Free SMS And Earn Part Time Money







12/4/10

త్రిష నాకంటె బాగ నటించింది :samantha


TV బాంబు కేసులో ప్రధాన నిందితుడు పరిటాల రవి:మద్దెలచెర్వు సూరి


రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర -2 సినిమాపై పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూరి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రక్తచరిత్రలో మద్దెలచెర్వు సూరి పాత్రను సూర్య, పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించిన విషయం తెలిసిందే. రక్తచరిత్ర -2 సినిమాపై అభ్యంతరాలు తెలియజేయడానికి రామ్ గోపాల్ వర్మ ఫోన్ లో దొరకడం లేదని, అందుకే మీడియా ద్వారా తన అభ్యంతరాలను తెలియజేస్తున్నానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

టీవీ బాంబు కేసులో ప్రధాన నిందితుడు పరిటాల రవి అని, ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించలేదని ఆయన అన్నారు. సినిమాలో నిజాలను చూపించకుండా పరిటాల రవికి ఫేవర్ గా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారని ఆయన విమర్శించారు. తన అభ్యంతరాలను తెలపడానికి వర్మ ఫోన్లో దొరకడం లేదని ఆయన చెప్పారు.

[అంతా డుపే ]

హీరోయిన్ల అందాలను ఎంత మేరకు ఉపయోగించుకోవాలో అంత మేరకు దర్శకుడు ఉపయోగించున్నట్లు Ragada


ఒక మంచి హిట్ కోసం మొహవాచిపోయిన యువసామ్రాట్ తన తాజా చిత్రం "రగడ"తోనైనా ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన అందాల తారలు అనుష్క, ప్రియమణి నటిస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేసి తీరాలని దర్శకుడు కృతనిశ్చయంతో ఉన్నారు. నాగార్జు నటన సంగతి అలా ఉంచితే... హీరోయిన్ల అందాలను ఎంత మేరకు ఉపయోగించుకోవాలో అంత మేరకు దర్శకుడు ఉపయోగించున్నట్లు సమాచారం.

ముఖ్యంగా అనుష్కతో "సూపర్" ఎక్స్‌పోజింగ్ చేయించాడంటున్నారు. ఇక ప్రియమణి అయితే ఆల్రెడీ "గ్లామర్ ప్రదర్శన ఎంతవరకు చేయాలో చెప్పండి... అంతవరకూ చేస్తా"నంటోంది కనుక ఆమె అందాల ప్రదర్శనపై పెద్దగా డిమాండ్ చేయాల్సిన పనిలేదు.

ఎటొచ్చీ అనుష్క విషయంలోనే కాస్త తటపటాయించినా ఆ తర్వాత ఆమె నాగ్ కోసం అనుకున్న మోతాదులో ఎక్స్‌పోజింగ్ చేయడానికి రెడీ అనేసరిక ఆమె వద్ద నుంచి 100 శాతం అవకాశాన్ని తీసుకున్నారట. మరి చిత్రంలో అనుష్క ఏ మేరకు అందాలను ప్రదర్శించిందో చూడాలి.

"నార్నియా". సినిమా ట్రెయిలర్ మీకోసం...

అత్యంత భారీ బడ్జెట్ తో తెలుగు వెండితెరపైకి దూసుకు వచ్చిన హాలీవుడ్ చిత్రం "నార్నియా". ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రెయిలర్ మీకోసం...



తాప్సీ ఎటువంటి నలుసో మరి..?


ఢిల్లీ పిల్ల తాప్సీ "ఝుమ్మంది నాదం"తో ఒక్కసారి టాలీవుడ్‌లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం "వస్తాడు నా రాజు" అంటూ మంచు విష్ణు వెంట నటిస్తోంది.

ఈ భామకు అన్నిటికంటే ఐస్‌క్రీమ్ అంటే మహా ఇష్టమట. క్రీమ్ పార్లల్ కనబడితే చాలు.. కాళ్లకు బ్రేకులు పడతాయట. తనకు ఇష్టమైనంత సేపు ఐస్‌క్రీమ్‌ను మనసారా తినేసి వెళుతుందట.

క్రీమ్ తినేటపుడు ఎవరైనా పిలిస్తే కనీసం అటువైపు తల కూడా తిప్పదట.

నంబర్ గేమ్స్ గురించి నమ్మకముందా అని అడిగితే... ఇక్కడ ఎవరూ నంబర్ వన్ కాదంటోంది. ఇండస్ట్రీ చాలా పెద్దదనీ, అంత పెద్ద పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నలుసుల్లాంటి వారని అంటోంది.

ఇంతకీ తాప్సీ ఎటువంటి నలుసో మరి..? ఈ విషయాన్ని ఈసారి అడుగుదాం...
Powered by web analytics software.