Free SMS And Earn Part Time Money







11/16/10

అరుంధతిగా ఐశ్వర్య రాయ్:దాంతో విలన్ ఎవరు నిర్మాతలకు ఎంపిక మిగిలింది


"అరుంధతి" చిత్రం త్వరలో హిందిలోకి (త్రీడీ ఫార్మెట్ లో) రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మించే ఈ చిత్రంలో పాత్రల ఎంపిక జరుగుతోంది. అరుంధతిగా ఐశ్వర్య రాయ్ దాదాపు ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. దాంతో విలన్ గా బొమ్మాళి అంటూ అరూస్తూ భయపెట్టేది ఎవరన్నది నిర్మాతలకు ఎంపిక మిగిలింది. రకరకాలుగా ఆలోచించిన తర్వాత సోనూసూద్ నే హిందికి కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమితాబ్ ని తీసుకోవాలనుకున్నారు కానీ ఆయన తాను చేయలేనని, సోనూసూదే కరెక్టు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా ధూమ్ దర్శకుడు సంజయ్ గద్వీని ఎంపిక చేసారు. ఈ చిత్రం రైట్స్ కోసం బోనీకపూర్ చివరి వరకూ పోటీపడ్డారు. ఇక ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే జెమినీ వారు ఈ చిత్రాన్ని హిందీలో బారీగా ప్లాన్ చేస్తున్నారు. త్రీడిలో అయితే మరింత Hurrer గా మారి నేషనల్ వైడ్ గా మంచి పేరు, డబ్బు తెస్తుందని ఆశించి కొన్నామని చెప్తున్నారు.
Powered by web analytics software.