Free SMS And Earn Part Time Money







2/3/11

తెలుగు లో హిరోలకే ప్రాధాన్యత :shraddha das


కుక్క పిల్లతో రాత్రంతా తంటపడినా బాలీవుడ్ తార



తల తిరిగే సమధానం తో రిచా



click image for clear view

విక్రం కి లాయర్ గా అనుష్క


విక్రమ్ త్వరలో దేవుని పుత్రుడు (‘దైవమగన్’) గా కనిపించనున్నాడు. తమిళంలో అనేక సూపర్ హిట్స్ ఇచ్చిన విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి చాలా రూమర్లు వచ్చాయి. ఐ యామ్ శామ్ అనే హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతుందని, ఈ చిత్రం నుంచీ హీరోయిన్ Anushka తప్పుకుందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే నేను ఈ కథను రెండేళ్ల క్రితమే తయారుచేసుకున్నాను. ఇది పూర్తిగా ప్రేమానుబంధాల ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం. ఒక హార్ట్‌కు, బ్రెయిన్‌కుమధ్య జరిగే వార్ ఈ చిత్రం అని అంటున్నారు. అలాగే జాతీయ అవార్డు గ్రహీత విక్రమ్ లాంటి హీరోతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇందులో విక్రమ్ మెంటలీ చాలెంజ్డ్ పర్సన్ గా నటిస్తున్నాడు. ఇతని భార్య జబ్బు మనిషట. ఈ పాత్రను తమిళ హీరోయిన్ Amala పౌల్ పోషిస్తోంది. విక్రమ్ లాయర్ గా అనుష్క నటిస్తోంది. ఒకేసారిTelugu,Tamil భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.

ఈ ముద్దుగుమ్మ మళ్ళీ మరొకడ్ని చూసుకునే ఆలోచనలోఉందనిkareenaకుటుంబ సభ్యులు తలపట్టుకు కూర్చుంటున్నారట


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చాలా కాలంగా సైఫ్ అలీఖాన్ తో లివింగ్ టుదెగర్ కాన్సెప్టుని ప్రాక్టీస్ చేస్తూ గడుపుతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సహజీవనం కన్నా పెళ్లి బెస్ట్ అనుకుంటూ సైఫ్ పెళ్ళికి తొందరపెడుతున్నాడు. కానీ కరీనా మాత్రం దానికి ససిమేరా అంటోంది. నాకింకా పెళ్ళి చేసుకునే వయస్సురాలేదని స్టేట్ మెంట్స్ ఇస్తోంది. తన దృష్టంతా కెరీర్‌మీదనే ఉందని చెబుతోంది.భవిష్యత్ లో తాను చాలా విజయాలు చూడాలనుకుంటున్నానని దానికి వివాహం అనేది అడ్డంకి కాకూడదనే వాయిదావేస్తున్నానంటోంది. షాహిద్ కపూర్ నుంచి విడిపోయిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ మరొకడ్ని చూసుకునే ఆలోచనలో ఉండి ఈ మాట అంటోందా లేక నిజంగానే వివాహం అంటే అనాశక్తితో సహజీవనాన్నే సపోర్టు చేస్తూ గడపుతోందా అని ఆమె కుటుంబ సభ్యులు తలపట్టుకు కూర్చుంటున్నారట. ఇక సైఫ్ ప్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ సంవత్సరం పెళ్ళి చేసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారుట

జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు


జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.రేపు(శుక్రవారం) విడుదల కానున్న జై బోలో తెలంగాణ చిత్రం లో జగపతిబాబు నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం వెంకటరమణ, కృష్ణా జిల్లా జేఏసీ అధ్యక్షుడు తాడికొండ సాయికృష్ణలు మీడియాతో మాట్లాడారు. జైబోలో తెలంగాణ చిత్రంలో హీరోగా నటించిన జగపతిబాబు నోటి వెంట సీమాంధ్రులను కించపరిచే విధంగా సంభాషణ ఉంటేకార్యక్రమంలో జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తామని హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు మణీంద్ర, భాగ్యరాజు, అశోక్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలను, సీమాంధ్ర ఉద్యమాన్ని కించపరిచే విధంగా వివాదాస్పదంగా జైబోలో తెలంగాణ చిత్రం ఉంటే అడ్డుకుంటామని అన్నారు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు.

పచ్చ బొట్టు పండగ జరుపుకుంటున్న త్రిష









రాజమౌళి తో డీలా పడ్డ హిరోలు


రాజమౌళి ఇప్పటివరకూ ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, రామ్ చరణ్ లకు దిమ్మతిరిగిపోయే హిట్లు ఇచ్చాడు. ఆ హిట్లను ఈ హీరోలు బాగానే ఎంజాయ్ చేసారు. కానీ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ ను చవి చూడటానికి జూ ఎన్టీఆర్, ప్రభాస్ నానా పాట్లు పడాల్సివచ్చింది. నితిన్ అయితే రాజమౌళి తో ‘సై’ మూవీ చేసిన తర్వాత ఇప్పటి వరకూ ఒక హిట్ కూడా చవిచూడలేదు. ‘మగధీర’ చిత్రం తర్వాత రామ్ చరణ్ కూడా ఈ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఈ చిత్రం తర్వాత చేసిన ‘ఆరెంజ్’ ప్లాప్ అయ్యింది. తన తదుపరి చిత్రాల పరిస్థితి ఏమవుతుందో అని భయపడుతున్నాడట చరణ్. రాజమౌళితో ఒక హిట్ పొందితే అంతే సంగతులు. తన హీరోలుకు సెన్సేషనల్ హిట్స్ ని అందించడంతో రాజమౌళిని గోల్డెన్ హ్యాండ్ అనాలో, లేక..ఆ తర్వాత ఆ హీరోలు సరైన హిట్లులేక విలవిల్లాడటం చూస్తుంటే ఐరెన్ లెగ్ అనాలో తెలియక కొంతమంది సినీపండితులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

రజని పక్కన చాన్స్ కొట్టేసిన అనుష్క


రజనీకాంత్ కొత్త చిత్రం ‘రాణా’ చిత్రంలో ఓ హీరోయిన్ లలో ఒకరిగా తెలుగు పరిశ్రమకు చెందిన అనుష్క ఎంపికైనట్టు తమిళ చిత్రపరిశ్రమలో వినపడుతోంది. రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మూండ్రుముఖం’ తర్వాత రజని త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ చిత్రం ఒక నిర్దిష్ట కాలానికి చెందిన కథతో రూపొందనున్నట్టు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెలిపారు. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఇక యానిమేషన్ పాత్రకు గాను తమిళనటి విజయలక్ష్మి, లైవ్ పాత్రలకు బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ‘రోబో’ చిత్రం తర్వాత రజనీ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సౌందర్య రజనీకాంత్ అక్కర్ స్టూడియోస్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బలపం పట్టీ బాబయ్ ఒళ్ళో ..... రాణా


బలపం పట్టీ బాబయ్ ఒళ్ళో ..... రాణా బొబ్బిలిరాజాలో వెంకటేష్ చేసిన సందడి తిరిగి మళ్ళి చేస్తాడ అప్పుడు వెంకటేష్ దివ్యభారతితో చేసినా అల్లరి రొమేన్స్ మళ్ళి రాణా ఇప్పటి హిరోయిన్స్ తో చేస్తాడా ?అనేది ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న టాపిక్ అయితే రాణ కాకుండా తిరిగి వెంకటేష్ ఆ చిత్రం రీమేక్ చేస్తాడ అని కూడ డౌట్ అయితే ఈ సందేహాలన్ని తిరాలంటే కొద్దిరోజులు మాత్రం ఆగల్సిందే ఎందుకంటే రాణా నేను నా రాక్షసి రిజల్ట్ చూసి ఈ ప్రొజెక్ట్ కదిలిద్దామని వెంకటేష్ నాగవల్లి ఫ్లాప్ తో రీమేక్ తీసి మళ్ళి ఎందుకు రిస్క్ తీసుకోవటం అని ఆలోచిస్తునట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం

పెళ్ళి తరవాత సినిమాలు చేయనన్న ప్రభుదేవా లవర్


పవన్ కళ్యాణ్ సినిమా లో మాజీ మిస్ ఇండియా :The Shadow


పవన్ కల్యాణ్ హీరోగా ‘బిల్లా, సర్వం’చిత్రాల దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా శారా జానే ఎంపికైంది. ‘ప్యాంటలూన్స్ ఫిమినా మిస్ ఇండియా వర్డ్ 2007’ సంవత్సరానికి మిస్ ఇండియాగా ఎంపికైన శారా గతంలో ఛానెల్ V లో వీజేగా పనిచేసింది. 'కిలాడీ' పేరుతో తెలుగులోకి డబ్ అయిన ‘తీరత్త విలయాట్టు పిళై’హీరో విశాల్ సరసన తమిళ సినిమాలో ఈమె తొలిసారిగా నటించింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తో 'గేమ్' హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం 'ది షాడో' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మార్చ్ మొదటి వారంలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ కలిసి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతాన్ని సమకూరుస్తాడు.

Maheshbabu అన్ని ప్రాంతాలు అయిపోయి గుజరాత్ చేరుకున్నాడు.....!!!


మహేష్ బాబు, సమంతా హీరో హీరోయిన్లుగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దూకుడు' సినిమా తాజా షెడ్యులు షూటింగు గుజరాత్ లోని అరేబియన్ సీ తీరంలోని కచ్ ప్రాంతంలో జరుగుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి జరుగుతున్న ఈ షూటింగులో ఓ పాటతో బాటు కొన్ని సీన్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లతో బాటు ముఖ్య తారాగణం కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నాడు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుపోయిన ఓ టెర్రరిస్టును పట్టుకునే ప్రయత్నంలో హీరో పలు ప్రాంతాలకు వెళతాడు. వాటికి సంబంధించిన కొన్ని సీన్స్ నే ఇప్పుడు గుజరాత్ లో షూట్ చేస్తున్నారు. ఇంతకు ముందు టర్కీ, దుబాయ్, మలేసియా, హైదరాబాదులో కొంత భాగం షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

తాత పాటకి మనవడి స్టెప్పులు సూటవుతాయా???


ఏ మాయ చేశావే చిత్రం లో సమంత తో రొమాన్స్ చేసి విజయం సాధించాడు నాగ చైతన్య. ప్రస్తుతం తమన్నతో ప్రేమ వ్యవహారం నడిపే పనిలో కొత్త సినిమా చేస్తున్నాడు. గతంలో ఆర్య, జగడం, ఆర్య 2 చిత్రాలు చేసిన దర్శకుడు సుకుమార్ ఓ టీనేజ్ ప్రేమకధతో ఈ సినిమా రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి మొదట్లో 'దట్ ఇజ్ మహా లక్ష్మి' అనే పేరు అనుకున్నారు. అలాగే ఈ సినిమాకి హీరోగా వరుణ్ సందేశ్ ను అనుకున్నారు కానీ ఆ స్థానాన్ని నాగ చైతన్య భర్తీ చేయడం తో టైటిల్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని సుకుమార్ కధకు అనుగుణంగా 'ఐ లవ్ యు' అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

సుకుమార్ గత చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య తన తాత ఏ.యన్.ఆర్ ప్రేమాభిషేకం లోని హిట్ సాంగ్ 'నా కళ్ళు చెబుతున్నాయి' పాట రిమిక్స్ కు స్టెప్పులు వేయబోతున్నాడు.

రోగం ముదిర బిల్డింగ్ కి గ్రిల్ల్స్ వేయించుకుంటోంది:సమీరా రెడ్డి


సాదారణంగా చాలా సార్లు విని వుంటారు. నిద్రలో నడుస్తుంటారని. కానీ నటిచే వారికి మాత్రం తెలియదు తను ఎటు వెళుతుంది. ఈ రోగాన్ని ‘సోమ్మాబ్లిజమ్’ అని అంటారు. బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డిని ఈ రోగం పట్టి పీడిస్తోందట. సమీరా రెడ్డికి (ఈ రోగం)చిన్నప్పటి నుంచి నిద్రలో నడిచి వెళుతూనే ఉంటుందట. సమీరా రెడ్డికి ఈ రోగం ఉన్నదనే సంగతి సినీ పరిశ్రమకు కూడా తెలిసిన విషయమే. సమీరా రెడ్డి కొత్తగా ఒక బిల్డింగ్ కొన్నదని సమాచారం. అందులో సమీరా రెడ్డి, సమీరా మదర్ (నిక్కి) ఫాదర్ ఉంటున్నారట. ఇంతకీ ప్రాబ్లమ్ ఏమిటంటే..ఈ మద్యనే సమీరా రెడ్డికి స్లీప్ వాకింగ్ ఎక్కువైందని తెలుస్తోంది. రోగం ముదరటంతో, సమీరా రెడ్డి రోజు నిద్రలో తనకు తెలియకుండా లేచి, నడుస్తూ ఉండటంతో, సమీరా రెడ్డి తల్లి నిక్కి ఎంతో బాధపడుతోందట. అందుకని బిల్డింగ్ బాల్కనీలో గ్రిల్స్ వేయించితే బెటరని, సమీరా రెడ్డి తల్లి ఆలోచించి, బాల్కనికి గ్రిల్ వేయించే పనిలో పడింది. ఈ విషయం తెలిసిన సమీరా రెడ్డి తల్లితో ఘర్షణకు దిగి, గ్రిల్ వేయించటాన్ని ఆపివేసందట బిల్డింగ్ కు ఉన్న అందం పోతుందని సమీరా, అందంపోతే పోయింది, నిద్రలో నడుచుకుంటూ వెళ్లి బిల్డింగ్ మీద నుంచి పడిపోతావని పోట్లాడుకుంటున్నారట. కాగా ఈ విషయాన్ని ఇద్దరూ కలిసి తండ్రి నిర్ణయానికి వదిలేశారని తెలిసింది.

బొంగో బికిని లు అందరు ధరించాలని కోరికట


హిల్స్ స్టార్ ఆడ్రినా పాట్రిడ్జి తను కొత్తగా నటించినటువంటి బోంగో యాడ్ క్యాంపెయిన్‌కి బికినీలో తన అందాలను అమాంతం ప్రదర్శించారు. ఈ సందర్బంలో ఆడ్రినా పాట్రిడ్జి మాట్లాడుతూ ఇలా ఈబ్రాండ్‌కి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించడం రెండవసారి అని అన్నారు. బోంగో యాడ్ క్యాంపెయిన్‌లో ఆడ్రినా పాట్రిడ్జి తనయొక్క బికినీ బాడీని టూపీస్ బ్లాక్ బికనీ ధరించి ఫోజు లివ్వడం జరిగింది. బోంగో గర్ల్‌గా నన్నురెండవ సారి కూడా తీసుకున్నందుకు నేను చాలా ధ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నానని న్యూయార్క డైలీ న్యూస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. నిజంగా బోంగో ప్రోడక్ట్‌తో నాఅనుబంధం తీరనిది అందుకే నేను రెండవసారి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాను అని అన్నారు. సాధారణంగా మనం బీచ్‌లలో బికినీలు వేస్తాం..వచ్చే సమ్మర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దానికి కారణం నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేటటువంటి బోంగో బికినీలు ధరించి అలా బీచ్‌లలో విహారించాలనేది నాకోరిక అని అన్నారు. బోంగో కంపెనీ వారు ప్రవేశపెట్టినటువంటి షార్ట్స్ మరియు శాండిల్స్ కూడా ఎంతగానో నన్ను ఆకట్టుకున్నాయని వీటన్నింటిని నాఅభిమానులు కూడా తప్పకుండా వాడాలని అన్నారు.

నగ్నంగా ఉన్న ఫోటోలు నావేనని ఒప్పుకున్న పాప్ సింగర్


గత కొన్నిరోజులుగా హాలీవుడ్‌లో పాప్ సింగర్ రిహానా పేరు బాగా వినిపిస్తుంది దీనికి కారణం ఇటీవల రిహానాకు సంబంధించినటువంటి కొన్ని నగ్నమైన పిక్చర్స్‌ను ట్విట్టర్ ద్వారా ఎవరో పోస్ట్ చేయడమే. ఈ నగ్నమైన పిక్చర్స్ చూసినటువంటి ఆమె వీరాభిమాని ఒకరు ట్విట్టర్ లో డైరెక్టుగా రిహానాకు రీట్వీట్ చేయడం జరిగింది. ఈ రీట్వీట్ లో ఆఅభిమాని ఏమిటిది ఈఫోటోలో ఉన్నది మీరేనా అంటూ అడిగాడు. దీనికి గాను రిహానా అతని క్వచ్చన్‌కి సమాధానమిస్తూ ఆఫోటోలు నావేనని, వాటిని నేను చాలా సన్నగా ఉన్నప్పుడు అదికాక అప్పుడు నావయసు కూడా చాలా తక్కువ అంటూ సమాధానమిచ్చారు. ఇక ఆఫోటోల విషయానికి వస్తే రిహానా మాజీ బాయ్ ప్రెండ్ స్పోర్ట్ స్టార్ అయినటువంటి క్రిస్ బ్రౌన్ వాటిని గాసిప్ వెబ్ సైట్స్‌కు అందజేశాడని సమాచారం. గతంలో రిహానా, క్రిస్ బ్రౌన్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకోని తిరిగిన విషయం తెలిసిందే. రిహానా నగ్నంగా ఉన్నటువంటి ఈపోటోని మీడియా టెక్ అవుట్.కామ్ అనే వెబ్ సైట్‌లో ఉంచడం జరిగింది.

గణేష్ బాబు యవ్వారంలో పవన్ కళ్యాణ్ ఇరుకున్నాడ???


తన సోదరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అర్భాజ్ ఖాన్ హిందీలో ‘దబాంగ్’ చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తూ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడు. కానీ ఇటీవల బాలీవుడ్ మీడియాతో ‘దబాంగ్’ రీమేక్ హక్కులు ఎవ్వరికీ అమ్మలేదని అర్భాజ్ ఖాన్ ప్రకటించాడు. అలా ఎవరైన దబాంగ్ రీమేక్ అంటూ సినిమా తీస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపధ్యంలో హక్కులు సొంతమవ్వకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎలా ప్రకటించాడు అని టాలీవుడ్ లో చర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి కామెడీ నటుడు, నిర్మాత గణేష్ బాబు ఈ హక్కలు కొని అనంతరం పవన్ కి ఇచ్చినట్టు వార్తలు ఉన్నాయి. కాబట్టి గణేష్ బాబు ఏదైనా యవ్వారం చేసి ఉంటాడని పలువురు భావిస్తున్నారు.
Powered by web analytics software.