Free SMS And Earn Part Time Money







2/3/11

జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు


జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.రేపు(శుక్రవారం) విడుదల కానున్న జై బోలో తెలంగాణ చిత్రం లో జగపతిబాబు నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం వెంకటరమణ, కృష్ణా జిల్లా జేఏసీ అధ్యక్షుడు తాడికొండ సాయికృష్ణలు మీడియాతో మాట్లాడారు. జైబోలో తెలంగాణ చిత్రంలో హీరోగా నటించిన జగపతిబాబు నోటి వెంట సీమాంధ్రులను కించపరిచే విధంగా సంభాషణ ఉంటేకార్యక్రమంలో జగపతి బాబుకి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తామని హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు మణీంద్ర, భాగ్యరాజు, అశోక్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలను, సీమాంధ్ర ఉద్యమాన్ని కించపరిచే విధంగా వివాదాస్పదంగా జైబోలో తెలంగాణ చిత్రం ఉంటే అడ్డుకుంటామని అన్నారు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు.
Powered by web analytics software.