Free SMS And Earn Part Time Money







3/17/11

చిన్నప్పటి నుంచి నేనింతే అంటున్న డర్టి పిక్చర్స్ హిరోయిన్


బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ తనకు ఒళ్ళు రావటానకి కారణం తను రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోవటమేనంటూ తేల్చింది. అయితే ఈ నిద్రపట్టని సమస్య తనకు పన్నెండవ ఏట నుంచి ఉందని అప్పట్లో కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నని అదే తన మెటబాలిజాన్ని దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్ళ క్రిందట ఈ విషయం తనకు తెలిసిందని చెప్పింది. ఇక తన ఒళ్ళు గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడల్లా బాధకలిగేదని,అయితే లావు తగ్గటం కోసం తాను చాలా కష్టపడ్డానని అయితే ఫలితం లేకుండాపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో పూజ మకీజా అనే డైటీషన్ దగ్గరకు వెళితే ఆవిడ నా అలవాట్లు తెలుసుకుని అప్పుడు నిద్రపోకపోతే వచ్చే సమస్యలు చెప్పి, తనను మార్చిందని అప్పటినుంచి రాత్రిళ్ళు ఎక్కువ సేపు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నాని అంది. అయితే హఠాత్తుగా ఈ నిద్రగోల ఎత్తుకోవటానకి కారణం ఆమె స్లీపింగ్ ఎవేర్ నెస్ మంత్ కి బ్రాండ్ అంబాసిడర్ కావటమే. ప్రస్తుతం విద్యాబాలన్..సిల్క్ స్మితగా డర్టీ పిక్చర్ లో నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలింద్ లూద్రియా డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. ఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
Powered by web analytics software.