Free SMS And Earn Part Time Money







3/21/11


3/18/11

"DaBaang"హిరోయిన్ బికిని , ముద్దు సీన్లలో యాక్ట్ చేయటం కోసం 2కోట్లు


సెల్వరాఘవన్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన ఛాన్స్ దక్కించుకుని కోలీవుడ్‌ లో అడుగుపెడుతున్న బాలీవుడ్ ఫ్రెష్ ఫేస్'దబాంగ్' హీరోయిన్ సోనాక్షి సిన్హా, తొలుత ముద్దు సీన్లలో, రొమాన్స్, బికినీ సన్నివేశాల్లో నటించనని వాళ్లమ్మ చేత చెప్పించింది. రంగంలోకి దిగిన నిర్మాత ఆమెకు పారితోషికంగా రెండు కోట్ల రూపాయలను ఇస్తానన్నట్టు తెలిసింది. దీంతో మొన్నటివరకూ బికినీ వేయను, అందాలను అలవోకగా కూడా చూపను అని మొండికేసిన సోనాక్షి తన మనసు మార్చున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కండిషన్లు వదిలేసి ఎలా కావాలంటే అలా నటిస్తానని చెప్పేసిందట. కాగా దక్షిణాదిలో అడుగుపెడుతూ తొలి సినిమాకే రూ. 2 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్న ముద్దుగుమ్మ బహుశా సోనాక్షీయే అని అంటున్నారు. అంతే కాకుండా కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో ఓ హీరోయిన్‌ కు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికాన్ని ముట్టజెప్పిన దాఖలాలు కూడా లేవంటున్నారు. సోనాక్షీలో అంతగా ఏమున్నదో మరి...?

అప్పటి స్టార్ డం ఉందనుకుంటోంది పాపం అమ్మడు


బాలీవుడ్ ఒకప్పటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇప్పటికీ తానే నెంబర్ వన్ హీరోయిన్ ని అనుకుంటోంది. అందుకే, తన దగ్గరకొచ్చే నిర్మాతలకి కళ్ళు తిరిగే రేటు చెబుతోంది. ఈమధ్య అమెరికా నుంచి వచ్చి, ఓ రియాలిటీ షోలో పాల్గొన్న మాధురీ దీక్షిత్ ని నలుగురైదుగురు నిర్మాతలు కలిసి, తమ సినిమాల్లో నటించమని కోరేటప్పటికి, 5 కోట్లు రెమ్యునేరేషన్ గా అడిగిందట. దాంతో ఏం చెప్పాలో నోట మాట రాక, 'మళ్లీ వస్తాం మేడం' అంటూ ఆ ప్రోడ్యుసర్లు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్దంత మొత్తలో రెమ్యూనరేషన్ కరీనా కపూర్, కత్రినా కైఫ్ మరియు ప్రియాంకా చోప్రాలు మాత్రమే తీసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు, ‘అవును..మాధురీకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో చెక్కుచెదరని అభిమానం వుంది. ఆమె మీ సినిమాలో వుంటే కళ్ళు మూసుకుని బిజినెస్ అయిపోతుంది’ అంటూ గొప్పలు చెబుతున్నాడు. అయితే, బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు మాత్రం మాధురీకి అంత సీను లేదనీ, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుని అలా అడుగుతోందనీ అంటున్నారు. ‘ఇప్పుడు తను సిస్టర్ పాత్రలకీ, తల్లి పాత్రలకే సూట్ అవుతుంది. అలాంటప్పుడు అంత పారితోషికం ఎవరిస్తారు?’ అంటున్నారు

.వర్మ కనిపిస్తే.. కొట్టేటట్లున్నారని.. థియేటర్‌ యజమాని అనడం విశేషం...ఇది దొంగలముఠా రివ్యూ


నటీనటులు: రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు, సునీల్‌, లక్ష్మీమంచు, సత్యప్రకాష్‌, బ్రహ్మాజీ,సుప్రీత్‌లు, కెమెరా:ఎఫ్‌ఎక్స్‌ స్కూల్‌, నిర్మాత: కిరణ్‌కుమార్‌ కోనేరు, సంగీతం: అమర్‌ మోహ్లే, దర్శత్వం: రామ్‌గోపాల్‌వర్మ + హరీష్‌శంకర్‌. పాయింట్‌: ఓ ముఠా ద్వారా కిడ్నాప్‌ అయిన బ్రహ్మానందాన్ని కనిపెట్టే ఓ జంట. ఈ చిత్ర సమీక్ష రాయడానికి కారణం కేవలం రామ్‌గోపాల్‌వర్మ అనే పెద్ద దర్శకుడు సినిమా తీశాడననిన్నూ, రవితేజతోపాటు పలువురు ప్రముఖులు నటించారననిన్నూను. అంతకుమించి ఈ చిత్రంలో ఏమీలేదు. చూసినవాడు తలబాదుకోవడం ఖాయం. వెబ్‌దునియాలో అంతకుముందు పాఠకులు చదివినట్లే.... చార్మి.. అందాలపైనే వర్మ కెమెరాను ఫోకస్‌ చేయడం.. దర్శకత్వంతోపాటు వర్మ కెమెరామెన్‌ అవతారమెత్తడం మరో విశేషం. కొత్త ప్రయోగాలు చేయవచ్చు. కానీ ఆప్రయోగాలు ఎలా చేశారు. దాని గురించి వివరంగా చెప్పేందుకు దర్శకుడు, నిర్మాత సాహసించాలి. ఏదో గుడ్డిలో మెల్లగా రాత్రిరాత్రే వచ్చిన ఆలోచనతో సినిమా చుట్టేసి.. గొప్ప ప్రయోగం చేశామనుకోవడం భ్రమే అవుతుందని చూసిన ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు. కామెరూన్‌ అనే స్టిల్‌ కెమెరాతో కూడా సినిమా తీయవచ్చు. అనేది చెప్పడానికి వర్మ చేసిన ప్రయోగం. కానీ... ఆ కెమెరాతో పగలు షూటింగ్‌ చేస్తే క్లారిటీ బాగానే వస్తుందనేది అందరికీ తెలిసిందే. కానీ వెలుగులేని గదుల్లో కూడా క్లారిటీగా రావడం విశేషం. లైట్లు లేకుండా ఎలా తీయగలిగాడు..? అనేది వివరంగా వర్మ చెప్పలేకపోయాడు. అసలు లైట్లు పెద్దగా వాడలేదన్నాడు. కెమెరాకు సరైన లైటు లేకపోతే క్లారిటీ రాదు. వస్తే ఇన్నాళ్ళు ఆ కెమెరాను ఎందుకు వాడలేదు. పైగా కెమెరా ఎలా వాడారో తెలియజెప్పేందుకు... యూనిట్‌ ఎవరినీ తీసుకెళ్ళకుండా వర్మ జాగ్రత్తపడ్డాడు. ఐదు రోజుల సినిమా.. ఆర్టిస్టులకు పారితోషికాలు ఇవ్వలేదని వర్మ చెబితే నమ్మాలేమో.. ఒక్కరోజులో తమిళం, మలయాళంలో ఓ చిత్రాన్ని తీశారు. అందులో ప్రముఖ హీరోలు నటించారు. ఆ విషయం వర్మను అడిగితే... ఆ చిత్రం గురించి నాకు తెలీదు అన్నాడు... మరి ఈయన చిత్రం గురించి ఎవరికి తెలియాలని ఎవరైనా అడిగితే... సమాధానం ఏం వస్తుందో తర్వాత చూద్దాం... ఇక కథలోకి వెళితే.... సత్యప్రకాష్‌ ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేస్తాడు.. కట్‌చేస్తే... దంపతులైన సుధీర్‌(రవితేజ), రాణి (చార్మి)లు ఓ వివాహానికి వెళుతూ కారు పాడవడంతో మెకానిక్‌కోసం కొంచెం దూరంగా ఉన్న ఓ హోటల్‌కు వెళతారు. అక్కడ సుబ్బరాజు, సుప్రీత్‌, బ్రహ్మాజీలుంటారు. వారు హోటల్‌ నిర్వాహకులు. వారికి ఓ రూమ్‌ ఇస్తారు. ఈ రాత్రి అక్కడే ఉండి తెల్లారి వెళ్ళానుకుంటారు. వారి రూమ్‌ పక్క రూమ్‌లో రాణికి విచిత్రమైన అరుపులు విన్పిస్తుంటాయి. పైగా ఆ ముగ్గురి ప్రవర్తనపై అనుమానం వస్తుంది. వారి పిచ్చి ప్రవర్తనతో సుధీర్‌ విసిగిపోయి అక్కడ నుంచి బయటపడాలనుకుంటాడు. కానీ వారు వెళ్ళనివ్వరు. రాణిపై మోజుతో వారు తనకు రూమ్‌ ఇచ్చారని సుధీర్‌ గ్రహిస్తాడు. ఆ తర్వాత పోలీసు ఆఫీసర్‌ ప్రకాష్‌రాజ్‌ ఎంటరవుతాడు. ఆ తర్వాత మంచు లక్ష్మి, సునీల్‌ వస్తారు. కొన్ని సంఘటనలు జరిగాక... లక్ష్మీమంచు తాను పోలీసు ఆఫీసర్‌ అని ట్విస్ట్‌ ఇస్తుంది. మరి ప్రకాష్‌రాజ్‌ దొంగ అన్నమాట... ఇలా ఎందుకు అనేది తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటే సినిమాకెళ్ళాలి. ఈ చిత్రంలో పాత్రధారులు ప్రత్యేకంగా నటించింది ఏమీలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా అంతా లాగించేశాడు. అనవసరపు సౌండ్‌ సిస్టమ్స్‌తో... నటీనటులు ఒకరినొకరు వింతగా చూసుకోవడం... చార్మి పిరుదలు, నాభి ప్రాంతాలపైనే కెమెరాను కావాల్సింత మేర ఉంచినట్లు తెలుస్తుంది. సీరియల్స్‌లో ఇటువంటి ప్రయోగాలుంటాయి. రోడ్డుపై నుంచి రిసార్ట్‌ రావడానికి పావుగంట చూపించాడు. ఇది సీరియల్‌గానైనా జనాలు చూడరేమో. టైటిల్‌కు కథకు సంబంధం లేదు. దొంగతనం అనేది జరగదు. ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేస్తారు. అంటే.... తాను ముందుగా చెప్పేది ఒకటి తర్వాత చూపించేది ఒకటని... వర్మ మరోమారు నిరూపించాడు. అప్పల్రాజు సినిమాను అలాగే చేశాడు. కేవలం క్లోజప్‌షాట్స్‌, మిడ్‌ షాట్స్‌తోనే సినిమా అంతా లాగించేశాడు. చివరగా... రూపాయి ఖర్చు లేకుండా లక్షలు ఎలా సంపాదించాలి? అనే ఆలోచనతో వర్మ ఈ చిత్రాన్ని తీశాడని తెలుస్తుంది. లేదంటే..... ఏ మాత్రం ఖర్చులేకుండా... తనకున్న పరిచయాలతోనే ఓ డాక్యుమెంటరీలా చుట్టేసి ప్రేక్షకులు జేబులు కొట్టడానికే ఈ సినిమా తీశారా అనిపిస్తుంది. ట్విస్ట్‌ ఏమంటే..... హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ...వర్మ కనిపిస్తే.. కొట్టేటట్లున్నారని.. థియేటర్‌ యజమాని అనడం విశేషం...

కరీనా ని చూసి ఆగలేక రన్వీర్ ....????



తన సంబంధాలపై ఆమె చాలా సీక్రెట్‌గా వ్యవహరిస్తుంది. బాడీనీ జీరో సైజుకు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడింది. వెండితెరపై బికినీలో తన అందాలను ఆరబోస్తుంది. కానీ అవన్నీ ఆమెను ఓ స్టూడియోలో ఓ పురుషుడు వాటేసుకునే దాకా వెళ్తుందని ఆమె ఊహించలేదు. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్. ఆ ఆభిమాని అమాంతం వాటేసుకుని కరీనాను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఆ అభిమాని సాధారణమైనవాడేమీ కాదు. బాలీవుడ్ నటుడు రన్వీర్. అతన్ని వదిలించుకోవడానికి ఆమె చాలానే కష్టపడాల్సి వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదని నిర్ధారించుకుని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని కరీనా కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రన్వీర్ సింగ్‌ను గతంలో తాను యాష్‌రాజ్ స్టూడియోలో చూశానని, తనను చూసి అతను ఉద్వేగానికి లోనయ్యాడని, చిన్న పిల్లాడిలా గంతులేశాడని, అతన్ని సమాధాన పరిచి మామూలు స్థితికి తేవడానికి తాను ఎంతో శ్రమపడాల్సి వచ్చిందని, చాలా సేపటికి గాని అతను మామూలు మనిషి కాలేదని, అతన్ని సమాధాన పరిచి తాను గట్టిగా ఊపిరి తీసుకున్నానని కరీనా కపూర్ వివరించింది.

దొంగల ముఠా ప్రివ్యూ


రామ్ గోపాల్ వర్మ తాజా ప్రయోగాత్మక చిత్రం దొంగలముఠా ఈ రోజే(శుక్రవారం) విడుదల అవుతోంది. ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కథ ఓ కామిక్ ధ్రిల్లర్ లా సాగుతుందని తెలుస్తోంది. కథ ప్రకారం సుధీర్(రవితేజ),రాణి(ఛార్మి) స్నేహితురాలు వివాహంకి అటెండ్ అవటానకి ఓ నిర్మానష్యుమైన రోడ్డులో ప్రయాణిస్తూంటారు. హటాత్తుగా కారు ఆగిపోతుంది. వారు దగ్గరలో ఓ హోటల్ ఉండటాన్ని గమనిస్తారు. వారు ఆ హోటల్ లోకి వెళ్ళగానే అక్కడ వారు ఓ కారుని ఇచ్చి ప్రక్కనున్న విలేజ్ లోకి వెళ్ళి మెకానిక్ ని తెచ్చుకోమంటారు. కానీ వారు నీ భార్యని తీసుకెళ్ళద్దు అంటారు. దాంటో సుధీర్ చాలా ఇరిటేట్ అవుతాడు. వారిని గెట్ అవుట్ అని అరుస్తాడు. తర్వాత వారి ప్రక్క గదిలోంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. కానీ చూస్తే ఆ గది తాళం వేసి ఉంటుంది. మెల్లి మెల్లిగా సుధీర్ కి తాము ట్రాప్ అయ్యామనిడు ఆర్ డై సిట్యువేషన్ లో ఇరుక్కున్నామని అర్దమవుతుంది. ఇంతకి అక్కడి స్టాప్ మరెవరో కాదు..ఓ దొంగలముఠా. వారు ఓ బ్యాంక్ ని దోచి అక్కడ మేనేజర్ (బ్రహ్మానందం) ని అదుపులోకి తీసుకుని బంధించి దాక్కుని ఉంటారు. ఆ దొంగలముఠాకి ఓ నాయకురాలు(లక్ష్మీ ప్రసన్న) ఉంటుంది. ఆమె ఆధ్వర్యంలో అంతా జరుగుతూంటుంది. చివరకు ఆ చెరనుంచి సుధీర్, రాణి ఎలా తప్పించుకున్నారనేది మిగతా కథ. ఈ కథ హాలీవుడ్ లో వచ్చిన ద వేకిన్సీ చిత్రం నుంచి ప్రేరణ పొంది తయారు అయ్యిందని అంతటా వినపడుతోంది.

దీవిలో ఆదుకున్న కుర్రాడిని వదిలేసి భర్త చెంతకు దగ్గరైన భర్తను దూరం చేసుకుంటుందా? అనేదే పతాక దృశ్యం


కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ఆంగ్ల చిత్రం బ్లూ లాగూన్ అప్పట్లో యువతను కవ్వించి మైమరపించి ఓ సంచలనాన్ని సృష్టించింది. ఈ మధ్యనే దీనికి తదుపరి చిత్రంగా 'సర్వీయల్ ఐలాండ్' పేరుతో పార్ట్-2 వచ్చి ప్రపంచ దేశాల్లో యువతిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ప్రొడక్షన్స్ వారు అందాల దీవిలో అనే పేరు పెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అందిస్తున్న రఫాతున్నీసా "అందాల దీవి"లో చిత్రం గురించి చెపుతూ... అమెరికాలో వీకెండ్ సెలవు రోజుల్ని ఎంజాయ్ చేసేందుకు నాలుగు జంటలు ఓ షిప్పులో బయలుదేరి తమతమ గర్ల్‌ఫ్రెండ్సుతో సరదాగా కాలక్షేపం చేస్తున్న తరుణంలో వారు పయనిస్తున్న షిప్ యాక్సిడెంట్‌కి గురవుతుంది. అందులోని ఓ అమ్మాయి సముద్రపు అలలకు కొట్టుకొచ్చి తీరాంతంలో పడుతుంది. అలాగే అందులోనే ఉండే ఓ కుర్రాడు ఈవిధంగానే అలలకు కొట్టుకొచ్చి ఆ ప్రక్కనే పడిపోయి కొంతటైమ్ తర్వాత వీళ్లద్దరూ స్పృహలోకి వచ్చి ఏం చేయాలో తోచక ఒకరికి మరొకరు తోడై ఆ దీవిలో నుంచి బయటపడేందుకు శతవిధాలా కృషి చేస్తుంటారు. ఈ టైంలోనే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన భర్త కూడా ఆ దీవిలోకి చేరతాడు. తనను ఆ దీవిలో ఆదుకున్న కుర్రాడిని వదిలేసి భర్త చెంతకు ఆ అమ్మాయి చేరుతుందా..? లేక దగ్గరైన భర్తను దూరం చేసుకుంటుందా? అనేదే పతాక దృశ్యం.

యువ హిరోల పొట్టి తనానికి హిరోయిన్ చాన్స్ లు గల్లంతు


టాలీవుడ్ కత్రినా అంటూ తెగ పొగడ్తలను అందుకున్న సెక్సీ భామ దీక్షాసేథ్. వేదం చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి మిరపకాయ్, వాంటెడ్ చిత్రంతో అందరి కళ్లల్లోనూ పడింది. ఒడ్డూ పొడుగూ అందం చందం అంతా బాగానే ఉండటంతో తెలుగు దర్శకనిర్మాతలు ఆమెపై దృష్టి సారించారు. అవకాశాలను ఇచ్చేందుకు ఉబలాటపడ్డారు. కానీ ఆ హీరోయిన్ పక్కన నటించాలంటే కొంతమంది హీరోలు భయపడుతున్నారట. కారణమేంటని ఆరా తీస్తే... టాలీవుడ్‌లో కొందరు హీరోలు దీక్ష భుజాల వరకే వస్తున్నారట. ఐదడుగుల ఎనిమిదంగుళాల ఎత్తుతో పొడవుగా ఉండే ఆమె సరసన నటిస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడుతున్నారట. దీంతో చేసేది లేక ఏ అనుష్కనో... తమన్నానో... ఇలియానానో బుక్ చేసుకోవాల్సి వస్తోందట. ఇంతకీ దీక్షకంటే పొట్టిగా ఉన్న హీరోలెవరయా అని మరికొంచెం నిశితంగా పరిశీలిస్తే... అల్లు అర్జున్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్, నాగచైతన్య... ఇలా యువహీరోలంతా దీక్షకంటే రెండు మూడు అంగుళాలు ఎత్తులో తేడా ఉన్నట్లు తెలిసింది. పాపం... దీక్షా... అందం... అభినయం... చూపించే టాలెంట్ ఉన్నా ఆఫర్లే రావడం లేదు.

బాత్రుం సీన్లో రెచ్చిపోయిన అమీర్ అల్లుడు


బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ "షార్ట్ టెర్మ్ షాది " అనే సినిమా లో సెక్స్ బాంబ్ సోనియా మెహ్ర తో కొన్ని హాట్ హాట్ సీన్లలో రెచ్చిపోయి నటించాడట ఈ సినిమా లో బాత్రుం సన్నివేశంలో మెహ్ర నుడ్ గా చేయవల్సి వస్తే డైరక్టర్ సెకండ్ స్కిన్ వేసుకోమని చెప్పిన పర్వాలేదని ఇమ్రాన్ తో భీభత్సంగా నటించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి వీరిద్దర్ని విడదీయటాని యూనిట్ సభ్యులు నాన తంటాలు పడ్డారట మెహ్ర ఈ సినిమా గురించి మాట్లడుతు ఇమ్రాన్ కనిపించే అంతా కాం కాదని చెప్పుక్స్తోంది మరి అంతగా ఇమ్రాన్ మెహ్ర కి ఏం చూపించాడో మరి

రాణ హిరోయిన్ బాబయ్ ని తిరస్కరించింది


రాణ సరసన నటించిన రిచా గంగోపాద్యాయ వెంకటేష్ నాగవల్లి లో ఆఫర్ ఇవ్వగానే పళ్ళు ఇకిలిస్తు వెళ్ళి వేషం కట్టేసింది అదే రాణ పక్కన నటిస్తున్న ఇలియాన మాత్రం వెంకటేష్ పిలిస్తే ఆఫర్ తనకొద్దంటు తిరస్కరించింది కొడుకు తో చేస్తు బాబయ్ తో కూడ చేస్తే బాగోదనుకుందే ఎమో వెంకి ఇచ్చిన ఆఫర్ సున్నితంగా తిరస్కరించిది బాడీగార్డ్ సినిమా కోసం నయనతార కాని ఇలియాన గాని హిరోయిన్ చేద్దామనుకున్నడు నిర్మాత బెల్లంకొండ సురేష్ అవేమి కుదరక పోయేసరికి మళ్ళి త్రిషని పెట్టి సర్దుకొని తీస్తున్నాడు మరి ఈ బాడీగార్డ్ వెంకటేష్ మాత్రం అదే కాంబినేషన్ లో ఎన్నిసార్లు తీస్తామన్నట్టు తప్పక ఒప్పుకుంటున్నాడని గుసగుసలు

బరి తెగించిన హిరోయిన్లు


టాలీవుడ్ లో చూపిన హద్దులు బిదియాలు బాలీవుడ్ కి వర్తించవు అనుకుంటున్న టాలీవుడ్ హిరోయిన్ లు టాలీవుడ్ లో ఉనంతసేపు బికినిలకి కురచ దుస్తులకు దూరంగా ఉంటు వచ్చిన హిరోయిన్ లు కొందరు బాలీవుడ్ చాన్స్ రాగనే వారికి తోచిన విధంగా కొన్ని పత్రికలకి హద్దు ఆపు లేకుండా ఎక్స్పోజ్ చేస్తు అందాలు ఆరబోస్తున్నారు వారి లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రియ టాలీవుడ్ లో ఉన్నంతసేపు బికిని జోలికి పోని ఈ హిరోయిన్ బాలీవుడ్ లో వెళ్ళగానే మ్యాగ్జిం పత్రికకి మ్యాగ్జిమం కురచ దుస్తులు ధరించి ఫోజులిచ్చింది ఆ తరవాత త్రిష ఒంగి ఒంగి మరి పత్రికలకి ఎక్స్ పోజ్ చేసింది ఇలియాన ఎమైన తక్కువతింద అంటే అదిలేదు తనకి తోచిన విధంగా రేడియోకి ఎక్స్ పోజ్ చేసింది త్వరలో అసిన్ కూడ బికిని వేయటాని రేడి అంది సదా ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వెళ్ళిన ప్రతి హిరోయిన్ హద్దులు దాటి ఎక్స్ పోజ్ చేసేస్తున్నారు ఇప్పుడిప్పుడే చాన్స్ లు అందుకుంటున్న కాజల్ కూడ బాగనే చూపించటానికి రెడీ అవుతోందని సమాచారం మన డైరక్టర్ ల దగ్గర ఉన్న సిగ్గు బిడియం ఇతర డైరక్టర్ ల దగ్గర ఉండదేమో [మని మని అమ్మ సుట్టం కాదు అబ్బ సుట్టం కాదు మని మని ] ఈ పాట పై హిరోయిన్ లకి అంకితం

3/17/11

తెలుగు టాప్ నిర్మాత మనవడు సెక్సి హిరోయిన్ వలలో


టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న హిరో దగ్గుబాటి రాణ మీద తెగ ప్రేమ ఒలక బోస్తోంది బాలీవుడ్ ముదురు సుందరి బిపాష బసు "దం మారో దం"లో సినిమాలో బిపాసా బసు ,రాణ జంటగా నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిన విషయమే ఈ సినిమా ప్రమోషన్ లో రాణ ని బిపాసా ఆకాశానికి ఎత్తేస్తోంది బాలీవుడ్ కి తగ్గట్టుగా రాణ ఫిజిక్ ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది బిపాసా అంతేనా రాణ తనకి సరిగ్గా సరిపోయాడంటోంది ఈ బాలీవుడ్ ముదురు సెక్సీ అంతేకాక ఇంకా చెప్పింది వినండి తనతో కెమెరా ముందు యాక్ట్ చేయటం ఎంతో ఎంజాయ్ చేసిందట ఇలా అన్ని చెప్పి రాణ ని ముగ్గులో దింపిందని బాలీవుడ్ సమాచారం పాపం ఈ ముదురు సుందరి వలలో పడి లేత కుర్రాడు కెరీర్ ఎమైపోతుందోనని కొందరు ఇప్పటికే చెవులు కొరుక్కుటున్నారట మరి రాణ బాబాయ్ తాత ఎలా బయటకి లాగుతారో ఈ లేత కుర్రాడ్ని ముదురు భామ వలలో నుండి అని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి

మహేష్ ది పెద్దదని మణి డైరక్షన్ వదులుకున్న విక్రం


మణిరత్నం అడిగితే కాదు,లేదు అనే మాటలు తమిళ హిరోల నోట రావు అలాంటిది మణి రత్నం తన రావణ్ చిత్రంలో నటించిన విక్రం ని హీరోగా అడిగితే కాదన్నడట దేనికి అని వివరం లోకి వెళ్ళితే మణి రత్నం తీసే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హిరోలు ఒకటి మహేష్ బాబు , రెండు విజయ్, మూడు విక్రం అయితే ముగ్గురు హీరోలలో మహేష్ బాబు ది నిడివి గల క్యారెక్టర్ అందుకని ఆ క్యారెక్టర్ తన కిమ్మని విక్రం అడిగాడని సమాచారం మహేష్ ని ఒప్పించటానికి మణి రత్నం ఆ క్యారెక్టర్ ఉంచాడు అందుకని మణి ఆ క్యారెక్టర్ ఇవ్వకపోవటంతో విక్రం చిన్నబోయాడట ఆ స్థానంలో ఆర్యని ఫిలప్ చేశాడని అందరు అనుకుంటున్నారు

రూల్స్ సంవత్సర కాలం గుర్తురాలేదు చిరంజీవి వ్యతిరేక జంటకి


హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు జీతాల చెల్లించకుండా చిక్కుల్లో పడ్డారు. రాజశేఖర్ దంపతులు తమ సెక్యూరిటీకి జీతాలు చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని సిటీ సెక్యూరిటీ వింగ్ వారికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పది పన్నెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ చెల్లించడం లేదని, ఇదే ఆఖరు నోటీసులని హెచ్చరించింది. సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసిన 2+2 గన్‌మెన్లకు రాజశేఖర్ దంపతులు గత సంవత్సరకాలంగా జీతాలు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ వస్తున్న డాక్టర్ రాజశేఖర్ దంపతులపై కొందరు చిరంజీవి అభిమానులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత రాజశేఖర్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమకు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా అడిగారు. దీనికి నాటి ముఖ్యమంత్రి వారికి 2+2 గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరకాలంగా వారుమాత్రం జీతాలు చెల్లించడం లేదని నోటీసులు జారీ చేశారు.

అందుకే సూపర్ స్టార్ [ఆయన రూటే సెపరేటు]


సూపర్ స్టార్ రజనీకాంత్ దానధర్మాల గురించి ఎన్నో విన్నాం. ఎవ్వరూ అడిగినా అడగక పోయినా, రజనీకాంత్ దృష్టిలో ఎవరైనా నటుడు గానీ, లేక సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ గానీ బాధల్లో ఉంటే, రజనీ వెంటనే వారికి సహాయం జరుగుతుంది. అలా ఆయన ఎంతో మందికి సహాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలనాటి హీరో ఎంజీఆర్ స్టంట్ మెన్ ఆర్థికంగా ఎంతో బాధపడుతుంటే, షూటింగ్ స్పాట్ లో ఆ స్టంట్ మెన్ ను చూసి అతనికి కొన్ని లక్షలు సహాయం చేశాడు. అలాగే నటుడు కాంతారావుకు నెలకు పదివేల రూపాయాల చెక్ ను చనిపోయే వరకు అందించారు. అలనాటి కమేడియన్ ‘తంగవేలు’ కుమారుడికి కొన్ని లక్షల బ్యాంక్ బుణం ఇప్పించి, మంచి ఇండస్ట్రీ పెట్టించారు. ఇప్పుడు జపాన్ లో భూకంపం, సునామీ సందర్భంగా ‘టోక్యో’ నేలమట్టమయింది. ఎంతో మంది చనిపోయారు. సునామి కారణంగా ఇళ్ళు కొట్టుకొని పోయాయి. ఇప్పుడు కూడా జపాన్ లో ఎంత మంది శవాలు ఉన్నాయో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితులలో సూపర్ స్టార్ రజనీకాంత్, జపాన్ కు సహాయం అందించడానికి నడుం కట్టాడు. జపాన్ లో ‘రజనీకాంత్’కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యం రజినీకాంత్ తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ సహాయంతో జపాన్ ప్రజలకు అవసరమైన వస్తువులను, డబ్బును, జపాన్ ప్రజలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. రజినీకాంత్ జపాన్ వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితి బాగుండక పోవడంతో జపాన్ ప్రోగ్రామ్ ను నిర్ణయించలేదు. రజనీకాంత్ కోలీవుడ్ కో స్టార్స్ తో కూడా సంప్రదించి, కొన్ని వేల కోట్లు కలక్ట్ చేసి జపాన్ ప్రజలకు పంపించే ఆలోచనలో నిమగ్నమయ్యారని సమాచరం.

చిన్నప్పటి నుంచి నేనింతే అంటున్న డర్టి పిక్చర్స్ హిరోయిన్


బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ తనకు ఒళ్ళు రావటానకి కారణం తను రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోవటమేనంటూ తేల్చింది. అయితే ఈ నిద్రపట్టని సమస్య తనకు పన్నెండవ ఏట నుంచి ఉందని అప్పట్లో కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నని అదే తన మెటబాలిజాన్ని దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్ళ క్రిందట ఈ విషయం తనకు తెలిసిందని చెప్పింది. ఇక తన ఒళ్ళు గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడల్లా బాధకలిగేదని,అయితే లావు తగ్గటం కోసం తాను చాలా కష్టపడ్డానని అయితే ఫలితం లేకుండాపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో పూజ మకీజా అనే డైటీషన్ దగ్గరకు వెళితే ఆవిడ నా అలవాట్లు తెలుసుకుని అప్పుడు నిద్రపోకపోతే వచ్చే సమస్యలు చెప్పి, తనను మార్చిందని అప్పటినుంచి రాత్రిళ్ళు ఎక్కువ సేపు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నాని అంది. అయితే హఠాత్తుగా ఈ నిద్రగోల ఎత్తుకోవటానకి కారణం ఆమె స్లీపింగ్ ఎవేర్ నెస్ మంత్ కి బ్రాండ్ అంబాసిడర్ కావటమే. ప్రస్తుతం విద్యాబాలన్..సిల్క్ స్మితగా డర్టీ పిక్చర్ లో నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలింద్ లూద్రియా డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. ఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇరువురి వర్షన్స్ సెక్స్ కోరాడంటు హిరోయిన్ ఆడిషన్ లో ఫెయిల్ అంటు డైరక్టర్


ఖోస్లా కా గోస్లా, లవ్ సెక్స్ అవుర్ ధోకా, లక్కీ ఓయ్ లక్కీ చిత్రాల దర్శకుడు దివాకర్ బెనర్జీపై బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. విభిన్నమైన చిత్రాల ఈ దర్సకుడు ఇప్పుడు ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్లో బి గ్రేడ్ సినిమాలు చేసుకునే పాయిల్ రోహత్గీ అనే నటి తనను సెక్స్ వల్ గా వేధించాడంటూ ఆరోపణ చేసింది. అలాగే తనకు దివాకర్ చాలా కాలంగా ప్రెండ్ అని, అయితే అతను ఇలా సినిమాలో ఆఫర్ అడిగేసరికి ఇలా హెరాస్ మెంట్ కి దిగాడంటోంది. అయితే దివాకర్ వెర్షన్ వేరేగా ఉంది. ఆమె ఎంత స్నేహితురాలైనా ఆడిషన్లో ఫెయిల్ అయిందని, అలాంటప్పుడు ఆమెకు ఎలా ఛాన్స్ ఇవ్వగలుగుతానని, ఆ విషయాన్ని ఆమె పాజిటివ్ గా తీసుకోకుండా నానా యాగీ చెయ్యటాన్ని తాను ఊహించలేకపోతున్నాని వాపోతున్నాడు. దివాకర్ ప్రస్తుతం సాంఘై అనే చిత్రం రూపొందిస్తూ అందుకోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అందులో మెయిన్ క్యారెక్టర్ కోసం అతన్ని ఆమె సంప్రదించింది. అయితే ఆమె ఫెయిల్యూర్ అయింది. కాస్టింగ్ కోచ్ వివాదంలో ఈసారి దివాకర్ బెనర్జీ ఇరుక్కోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పాయిల్ గురించి తెలిసిన వారంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. దాంతో ఆమె మీడియా ముందు తన ఆక్రోశం వెల్లబుచ్చుతోంది.

ఒక స్టార్ హిరోయిన్ చెల్లెలి కోర్సు పూర్తయింది


మామూలుగా హీరోలు తమ కొడుకుల్ని హీరోల్ని చేయడానికి నిర్మాతలుగా మారుతుంటారు. అయితే, ఇప్పుడు తన చెల్లెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఓ హీరోయిన్ నిర్మాత అవతారం ఎత్తుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో వున్న కత్రినా కైఫ్ తన చెల్లి ఇసాబెల్ కైఫ్ ని హీరోయిన్ గా ఇంట్రడ్యుస్ చేయడానికి రెడీ అవుతోంది. అందుకోసం తనే సొంతంగా ఓ చిత్రాన్ని ప్రోడ్యుస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. కత్రినా ఒక ఫ్రెంచి మూవీ ‘ప్రైవేట్ బెంజమిన్’ని రీమేక్ చేయడానికి ప్రేక్షకుల్ని, బిజినెస్ వర్గాలని ఎట్రాక్ట్ చేయడం కోసం ఇందులో తను కూడా నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇసా అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి, ముంబై వచ్చింది. సినిమా స్టార్ట్ అయ్యేలోగా ప్రతి రోజూ బాలీవుడ్ సినిమాలు చూస్తూ అవగాహన పెంచుకోమనీ, అలాగే భాష మీద పట్టుకోసం రోజూ తనతో హిందీలోనే మాట్లాడమనీ కేట్ చెల్లికి ఆదేశాలు ఇచ్చిందట.

యన్.టి. ఆర్ పెళ్ళి కలయిక శక్తి సినిమా కి ఫ్లాప హిట్ట


ధియోటర్స్ లో చూడెచ్చు అనగానే వివాహాన్ని లైవ్ గా ధియోటర్స్ స్క్రీన్స్ పై క్రికెట్ లాగా చూడెచ్చు అనుకోకుండి. జూ. ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి లో త్వరలో జరగనున్న ఎన్టీఆర్ వివాహంలోని హైలెట్స్ ను కలపనున్నారని సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్ తో అశ్వనీదత్ చర్చిస్తున్నాడని, ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ పెళ్ళిని మా టీవి వారు లైవ్ ఇవ్వటంతో అంతకన్నా క్రేజ్ వచ్చే విధంగా తన పెళ్ళిని ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా తన లేటెస్ట్ శక్తి చిత్రానికి ఎలాగయినా కొత్త క్రేజ్ తెచ్చి మరింత కలెక్షన్స్ సంపాదించాలని అనుకుంటున్నాడు. అందులోనూ శక్తి చిత్రం బడ్జెట్ లో అత్యధిక మొత్తంలో తయారవటంతో ఏమైనా చేసి మంచి రేటు కు అమ్మాలని అశ్వనీదత్ భావిస్తున్నారు. వీరందరి ఆలోచనలే ఈ పెళ్ళిని ధియోటర్స్ లో చూపాలనేది ఊతం ఇస్తోంది. ఇక ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అంటున్నారు. ఇదే గనుక జరిగితే శక్తి చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సోషియో పాంఠసి చిత్రంగా శక్తి పీఠాల నేఫధ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. అలాగే 'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.

3/16/11

అనుష్క బికిని కోసం తమిళ బిల్లా ఆరాటం


తెలుగు "బిల్లాలో" అనుష్క బికినితో తెలుగు ప్రేక్షకులను అలరించింది అది అందరికి తెలిసిన విషయమే తమిళ "బిల్లాలో" నయనతార అజిత్ పక్కన బికిని అందాలు ఆరబోసింది అది అందరికి తెలిసిన విషయమే కాని తమిళ నాట అనుష్క బికిని అందాల ముందు నయనతార అందాలు బేజారు అయిపోయాయి అనుకున్నాడో ఎమోగాని బిల్లా గారు అదేనండి తమిళ్ హిరో అజిత్ అనుష్క బికిని అందాలు 2కోట్లు పోసి కొనేద్దామని స్వయంగా తానే బిల్లా-2 లో అనుష్క ని నటింప జేసేందుకు పూనుకున్నాడు దీనికి గాను నిర్మాతలను ఒప్పించాడు కూడ ఒప్పుకోక చస్తార అసలే హై బడ్జెట్ చిత్రమాయే [100 కోట్లు] అనుష్క అందాలు చూసయినా వస్తారని నమ్మకం ఏది ఏమయితేనేం అనుష్క బికిని అందాలు మళ్ళి చూడచ్చు

నూడ్ గా నటించలేదు లోపల అవివేసుకున్నాను :sanjana


వెబ్‌మీడియాలో నేను ‘దుశ్శాసన’ చిత్రంలో టాప్‌లెస్ దుస్తులతో నటించానని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు అంటోంది సంజన. ఈ విషయంపై వివరణ ఇస్తూ...ఆ చిత్రంలో ఓ సీన్ లో విలన్ నా జాకెట్ ని కత్తితో చింపేస్తాడు కానీ, ఆ సన్నివేశంలో నేను న్యూడ్ గా లేను. లోపల స్కిన్ కలర్డ్ డ్రస్ వేసుకున్నాను అంది. కానీ బయిట చాలామంది నేను న్యూడ్ గా నటించానంటూ ప్రచారం చేస్తున్నారు..బాధగా ఉంది అంటోంది. ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంజన ఆ తర్వాత తెలుగులో సత్యమేవ జయతే, అసమర్థుడు, పోలీస్ పోలీస్ చిత్రాల్లో నటించింది.కానీ అనుకున్న స్ధాయిలో క్లిక్ కాలేదు. తాజాగా ఆమె శ్రీకాంత్ సరసన ‘దుశ్శాసన’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె టాప్ లెస్ గా నటించిందంటూ వార్తలు వినపిస్తున్నాయి. దాంతో ఈ విధమైన క్లారిఫికేషన్ ఇస్తోంది. ఇక దర్శకుడు పోసాని గురించి చెబుతూ..నిజానికి ఈ సినిమాలో నటించడం సంతోషంగా వుంది. పోసాని గారు ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం తప్పకుండా తెలుగులో నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది అంది. అలాగే ఈ చిత్రంలో కొన్ని గ్లామర్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అయినా కూడా కొన్ని షరతులకు లోబడే నటించాను. సన్నివేశానికి తగ్గట్టుగా గ్లామరస్‌గా కనిపించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది.

నేను తాగుతానంటున్న కంగనా


ప్రభాస్ సరసన ఏక్‌నిరంజన్‌ చిత్రంలో చేసిన కంగనరనౌత్‌ కాస్త ధైర్యం ఎక్కువే. లేట్ నైట్ పార్టీలకు రెగ్యులర్ గా అటెండ్ అయ్యే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఓ మీడియా వ్యక్తి కి త్రాగి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. దాంతో అతను ఆడవారు మందు కొట్టకూడదు కదా అన్నారు. దానికామె ఏమాత్రం తడబాటులేకుండా ‘మందు త్రాగటం ఏమన్నా నేరమా?...అయినా నావరకు నేను అప్పుడప్పుడు తాగుతునే ఉంటాను. నా గ్లామర్‌ రహస్యం కూడా అందులోనే ఉంది’ అంటూ సమాధానమిచ్చి తూలుకుంటూ వెళ్ళి కారు ఎక్కి కూర్చుంది. దాంతో ఆ మీడియా వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్దం కాని స్ధితిలో పడ్డాడు. ఇక రీసెంట్ గా కంగన...మాధవన్‌తో కలిసి నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘తను వెడ్స్‌ మను’ చిత్రం విజయవంతం కావడంతో కంటిన్యూ ఆఫర్స్ వస్తున్నాయి. ఏప్రిల్‌ ఒకటవ తేదినన ఆమె నటించిన ‘గేమ్‌’ చిత్రం కూడా విడుదల

రవితేజ మాట కూడ వినని కాజల్, తాప్సీ


కాజల్, తాప్సీ ఇద్దరూ రీసెంట్ గా రవితేజ హీరోగా చేస్తున్న ‘వీర’చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే ఇద్దరికీ ఈ షూటింగ్ సమయంలో ఇగో సమస్యలు తలెత్తాయి. నేను గొప్పంటే..నేను గొప్పనే సిట్యువేషన్ వచ్చింది. మాటలు యుద్దం కాస్తా...ముదిరి కోల్డ్ వార్ గా మారింది. దాంతో వీరి కాంబినేషన్ సీన్స్ అంటే డైరక్టర్ కి టెన్షన్ గా మారింది. ఇదంతా వీర షూటింగ్ స్పాట్ లో చోటుచేసుకుంది. వీరిద్దరూ మొదట సఖ్యంగానే ఉన్నా కొద్దిరోజులకు ఒకరంటే ఒకరికి పడని సెట్యువేషన్ వచ్చేసింది. దీంతో కాజల్‌కు, తాప్సీకి మధ్య పెద్ద గొడవే అంతర్గతంగా సాగింది. వీరిద్దరినీ శాంతింపచేయడానికి యూనిట్‌లో అనేకమంది ప్రయత్నించినా ఇద్దరూ ఎవరి మాటా వినలేదని తెలుస్తోంది.దర్సక ,నిర్మాతలు వీరిని శాంతింప చేసే భాధ్యత రవితేజపై పెట్టారు. కానీ అతను ఎంత ప్రయత్నించినా వారి మధ్య సఖ్యత కుదర్చలేకపోయాడు. అదీ సంగతి. ఇక 'వీర' లో కాజల్ కబడ్డి చిట్టి అనే మాస్ పాత్రలో కనిపించనుంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తన్న తాప్సీ ఐటీ స్టూడెంట్ గా అలరిస్తుంది. కిక్ శ్యామ్ పోలీస్ ఆపీసర్ గానూ, అతని భార్యగా శ్రీదేవి చేస్తున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని గణేష్‌ ఇందుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే అరకులో ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: తమన్‌.

అందాల భామ చనుమొన కొరికి చచ్చిన కొండచిలువ



హాలీవుడ్, బాలీవుడ్ భామలు పాములు... అదీ కొండ చిలువలతో ఆటాడుకోవడం మామూలైన విషయమే. తాజాగా ఇదే ఆటను ఓ ఇజ్రాయెల్ మోడల్(ఆమె పేరు ఓరిట్ ఫాక్స్) ఆడింది. పామును ముద్దాడాలనుకుని దాని మెడను చేతితో పట్టుకుని తన నాలుకను అందించబోయింది. ఆమె నోటి నుంచి వచ్చిన దుర్వాసన తట్టుకోలేకపోయిందో... ఏమోగానీ చిలువ చటుక్కున ఆమె ఎద భాగంపైకి దూసుకెళ్లింది. వెళ్లడమే కాదు చటుక్కున ఆమె చను మొనను గట్టిగా పట్టుకుంది. అంతే... ఆమె తన చనుమొనను పాము నోటి నుంచి విడిపించుకునేందుకు చిందులేసింది. చివరికి ఎలాగోలా విడిపించుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే... చను మొనను కొరికిన పాము కాసేపటికి చచ్చిపోయింది. ఎందుకలా చచ్చిందో అర్థం కాక అందరూ నిర్ఘాంతపోయారు. దానిని పరీక్షించిన వైద్యులు మోడల్ ఫాక్స్ చను మొనను కొరకడం వల్లనే అది చచ్చిపోయిందని నిర్థారించారు. ఎందుకలా...? అనడిగితే... మరేం లేదు ఆమె వక్షోజాలు సిలికాన్ చికిత్సతో సంతరించుకున్న అందాలు. సిలికాన్ విషం ఆమె వక్షోజాల్లో ఉండటం వల్ల కరిచిన పాము చచ్చిందని సెలవిచ్చారు. ఆ విషయం తెలుసుకున్నవారంతా... పాపం కొండ చిలువ అంటూ నిట్టూర్చారు. అన్నట్లు మన బాలీవుడ్ భామ మల్లికా శరావత్ కూడా ఆమధ్య హిస్ చిత్రంలో నటించేటపుడు కొండచిలువతో ఆడింది. ఓ రోజు ఆ చిలువ అమ్మడి ఒళ్లంతా పాకేసి మెత్తని అందాలను గట్టిగా చుట్టేసిందట. దాంతో భయపడిపోయిన మల్లిక, అప్పట్నుంచి తన వెంట ఇద్దరు దృఢకాయులను ఏర్పాటు చేసుకున్నదట.

తెలుగు మిడియాని తీసిపారేసిన రాం గోపాల్ వర్మ


రాంగోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో గొడవలో ఉంటూనే ఉంటాడు. పాజిటివ్‌ అయినా నెగెటివ్‌ అయినా ఏదో విధంగా పాపులారిటీ రావాలనేది ఆయన తత్త్వం అని ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. తెలుగువాడు బాలీవుడ్‌ హవా చేస్తున్నాడని ప్రమోట్‌ చేసిన మీడియాకు వర్మ షాక్‌ ఇస్తే.... మీడియా కూడా చూసి చూసి షాక్‌ ఇచ్చింది. ఇటీవలే టీవీ9లో ఆయనపై నెగెటివ్‌ టాక్‌తో దాడిచేస్తే.... అదంతా ఒక డ్రామా అని తెలిసి.. వర్మను ప్రింట్‌ మీడియా అడిగింది.. కేసు పెడతానన్నారు. ఇంకా పెట్టలేదు ఏమిటని..? అసలు ఇదంతా మీకు సన్నిహితులైన జర్నలిస్టుల చేత నెగెటివ్‌గా ప్రచారం చేయించారని తెలిసిందని అడిగితే... కాసేపు ఆలోచింది.. అలా కూడా అనుకుంటున్నారా? అని దాటవేశారు. ఇదిలా ఉండగా... బుధవారం.. ఆయన 'దొంగలముఠా' ఆఫీసుకు రమ్మని కొంతమంది మీడియా మిత్రులను ఆహ్వానించారు. చెప్పిన టైమ్‌కు గంట దాటినా ఆయన జాడ లేదు. ఓ సీనియర్‌ ఇదేమిటని ఫోన్‌లో సంప్రదిస్తే... వేరే పనిపై బిజీగా ఉన్నాను. మీరు అందరూ అక్కడే వెయిట్ చేయండని తాపీగా జవాబు చెప్పారట. దీంతో అహం దెబ్బతిన్న మీడియా మిత్రులు శాపనార్థాలు పెడుతూ వర్మ మీట్‌ను బాయ్‌కాట్‌ చేశారు. ఇదే బాలీవుడ్‌లో అయితే నానారకాలుగా రాస్తారనీ, తెలుగు మీడియా చెప్పినట్లు రాస్తుందని అంటుండే రాంగోపాల్‌వర్మ తెలుగువారికి ఇచ్చిన గౌరవం ఇదేనా..!

ఒక సుపర్ హిట్ కోసం రహస్య శౄంగరా సన్నివేశాలు


సుమంత్‌ కథానాయకుడుగా ప్రియమణి, విమలారామన్‌ కథానాయికలుగా వస్తున్న చిత్రం రాజ్‌. విఎన్‌ ఆదిత్య రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానున్నది. కుమార్‌బ్రదర్స్‌ పతాకంపై కుమార్‌ బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమర్షియల్‌గా అన్ని హంగులు ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. అయితే నాగార్జున మేనల్లుడు సుమంత్ ఎంత కొట్టుకుంటున్నా ఒక్క హిట్టూ పడడంలేదు. ఓపక్క తన తర్వాత వచ్చిన నాగ చైతన్య, రాణా వంటి తమ కుటుంబానికే చెందిన వాళ్లు స్పీడుగా వెళ్లిపోతున్నారు. తను మాత్రం అక్కడే వున్నాడు. ఈ నేపథ్యంలో ఏదోలా హిట్ కొట్టాలనుకుంటున్నాడేమో... ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధమైన తన 'రాజ్' సినిమా చాలా స్పైసీగా ఉండేలా చూసుకుంటున్నాడట. గ్లామర్ తారలైన ప్రియమణి, విమలా రామన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. యూత్ ని ఆకట్టుకునేలా వీళ్లని బాగా ఎక్స్ పోజ్ చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే, ఇద్దరు హీరోయిన్లతోనూ 'లిప్-లిప్' ముద్దులు కూడా రసరమ్యంగా చిత్రీకరించారని సమాచారం. ఇలా కమర్షియల్ మసాలాను బాగా దట్టించి, ఈ చిత్రాన్ని ఈ నెల 18 న ప్రేక్షకుల మీదకి వదులుతున్నారు. మరి... ఇదైనా సుమంత్ కి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం!

అలా నేను చేయనంటున్న సంజన


ఆమధ్య పూరీ జగన్నాథ్‌ చిత్రంలో నటించిన సంజన గుర్తుండే ఉంటుంది. ఫస్ట్‌ సినిమా అని తెలుగులో చెప్పింది. కానీ... అంతకుముందే కన్నడలో ఓ సినిమాలో నటించింది. అందులో శృంగార సన్నివేశాల్లో చాలా బాగా నటించింది. దాదాపు పీలికలు మినహా బాడీ మీద ఏమీలేవు. కానీ తెలుగులోకి వచ్చేసనికి కొన్ని రూల్స్‌ పెట్టింది. దాంతో ఆమె చక్కటి అమ్మాయిగా నటించి పారితోషికం బాగానే పుచ్చుకుంది. లేటెస్ట్‌గా పోసాని చిత్రం "దుశ్శాసన"లో నటించింది. అందులో తను ఎక్స్‌పోజింగ్‌ చేశానని ప్రచారం జరుగుతుందని అది తప్పని అంది. కానీ.. చిత్రంలోని స్టిల్స్‌ చూస్తే.. ఆమె కావాలనే ఎక్స్‌పోజింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్‌లో కనబడింది తాను కాదనీ, మరెవరినో పెట్టారని పిట్ట కథలు వినిపిస్తోంది. కన్నడంలో నటించిన హాట్ సీన్స్‌ బటయకు వచ్చాక... ఏంటని అడిగితే నోరు మెదపడంలేదు.

రాజ్ సినిమాలో ప్రియమణి అందాల ఆరబోత


సుమంత్‌ నటించిన రాజ్‌ చిత్రంలో ప్రియమణి అందాలు బాగా ఆరబోసింది. అలాగని సినిమా అంతా ఎక్స్‌పోజింగ్‌ చేయలేదనీ, కథలోని సీన్‌ వరకే చేశానని ఒప్పుకుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్స్‌, పోస్టర్లు మాత్రం బాగా ఎక్స్‌పోజింగ్‌గా ఉన్నాయి. అవి కేవలం పబ్లిసిటీ కోసమే చేశారనీ, సినిమాలో ఏమీ ఉండదని చెబుతోంది. మార్చి 18న విడుదలయ్యే ఈ చిత్రం గురించి "ఏమీ లేదని" ఇప్పుడే చెబితే ఓపెనింగ్స్‌ ఉంటాయా...? పాపం ఆ విషయం మరిచినట్లుంది ప్రియ. అయితేనేం మనసులో మాట చెప్పింది. ఇండస్ట్రీలో నెంబర్‌ ఒన్‌ కాకపోయినా అటువంటి రేంజ్‌కు చేరాలనే కోరికను వ్యక్తం చేసింది. యథేచ్చగా అందాలను ఆరబోస్తే నెంబర్ 1 అయిపోవచ్చని అనుకుంటుందేమో ప్రియమణి.

3/15/11

ఇండియన్ సమురాయ్ గా అల్లు అర్జున్


టాలీవుడ్ హీరోలెవ్వరికీ లేని ఫాలోయింగ్ అల్లు అర్జున్ కి మలయాళంలో కూడా వుంది. ఎందుకో అతని చిత్రాలు అక్కడ కూడా బాగా ఆడతాయి. అందుకే, అల్లు అర్జున్ ని సరదాగా 'మల్లూ' అర్జున్ అని కూడా పిలుస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు తన రాబోయే చిత్రం 'బద్రీనాథ్ ని కేరళలో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'కేరళలో కూడా నా సినిమా మార్కెట్ ని విస్తరించే ఆలోచన చేస్తున్నాం’ అంటున్నాడు అర్జున్. అన్నట్టు, 'బద్రీనాథ్' సినిమాని 'మగధీర' సినిమాతో కంపేర్ చేస్తే మాత్రం తను ఒప్పుకోవడం లేదు. ‘అది అదే... ఇది ఇదే! 'మగదీర'తో ఎంత మాత్రం పోల్చుకోకూడదు. ఎందుకంటే, 'మగధీర' లాంటి సినిమాలు పదేళ్లకోసారి మాత్రమే వస్తాయి’ అంటున్నాడు బన్నీ. ఈ 'బద్రీనాథ్' సినిమాలో తను ఇండియన్ సుమొరాయ్ గా నటిస్తున్నాడు.

అమ్మ డిజైన్లకు పెద్ద చిత్రాన్నే వాడుకుంటున్న హిరోయిన్


ఐదేళ్ల క్రితం టాలీవుడ్ కి వచ్చినప్పుడు ఎలా వుందో ఇలియానా ఇప్పటికీ అలాగే వుంది. ఆ బాడీలో ఏ మాత్రం తేడాలేదు. ఆ సన్నజాజి నడుము... ఆ మెరుపుతీగ అందం అలాగే వున్నాయి. అందుకే ఈ గోవా బ్యూటీని చూసిన వాళ్లకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ బాడీని ఎలా మెయిన్ టైన్ చేస్తోందా? అన్నదే అందరికీ అంతుపట్టదు. అయితే, ఇదంతా జీన్స్ ప్రభావమే అని ఇలియానా తేలిగ్గా చెప్పేస్తుంది. 'మా ఇంట్లో అందరూ నాలాగే స్లిమ్ గా వుంటారు. థాంక్స్ టు మై జీన్స్. నేనెక్కువ కష్టపడక్కర్లేదు. డైటింగ్ కూడా అంతగా చేయను. రోజు విడిచి రోజు జిమ్ లో మాత్రం వర్కౌట్ చేస్తానంతే’అంటోంది. త్వరలో విడుదల కానున్న 'శక్తి' సినిమాలో అయితే ఇలియానా దేవకన్యలా సౌందర్యరాశిలా కనిపిస్తుందని అంటున్నారు. ‘ఆ సినిమాలో నా డ్రెస్ డిజైన్ అంతా అమ్మే చేసింది. నాకు ఎటువంటివి సూట్ అవుతాయో తనకి బాగా తెలుసు. 'శక్తి'లో సూపర్ డ్రెస్ లు డిజైన్ చేసింది. అందులో నేను చాలా అందంగా ఉన్నానంటే ఆ క్రెడిట్ అమ్మదే' అని చెబుతోందీ గోవా చిన్నది.

మగధీర ఐదు కోట్లు శక్తి కి పదికోట్లా అని గుసగుస


జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి' పై నిర్మాత అశ్వనీదత్ కి చాలా అంచనాలు ఉన్నాయి. దాంతో ఆయన తనదైన శైలిలో లెక్కలు వేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ కి, శాటిలైట్ కొనుగోలుదారులకు స్ట్రోక్స్ తెప్పిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం వెళ్ళిన ఇద్దరు ఛానెల్ ప్రతినిధులు కి ఆయన ఓ రేంజిలో రేటు చెప్పి షాక్ ఇచ్చారు. ఆ రేటు మరెంతో కాదు..పది కోట్లు అని చెప్తున్నారు. దాంతో వారు తెలుగు సినిమాకి ఇంత సీన్ ఎప్పుడు పెరిగిందని ఆశ్చర్యపోతూ వెళ్ళిపోయారు. అశ్వనీదత్ తాను చాలా ఖర్చుపెట్టానని, తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకూ ఎవరూ పెట్టనంత బడ్జెట్ తో తీసానని ఆ మాత్రం ఎక్సపెక్ట్ చేయటం సబబేనన్నట్లు చెప్తున్నాట్ట. ఇక ఇది విన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాని ఏ రేటుకు అమ్ముతాడోనని లెక్కలు వేసుకుంటున్నారుట. ఇక ఓ ప్రముఖ పంపిణీదారుడు ఈ విషయమై డైరక్ట్ గానే..మగధీర చిత్రం రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్టు అయ్యాక ఐదు కోట్లకు శాటిలైట్ ఇచ్చారు. అలాంటిది ఈ చిత్రం రిజల్ట్ తెలియదు..ఏ రేంజి హిట్టో తెలియదు..అలాంటిది పది కోట్లు అడిగితే ఎలా ఇస్తామనుకుంటున్నారని అంటున్నారు. అలాగే రీమేక్ రైట్స్ ని కేవలం పది సంవత్సరాలుకు మాత్రమే అని చెప్తున్నారని అంటున్నారు.

బాలు[నాగ చైతన్య] వెడ్స్ మహలక్ష్మి[తమన్నా]


నాగచైతన్య, తమన్నా ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఏప్రియల్ 15 న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి టైటిల్ ని 'బాలు వెడ్స్ మహలక్ష్మి' గా ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి దటీజ్ మహలక్ష్మీ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత ఐలవ్ యు మహలక్ష్మి అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ఈ రెండు కాక రెండిటినీ కలిపి 'బాలు వెడ్స్ మహలక్ష్మి' అని పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో మహలక్ష్మిగా తమన్నా కనిపించనుంది.కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ప్రెష్ గా ఫీలవుతారు అని చెప్తున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు.

అల్ల్లు అర్జున్ దొంగమాటలకి ఉబ్బిపోతున్న రాం చరణ్


అల్లు అరవింద్ ఎంత తెలివైనవాడనేది చిరంజీవి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. భోళా మనిషి అయిన చిరంజీవిని గ్రిప్ లో పెట్టుకుని కీలు బొమ్మలా ఆడించిన తెరవెనుక సూత్రధారి అతనే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అతనిలానే ప్రవర్తిస్తున్నాడు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న తెలివితేటలతో అల్లు అర్జున్ చాలా తెలివిగా చరణ్ కి చెక్ పెడుతున్నాడు. చిరంజీవి రిటైరైపోవడం, పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ దశకి చేరడంతో తనకి పోటీగా ఉన్న చరణ్ ని తప్పిస్తే హ్యాపిగా మెగాస్టార్ అనిపించేసుకోవచ్చని బన్నీ ప్లానేశాడు. చిరు లాగే ఉబ్బులకోరోడైన చరణ్ ని ఉబ్బేసి బన్నీ పబ్బం గడుపుకుంటున్నాడు. ‘నిన్ను మించినోడు లేడు నీకు నేనే పెద్ద ఫ్యాన్’ని అంటూ నిత్యం చరణ్ ని ఆకాశానికి ఎత్తేసే అల్లు అర్జున్ తన చచ్చు సలహాలతో చరణ్ ని పూర్తిగా రాంగ్ రూట్ పట్టించేస్తున్నట్టు భోగట్టా. మంచి కథలు చెబితే తాను చేస్తూ, కాస్త తక్కువ రేంజ్ కథలుంటే చరణ్ కి చెప్పమని చెబుతున్నాడట. అంతే కాక సదరు కథలు చాలా బాగున్నాయని చరణ్ని భ్రమపెడుతున్నాడని సమాచారం. అల్లు అర్జున్ ని గుడ్డిగా నమ్ముతున్న చరణ్ ఇప్పటికే కొన్ని కథల విషయంలో బోల్గా పడ్డాడని, ఇదే కొనసాగి ఆయా సినిమాలు విడుదలైతే మాత్రం చరణ్ తెచ్చుకున్న ‘మగధీర’ పేరంతా త్వరగానే కోల్పోతాడని బన్నీ తర్వాత చరణ్ అని అభిమానులు కూడా అనుకునే స్థాయికి దిగజారిపోతాడని అంటున్నారు.

సెక్స్ పాఠల కోసం హిరో హిరోయిన్ కి ఏకాంతం కల్పిస్తున్న నిర్మాతలు


గుర్రపు స్వారీ, కత్తి ఫైటింగ్ లేదా ఏదైనా యుద్ద విద్యకి సంబంధించిన సన్నివేశాలుంటే హీరోలు తర్షీదు తీసుకుని సమాయత్తమవడం చూసే ఉంటారు. బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా అలానే తాను చేయబోయే ఇక పాత్ర కోసం సెక్స్ పాఠాలు చెప్సించుకుంటున్నాడు. కెమెరా మందు సెక్సె సీన్స్ లో ఎలా నటించాలో, ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలో నేర్చుకుంటున్నాడు. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్ కి నిజమైన ప్రియుడి పాత్ర పోషిస్తున్న తుషార్ తో చాలానే శృంగార సన్నివేశాలున్నాయట. వారిమధ్య కెమిస్ట్రీ బాగోకపోతే జనం చూడరనే భయంతో ఇద్దరికీ మధ్య ఇంటరాక్షన్ కుదిరేందుకు ప్రత్యేకమైన వాతావరణం కల్పిస్తున్నారట. విద్యబాలన్ తో కంఫర్టబుల్ గానే ఉన్నానని, తమ జంట తెరపై సహజంగా కనిపిస్తుందని తుషార్ చెప్పాడు. నీకంటే పెద్దదానిలా ఉంటుంది కదా అనే ప్రశ్నకి ఆమె కంటే తనే ఏడాది పెద్దవాడినని చెప్పాడు.

సల్మాన్ హిరోయిన్ కి కమల్ ని నిరాకరించలేదా ???


చేసింది ఒకే ఒక్క సినిమా. హిట్టు కొట్టిందిలెండి. అయినాగానీ, ఒక్క సినిమా హిట్టుతోనే బెట్టు చేస్తే ఎలా? అదీ స్టార్ హీరో విషయంలో. జాతీయ స్థాయిలో నటుడిగా తిరుగులేని ఇమేజ్ వున్న కమల్ హాసన్ కి ఝలక్కిచ్చిన ఆ సెక్సీ ఎవరో తెలుసా? బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, ‘దబాంగ్’ సినిమాతో లైమ్ టైట్ కొచ్చిన సోనాక్షి, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కబోయే ఓ సినిమాలో కమల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ముందు కమల్ తో సినిమా అనగానే ఎగిరి గంతేసినా, తీరా సినిమా షూటింగ్ లో దర్శక నిర్మాతల్ని ముప్పుతిప్పలు పెట్టేస్తోంది. మూడు ముద్దు సీన్లు..ఆరు రొమాంటిక్ సీన్లు కమల్ సినిమాలో మామూలే. అందులో భాగంగానే ఆ టైపు సన్నివేశాలు తెరకెక్కించాల్సి వచ్చేసరికి, అలాంటి సీన్లలో నటించనని సోనాక్షి మొండికేసి కూర్చుంది. అదేంటీ, అన్నిటికీ ఒప్పుకున్నావు కదా..ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావంటూ నిర్మాతలు అడిగితే నేను చెప్పినట్టు చెయ్యండంటూ తెగేసి చెప్పేసరికి, వేరే హీరోయిన్ వేటలో పడ్డారట ఆ చిత్ర దర్శక నిర్మాతలు. ఇక, సోనాక్షి వ్యవహారం బయటకు పొక్కి, ఆమెను తమిళనాట నానా తిట్లూ తిడ్తున్నారు కమల్ అభిమానులు. కమల్ ని నిరాకరించే రేంజా నీది..అంటూ సోనాక్షిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి...

రాం గోపాల్ చార్మి ప్యాంటు లో రవితేజ చేయి పెట్టించాడు....!!!!


రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ప్రేక్షకుల దృష్టిని ఎలా ఆకర్షించాలో రాముకు తెలిసినంతగా మరే దర్శకునికీ తెలియదని సినీ పరిశ్రమలో చాలామంది చెబుతుంటారు. తాజాగా లోబడ్జెట్.. అంటే అత్యంత తక్కువ ఖర్చుతో కేవలం 5 రోజుల్లో తెరకెక్కించిన సినిమా దొంగలముఠా. ఈ చిత్రంలో అగ్రహీరో రవితేజతోపాటు ఛార్మి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీప్రసన్న, సునీల్, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. అసలే లోబడ్జెట్ సినిమా. అందునా సినిమా కెమేరాలు కాకుండా మామూలు కెమేరాలను ఉపయోగించి తీసిన చిత్రమాయె. మరి మార్కెట్ ఎలా..? అనే సందేహం తలెత్తిందో... ఏమోగానీ, చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ హీటెక్కించే విధంగా ఉన్నది. సెక్సీ హీరోయిన్ ప్యాంటు ముందర పైభాగంలో రవితేజ తన చేతిని లోనికి పోనిస్తూ పట్టుకున్నట్లుగా ఓ స్టిల్ దర్శనమిస్తోంది. దీనిపై అప్పుడే పలువురు ధాం.. ధూం అంటున్నారు. నిజానికి ఇంతకుమించి... అంటే టూ పీస్ వస్త్రాలను ధరించిన హీరోయిన్ శరీరంపై హీరో తన చేతులతో ఎక్కడబడితే అక్కడ తడమడం చాలా సినిమాల్లో చూపించారు కూడా. కాకపోతే రాము సినిమా... అందులోనూ క్రేజీస్టార్ రవితేజ... సెక్సీ హీరోయిన్ ఛార్మి. కనుకనే దీనిపై అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే రవితేజ అక్కడ ఆ చేతిని ఎందుకోసం పెట్టాడో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే మరి

3/7/11

NTR ట్రీట్ మెంట్ తో ఐటం సాంగ్స్ చేసు కుంటున్న ఆశ షైని


శరీరంలో అతిగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవటానికి వాడే పద్దతిని లైపోసక్షన్ అంటారు పలకలేని వారు N TR ట్రీట్ మెంట్ అంటారు ఎందుకంటే N TR చేయించుకున్న తరవాత ఈ ట్రీట్ మెంట్ కి బాగ పేరొచ్చింది ఇప్పటికి ఇ పద్దతి ద్వార బరువు తగ్గుతున్నవారు చాలమందే ఉన్నారు బాగ ఒళ్ళు చేసి గౄహిణి పాత్రలకే పనికి వస్త ననుకుందొ ఎమో గాని ఈ పద్దతి ద్వార నడుము దగ్గర కొవ్వుని తగ్గించుకొని ఐతం సాంగ్స్ బూక్ అవుతోంది ఎవర అనుకుంటున్నార అదేనండి లక్స్ పాప [ఆశ షైని ] మరి సన్న పడకుండ తెలుగువారికి నచ్చే విధంగా బొద్దుగా తయరయిందిలేండి మొత్తం మీద ట్రైట్ మెంట్ బానే వర్క్ ఔట్ అయింది అమ్మ్మడికి ఈ ట్రీట్ మెంట్ ద్వార బాధ పడిన వారు ఉన్నారు

ఇలియాన డ్యాన్స్ కి పది లక్షలా??


"శక్తి ఆడియో విడుదలకు గాని ఇలియాన వేసిన డ్యాన్స్ కి అశ్వని దత్ సుమారు పది లక్షలు సమర్పించుకున్నాడని వినికిడి యన్.టి.ఆర్ కూడ వేశాదనుకోండి దానికి ఎంత ఇచ్చు కున్నాడో తెలియదు గాని ఇలియానకి అక్షరాల పది లక్షలు ఇచ్చాడట అని గుసగుసలు వినిపిస్తుంటే సినిమా కి 70లక్షలు సమర్పించుకున్నాడు గా ప్రమోషన్ కి పది పెట్టలేడ అని ఇంకొరి వాదనట ఆరెంజ్ సినిమా కి నాగబాబు దగ్గర జెని ఇంతే లాగిందట అందుకే నాగబాబు జెనిలియా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడట శక్తి అటు ఇటు అయితే అశ్వనీ దత్ పరిస్థితి అంతే మరి ఏం జరుగుతుందో మార్చి31 దాక వేచి చూడలి మరి

సోనాక్షిసిన్హా.వెంట వెంకటేష్


దబాంగ్ బాలీవుడ్‌లో ఓ చరిత్రను నెలకోల్పినటువంటి సినిమా. ఒకే ఒక్క సినిమాతో యావత్ బాలీవుడ్ మొత్తం అభిమానులను సంపాదించుకుంది సోనాక్షిసిన్హా. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ కూడా ఈమె డైరీలోని కొన్ని పేజీలను కేటాయించాలని తిరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచ కధానాయకుడు కమల్ హాసన్ ప్రక్కన ఈ భామ నటించనుందని వార్తలు రావడం జరిగింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ పాత హీరో సోనాక్షిసిన్హాని తన సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశ్యంతో అర్రులు చాచుతున్నట్లు వినికిడి. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా ఇంకెవరూ మన విక్టరీ వెంకటేష్ అండి. గతంలో త్రిష, నయనతార, అసిన్ లాంటి హీరోయిన్స్ తో నటించి, నటించి చివరకి బోర్ కోట్టి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కళ్శు బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా మీద పడ్డాయని ఫిలింవర్గాల సమాచారం. త్వరలో చిత్రం సినిమా దర్శకుడు తేజ దర్శకత్వంలో నటించనున్నటువంటి సావిత్రి సినిమాలో హీరోయిన్‌గా సోనాక్షిసిన్హా ఐతే బాగుంటుందని వెంకటేష్ చెప్పినట్లు వినికిడి. దాంతో సోనాక్షిసిన్హాతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఐతే ఇప్పటికే సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి చాలా సినిమాలు సోనాక్షిసిన్హా అంగీకరించకపోవడం మరో విశేషం

బాల జేజమ్మ తో ఎక్స్ పోజింగ్


"అరుంధతి సినిమాలో బాల జేజమ్మ .....అదేనండి దివ్య గణేష్ చిన్నప్పటి అరుంధతిగా నటించింది కదా! ఇప్పుడీ అమ్మాయి పెద్దదయింది హిరోయిన్ వయసు రాలేదుగాని సరిగ్గ సెవెంత్ క్లాస్ టెంత్ క్లాస్ సినిమా కాన్సెప్ట్ తీయచ్చు ఆ కాన్సెప్ట్ తోనే తీస్తున్న చిత్రం "నేను నాన్న అబద్దం" అ సినిమాలో దివ్య హిరోయిన్ గా ఫిక్స్ చేశారు చేస్తే చేశారు గాని పాపం దివ్యతో ఎక్స్ పోజింగ్ కూడ చేయిస్తున్నారు ఇదంతా ఉన్నప్పుడు సెన్సార్ వాళ్ళు ఏంచేస్తున్నారో అని అందరికి డౌట్ కూడ వస్తుంది దర్శక నిర్మాతలు ఇది అటువంటి సినిమా కాదని చెబుతున్నా ఈ సినిమా పోస్టర్స్ మిడియాలో చూస్తే వాళ్ళు చెప్పేది అబద్దమని క్లియర్ గా తెలుస్తుంది

క్యాజువల్ గా అల్లు అర్జున్ పెళ్ళి కి వెళ్ళిన పవన్


అల్లు అర్జున్ వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వలేదు. బన్నీని పెళ్ళి కొడుకు చేసినప్పుడు, సంగీత్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడంతో కుటుంబంలో ఉన్న మనస్పర్థలు వల్లే పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నాడని చాలా మంది మాట్లాడుకున్నారు. అసలు బన్నీ పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తోడో?లేదోనని కూడా మాట్లాడు కున్నారు. కానీ పెద్దంతగా వేడుకల్లో పాల్గొనడానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్ బన్నీ పెళ్ళి వేడుకల్లో మాత్రం పాల్గొన్నాడు. జీన్స్, టీ షర్ట్ ధరించి క్యాజువల్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్ ఆప్యాయంగా ఆహ్వానించి తీసుకెళ్ళాడు.

బూతు మాటకి సెన్సర్ కట్ చెప్పలేదేమి


తాజా చిత్రం మంగళ లో ప్రదీప్ రావత్ పాత్ర వచ్చి తో నా కొడుకు నీ సల్లు పట్టుకున్నాడని నువ్వు చెంప దెబ్బ కొట్టావు..వాడు పురుగుల మందు త్రాగి ప్రాణాపాయ స్ధితిలో ఉన్నాడు..నువ్వు ఒక్కసారి వచ్చి చూస్తేనే మందులు వేసుకుంటానంటున్నాడనే డైలాగు ఉంటుంది. కథ ప్రకారం ..మంగళ అనే సినీ హీరోయిన్. ఆమె తో అసభ్యంగా బిహేవ్ చేసారని ఓ వ్యక్తిని కొడతారు. అయితే అది పొరపాటున వేరే వ్యక్తికి తగులుతుంది. అభిమానంతో కారు గిప్ట్ గా ఇద్దామని వచ్చిన ఆ వ్యక్తి భాధతో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ అభిమాని తండ్రి ప్రదీప్ రావత్ వచ్చి ఈ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగులో సల్లు అనే పదం వాడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ పదానికి సెన్సార్ వారు ఎట్లా అనుమతి ఇచ్చారో అని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

3/6/11

సూర్య సరసన మంచు వారి హిరోయిన్


ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ కి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సూర్య సరసన ఆఫర్ వచ్చిందని సమాచారం. కేవీ.ఆనంద్ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం టైటిల్ మాట్రాన్. మాట్రాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో సూర్య ఐదు గెటప్‌లలో కని పించనున్నారని సమాచారం. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానటువంటి విభిన్న కథాం శంతో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు కేవీ.ఆనంద్ పేర్కొన్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆడుగళం లో నటించి అందరి ప్రశంసలు పొందిన తాప్సీ ఇందులో మంచి పాత్ర కొట్టేశారని తమిళ చిత్రపరిశ్రమలో వినపడుతోంది. రెండో సినిమాకే సూర్య వంటి స్టార్ సరసన ఆఫర్ రావటంతో అంతటా ఆమెకు లక్కు తిరిగినట్లే అంటున్నారు. ప్రస్తుతం సూర్య..గజనీ దర్శకుడు...ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 7 ఆమ్ అరివు చిత్రంలో నటిస్తున్నారు.

తెలంగాణ వాసులుగా టాలీవుడ్ హిరోలు


పవన్ కళ్యాణ్ రాబోయో చిత్రం తీన్ మార్ లో తెలంగాణాకు చెందిన కాలేజి స్టూడెంట్ గా కనిపించనున్నారనేది ఆసక్తికరమైన విషయం. గతంలో తెలుగు సినిమాల్లో నెగిటివ్ పాత్రలకు మాత్రమే తెలంగాణా మాండలికాన్ని ఉపయోగించేవారు. అయితే తాజాగా తెలుగు సినిమా పరిస్ధితిని గమనిస్తే తెలంగాణా ఉద్యమ ప్రభావం తెలుగు సినిమాని ఎంతగా ప్రభావం చేసిందో గమనించవచ్చు.రీసెంట్ గా రిలీజైన సినిమాల్లో హీరోలను తెలంగాణా ప్రాంతానికి చెందిన వారిగా చూపించటం, వారిచేత తెలంగాణ యాసలో మాట్లాడించటం జరిగింది. బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రూపొందిన ‘పరమవీర చక్ర’లో హీరో బాలకృష్ణతో ‘కొమరం భీమ్‌’ పాత్ర వేయించి ఓ పాటను చిత్రీకరించటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ చిత్రం ‘కొమరం పులి’ లో హీరోను తెలంగాణావాసిగా చూపించారు. ఇక అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘రాజన్న’ చిత్రం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అందులో నాగార్జున పాత్ర తెలంగావాది కావడం గమనించతగ్గది. అలాగే, ఆమధ్య విడుదలైన వరుణ్ సందేశ్ ‘ఏమైంది ఈవేళ’ చిత్రంలో హీరోను వరంగల్‌వాసిగా చూపించారు. అలాగే సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ‘ప్రేమకావాలి’ చిత్రంలో హీరో స్వస్థలం ఖమ్మంగా చూపించడం జరిగింది. వీటితో పాటు మొన్న బుధవారం విడుదలైన ‘అహనా పెళ్లంట’ చిత్రంలోనూ హీరోయిన్‌ వరంగల్‌కు చెందిన అమ్మాయిగా చూపించారు. అంతేకాదు.. హీరోయిన్స్‌ సోదరులు శ్రీహరి, సుబ్బరాజు, హీరోయిన్‌ తండ్రి నాగినీడు తదితరులంతా తెలంగాణా మాండలికంలోనే మాట్లాడుతూ ఉంటారు.ఇలా తెలుగు సినిమాల్లో ఒక్కసారిగా తెలంగాణాకు, ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నారు. అయితే అక్కడ సంస్కృతి,సంప్రదాయాలను కూడా గుర్తించి,గౌరవించి వాటిని సైతం సినిమాల్లో పెడితే మన తెలుగు సినిమాలు మరింత జీవంతో ఉట్టి పడతాయి.ఈ మార్పుకు కారణం ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా తెలంగాణా ఉద్యమమేనన్నది అందరి వాదన

Allu Arjun Marriage Function

సలోని లక్ష్మీ రాయ్ ల తో త్రిపాత్రభినయం:బాలకృష్ణ




సునీల్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'మర్యాద రామన్న' చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టన భామ సలోని. అయితే ఆ చిత్రం తర్వాత ఆమెకు చెప్పుకోతగ్గ ఆఫర్స్ రాలేదు. తెలుగుఅమ్మాయి అనే చిత్రంలో చేస్తున్న ఈమె తాజాగా బాలకృష్ణ చిత్రంలో ఒక హీరోయిన్ గా బుక్కయ్యింది. శ్రీకీర్తి కంబైన్స్‌ సంస్థ పతాకంపై ఎమ్‌.ఎల్‌.పద్మకుమార్‌ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్ ఇప్పటికే లక్ష్మీరాయ్‌ ఎంపికైంది. మరో హీరోయిన్ గా సలోనిని ఎంపికచేసారు. ఈ విషయంపై తన ఆనందాన్నివ్యక్తం చేస్తూ "బాలకృష్ణతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి దొరికింది. మాస్‌ మసాలా పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు చేయని ఒక వైవిధ్యమైన పాత్ర ఈ సినిమాతో దక్కడం ఆనందంగా ఉంది. ఈ నెల 11 నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్తోంది. ఈ చిత్రంలో జయసుధ, నదియా, ప్రదీప్‌రావత్‌, ఆదిత్య మీనన్‌, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమర్పణ: సందీప్‌, సంగీతం: కల్యాణిమాలిక్‌.

జోష్ చిత్రం నాగచైతన్య లాంచ్ కోసమే తీశారు అంటున్న కార్తికా


"అదేంటో కెమెరా ముందు తొలిసారి నిలబడినప్పుడు కూడా నాకు కొత్తగా అనిపించలేదు. నటన అమ్మ జీన్స్‌లోనే ఉంది కదా. ఆ ప్రభావమేనేమో అంటోంది రాధ కూతురు కార్తీక. నాగచైతన్య సరసన 'జోష్'తో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తలుగులో ఆఫర్స్ లేకున్నా తమిళ,మళయాళంలో కొన్ని సినిమాలు చేస్తోంది. అలాగే.. షూటింగ్ ఎలాంటి లొకేషన్లలో ఉన్నా చాలా కంఫర్టబుల్‌గానే చేస్తాను. అలాగే సినిమాలకు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా నాకు ఎక్కువే. అమ్మ కన్నా ఆంటీ అంబిక నటనంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ నా కాస్టూమ్స్ సెలక్షన్ మొత్తం ఆంటీదే అంది. ఇక జోష్ చిత్రం ప్లాప్ గురించి మాట్లాడుతూ..నాకు తెలుసు జోష్ చిత్రం నాగార్జున కుమారుడు చైతన్య ను లాంచ్ చేయటానికి అని...అందుకే అతని మీదే పూర్తి స్ధాయి ఫోకస్ పెట్టారు. అయితే రిజల్టు ఏ విధంగా వచ్చిందన్న దాని గురించి నేను మాట్లాడను. నేను ఏదైతే తెరమీద చేసానో దానని ఇప్పటికీ ఇష్టపడుతున్నాను..నేను దాని గురించి అస్సలు భాధపడటం లేదు అని తెల్చేసింది. ప్రస్తుతం ఆమె సంతోష్ శివన్ సరసన ఓ మళయాళ చిత్రంలో చేస్తోంది.
Powered by web analytics software.