Free SMS And Earn Part Time Money







2/7/11

అందరూ దర్శకులు నాకు అపురూపం అంటోన్న ఇలియాన


సెట్లో ప్రతిరోజూ నాకు కొత్తగానే ఉంటుంది. నా కెరీర్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే సెట్లో ఉన్నప్పుడు దర్శకుల పనితీరును గమనిస్తూ ఉంటాను. ప్రతి సన్నివేశం చేసేటప్పుడు వారు నాకు నేర్పించే విషయాలను అపురూపంగా విని ఫాలో అవుతాను అంటోంది ఇలియానా. అలాగే దర్సకులు వై.వి.యస్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, త్రివిక్రమ్, విజయభాస్కర్, ఆదిత్య... ఒకరిద్దరని కాదు... నేను పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను అంటోంది. ఇక నేను ప్రతిరోజూ షూటింగ్‌కి వెళ్ళగానే ముందు అక్కడి పరిసరాలను గమనిస్తాను. దానికి తగ్గట్టు మనసును సమాయత్తపరచుకుంటాను అని వివరించింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. అలాగే పూరి దర్సకత్వంలో ఆమె చేసిన నేను నా రాక్షసి చిత్రం రిలీజుకు రెడీగా ఉంది. త్వరలో శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ రీమేక్ లో చేస్తోంది. ఆయన గురించి చెబుతూ..శంకర్ తో షూటింట్ చేయటం చాలా గ్రేట్. అంత పెద్ద దర్శకుడుతో పనిచేయటం అనేది నేను ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. అందుకే నేను సెట్స్ మీద రిలాక్స్ గా ఉన్నాను అంది.
Powered by web analytics software.