Free SMS And Earn Part Time Money







2/10/11

ఐష్వర్య ముందు త్రిష దీపిక సరిపోరు: రజినీకాంత్


రోబో’ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ సరిపోలేదేమో, ఇంకోసారి ఐశ్వర్య తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేందుకు తెగ సంబరపడిపోతున్నాడట హీరో రజనీకాంత్. ఈ విషయాన్ని రజనీకాంతే స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తెతో కలిసి పనిచేయాలనేది ఎవరికైనా గొప్ప విషయమే. అందుకు నేనూ అతీతమేమీ కాదు..’అంటూ ఐశ్వర్య రాయ్ ని రజనీ ఆకాశానికెత్తేశాడు. తన తదుపరి చిత్రం కోసం దీపికా పదుకొనే, త్రిష, అసిన్ ల పేర్లను పరిశీలిస్తోన్న రజనీకాంత్, పనిలో పనిగా ఓ చిన్న పాత్రలో అయినా ఐష్ తో నటింపజేయాలనుకుంటున్నాడు. ‘రోబో’ ని మించేలా తన తదుపరి చిత్రం వుండబోతోందనీ, దర్శకుడు కెఎస్ రవికుమార్ చెప్పిన కథ అత్యద్భుతమనీ రజనీకాంత్ చెబుతున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, త్రిష, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించడం దాదాపు ఖాయమే.

మెగా ఫ్యామిలీ ఫ్లాప్ లు అంచనా వేసుకుంటున్న ఓవర్ సీస్ దారులు


సినిమా సర్కూట్ లో మెగా కుటుంబం గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కొనిదల కోటలో విభేదాలు వచ్చాయని చిత్ర పరిశ్రమలో పుకారు. ఈ నేపథ్యంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకప్రక్క, చిరు, అల్లు అరవింద్ మరో ప్రక్క ఉండటాన్ని టాలీవుడ్ గమనిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ‘ఓవర్ సీన్’ హక్కులపై వచ్చే రెమ్యునరేషన్ విషయంలో రామ్ చరణ్ తో పోల్చుకొని, అవమానంగా ఫీలవుతున్నారని ‘ఫిలింనగర్’లో టాక్. ఇంతకీ కథ ఏమిటి..?‘రామ్ చరణ్’ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ను ఓవర్ సీస్ హక్కులు 2.8కోట్లకు పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘తీన్ మార్’ రీమేక్ కు రూ 1.8కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఈ ఆఫర్ ను చాలా అవమానంగా భావిస్తున్నాడట. ‘రామ్ చరణ్’కంటే నా సినిమాకు తక్కువగా ఇవ్వటం ఏమిటని, తన సన్నిహిలతుల వద్ద అంటున్నారని తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయాన్ని ఓవర్ సీస్ హక్కుదారులు త్రోసి పుచ్చారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వటం వలన, ఇంతకంటే మేము కొనలేమని ఓవర్ సీస్ హక్కుదారులు తేల్చిచెప్పారు. ఈ మధ్యనే ‘పులి’ దారుణంగా దెబ్బతినటం వలన ‘పవన్ కళ్యాణ్’ సినిమాపై ఇంతకంటే రిష్క్ తీసుకోదలచలేదని, ఓవర్ సీస్ హక్కుదారులు చెబుతున్నారు. ‘ఆరెంజ్’ ప్లాప్ అయినా, యూఏఏలో దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసిందని ప్రస్తుతం రామ్ చరణ్ కు ఆ డిమాండ్ లో ఉన్నాడని అంటున్నారు.

శ్రియా కొత్త గా వచ్చినప్ప్పుడు సినిమా హిరోయిన్స్ ఏమనుకోవాలి


దక్షిణాది సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రేయా చరణ్ డిమాండ్ తగ్గిపోయింది. ఒక దశలో సినిమాకు 70 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేసిన ఈ భామ ప్రస్తుతం చేతులు ముడుచుకుని ఇంట్లో ఖాళీగా కూచుంటోందట. తిరిగే కాలు.. అరిచే నోరు ఉరుకోదన్నట్లు నటించడం అలవాటైతే అది మానుకుని ఎంతకాలం ఇంట్లో కూచుగోలరు. అందుకనే తన పారితోషికాన్ని 50 లక్షలకు తగ్గించినట్లు ఆయా నిర్మాతలకు సందేశాలను పంపిందట. అయినా సదరు నిర్మాతల నుంచి ఉలుకూపలుకూ లేదట. దీంతో నిరాశ చెందిన శ్రేయ తక్కువ పారితోషికాలు తీసుకుంటూ కొత్తగా కోలీవుడ్‌లోకి ఎంటరైన తారలను తిట్టిపోస్తోందట. వారి వల్లే తనలాంటి టాప్ హీరోయిన్లకు ఛాన్సులు తగ్గాయని అంటోందట. నటన అంటే వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారనీ, ఎంత కష్టమో తెలీడం లేదని మండిపడుతోందట. అయితే నేటి హీరోయిన్లు నటించడం కంటే అందాలను ప్రదర్శిస్తే సరిపోతుంది. కనుక నటించలేకపోయినా అందాలను ప్రదర్శిస్తే చాలు అనే సూత్రంపై ఆధారపడి ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు. ఈ విషయం శ్రేయకు తెలుసో తెలియదో మరి.

విక్రం పక్కన చాన్స్ కొట్టేసిన చిన్నది


టాలీవుడ్ హాట్ బేబీ దీక్షాసేథ్ మెల్లగా కోలీవుడ్‌లోనూ కాలు పెట్టింది. ఏకంగా విక్రమ్ సరసన ఛాన్స్ కొట్టేశానని సంబరంగా చెపుతోంది. అయితే విక్రమ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మొదట అమలాపాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట. ఇంతలో ఏమైందో తెలియదు గానీ, హఠాత్తుగా చిత్ర దర్శకుడు దీక్షాసేథ్‌ని పిలిపించి ఫోటోసెషన్స్ పెట్టించాడట. ఆ ఫోటోల్లో దీక్షా అందాలు అదిరిపోవడంతో ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకుండా విక్రమ్ సరసన నటించే ఛాన్స్ ఇస్తున్నట్లు దీక్షకు చెప్పాడట. ఈ సంగతి తెలుసుకున్న హీరోయిన్ అమలాపాల్ నేరుగా వెళ్లి విక్రమ్ చెవిలో గుసగుసలాడిందట. దీంతో విక్రమ్ రంగంలోకి దిగినట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి విక్రమ్ సరసన తనకు ఛాన్సుచ్చిందోచ్ అంటూ ఎగిరెగిరి పడుతున్న దీక్షాసేథ్ ఆనందం అలాగే ఉంటుందో... లేదో చూడాలి.
Powered by web analytics software.