Free SMS And Earn Part Time Money







1/3/11

ఆమె స్థానంలో ప్రస్తుతం త్రిష ఎంపిక చేసారు.ఈ మ్యాటర్ పై కరణానిధి సీరియస్


త్రిషకు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి వార్నింగ్ వచ్చినట్లుగా చెన్నై పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కరుణానిధి మనవడు ఉదయగిరి స్టాలిన్ వరసగా త్రిషను పెట్టి సినిమాలు తీస్తూ కోట్లు నష్టపరుస్తున్నాడని, అంతేగాక త్రిష మోజులో పడి మిగతా వ్యాపాలను, కుటుంబాన్ని పట్టించుకోవటంలేదని మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తాత దగ్గర బాగా గారం కల ఉదయగిరి స్టాలిన్ ఆయన మాట ఒక్కరికే విలువ ఇచ్చి మాట వింటారు. అందులోనూ తాజాగా ఉదయగిరి స్టాలిన్..కమల్ హాసన్, త్రిష కాంబినేషన్ లో మన్మధ బాణం చిత్రం నిర్మించారు. అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఇక ఇప్పుడు అతనే స్వయంగా హీరోగా త్రిష హీరోయిన్ గా చిత్రం చేయటానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ చిత్రానికి శివ మనసుల శక్తి, బాస్ ఎన్గిర భాస్కరన్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజేష్ ఎం.దర్శకత్వం వహించనున్నారు. నన్బేండా అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత శృతిహాసన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె స్థానంలో ప్రస్తుతం త్రిష ఎంపిక చేసారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే కరణానిధి మాత్రం ఈ మ్యాటర్ పై సీరియస్ గా ఉన్నారు.

మగాళ్లంతా తన ఎద సౌందర్యాన్ని గురించి మాట్లాడుకోవడం తను చాలా సంతోషిస్తోందట


బాలీవుడ్ సెక్సీ సైరన్ మల్లికా శరావత్ బోల్డ్‌గా మాట్లాడటం మామూలే. తాజాగా మరో వ్యాఖ్య చేసి వార్తలకెక్కింది. మగాళ్లంతా తన ఎద సౌందర్యాన్ని గురించి మాట్లాడుకోవడం తను చాలా సందర్భాల్లో గమనించానని చెపుతోంది. వారలా మాట్లాడుకోవడంపై తను ఏమీ అనుకోననీ, అందంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని ఆ మగాళ్లను వెనకేసుకొస్తోంది. హిస్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లాపడటంతో విచారంగా ఉన్న సెక్సిణి మల్లికను తాజాగా మరో బిగ్ ఆఫర్ వరించిందిట. ఆ చిత్రంలో అందాలను బాగా ప్రదర్శించగలిగే పాత్ర దొరికిందట. అందువల్లనో ఏమో గానీ ఇప్పటి నుంచే మగాళ్లు - తన ఎద సౌందర్యపు అందాలు...అంశంపై బాకా ఊదటం మొదలెట్టింది.

రాజమౌళి,జూనియర్ యన్.టి.ఆర్ యాడ్ లలో పడ్డారు


రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ త్వరలో నటించనున్నారు. అయితే సినిమాకు మాత్రం కాదు. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ అది. నవరత్న టాల్కమ్ పౌడర్ యాడ్ ఫిలిమ్ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన ఎన్టీఆర్ దర్శకుడుగా రాజమౌళిని సూచించారు. ఎన్టీఆర్ కు ఇది రెండో యాడ్ ఫిలిం. మొదటిది జండూభామ్. ఇక రాజమౌళికి ఇది మొదటి కమర్షియల్ యాడ్ ఫిలిం. డైరక్టర్ కాకముందు ఆర్కే బ్యానర్ లో ఎలక్ట్రానిక్ మీడియాకు యాడ్స్ చేసారు. గతంలో సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ వంటి సూపర్ హిట్స్ అందించిన ఈ కాంబినేషన్ ఈ యాడ్ ఫిలింతో ఏ రేంజి ప్రొడెక్ట్ ని ఇవ్వనున్నారో అని అంతా ఎదురుచూడటం మాత్రం ఖాయం.

రాత్రి చాలా సేపు వరకూ ఈ పార్టీ:ఆడవాళ్ళు పిల్లలూ వెళ్ళిపోయినా మహేష్ సన్నిహితులు కొందరు


మహేష్ బాబుతో శ్రీను వైట్ల రూపొందిస్తున్న దూకుడు చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరో ప్రక్క ఈ చిత్రం చాలా సంతృప్తికరంగా వస్తూండటంతో ఆ ఆనందాన్ని పంచుకోవటానికి న్యూ ఇయిర్ పార్టీని మహేష్ తన ఇంటిలో ఏర్పాటు చేసి శ్రీనుని పిలిచారు. శ్రీనువైట్ల తన ఫ్యామిలీతో ఈ పార్టీకి హాజరయ్యారు. ఆడవాళ్ళు పిల్లలూ వెళ్ళిపోయినా రాత్రి చాలా సేపు వరకూ ఈ పార్టీ సాగిందని, మహేష్ సన్నిహితులు కొందరు ఈ పార్టీలో పాల్గొన్నారని చెప్తున్నారు.

ఇక దూకుడు చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. అతని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం జూ ఎన్టీఆర్ తో చేయటానికి సైన్ చేసారని తెలస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిసి ఓ లైన్ వినిపించారని, ఎన్టీఆర్ మారు మాట లేకుండా ఓకే చేసాడని, ఈ ప్రాజెక్ట్ చేయటానికి పెద్ద నిర్మాతలు ముందుకొచ్చినా నిర్మాత గణేష్ బాబుకే చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

రక్త చరిత్ర-3 మళ్ళి మొదలు


రక్తచరిత్ర అంటూ పరిటాల రవి - మద్దెలెచెర్వు సూరి జీవితాలను ఆధారంగా చేసుకుని వర్మ ఇటీవల రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాలు విడుదలైన సందర్భంలో అటు రవి, ఇటు సూరి వర్గీయులు వర్మపై కారాలు మిరియాలు నూరారు. వాటన్నిటినీ లెక్కచేయని రాము ఆ సినిమాలను పోలీసుల నడుమ విడుదల చేయాల్సి వచ్చింది.

అదలా ఉంచితే సోమవారం తన అనుచరుడు చేతిలో సూరి దారుణ హత్యకు గురవడం తనను కలచి వేసిందని సన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారం వ్యక్తం చేశారు. రక్తచరిత్ర చిత్రీకరణకు ముందు ఆయన అనుభవాలను తెలుసుకునేందుకు సూరితో ఏడాదిపాటు పలుమార్లు ఆయనను కలిశానని చెప్పుకున్నారు.

విగతజీవిగా సూరి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని వర్మ తన ట్విట్టర్ పేజీలో రాసుకున్నారు. అందరూ చెప్పుకుంటున్నట్లుగా సూరి మరణంతో తిరిగి రక్తచరిత్ర 3కి వర్మ పూనుకుంటారేమో... లెట్ అజ్ సీ..

అనుష్కని హీరోయిన్ గా పరిచయం చేసి కెరీర్ ఇచ్చిన నాగచైతన్య


యోగా టీచర్ గా ఉన్న అనుష్కని హీరోయిన్ గా పరిచయం చేసి కెరీర్ ఇచ్చిన నాగచైతన్య ఇప్పటికీ ఆ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తన తండ్రి నాగార్జున సినిమాల్లో వరసగా నటిస్తూ ఉన్నా నాగచైతన్య మాత్రం ఆమెతో రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని నాగచైతన్య తన స్నేహితులతో జరుపుకుంటూ మీడియా కళ్ళపడ్డారు. అతనితో పాటు అనుష్క కూడా ఉంది. ఇద్దరూ మిగతా స్నేహితులకు దూరంగా కబుర్లూ చెప్పుకుంటూ ఆ తర్వాత కాస్సేపు మాయమయ్యారు. ఇక నాగార్జున క్యాంప్ మొత్తం ఈ పార్టీలో ఉన్నా...నాగార్జున మాత్రం మిస్సయ్యాడు. మరీ కొడుకుతో కలిసి పార్టీకి రావటం ఎందుకని దూరంగా ఉన్నాడని అక్కడ గుసగుసలు వినిపించాయి.

. ఓ నిర్మాత పవన్‌కళ్యాణ్‌ వద్దకు వెళ్ళి తాను 7కోట్లు ఇస్తానని డేట్స్‌ కావాలని అడిగాడట. దీంతో పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌ అయి


అసలే ఇండస్ట్రీ బంద్‌లో ఉంది. ఎప్పుడు షూటింగ్‌లు జరుగుతాయో తెలియని పరిస్థితి. హీరోల రెమ్యునరేషన్‌ తగ్గించుకునేలా నిర్మాతలు వారికి ఎలా చెప్పాలని కిందామీద పడుతున్నారు. హీరోలకు ఎడాపెడా రెమ్యునరేషన్‌ పెంచేసింది నిర్మాతలే అనేది నగ్నసత్యం.

ఇటువంటి స్థితిలో హీరోలు కూడా ఓ మెట్టు దిగి వచ్చే స్థితిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరికొంతమంది హీరోలు డిమాండ్‌ సప్లయి మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇటీవలే ఓ ఉదంతం జరిగింది. ఓ నిర్మాత పవన్‌కళ్యాణ్‌ వద్దకు వెళ్ళి తాను 7కోట్లు ఇస్తానని డేట్స్‌ కావాలని అడిగాడట. దీంతో పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌ అయి... ఇంత బంద్‌ జరుగుతున్నా నా దగ్గరకువచ్చి మీరిలా అడగడం భావ్యంకాదని కాస్త సున్నితంగా మందలించారట. దీంతో మరొకరితో ఫోన్‌చేయించినా ఫలితం లేకపోయింది.

వెంటనే నిర్మాతలమండలికి పవన్‌కళ్యాణ్‌ ఫోన్‌లోనే సంప్రదించి... ముందు మీరంతా కలిసికట్టుగా ఉండండి అంటూ సూచిస్తూ.... బడ్జెట్‌ కంట్రోల్‌ విషయంలో హీరోలపై నిందలు వస్తున్నాయి. అవన్నీ మీరు యూనిట్‌గా ఉండి ముందు పరిష్కరించుకోండి. ఆ తర్వాత మీరు ఏర్పాటుచేసే సమావేశానికి హాజరవుతాం. అప్పుడు మీడియా ముందు మా నిర్ణయం చెబుతామని వెల్లడించాడు.

దీంతో ఖంగుతిన్న నిర్మాతమండలి... పవన్‌కళ్యాణ్‌ చెప్పినదాంట్లో ఏమాత్రం తప్పులేదని గ్రహించాయి. దీనికి కారణమైన ఆ నిర్మాత ఎవరో కనుక్కుని ఆయన సభ్యత్వం పరిశీలించాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. సందడ్లో సడేమియా.. అంటే ఇదేమరి...

తెల్లపిల్ల తాప్సీ గురించి విష్ణును అభిప్రాయం అడిగితే అవాక్కయ్యే సమాధానం ఇచ్చేశాడు


తెల్లపిల్ల తాప్సీ గురించి మోహన్ బాబు తనయుడు మంచు విష్ణును అభిప్రాయం అడిగితే అవాక్కయ్యే సమాధానం ఇచ్చేశాడు. తాప్సీ తన సొంత చెల్లెలు లాంటిదని చెప్పాడు.

విష్ణు చెప్పిన మాటలు విని అక్కడివారంతా ముక్కున వేలేసుకున్నారట. వస్తాడు నా రాజు చిత్రంలో తాప్సీతో వేడి వేడి సన్నివేశాల్లో నటించడమే కాక వేడి ముద్దులు కురిపించిన మంచు విష్ణు, తాప్సీని తన చెల్లెలితో పోల్చడం ఏమిటని వింతగా చూశారట.

కానీ వారి మాటలేమీ పట్టించుకోని విష్ణు... తాప్సీ తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందనీ, తన మటుకు తాను ఆమెను చెల్లెల్లా ట్రీట్ చేస్తానని చెప్పేశాడు. మరి తమ్ముడు మంచు మనోజ్ ఎటువంటి బంధం ఉందని చెపుతాడో...?
Powered by web analytics software.