Free SMS And Earn Part Time Money







2/8/11

హిరోయిన్ బొడ్డు పై మంచు ఫ్యామిలి


"సలీం"సినిమాతో దుమ్ముకొట్టుకుపోయిన మంచు విష్ణు చాలాకాలం తర్వాత దుమ్మంతా దులుపుకొని "వస్తాడు నా రాజు" సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు తన అందాలతో తమ్ముడికి హిట్ ఇచ్చినా తాప్సి అందాలను కెమెరా ముందు ఉంచి "అంటే ఆరబోసి"తనకి మంచి హిట్ వస్తుందేమోనని తెగ ఉబలటపడుతున్నాడు తను ఎన్ని ఫైట్స్ యాక్షన్ సీన్స్ చేసినా ఈ సినిమా కి గుర్తింపురాదని తెలుసుకున్నాడో ఎమో మొదటి నుంచి తాప్సి బొడ్డు పైనే కాంస్రంట్రేషన్ అంతా పెట్టి డైరక్టర్ కూడ అదే చెప్పి సినిమా తీశాడు అందుకే కాబోలు సెన్సార్ వాళ్ళు కూడ హిరోయిన్ బొడ్డు మీదే సెన్సార్ పెట్టడంతో సెన్సార్ వాళ్ళపై తెగ మండిపడ్డాడు మొత్తాని కి ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదలకు సిద్దమయింది మరి మన వాళ్ళు తాప్సి అందాలు[బొడ్డు]గుర్తిస్తారో ఇంతకంటే ఎన్నో చూశాం అని లైట్ తీసుకుంటారో ముందు చూడాలి
హిరోయిన్ బొడ్డు పై మంచు ఫ్యామిలి ఆధారపడిందనుకుంటునారు టాలీవుడ్ వర్గాలు

పవన్ సినిమాలు ఆగిపోతాయా???


గోపిచంద్ ‘వాంటెడ్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై..ప్లాప్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్న బి.వి.యస్.రవి తన దర్శకత్వంలో రూపొందే సినిమాకి ‘తీన్ మార్’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నాడని వినికిడి. కాగా జయంత్ దర్శకత్వంలో ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా కామెడీ యాక్టర్, నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తీన్ మార్’ టైటిల్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ చిత్రానికి ఖుషీగా అని తర్వాత లవ్లీ అనీ వర్కింగ్ టైటిల్స్ గా షూటింగ్స్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అంటే తనకున్న ఇష్టం వల్ల, మిరపకాయ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనకు ఫ్రెడ్స్ షిప్ వల్ల, ఆ టైటిల్ ను వారు తస్కరింపబడినా కూడా బి.వి.యస్.రవి ఈ టైటిల్ ను త్యాగం చేశాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ త్యాగం చేయకపోయి ఉండి ఉంటే..ఖలేజా, కత్తి టైటిల్స్ లా ‘తీన్ మార్’ కూడా వివాదం అయిఉండేది పవన్ కళ్యాణ్ మళ్ళి ఇంకొ వివాదంలో చిక్కుకునేవాడు ఇప్పటికే తాను తీస్తున్న దబాంగ్ రీమేక్ హక్కులు ఎవరికి ఇవ్వలేదని అంటు వార్తలు వినిపిస్తున్న ఈ సమయంలో ఈ టైటిల్ కూడ వివాదం వస్తే ఇకా పవన్ కి అసలే చిరకు సినిమా లన్ని ఆపేస్తాడేమో

తాప్సి తెగ తినేది:విష్ణు


విష్ణు, తాప్సీ జంటగా నటించిన చిత్రం "వస్తాడునారాజు" ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఈ చిత్రంలో తనతో రొమాన్స్ చేసిన తాప్సీ తనను పదినిమషాలకొకసారి ఇరిటేట్ చేస్తోందని అంటున్నారు విష్ణు.

వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో తాప్సీ మెడికల్ స్టూడెంట్ గా చేసారట. బబ్లిగా వుండే ఈ అమ్మాయికి అన్నంటే ప్రాణం. ఆమె అన్నగా ప్రకాష్ రాజ్ నటించారు. అయన కూడా చెల్లలంటే అంటే అభిమానం. తాప్సీ ప్రేమను గెలవటానికి విష్ణు ఏం చేసాడు అనేది కధ.

ఇక తాప్సీ షూటింగ్ సెట్ లో ప్రతి పది నిమషాలకు ఏదో ఒకటి తినాలని అడుగుతుండేదట. దాని వలన విష్ణుకు ఇరిటేషన్ వచ్చేది. అయితే అది కొన్ని సెకన్ల వరకే పరిమితమని ఆ తర్వాత తనంటే నాకు అభిమానం పెరిగిందని విష్ణు చెప్పుకొచ్చారు

నందిని రెడ్డి హిరో ఎవరు???సస్పెన్స్


అలా మొదలైంది చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మరో దర్శకురాలు నందినిరెడ్డి. కృష్ణ వంశీ శిష్యురాలిగా చేసిన ఈమె తొలిచిత్రంతోనే సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ప్రేమ కధల్లో సరికొత్తగా వుండే విధంగా అలామొదలైంది చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని తన వైపుకు త్రిప్పుకున్నారు. ఇప్పుడు ప్రతి నిర్మాత నందిని రెడ్డి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా నందిని రెడ్డి తదుపరి చిత్రాన్ని బెల్లం కొండ సురేష్ నిర్మించనున్నాడు. ఈ మేరకు ఈ దర్శకురాలికి అడ్వాన్స్, అగ్రిమెంట్ తదితర పనులన్నీ బెల్లంకొండ పూర్తి చేసాడు. అయితే నందిని దర్శకత్వంలో నటించే హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నారు.

వీరిద్దరిది స్నేహం కాదంటున్న


పాప్ యువ తరంగం జస్టిన్ బైబర్ తన స్నేహితురాలు అయినటువంటి సెలినా గోమెజ్ ఇద్దరి మద్యా ఉన్నటువంటి సాన్నిహిత్యం రోజురోజుకీ పెరిగిపోతుందని అనుకుంటున్నారు హాలీవుడ్ సినీ విమర్శకులు. ఇటీవల కాలిఫోర్నియాలోని శాంతా మోనికాలో కనిపించిన విధానమే దీనికి ప్రతిబింబిస్తుందని పెద్దలు అంటున్నారు. ఇద్దరూ ఒకరికోకరు చెట్టాపట్టాలేసుకోని మరీ శాంతా మోనికా వీధుల్లో రెచ్చిపోతున్నారు. గతంలో జస్టిన్ బైబర్ పలుమార్లు ఇంటర్యులలో సెలినా గోమెజ్ తనకి ఉన్నటువంటి ప్రాణ స్నేహితులలో ఒకరు అని అనడం జరిగింది. ఇప్పుడు ఆ స్నేహామే వారిద్దరిని బాగా చనువుగా చేసిందని సమాచారం. కాలిఫోర్నియాలోని శాంతా మోనికాలోని ఫోటోలను చూసినట్లైతే జస్టిన్ బైబర్ సెలినా గోమెజ్ వీపు వెనుక భాగాన అమాంతం వాటేసుకోవడం జరిగింది. ఈఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరి మద్యా స్నేహం కంటే కూడా ఏదో బలమైన సంబంధం ఉందని రూమర్స్ రావడం విశేషం.

అపార్ట్ మెంట్లో నిఖిత


సంబరం, కళ్యాణరాముడు, ఏవండోయ్ శ్రీవారు, నీ నవ్వే చాలు వంటి చిత్రాలలో నటించి ఆ తర్వాత వరస ఫ్లాప్ లు ఇచ్చి కనుమరగైపోయిన నిఖిత తాజాగా ‘అపార్ట్‌మెంట్’ అనే చిత్రంలో చేస్తోంది. నిఖిత ప్రధాన పాత్రలో శ్రీ క్రియేటివ్ ఫిలిం పతాకంపై వి.రాజేష్ దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ రావ్, సతీష్ కె.వి., వేగేశ్న సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ- సస్పెన్స్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. రక్ష, ఉత్తేజ్, రవివర్మ, ఎం.ఎస్.నారాయణ, చిన్న, విజయసాయి, సుబ్బరాజు, అల్లరి సుభాషిణి, శ్రీకర్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాబూ జేమ్స్, సంగీతం: ఖుద్దూస్, నిర్మాతలు: ఎ.కె.శ్రీకాంతరావు, సతీష్ కె.వి. వేగేశ్న, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.రాజేష్.

ఇలియాన నెంబర్ వన్ అవుతోందా??


అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అన్నాడు ఓ కవి. ఆ అందాలు ఉంటేనే గ్లామర్‌ ఫీల్డులో మరింత రాణింపు ఉంటుంది. మిస్‌యూనివర్స్‌, మిస్‌‌పసిఫిక్‌, మిస్‌‌ఇండియా వంటి వారు కూడా పోటీల్లో నెగ్గిన తర్వాత తమ అందాలను మరింత ప్రదర్శించడానికి సరైన వేదిక కోసం వెతుకుతుంటారు. చాలామంది మోడలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఇందులో ఏ కొంతమందో వెండితెరపై వెలిగిపోతారు. కొందరి కళ్లు అట్రాక్షన్‌గా ఉంటే ఇంకొందరిలో కోటేరులాంటి ముక్కు, కట్టిపడేసే ముఖ వర్చస్సు, ముత్యాల్లాంటి పలువరసు.. గిలిగింతలు పెట్టే సొట్టబుగ్గలు.. ఇలా ఒక్కోటి ఒక్కొక్కరికి ఎసెట్‌గా నిలుస్తాయి. అయితే ఎన్ని అందమైన ఆస్తులున్నా సినిమా కథలో ఏమాత్రం తేడా వచ్చినా అవకాశాలు అలానే పోతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందాల భామల తీరు అలానే ఉంది ఇలియానా: దాదాపు కోటి రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం. వై.ఎస్‌.చౌదరి 'దేవదాసు' చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. అయితే దానికి ముందే 'జాదు' అనే చిత్రంలో నటించింది. ఎ.ఎం.రత్నం కుమారుడు హీరోగా నటించిన ఆ చిత్రం రెండు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ బయటకు రాలేదు. దేవదాసు చిత్రంలో తన అందాలను కనపడి కనబడనట్లు చూపించి హిట్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అలా ఒక్కో చిత్రం ఒక్కో యువ హీరోతోనూ, సీనియర్ కథానాయకులతోనూ నటించి తన పారితోషికాన్ని కోటివరకు పెంచింది. 'మల్లీశ్వరి'లో కత్రినాకైఫ్‌కు ఆనాడు 70 లక్షలు ఇచ్చినట్లు వార్తలువెలువడ్డాయి. ఆమెను మించిన స్థాయికి ఇలియానా చేరుకుంది. టాప్‌ 5లో ఇలియానా ఒకరు. తాజాగా తమిళం, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉంది. .

అలా మొదలైంది నిర్మాతతో అల్లరి చేస్తున్న నరేష్


దామోదర్ ప్రసాద్ అంటే అనగానే మనకి ఇంతకమునుపు గుర్తుకు రాదు కాని "అలా మొదలైంది" సినిమా ద్వార అందరికి పరిచయం అయ్యాడు దామోదర్ తీసిన అలా మొదలైంది హిట్ అవటంతో మరో సినిమా తీయటానికి రెడి అయ్యాడు.ఇందులో అల్లరి నరేష్ హిరో సీతరామరాజు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు సీత రామరాజు ఎక్స్ పీరియన్స్ కొంతమంది పరిచయం అల్లరి నరేష్ ఫేం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ ఈ సినిమా సంగతి అలా ఉంచినా ఇంకా అలా మొదలైంది సినిమా ధియేటర్స్ లో ఆడుతునే ఉంది హిట్ టాక్ వచ్చిన పైరసి బారిన పడట్లేదు కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ కి ఎటువంటి డోకా లేకుండా పోయింది మొత్తానికి అలా మొదలైంది సినిమా ద్వార అందరూ లాభ పడ్డారు ........1!!!

యువతను ఉర్రుతలుగించే రొమాంటిక్ లేడి 'మేఘనానాయుడు' ప్రధాన పాత్రలోబంగారు కోడిపెట్ట


మత్తెకించే అధరాలతో యువతను ఉర్రుతలుగించే రొమాంటిక్ లేడి 'మేఘనానాయుడు' ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ఓ చిత్రాన్ని శ్రీ నాగలక్ష్మి పిల్మ్స్ బ్యానర్ పై బి.ఫణి నిర్మాతగా బంగారుకోడిపెట్ట పేరుతో ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలలలోనే విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర విశేషాలను నిర్మాత ఫణి తెలుపుతూ - ఇందులో ఒక ఫ్యామిలీ ఉమెన్ లా ఎన్నో కట్టుబాట్లతో వున్న 'మేఘనా నాయుడు' ని అనుకోకుండా ఓ సందర్భంలో కలిసిన ఓ యువకుడు కఠినంగా వుండే ఆమె మనస్సును మెల్ల మెల్లగా కరిగించి తన వశం చేసుకుంటాడు. అలా ఎడాపెడా వారి సంబంధం ముదిరి పూర్తిగా లీనమై, సర్వసుఖాలను అనుభవిస్తూ వుంటారు. ఓ సారి వీరిద్దరి విషయం బయటపడింది. అలాంటి సమయంలో వాళ్ళు తీసుకున్న అత్యవసర నిర్ణయం వల్ల ఎలాంటి చిక్కుల్లో పడ్డారో? చివరకు కధ ఎలా సుఖాంతమయిందో వెండి తెరపై చూడాల్సిందే.

వీరిద్దరి మధ్య సాగే రసవత్తరమైన సన్నివేశాలు యువతను కట్టి పడేసేవిలా ఉంటాయి. ఇందులోని 3 పాటలు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తాయి. ఈ వారంలో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసి ఈ నెలలోనే చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత బి. ఫణి తెలిపారు.

మరో మగదీర అవుతుందా ??? దానినే దాటుతుందా అనేది ప్రశ్న


సరికొత్త తరహా చిత్రాలని ఖర్చుకి వెరవకుండా గ్రాండ్ గా తెరకెక్కిస్తే రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుందని ‘మగధీర’, ‘అరుంధతి’తో రుజవైంది అదే నమ్మకంతో జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘శక్తి’చిత్రం మీద తన శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు నిర్మాత అశ్వనీదత్. గత ఏడాది ఫిబ్రవరి 6న రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం ఏడాది కాలంగా సెట్స్ మీదే ఉంది. అలాగే మరో ఏడెనిమిది నెలలు ఫ్రీ ప్రొడక్షన్ లోనే గడిపింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న‘శక్తి’ పబ్లిసిటీ క్యాంపైన్ ఈ నెల 14న మొదలవుతుంది. ఇంతదాకా ఈ చిత్రానికి సంబందించిన స్టిల్స్, గెటప్స్ అన్నీ సీక్రెట్ గా ఉంచారు. అయితే సినిమా మార్చి 30న విడుదలకి సిద్దమవుతూ ఉండడంతో ‘శక్తి’ హంగామాకి తెర లేపుతున్నారు. ఫిబ్రవరి 27లేదా మార్చి 2న ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లేదా గుంటూరులో జరుగుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ‘శక్తి’ ఎంతనేది, బాక్సాఫీస్ వద్ద అతని స్టామినా ఏమిటనేది తెలుస్తుందని చిత్ర రూపకర్తలే కాక అభిమానులు సైతం నమ్మకంగా ఉన్నారు. ఇన్నాళ్లు ప్రొఫైల్ లో ఉంచిన ఈ చిత్రాన్ని ఇకపై హైప్ చేస్తారో లేక సైలెంట్ గా వచ్చి తమ ‘శక్తి’ చూపిస్తారో వేచి చూడాల్సిందే..

మళ్ళి రాం గోపాల్ వర్మ డేట్ ఇచ్చాడు


రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సునీల్, స్వాతి, సాక్షి ఇందులో హీరోహీరోయిన్లు. వందిత కోనేరు సమర్పణలో శ్రేయ నిర్మాణంలో కిరణ్ కుమార్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... సినిమా మొత్తం సినిమా నేపథ్యంగానే సాగుతుంది. సినిమాలంటే ప్రాణం పెట్టే ఓ ప్రేక్షకుడు దర్శకునిగా మారి ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాడన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశం. వినోదానికి పెద్ద పీట వేశాం. వారానికో పాట చొప్పున ఆరు పాటలను మార్కెట్లోకి విడుదల చేశాం. ఇటీవలే మొత్తం పాటలను విడుదల చేశాము. రాంగోపాల్ వర్మ ఈ చిత్రం ద్వారా పాటల రచయితగా పరిచయం కావడం విశేషం. వర్మ మార్కు వినోదం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నిర్మాణానంతరం కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 18న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని తెలిపారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణు మాధవ్ తదితరులు నటించారు.

నగ్నంగా కనపడటానికి రెడి అవుతున్న తార


ప్రపంచంలో కెల్లా అత్యంత పోడవైనటువంటి సుందరి అమాజాన్ ఈవ్ ఇటీవల ఫాక్స్ 411కి ఇచ్చినటువంటి ఇంటర్యూలో తన మనసులో ఉన్నటువంటి కొన్ని నగ్న సత్యాలు బయట పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తనకు ఎప్పటి నుంచో ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా కనపించాలని తపన ఉండేదంట. దానితో ఒకసారి ప్లేబాయ్ మ్యాగజైన్ చైర్మన్ హెప్నర్‌ని సంప్రదించడం జరిగిందంట. దీనిలో భాగంగానే తన ఫిజిక్‌ను కూడా ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమివ్వడానికి అనుకూలంగా తయారుచేసిందంట. త్వరలోనే నగ్నంగా ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమివ్వడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు

మరో కొత్త వ్యక్తితో హాలీవుడ్ తార


హాలీవుడ్‌లో హీరోయిన్లు ఎప్పుడు ఎవరితో కనిపిస్తారో చెప్పడం ఎవరి తరం కాదు. దీనికి సాక్షం మరో ఎవరో కాదు పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరిస్ సినిమాల్లో నటించినటువంటి హాలీవుడ్ అందగత్తె కైరా నైట్లీ గత ఐదు సంవత్సరాలుగా తన కోస్టార్ అయినటువంటి రూపర్ట్ ప్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరగడం మనం చూశాం. ఐతే గతవారం లండన్ లోని చైనాటౌన్‌కి వచ్చినటువంటి కైరా నైట్లీ మరో కొత్త ప్రెండ్‌తో వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసందర్బంలో కైరా నైట్లీ మాట్లాడుతూ గత ఐదు సంవత్సారాలుగా నేను రూపర్ట్ ప్రెండ్ కలసి ఉన్నమాట అందరికి తెలిసిందే. మేము కొన్నికారణాల వల్ల విడిపోవడం జరిగింది. విడిపోవడం అనేది మేమిద్దరం చాలా తేలికగానే తీసుకోవడం జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగిందన్నారు. అసలు కైరా నైట్లీ చైనా టౌన్‌కి రావడానికి కారణం వెస్ట్ ఎండ్ ప్లే అనే షాప్ ఓపెనింగ్. ఈసందర్బంలో షాపు యజమాని మాట్లాడుతూ కైరా నైట్లీ, రూపర్ట్ ప్రెండ్ విడిపోయినప్పటికీ జీవితంలో మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

మరో హిరోయిన్ ప్యాంటి వివాదం

మరి ఇ అమ్మడి కి పబ్లిసిటి వస్తుందో చీవాట్లు దక్కుతాయో చూడాలి మరి అందరూ వేసుకోవట్లేదు కదా నేను వేసుకొపోతే ఎమొచ్చిందిలే అనుకుని ఉంటుంది

మరో హిరోయిన్ ప్యాంటి వివాదం sonali bindre


చిరంజీవి సరసన "శంకర్ దాదా ఎంబీబీఎస్", "ఇంద్ర" చిత్రాల్లో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలి బింద్రే ఇటీవల ఓ ఫంక్షన్‌కు ప్యాంటీ వేసుకోకుండా వచ్చిందంటూ పుకార్లు షికారు చేశాయి. వివరాల్లోకి వెళితే.... సోనాలి బింద్రే ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీకి హాజరైంది. అయితే ఆ పార్టీకి ఆమె యానాగుప్తా మాదిరిగా ప్యాంటీ వేసుకోకుండా దర్శనమిచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అవి ఆ నోటా ఈ నోటా చివరికి బింద్రే కుటుంబం చెవిన పడ్డాయట. దీంతో వారు మండిపడుతున్నారట. ఇదిలావుంటే బింద్రే మాత్రం తనపై లేనిపోని పుకార్లు పుట్టించి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నవారికి తగిన బుద్ధి చెపుతానంటోందట. తాను ప్యాంటీ వేసుకోలేదంటూ పిచ్చిరాతలు రాసిన వారిపై కేసు పెడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.

లేటు వయసులో షా కి ఘాటు రొమేన్స్ విధ్యాభాలన్ తో


సిల్క్స్మిత జీవితకధ ఆధారంగా తీస్తున్న డర్టిపిక్చర్స్ చిత్రంలో ప్రధానపాత్ర విధ్యభాలన్ చేస్తోంది ఈ సినిమా లో విధ్య సిల్క్ స్మిత పాత్ర వేస్తోంది ఈ సినిమా లో సిల్క్ స్మిత నటన జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కూడ తెరకెక్కించ నున్నారు అందుకుగాను సిల్క్ స్మిత అప్పట్లో కొంతమంది తో లవ్ ఎఫ్ఫైర్స్ నడిపిన సన్నివేశాలను కూడ ఈ చిత్రంలో విధ్యబాలన్ నటించవల్సి వస్తుంది సిల్క్ స్మిత అప్పట్లో వివిధ ఏజ్ గ్రూప్స్ వారితో సెక్స్ సంభందాలు నడిపింది అటువంటి సీన్స్ గాను ఈ సినిమా లో నసిరుద్దీన్ షా తో విధ్యా భాలన్ ఈ సినిమా లో కొన్ని సెక్స్ సీన్స్ చేయటానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం ఇష్కియా చిత్రంలో వీరిద్దరు కళ్ళతోనే వేడి పుట్టించిన సంగతి తెలిసిందే ఈ సినిమా లో మరి కొంచం ముందు కెళ్ళి కార్యక్రమాలలో దిగనున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి లేటు వయసులో షా కి ఘాటు రొమేన్స్

నేనింతే:ఉపేంద్ర


మొన్ని మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వెల్ లేకుండా సినిమా తీస్తే కన్న్నడ హిరో దర్శకుడు అయిన ఉపేంద్ర టైటిల్ లేకుండా సినిమా తీశాడు ఇలా తీస్తే సినిమాలు ఆడతాయ అంటే ఆడినా ఆడకపోయినా నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటానో అలానే సినిమా తీస్తానంటు అలానే తన సినిమాలోని హిరో ఉంటాడంటు చెపుతున్నాడు ఏ సినిమా తీసినా ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉండాలన్నది ఉపేంద్ర సిద్దాంతం పని లో పనిగా డైరెక్ట్ గా తెలుగులో ఒక సినిమా తీస్తానని అది తొందర్లో చెబుతానని చెప్పాడు మగదీర లాంటి సినిమా తీయలంటే గట్స్ ఉండాలని రాం చరణ్ బాగనటించాడని చెప్పాడు ఆ సినిమా బాగ నచ్చిందని చెప్పాడు
ఒకరు ఇంటర్వెల్ లేని ఒకరు టైటిల్ లేని సినిమా లు తీశారు మరి మిగిలిన వారు ఏమిలేకుండా తీస్తారో చూడాలి

డబ్బిస్తే ఒకటి కి పది సార్లు బికిని వేస్తా:దీపికా పదుకొనే


బికినీ కి ఓరేటు,లిప్ 2 లిప్ కిస్ కో రేటు పొట్టి దుస్తులకో రేటు స్పెషల్ సాంగ్ కి ఓ రేటు ఇదీ బాలీవుడ్ సెక్సీ భామ దీపికా పదుకొనే రేటుమేటర్. పేరుకోసమే సినిమాల్లో నటించటం ఆ పేరువచ్చాక కావల్సింది డబ్బే ఆ డబ్బుకోసమే ఎవరెన్ని వేషాలేసినా .....అంటూ నిసిగ్గుగా చెప్పుకొస్తోంది బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ...!!! డిమాండ్ ఉన్నప్పుడే కాసులు గుంజుకోవాలనీ...అయినా నిర్మాతలేమి ఊరకనే రెమ్యునరేషన్ ఇవ్వరనీ తమ గ్లామర్ ని నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నప్పుడు డిమాండ్ కి తగ్గట్టుగా రెమ్యునరేషన్ పెంచటం తప్పేమి కాదని దీపికా వాదన నా బికినీ కి ప్రేక్షకులలో చాల హైప్ ఉంది ఆ హైప్ కి తగ్గ రెమ్యునరేషన్ ఇస్తే సినిమా లో ఒకటికి పది సార్లు బికినీ సిన్స్ లో నటిస్తా ఆ సిన్స్ కి సినిమాలో కళాత్మకంగా ఉండాలి ఇదీ దీపికా బికినీ బాఘోతం

దేనికైనా రెడి అంటున్న మల్లికా money makes heroine thinks అన్నమాట


దబ్బు కోసం ఎమైనా చేస్తుందట మల్లిక షెరవత్ ఎమైనా అంటే మీరు వేరే విధంగా ఆలోచించకండి ఎమైనా అంటే సినిమా లో ఎటువంటి పాత్ర అయినా చేస్తుందట ఎందుకలా ?అంటే హిస్ సినిమా పై నమ్మకంతో అందులో పెట్టుబడులు పెట్టిందట ఈ భామ అ సినిమా తుస్ మనటం తో ఈ అమ్మడి ఆర్ధిక పరిస్థితి కుంటూ పడిందట దాంతో ఎంచేయలో తెలియక నిర్మాతలకు ఎదైనా చేస్తానంటు హింట్ ఇస్తోంది మరి నిర్మాతలు ఎలా కనికరిస్తారో మరి అన్నట్టు ఒక నిర్మాత కనికరిద్దమని వస్తే అ నిర్మాతని సంజయ్ దత్ పొగొట్టాడు మల్లిక ఈ సినిమా లో ఉంటే నేను హిరోగా చేయనని చెప్పటం తో గచ్చతరం లేక మల్లిక ని తీసేశాడట మరి ఈ దుర్బర పరిస్థితిలో ఆదుకునేదెవరో మల్లికా ని

ఖలేజా కొమరంపులి అదుర్స్ ఈ మూడు సూరి హత్య కేసులో



ఎన్టీఆర్ తో అదుర్స్ చిత్రాన్ని నిర్మించిన వల్లభనేని వంశీని పోలిస్ లు విచారించారు. మద్దెల చెర్వు సూరి హత్య కేసుకు సంబందించి ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ గతంలో విజయవాడ నగరంలో చేసిన సెటిల్ మెంట్ ను వంశీ బయటపెట్టిన సంగతి తెలిసిందే.

విజయవాడలోని అన్నపూర్ణ సంస్థ యజమానులైన అన్నదమ్ముల మధ్య వచ్చిన స్పర్ధలను తనకు అనుకూలంగా మార్చుకున్న భానుకిరణ్ వారిని బెదిరించి, అందులో డైరెక్టర్ గా చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. భాను, మధులను కోవర్టులుగా మార్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వల్లభనేని వంశీ, పరిటాల రవి పెద్ద కుమారుడు శ్రీరామ్ హత్యకు వ్యూహరచన చేసారని భానుమతి ఆరోపించారు. దీంతో సీసీఎస్ పోలీసులు వంశీని హైదరాబాద్ కు పిలిపించి రెండు గంటల పాటు విచారించారు

కొమరం పులి, ఖలేజా చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందుతుడైన భాను కు అత్యంత సన్నిహితుడైన సంగతి అందరికి తెలిసిందే. కాగా రమేష్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

రమేష్ పై నమోదైన కేసుల్లో పోలీసు విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పైనాన్షియర్ వైజయంతిరెడ్డి ని బెదిరించినట్లుగా, షాలిమార్ వీడియోస్ అధినేత అష్రప్ ను కూడా రమేష్ బెదిరింపు చర్యలకు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి.

సరదా సరదాగా సాగుతోంది’అంటూ తన బ్లాగులో తాజాగా రాసాడు Sankar [robo director]


తమిళ డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న '3 ఇడియేట్స్' రీమేక్ (తమిళంలో దీని పేరు 'నన్బన్') గురించి తొలిసారిగా నోరు విప్పాడు. తన బ్లాగులో ఈ సినిమా గురించి మంచి జోష్ తో వివరాలు రాసాడు. ‘ఊటీలో తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. స్టార్టింగ్ బాగుంది. బాగా ఎంజాయ్ చేసాను. అంతా యంగ్ టీమ్ వల్ల అందరిలోనూ మంచి ఎనర్జీ పొంగిపొరలింది. ఈ సినిమా షూటింగ్ సరదా సరదాగా సాగుతోంది’అంటూ తన బ్లాగులో తాజాగా రాసాడు. కథానాయిక ఇలియానా, జీవా, శ్రీకాంత్ (శ్రీరాం) ఈ షెడ్యూలులో పాల్గొన్నారు. ఇలియానా పై పెళ్లికూతురు గెటప్పులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా, రెండో షెడ్యులు షూటింగు త్వరలో డెహ్రాడూన్ లో ప్రారంభమవుతుందని అంటున్నారు. ఆ షెడ్యూలులో హీరో విజయ్ జాయిన్ అవుతాడు. జెమినీ ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు

బాబయ్ చూసి నేర్చుకోవల్సిన అబ్బయ్


ఒక్క ఫ్లేప్ తో అబ్బయ్ డీలా పడితే అంతకన్న దారుణమైన ఫ్లాప్ వచ్చిన బాబయ్ అదరకొడుతున్నాడు అదే మరి ఎక్స్ పీరియన్స్ అంటే మరి ఇన్ని రోజులు పవన్ ని చూసి ఏమి నేర్చుకున్నాడో రాం చరణ్ కొమరం పులి తర్వాత పవన్ లో కాస్త మార్పు వచ్చింది. తన మీద కోట్లు పెట్టుబడి పెట్టె నిర్మాతలకు మినిమం గ్యారెంటి ఇవ్వాలనే దృక్పదంతో సినిమాలు చేస్తునాడు పవర్ స్టార్. ప్రస్తుతం అవ్ ఆజ్ కల్ రీమేక్ చిత్రంతో పాటు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న క్రీస్తు చిత్రంలో నటిస్తున్న పవన్ త్వరలో బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్ రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో పాటు పవన్ మరో చిత్రాన్ని కూడా అంగీకరించారు. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి షాడో అనే టైటిల్ ను అధికారంగా ప్రకటించే అవకశం వుంది.

రాం గోపాల్ వర్మ కి మూర్ఖుడు అనే బిరుదిచ్చిన ఉదయ్ కుమార్


డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించినా, ఆయన దర్శకుడిగా ఎంత ఎత్తుకి ఎదిగినా, ఆయన తత్వం మాత్రం విచిత్రంగానే ఉంటుంది. ఆయన చేసే పనులు చాలా మందికి మూర్ఖంగా అనిపిస్తాయి. దర్శకుడయ్యాక ఇలాంటి పద్థతి వర్మ అలవర్చుకోలేదు. చిన్నప్పట్నుంచీ వర్మ ఇంతేనట. అందుకే అతడిని అంతా ‘మూర్ఖుడు’అని ముద్దుగా పిలుచుకునేవారట. ఇప్పుడు అదే టైటిల్ తో వర్మ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నారని సమాచారం. అన్నిఓకే అయిన తర్వాత ఫిబ్రవరి 15నుండి షూటింగ్ జరగుతుందని దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు. వర్మ సినీ జీవితం కాకుండా ఇందులో ఆయన కాలేజీ జీవితాన్ని చూపిస్తారట. కాలేజీలో వర్మ చేసిన పనులు, అతని స్నేహితులు, అఫైర్లు వగైరా అన్నింటినీ అధ్యయనం చేసి మరీ ఈ సినిమా తీస్తున్నారు. తన జీవిత కథతో సినిమా తీస్తూ ‘మూర్ఖుడు’ అనే టైటిల్ పెడితే వేరే ఎవరైనా ఫీలవుతారేమో కానీ వర్మ మాత్రం హర్టవ్వడు. పైగా ఇదంతా తనకు ఉచిత పబ్లిసిటీ ఇస్తుందని సంబరపడతాడు.

ఒక్క హిట్ తో చెట్టు మీద నుంచి పడ్డ రాం చరణ్


ఒక్క సినిమా పెద్ద హిట్ అవగానే చెట్టెక్కిన రామ్ చరణ్, ఒక్క భారీ ప్లాప్ రాగానే చతికిలపడ్డాడని ఫిలింనగర్ సమాచారం. మళ్శీ పరాజయం వస్తుందేమోననే భయంతో అసలు సినిమాలే చేయకుండా ఖాళీగా ఊళ్శు పట్టుకు తిరుగుతున్నాడు. ఇటీవల బాలీవుడ్‌ చాక్ లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ రిసెప్సన్‌కి హాజరైన విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా ఎన్ని కధలు విన్నా వాటిపై నమ్మకం కుదరక కొద్దిగా డిప్రెషన్‌కి కూడా లోనవుతున్నాడంట. హీరో వేషాలు వేసుకోవాల్సిన వయసులో తలకు మించిన భారాన్ని మోస్తున్నాడు. ఇటీవలే తన తండ్రితో చిత్రాన్ని నిర్మిస్తానంటూ కొత్త బ్యానర్ పెట్టిన విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా ఇటీవల మాటివి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా రామ్ చరణ్ చేరాడు. మాటీవిలో చిరంజీవికున్నటువంటి షేర్స్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకోని వాటాదారుడయ్యాడనేది అందరికి తెలిసిన నిజం. తన వయసున్న అల్లు అర్జున్ మాత్రం హ్యాపీగా నిర్మాణ వ్యవహారాలు తన తండ్రిపై వేసి తనుమాత్రం హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఒక్క సినిమా ప్లాప్ అవ్వగానే హీరోగా పనికి రానేమోనని భయపడుతున్నట్టు వేరే కార్యకలాపాలతో బిజీ అవుతున్నాడు. అసులు ఇంతకీ రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభం అవుతుందా లేదా అని అభిమానులు మాత్రం నిరాశతో ఉన్నారు.
Powered by web analytics software.