Free SMS And Earn Part Time Money







1/30/11

"థ్యాంక్ గాడ్. పిల్ల దీక్షాసేథ్


"థ్యాంక్ గాడ్. నాపై ఇంతవరకూ తీవ్రమైన గాసిప్స్ రాలేదు. అయినా గాసిప్స్ ఆరోగ్యానికి మంచిదే" అంటోంది వాంటెడ్ పిల్ల దీక్షాసేథ్. గాసిప్స్ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయని అడిగితే... గాలి కబుర్లు చెప్పుకుంటూ ఆనందపడేవారు ఎక్కువకాలం జీవిస్తారని ఇటీవల ఓ పత్రికలో చదివానంటోంది.

ఆసియా ఖండ దేశాలలో గాసిప్ మహా ఎక్కువగా జరుగుతుంటుందట. అయితే ఇందుకు భిన్నంగా ఐరోపా, అమెరికా ప్రజలైతే పెదాలు బిగపట్టుకుని మరీ కూచుంటారట. అయితే గాలికబుర్లను ఎంజాయ్ చేసే ఆసియా ప్రజలకంటే ఐరాపా ప్రజలు ఆయుర్దాయం తక్కువగా ఉన్నట్లు తేలిందట. ఈ సంగతిని చెప్పుకొచ్చింది దీక్షా సేథ్.

బాలీవుడ్ హీరోయిన్ల ఆఫర్లను గద్దలా తన్నుకుపోతోంది WHO???


శ్రీదేవి తర్వాత బాలీవుడ్‌లో సూపర్‌గా సక్సెస్ అయిన దక్షిణాది తారలు చాలా అరుదనే చెప్పాలి. ఇపుడు తాజాగా అసిన్ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ల ఆఫర్లను గద్దలా తన్నుకుపోతోంది. తాజాగా దీపికా పదుకునే అవకాశాన్ని అసిన్ తన్నుకెళ్లింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న "హౌస్‌ఫుల్ 2" చిత్రంలో మొదట దీపికా పదుకునేను అనుకున్నారు. ఇంతలో దర్శకుడి అభిప్రాయంలో మార్పు వచ్చింది. అసిన్ అయితే ఆ పాత్రకు సరిపోతుంది దీపకను తొలగించి ఆ స్థానంలో అసిన్‌ను ఎంపిక చేశాడట. ఇదంతా చూస్తుంటే సీనియర్ తార శ్రీదేవి, సెక్సీ అందాల అసిన్ కు చిట్కాలు చెప్పినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే అసిన్ పొద్దస్తమానం శ్రీదేవి ఇంట్లో దర్శనమిస్తోందట.

చార్మి వల్గారిటి ఇన్ మంగళ


click the image for clear view

పవన్ సినిమా పాటలు లేకుండా


ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ‘క్రియేటివ్ వర్క్’ అనే బ్యానర్ ఎలాంటి క్రియేషన్ లేకుండా వరుసగా రీమేక్ సినిమాలు చేసేస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ సినిమాని క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో రీమేక్ గా గబ్బర్ సింగ్ చేయబోతున్నానని పోస్టర్ ని విడుదల చేశారు. దాని గురించి వర్మ మరోరకంగా స్పందించాడు, మరి ఇలా తన గురించి అవాకులు, చెవాకులు మాట్లాడేవారికి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో గానీ..పవన్ కళ్యాణ్ ఓ ఎక్స్ పర్ మెంటల్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో పాటలు ఉండవట. అవుట్ అండ్ అవుట్ experimental చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్ బయట పెట్టనున్నాడని సమాచారం.

వరస హిట్స్ తో దూసుకెళ్తున్న హిరోయిన్ Anushka


అరుంధతి విజయంతో వెనక్కి తిరిగిచూసుకోలనటువంటి క్రేజు తెచ్చుకున్న అనుష్క తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్ ‘బిల్లా-2’లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రశాంత్ తో చేసిన ‘రెండు’ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఆమెకు అప్పట్లో ఐడెంటెటీ రాలేదు. ఆ తర్వాత విజయ్ ‘వేట్టైక్కారన్’తో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తమిళంలోనూ బిజీ స్టార్ గా మారింది. ఇక సూర్యతో చేసిన ‘సింగం’ (యముడు) ఘన విజయం సాధించటంతో అక్కడ టాప్ హిరోయిన్ గా మారింది ప్రస్తుతం తెలుగు ‘వేదం’ రీమేక్ అయిన ‘వానం’లో ఆమె వేశ్యగా నటిస్తోంది. అలాగే విక్రమ్ సరసన ‘దైవమగన్’ చిత్రంలో నటిస్తున్న అనుష్కను తీసుకున్నారు. ప్రస్తుతం తమిళ ‘బిల్లా’కు సీక్వెల్‌గా విష్ణువర్థన్ ‘బిల్లా-2’ తెర కెక్కించే సన్నాహంలో ఉన్నారు. అజిత్ 50వ చిత్రమైన ‘మంగాత్తా’ తర్వాత ‘బిల్లా-2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో నాగార్జున ‘ఢమరుకం’, ప్రభాస్ ‘రెబల్’ చిత్రాలను అంగీకరించింది.

నాకన్నా గొప్ప హీరోయిన్స్ లేరా?ఉన్నార?


హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారా? అని అందరూ అడుగుతున్నారు. అయితే అలాంటివి చేసేందుకు ఇంకా సమయం ఉంది. నాలో మరికొంచెం పరిపక్వత రావాలి. నేను ఆ పాత్రలకు సరిపడతాను అని నాకైతే అనిపించడం లేదు..అంటోంది సమంత. అలాగే ఈ ఫీల్డులో ఎప్పటికప్పుడు మనం నిరూపించుకోవాల్సిందే..అయినా నాకన్నా గొప్ప హీరోయిన్స్ ఇంకా ఎందరో ఉన్నారు. అయినా అప్పుడే నా నెంబర్‌ ఇది అని చెప్పుకొనేంత స్థాయికి నేను రాలేదు అంటోంది. ప్రస్తుతం మహేష్ సరసన దూకుడు చిత్రం చేస్తున్నఈ ముద్దుగుమ్మ రామ్ సరసన ఓ చిత్రం కమిటైంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నాని సరసన ఈగ చిత్రంలో చేస్తోంది. ఇక ఆమె గెస్ట్ రోల్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎర్ర గులాబీలు చిత్రం త్వరలో విడుదల అవుతోంది.

టాలీవుడ్ టీం మంచు వారి సొంతం


సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌కు సంబంధించి టాలీవుడ్ జట్టును తెలుగు సినిమా హీరో మంచు విష్ణు సొంతం చేసుకున్నాడు. జట్టు కెప్టెన్‌గా హీరో విక్టరీ వెంకటేష్ ఎంపికయ్యాడు. హీరోయిన్లు తాప్సీ, సమంత బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌కు హై ఫైగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ టీమ్‌ను ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కుటుంబం దక్కించుకుంది. టాలీవుడ్‌లో పరిపూర్ణమైన క్రికెట్ ఆడే నటులున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య వంటివారున్నారు.

శౄతి హాసన్ ఆంటీ రాం గోపాల్ సినిమాలో


మంచు లక్ష్మీ ప్రసన్న ప్రతీ ఒక్కరినీ ఆంటీ..అంకుల్ అని పిలుస్తూంటుంది. అయితే ఆమెను శృతిహాసన్..ఆంటి అని పిలిచి షాక్ ఇచ్చింది. అనగనగా ఒక ధీరుడు చిత్రంతో హీరోయిన్ గా పరచయం అయిన శృతిహాసన్ కి రీసెంట్ గా అందులో విలన్ గా చేసిన లక్ష్మీ ప్రసన్న పార్టీ ఇచ్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ...లక్ష్మి ప్రసన్న ఆంటీ ఇచ్చిన పార్టీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయేది అంది. దాంతో ఆమె త్వరలో ఈటీవీ కోసం చేసే ప్రేమతో మీ లక్ష్మీ పోగ్రాం టైటిల్ ని ప్రేమతో మీ లక్ష్మీ ఆంటీ అని మారిస్తే బాగుంటుంది అంటున్నారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న వర్మ దర్శకత్వంలో దొంగలముఠా చిత్రంలో కమిటైంది. ఆమె అనగనగా ఓ ధీరుడు చిత్రం ప్లాప్ అయినా అందులో ఆమె చేసిన మంత్రగత్తె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి ‘మొగుడు’


గోపీచంద్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మొగుడు’ (హజ్బెండ్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హీరో గోపీచంద్. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా విశేషాలు త్వరలో....!!!
Powered by web analytics software.