Free SMS And Earn Part Time Money







12/20/10

Q::ముమైత్ ఖాన్ ని ఓ జర్నలిస్టు మీ పెళ్లెప్పుడు Ans:నిన్నే చేసుకుంటాను..ఒప్పుకుంటావా అంది


ముమైత్ ఖాన్ ని రీసెంట్ గా సౌత్ కి చెందిన ఓ జర్నలిస్టు మీ పెళ్లెప్పుడు అని అడిగాడు. చేసకునేటప్పుడు మీకు చెప్పే చేసుకుంటాను అని సమాధానమిచ్చింది. ఇంతకీ ఎవరిని చేసుకోబోతున్నారు అని వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఆ జర్నలిస్టు అడిగాడు. దానికామె వెంటనే...నిన్నే చేసుకుంటాను..ఒప్పుకుంటావా అంది. దానికతను ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడామె నువ్వు పెళ్ళికి రెడీ గా లేవా...ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నావ్ అంది. దాంతో ఏమీ చెప్పలేని ఆ జర్నలిస్టు ఓ జివం లేని నవ్వు నవ్వి అక్కడనుంచి తప్పుకున్నాడు. ఇక ముమైత్ ఖాన్ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాజా చిత్రం నేనూ నా రాక్షసిలో కీలక పాత్రను నటిస్తోంది. రాణా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

చిరంజీవి గారు ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్ అదృష్ఠం:Ramgopal varma


ఆ మధ్యన చిరంజీవి సినిమాని డైరక్ట్ చేయాలని ఉందని,దాని పేరు దొర..ది లార్డ్ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఆ తర్వాత చిరంజీవి చాలా స్లిమ్ గా తయారయ్యారని, పవన్, రామ్ చరణ్ ల కన్నా చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేసారు. అనంతరం చిరంజీవి తన 150 చిత్రాన్ని తానే డైరక్ట్ చేసుకుంటే చూడాలని ఉందని అన్నారు. ఇంకెవరూ డైరక్ట్ చేసినా అంతబాగా ఉండరని కామెంట్ చేసారు. వీటితో పాటు రామ్ చరణ్ ఆరెంజ్ పైన కూడా ఆయన కొన్ని ట్వీట్స్ చేసి అందరిలో ఆసక్తి క్రియోట్ చేసారు. తాజాగా మరోసారి చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేసిన దాంట్లో...చిరంజీవి గారు ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్ అదృష్ఠం అండ్ ఆంద్రప్రదేశ్ ఈజ్ చిరంజీవిగారూస్ అదృష్టం అన్నారు. ఆయన అలా ఎందుకన్నారనేదాని పెద్ద రీజన్ ఉండకపోవచ్చు కానీ చిరంజీవి మరో సారి కామెంట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అన్నట్లు అర్దమవుతుంది.


Chiranjeevigaaru is andhrapradeshs adhrushtam and andhra pradesh is chiranjeevigaarus adhrushtam

పంక్షన్ ఎరేంజ్ మెంట్స్ లో ఇరువైపుల కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు:Allu Arjun


అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల నిశ్చితార్దం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం మార్చి ఆరున జరపటానికి పెద్దలు ఫిక్స్ చేసారని అల్లు అర్జున్ ని కలిసిన మీడియాకు చెప్పారు. అలాగే ఈ పంక్షన్ ఎరేంజ్ మెంట్స్ లో ఇరువైపుల కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారన్నారు. అలాగే పెళ్ళి సూటు కోసం డిల్లీనుంచి ప్రత్యేకంగా డిజైనర్ వస్తున్నారని అన్నారు. ఇక తనది ప్రేమ వివాహం అని మీడియాలో వచ్చిందని, అయితే అది నిజం కాదని, ఓ పార్టీలో తాము ఇద్దరం పరిచయం అయ్యామని, ఆ తర్వాత తమ అభిరుచులు కలవటంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పటం వారు నిశ్చితార్దం ఏర్పాటు చేయటం జరిగిందని అని చెప్పుకొచ్చారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.

సర్దార్ పాపరాయుడు,బొబ్బిలిపులి రేంజ్ లొ యాక్ట్ చేశాడని చెప్పుకొచ్చారు. :నిజమా........?


దాసరి నారయణ రావు మొట్ట మొదటి సారిగా బాలకృష్ణ తో తీస్తున్న పరమవీర చక్ర అది కాక దాసరి 150వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావొస్తోంది

నటి నటులు:బాలకృష్ణ,నేహదూపియ ,షీలా ,అమీషా పటేల్ హీరోయిన్స్
సి.కల్యాణ్ ప్రోడ్యుసర్

ఈ చిత్రం గురించి దాసరి మాట్లాడుతు :ఈ సినిమా అంతా బాలకృష్ణ ఒక యోధుడిలా మాత్రమే కాక రేగ్యులర్ పర్సన్ గాకూడ కామేడి పండించాడు అంతే కాక తన తండ్రి తీసిపోకుండా సర్దార్ పాపరాయుడు,బొబ్బిలిపులి రేంజ్ లొ యాక్ట్ చేశాడని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా అన్ని సిద్దం చేసుకొని కొత్తసంవత్సరంలో రీలీజ్ చేయటానికి సిద్దమవుతోంది 2011లో బాలయ్య అభిమానులకు మరో "సిం హ"-సమర"సిం హ"రెడ్డి-నర"సిం హ"నాయుడు-సీమ"సిం హం" వంటి రేంజ్ లో ఈ చిత్రం ఉండబోతోందని సినీవర్గాల అభిప్రాయం

ఈ సినిమాకీ సంగీతం మణి శర్మ అందించారు

కాజల్ త్వరలో ఎన్టీఆర్ హీరోగా ప్రారంభం కానున్న మరో కొత్త చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యింది


బృందావనం చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన కాజల్ త్వరలో ఎన్టీఆర్ హీరోగా ప్రారంభం కానున్న మరో కొత్త చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కె.ఎస్.రామారావు నిర్మించనున్న చిత్రంలో ఆమెను తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఆమె 'డార్లింగ్' తర్వాత ప్రభాస్ తో 'మిస్టర్ పర్ఫెక్ట్' లోనూ, 'మగధీర' తర్వాత చరణ్ తో 'మెరుపు' చిత్రంలోనూ వరుసగా ఒకే హీరోలతో బుక్కయింది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం శక్తి చిత్రం షూటింగ్ పూర్తి చేసారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రచ్చ చిత్రం ఓకే చేసారు. జనవరి 8 నుండి ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూ షేడ్యూల్ జరగనుంది. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది.

cinimavinodam.blogspot.com:gossips

నటీనటుల ఇష్టాల కన్నా దర్శకులు అభిరుచి వలన కొత్త పాత్రల సృష్టి జరుగుతోందని అంటోంది


బాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోయిన్ లాగే సమీరా చోటు సంపాదించుకోవుటకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సర్కిల్ లో చాలా కృషి చేస్తోన్నట్టు తెలుస్తోంది. అందులోనూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటించుటకు మరింత ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో ఒక రోజు ఇప్పటి వరకు చూపించిన నా అందాల ప్రదర్శన కంటే రెట్టింపుగా ఇంకా హాట్ హాట్ గా వెండి తెర మీద నా అందాలతో ప్రేక్షకుల్లో వేడిని రగిలిస్తానంటోంది బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సమీరా రెడ్డి. ఇప్పటి వరకు నేను చాలా రకాల పాత్రలు చేశాను. ఇక మీదట ఇంకాస్త భిన్నమైన పాత్రల్లో నటించాలనుందని తన మనసులోని భావాల్ని చెప్పుకోచ్చింది ముద్దుగుమ్మ.

‘ఆక్రోష్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ అమ్మడు నటీనటుల ఇష్టాల కన్నా దర్శకులు అభిరుచి వలన కొత్త పాత్రల సృష్టి జరుగుతోందని అంటోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండే సినిమాల్లో మాత్రమే నటిస్తాను. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాలు అలాంటి వేనని చెపుతోంది బాలీవుడ్ భామ. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా హాటైన అందాలతో ప్రేక్షకుల మతిని పోగడతానుంటుంది సమీరా. మరి సమీరా ఏ రేంజ్ లో తన హాట్ హాట్ అందాలను ఆరబోయనుందో చూడాల్సిందే.

గూగుల్‌ సెర్చ్‌లో వెతికిన ఫొటోలలో ద్వితీయ స్దానం శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షిసిన్హా హాటెస్ట్‌ ఫొటోల కోసం


శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షిసిన్హా తన తొలిచిత్రం దబంగ్‌ తో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈ 2010 సంవత్సరం ఎక్కువ మంది నెటిజెన్స్‌ గూగుల్‌ సెర్చ్‌లో వెతికిన ఫొటోలలో ద్వితీయ స్దానం దక్కింది. మార్ఫింగ్‌ చేసిన ఆమె బికినీ ఫొటోల కోసం నెటిజెన్స్‌ సెర్చ్‌చేయడంతోనే సోనాక్షికి ఈ స్థానం దక్కిందని గూగుల్ నిర్వాహకులు ప్రకటించారు. ఇక హాలీవుడ్‌ చిత్రాలలో నటించిన భారతసంతతికి చెందిన అరుణషీల్డ్‌‌సకి ప్రధమ స్దానం లభించింది. మిస్టర్‌ సింగ్‌-మిసెస్‌ మెహతా చిత్రంలో ఆమె నగ్న దృశ్యాల ఫొటోల కోసం, కైట్స్ చిత్రంలో ఆమె అందాల ఆరబోత ఫొటోల కోసం నెటిజన్లు విపరీతంగా సెర్చ్‌ చేశారని తెల్చింది. అలాగే వీరిద్దరి హాటెస్ట్‌ ఫొటోల కోసం ఎక్కువమంది నెటిజెన్స్‌ సెర్చ్‌చేశారని గూగుల్‌ నిర్వాహకులు ప్రకటించారు.

హీరోయిన్‌కి విలన్‌ వాంటెడ్‌. విలన్‌కి హీరో వాంటెడ్ 'లవ్‌, ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్:gopi chand......!!!


యాక్షన్‌ చిత్రాలు గోపీచంద్‌కు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి. ఆయన తాజాగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాంటెడ్‌'. దీక్షాసేథ్‌ నాయిక. రచయిత బి.వి.ఎస్‌.రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరులోను, జనవరిలో సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత వి.ఆనందప్రసాద్‌ తెలియజేస్తూ, 'శౌర్యం తర్వాత గోపీచంద్‌తో మా సంస్థ తీస్తున్న చిత్రమిది. అతని నుంచి ఎలాంటి యాక్షన్‌ను ప్రేక్షకులు ఆశిస్తారో ఆవిధంగా ఉంటూ కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులో హీరోకి హీరోయిన్‌ వాంటెడ్‌. హీరోయిన్‌కి విలన్‌ వాంటెడ్‌. విలన్‌కి హీరో వాంటెడ్‌. ఇదే ఈ చిత్ర ప్రధాన కథాంశం' అని అన్నారు.

దర్శకుడు బి.వి.ఎస్‌.రవి మాట్లాడుతూ, 'లవ్‌, ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ తరహా చిత్రాల్లో నటించడం గోపీచంద్‌కు కొట్టినపిండి. యువతరం ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఆయన పాత్ర చిత్రణను కొత్తగా చూపించాం. కథానాయకుడి తల్లిదండ్రులుగా జయసుధ, చంద్రమోహన్‌ నటించారు. రసూల్‌ ఎల్లోర్‌ ఛాయాగ్రహణం ప్రేక్షకులను కనువిందు చేస్తుంది' అని చెప్పారు.

http://cinimavinodamenglish.blogspot.com

ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, బెనర్జీ, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ఆహుతిప్రసాద్‌, షఫీ, సుబ్బరాజు, అంజాద్‌ఖాన్‌, దువ్వాసి, రావి కొండలరావు, రాధాకుమారి, ప్రభాస్‌ శ్రీను,

పృథ్వీ తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటింగ్‌: శంకర్‌, ఆర్ట్‌: వివేక్‌, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, విజయ్‌, రామ్‌, లక్ష్మణ్‌, గణేష్‌, డాన్స్‌: శంకర్‌, రాజు సుందరం, శోభి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నేరవి, నిర్మాత: వి.ఆనందప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.ఎస్‌.రవి

తల్లిగా టబు అందని ద్రాక్ష పుల్లన.. వచ్చిన ఛాన్సే తియ్యన.


హైదరాబాదు నుంచి ముంబైకి మకాం మార్చిన ప్రౌఢసుందరి టబు మొన్నటివరకూ హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని పోజులు కొట్టింది. చివరికి ఆమె కోరిన పాత్రలు రాకపోయేసరికి అమ్మ పాత్రలనైనా చేస్తానంటోందట. టబు తన మనసులో మాటను అలా బయట పెట్టిందో లేదో ఆంగ్ లీ అనే దర్శకుడు ఆమె ఇంటి ముందు వాలిపోయాడు.

"లైఫ్ ఆఫ్ పై" అనే చిత్రంలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్‌కు తల్లిగా టబు నటిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే... అంతకు ముందు ఓ సినిమాలో ఇర్ఫాన్‌కు టబు జోడీగా నటించింది. ఇపుడు అతడికి తల్లిగా నటించడానికి ఒప్పుకుంది.

మరి బాలీవుడ్ ప్రేక్షకులు వీళ్లద్దరిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. టబు మాత్రం తనకు అమ్మలా నటించడం భలేగా ఉందని చెపుతోంది. అవును.. అందని ద్రాక్ష పుల్లన.. వచ్చిన ఛాన్సే తియ్యన.

అశ్వినిదత్ కూమార్తె వివాహం డిసెంబర్ 19న hitech cityహైదరబాద్ లో జరిగింది DeTaIlS


భారీ చిత్రాలు తీయగల నిర్మాతలలో ఒక్కడైన అశ్వినిదత్ కూమార్తె వివాహం ప్రసాద్ వర్మ తో డిసెంబర్ 19న అంగ రంగ వైభవంగ hitech cityహైదరబాద్ లో జరిగింది ఇందుకు అశ్వినిదత్ కూమార్తెని ఆశీర్వదించటానికి Akkineni Nageswara Rao, D. Rama Naidu, Raghavendra Rao, Dasari Narayana Rao, Ramoji Rao, Krishna, Krishnamraju, Chiranjeevi, Nagarjuna, Amala, Allu Aravind, S.S. Rajamouli, Murali Mohan, Jayapradha, Srihari, Jr. NTR, Allu Arjun, Brahmanandam, Nagababu, Dil Raju, Varun Sandesh, Meher Ramesh, V.N. Aditya, Sekhar Kammula, Krish, Bellamkonda Suresh, K.L. Narayana, Bellamkonda Suresh, Prabhuమరికొందరు హాజరయ్యారు
స్వప్న దత్ లోకల్ టి.వి మెనేజింగ్ డైరక్టర్ అది కాక ఏంజల్స్ స్టుడియొ కూడ చూసుకుంటోంది ఈ సంస్థ ద్వార banamand om shantiవిడుదలయ్యాయి.....!!!

నా తొలి చిత్రం లీడర్ లో డాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లభించలేదు






'లీడర్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ నటించిన తాజా చిత్రం 'నాగవల్లి'. 'చంద్రముఖి' లో జ్యోతిక చేసిన పాత్రను ఈ చిత్రంలో రిచా చేశారు. తను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈ పాత్ర చేయడం సులువైందట. ఆ విషయం గురించి రిచా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నా తొలి చిత్రం లీడర్ లో డాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లభించలేదు. ఆ కొరతను కొంతవరకు 'నాగవల్లి' తీర్చింది. డాన్స్ బేస్డ్ కేరక్టర్ కావడంతో ఈ పాత్రను ఎంతో ఇష్టంగా అంగీకరించాను.

గౌరి పాత్రలో మీరు పూర్తిగా ఒదిగిపోయారని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. రవి తేజ సరసన ఆమె నటించిన మిరపకాయ్ త్వరలో విడుదల కానుంది. రాణా హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా రిచా గంగోపాధ్యాయ కమిట్ అయ్యారు. లీడర్ తర్వాత మళ్లీ రాణా, రిచా నటించబోతున్న చిత్రం "2" ఇది.

Richa Gangopadhyay is Miss India USA '07 - Miss India Worldwide — NEW YORK: Richa Gangopadhyay, a 21-year-old Michigan student, was crowned Miss India USA 2007 at the 26th annual pageant held in New Jersey.
Richa is a final year student at the Michigan State University and majoring in Dietetics and Nutrition. She enjoys dance, music, movies and teaching children about health and nutrition. She also won the title of Miss Photogenic. She was crowned by the outgoing queen, Ayushka Singh

పుస్తక ప్రియులు ఒకరు బిగ్ బీపై ఓ ప్రశ్న అడగ్గానే వర్మ.అమితాబ్‌తో పనిచేసినపుడు నరకం అనుభవించా


రాంగోపాల్ వర్మ నోటి నుంచి ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్య వస్తుందో చెప్పలేం. ఆయన వ్యాఖ్యలు చాలా సూటిగా సుత్తి లేకుండా ఉంటాయని చాలామంది చెపుతుంటారు. ఒక్కోసారి ఈ సూటి వ్యాఖ్యలు మరింత ఘాటుగా కూడా ఉంటాయి.

ఆదివారంనాడు హైదారాబాదులో తను రాసిన "నా ఇష్టం" పుస్తక ప్రచురణకర్త ఎమ్మెస్కో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పుస్తక ప్రియులు ఒకరు బిగ్ బీపై ఓ ప్రశ్న అడగ్గానే వర్మ.... ఆయన ఓ ఛండాలమైన నటుడని వ్యాఖ్యానించారు.

అమితాబ్‌తో పనిచేసినపుడు నరకం అనుభవించానని పేర్కొన్నారు. అటువంటి నటుడ్ని తన కెరీర్‌లో ఇప్పటివరకూ చూడలేదన్నట్లు వర్మ వ్యాఖ్యానించారు.
Powered by web analytics software.