Free SMS And Earn Part Time Money







2/9/11

మహెష్ బాబు పై సమంతా అలిగింది


మూడు సంవత్సరాల విరామం తర్వాత ప్రిన్స్ మహేష్ ఖలేజా అంటూ తన అభిమానుల ముందుకు రావడం జరిగింది. కొన్నికారణాల వల్ల ఖలేజా సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లాపడిన విషయం తెలిసిందే. దాంతో ఖలేజా తర్వాత సినిమా త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలని ప్రిన్స్ మహేష్ అనుకుంటూ ఉంటే దూకుడు సినిమా టైటిల్లో ఉన్న దూకుడు షూటింగ్ విషయంలో లేదని భాద పడుతున్నాడని సమాచారం. మొదటగా దూకుడు సినిమాని ఏప్రిల్‌కి విడుదల చేయాలని భావించినా ఇప్పుడు ఆసినిమా వేసవిలో విడుదల అయ్యే చూచనలు కనిపించడం లేదంట. దాంతో ప్రిన్స్ మహేష్ ఒక్కసారిగా దూకుడు సినిమాకి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేయాలని శ్రీను వైట్లని ఆదేశించినట్లు సమాచారం. సహాజంగా సినిమాలు తీసే సమయంలో హీరోకి అన్ని వసతులు ఏర్పాటు చేసిగానీ, అవుట్ డోర్ షూటింగ్‌లు పెట్టుకోరు. కానీ ప్రిన్స్ మహేష్ దగ్గరుండి మరీ చెప్పడంతో అలాంటి పార్మాలిటీస్ అన్ని లేకుండానే దూకుడు సినిమా గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకోని రావడం జరిగింది. దీంతో సమంత కొంచెం ఇబ్బందులు పడిందని సమాచారం. ఇన్నాళ్శు షూటింగులుకి ఏఇబ్బంది లేకుండా సాఫీగా చేసుకున్న సమంతకి ఈగుజరాత్ షెడ్యూల్ కొంచెం ఇబ్బందిని కలిగించిందంట. దానికి కారణం గుజరాత్ షెడ్యూల్ లో సమంతకి అరకోక వసతులు కల్పించారంట. ఇది మాత్రమే కాకుండా కంటిన్యూస్ షెడ్యూల్ తో ఒళ్శంతా గుళ్శ చేశారని తన ట్విట్టర్ ఫాలోవర్స్‌తో చెప్పుకోని బాధపడింది.
Powered by web analytics software.