమా అంగీకరించడం జరిగింది. ఎప్పుడూ ఒకే విధమైన క్యారెక్టర్స్‌తో బోరుకోట్టిననాకు ఈక్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. ఈసినిమాలో నారోల్ చాలా క్రేజీగా ఉంటుంది. ఇక కధవిషయానికి వస్తే నేను హాస్పిటల్‌లో డెంటిస్ట్‌ డాక్టర్ గా చేరడం జరుగుతుంది. నాకు నచ్చినవిధంగా, నేను ఏది చెబితే అది జరగాలనే మనస్తత్వం ఉన్నటువంటి డెంటిస్ట్‌ని.
అంతేకాకుండా నాకు కలలో ఎలాంటి కలలు ఐతే వస్తాయో అలాంటి కలలను ఉద్యోగులపై రుద్దడమే పనిగా పెట్టుకోని ప్రవర్తిస్తాను అని అన్నారు. ఈసినిమాలో మీరు మరో జెన్నిఫర్ ఆనిస్టన్ చూస్తారు అని అన్నారు. నాజీవితంలో మాట్లాడనటువంటి కొన్ని బూతు మాటలు కూడా ఈసినిమాలో నాతో డైరెక్టర్ మాట్లాడించారు అన్నారు. ఈసినిమాలో జెన్నిఫర్ ఆనిస్టన్‌ జీవితంలోని రెండవ కొణాన్ని చూస్తారని అన్నారు

నందమూరి ఫ్యామిలి ని ఒదలని యాక్షన్


నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజా చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. యజ్ఞం ఫేమ్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఇది తయారుకాబోతుంది. అతనొక్కడే తర్వాత అంతటి హిట్‌ కోసం చూస్తున్న కళ్యాణ్‌రామ్‌కు రవి కుమార్‌చౌదరి చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఒక సామాజిక అంశాన్ని టచ్‌ చేసే కథతో రూపొందబోతోంది. యజ్ఞంలో ఫ్యాక్షనిజానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన రవికుమార్‌ చౌదరి ఈ చిత్రంలో మరో అంశాన్ని తీసుకుని వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందులో ప్రముఖ హీరోయిన్‌ నటించనుంది. ఈ చిత్ర కథపై పూర్తి విశ్వాసంతో నందమూరి ఫ్యామిలీ ఉంది. యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యతగల ఈ సబ్జెక్ట్‌కు కళ్యాణ్‌రామ్‌ కరెక్ట్‌గా సరిపోతాడని భావిస్తున్నారు.

నవనీత్ కౌర్, రాణాలిద్దరూ పెళ్లి పీటలపై కూచోబోతున్నారు


ఆకట్టుకునే ఒంపుసొంపులతో, రెచ్చగొట్టే చూపులతో... సెక్సీ అందాలతో "6టీన్స్‌" చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైన నవనీత్‌కౌర్‌ ఎందుకనోగానీ అనుకున్నంత స్థాయిలో ఆఫర్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈ ఎత్తుపళ్ల సుందరి తమిళం, మలయాళ పరిశ్రమలో అదష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడికి వెళ్ళింది.

అయితే అక్కడ కూడా పరిస్థితిలో మార్పులేదు. దీంతో విసుగు చెందిన కౌర్ పెళ్లి చేసుకుంటే ఓ పనై పోతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఎలాగూ సినిమాల్లో సెటిలవలేకపోయింది కనుక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని చూస్తోంది. ఈ అమ్మడు వివాహం మహారాష్ట్రకు చెందిన ఎం.ఎల్‌.ఎ. రవి రాణాతో జరగనుంది.

మరో విశేషం ఏమిటంటే 2011 సంవత్సరం అడుగిడిన సందర్భంగా అమరావతి ఆలయంలో 2011 జంటలు వివాహబంధంతో ఏకంగా కానున్నాయి. ఈ జంటలతోపాటే నవనీత్ కౌర్, రాణాలిద్దరూ పెళ్లి పీటలపై కూచోబోతున్నారు. ఇలా నవనీత్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కనుంది. సినిమాల్లో రికార్డులు సృష్టించకపోయినా... పెళ్లితో రికార్డులకెక్కనుంది. కౌర్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పేద్దాం.

జై బొలో తెలంగాణ కి నై బొలా బోర్డ్ తీసేశారు


ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన జై బోలో తెలంగాణ సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి. కొద్దిపాటి కట్స్‌కు శంకర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాంతో సినిమాకు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయడానికి శంకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డు సినిమాను ముంబైలోని జాతీయ సెన్సార్ బోర్డుకు పంపింది. జాతీయ సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపింది. భాస్కరరావు నేతృత్వంలోని రివైజింగ్ కమిటీ గురువారం సమావేశమై సినిమాకు క్లీన్ చిట్ ఇచ్చింది.

సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడం పట్ల శంకర్ హర్షం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులు మానసిక వికాసంతో నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. సినిమాకు ఇంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తుందని అనుకోలేదని, అయితే తెలంగాణ ప్రజల పోరాటం వల్ల అది సాధ్యమైందని, వారికి చేతులెత్తి మొక్కుతున్నానని ఆయన అన్నారు. సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీ రామ రాజ్యం విడుదల తేది


నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశ కంటే గొప్పగా శ్రీరామ రాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి..అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అన్నారు.

అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఈ చిత్రంలో

hero:శ్రీరామునిగా బాలకృష్ణ,

heroine:సీతగా నయనతార చేస్తున్నారు.

banner:శ్రీ సాయిబాబా మూవీస్ పతాకం
producer:యలమంచిలి సాయిబాబు
రచన:ముళ్లపూడి వెంకటరమణ .
సంగీతం :ఇళయరాజా

. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం.

పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి,

సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు,
కూర్పు: జి.జి. కృష్ణారావు,
కళ: రవీంద్ర,
గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్,
డాన్స్: శ్రీను,
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ,
స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

త్రిష వల్ల పవన్ డైరక్టర్ కి కంగారు పుట్టింది


పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్‍ హీరోగా, జయంత్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న "లవ్ లీ" చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూంది. ఈ చిత్రంలోని కోన్ని స్టిల్స్ తీసుకుని తన ట్విట్టర్ లో పోస్ట్ చేద్దామనుకుందట త్రిష. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు జయంత్. సి. పరాన్జీ వెంటనే ఈ సినిమాలోని ఏ చిన్న విషయం కూడా తనకు తెలియకుండా బయటకు పొక్కటానికి వీల్లేదని త్రిషకు స్ట్రిక్ట్ గా చెప్పారట. ఆఖరికి ఏ ఒక్క ఫొటో కూడా బయటకు రాకూడదని. ఈ సినిమాకి తాను పబ్లిసిటీని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. త్రిష వల్ల ఆ ప్లాన్ పాడవుతుందని ఆయన కంగారు పడ్డారట.

అల్లు అరవింద్ డబ్బంతా గోవింద చేశారు బద్రినాధ్ యూనిట్

మగధీర తర్వాత గీత ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘బద్రీనాథ్’ నిర్మాత దిగ్గజం అల్లు అరవింద్ నేతత్వంతో బద్రీనాథ్ షూటింగ్ నిర్విరామంగా సాగిపోతుంది. గీతా ఆర్ట్స్ యూనిట్ అంతా అవుట్ డోర్ వెళ్లి హీరో అల్లు అర్జున్ తో శరవేగంతో షూటింగ్ ను కొనసాగించారు. వరుడు ప్లాప్ కావటం బన్నీకి ఎంతో నిరాశను మిగిల్చింది. వేదంలో బన్నీ వేషం ఉన్న సోలోగా లేకపోవటంతో బద్రీనాథ్ బన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా కోసం బన్నీ కూడా ఎంతో కష్టపడి అవుడోర్ లో రియాల్టిపిక్ గా కొన్ని ఫైట్స్ చేశారు. వివిధ లొకేషన్స్ లో కొన్ని పాటలు కూడా చిత్రీకరణ చేశారు.

అవుట్ డోర్ లో ప్లాన్ చేయటం అంటే ఈ రోజుల్లో టోటల్ బడ్జేట్ లో అధిక శాతం అవుట్ డోర్ లోనే ఖర్చుపెడతారు. పైగా అల్లు అరవింద్. ఖర్చుకు రాజీలేకుండా తీయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఇంత కష్టపడి అవుట్ డోర్ లో షూట్ చేసిన భాగమంతా పనికిరాకుండాపోయిందని తెలియటంతోనే బన్నీ యునిట్ సభ్యులమీద, కెమెరా మ్యాన్ మీద కోపంగా ఉన్నారని తెలిసింది. ఒక్కొక్కసారి ‘కాన్’ లోపం వల్ల షూట్ చేసిన పిలిం మొత్తం షాగ్ అవ్వటం అప్పుడప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ‘కాన్’లు సీల్డు చేసి ఉంటాయి. వాటిని కెమెరాలోకి లోడ్ చేసేటప్పుడు, అసలు సూర్యరశ్మి తగలకుండ లోడ్ చేసి షూటింగ్ చేస్తారు. కాన్ లో ఉన్న ఫిలింలోపం వల్లకాని, లోడ్ చేసేటప్పుడు పొరపాటు వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందుకే కాన్ ఫుల్ అవ్వగానే ఫిల్మింను డెవలప్ చేసి చూస్తారు.

కారణం ఏదైతేనేం చేసిన షూటింగ్ అంతా మరలా రీ షూట్ చేయాల్సి వచ్చింది. అసలే బన్నీ కుర్రవాడు, మంచి హిట్ కొట్టాలనే తొందరలో ఉన్న యువస్టార్ మరి ఇలాంటివి జరిగినప్పుడు కోపంగానూ, బాధగాను ఉండటం చాలా సర్వసాధారణం కదా? మరలా యూనిట్ అంతా అవుట్ డోర్ కు వెళ్లి తీసిన షూటింగ్ మరలా తీయాలని గీతా ఆర్ట్స్ సిద్దంగా ఉందని తెలుస్తుంది.

షాహిద్ కపూర్ ఆ ఇంట్లో దర్శనం ఇవ్వటం అనేది కొందరు నమ్మలేమంటున్నారు.


ప్రియాంక చోప్రా ఇంటికి రైడింగ్ కి వెళ్ళిన ఐటీ అధికారులకు అక్కడ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ దర్శనమిచ్చాడంటూ బాలీవుడ్ లో గుప్పుమంది. ఆ ఐటీ అధికారి అతన్ని బట్టలు వేసుకుని వెళ్ళిపొమ్మన్నాడని, ఆ తర్వాత తీరిగ్గా ఆ వార్తను మీడియాకు లీక్ చేసి ఆనందపడ్డాడంటూ అంతటా వినిపిస్తోంది.

ప్రియాంక చోప్రా మాజీ ప్రేమికుడు అయిన షాహిద్ కపూర్ ఆ ఇంట్లో దర్శనం ఇవ్వటం అనేది కొందరు నమ్మలేమంటున్నారు. అయితే బయిటకు ఇద్దరూ బద్ద శత్రువుల్లా వ్యవహిస్తున్నా ఎఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారని ఈ సంఘటన రుజువు చేసిందంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ..ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో ఆమె పెళ్ళి చేసుకున్న ఏడుగురు భర్తలను వరసగా చంపేసే పాత్రను పోషిస్తోంది. ఆంగ్ల చిత్రం 'సెవెన్‌ హజ్బండ్స్‌'ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.
Powered by web analytics software.