Free SMS And Earn Part Time Money







1/6/11

'రంగ ది దొంగ' సినిమాలో 'మిల మిల మిల మీనాక్షి..' అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది


గ్లామర్ క్వీన్ సాక్షిశివానంద్ మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన 'మాస్టర్', 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలతో పాటు 'యువరాజు', 'సముద్రం' వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లో ఆమె నటించింది. ఈ ముద్దుగుమ్మ తిరిగి టాలీవుడ్ సినిమాల్లో నటించబోతున్నట్టు చిత్రపరిశ్రమ వర్గాల టాక్.

జేడీ చక్రవర్తి దర్శకత్వం వహించిన 'హోమం' సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ టాలీవుడ్‌లో సాక్షి ప్రత్యక్షమైంది. ఇప్పుడు 'రంగ ది దొంగ' సినిమాలో 'మిల మిల మిల మీనాక్షి..' అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది. అయితే, టాలీవుడ్ లో మాత్రం సాక్షిని పట్టించుకునే నిర్మాతలెవరూ కనపడటం లేదు.

పైగా 'ఐటెం సాంగ్‌కు అయితే సాక్షి ఓకే అయితే హీరోయిన్‌గా సాక్షిని ఎంపిక చేసే ఛాన్సు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 'సాక్షి' అభిమానులకు మాత్రం శివానంద్ రెండో ఇన్నింగ్స్ గుడ్ న్యూస్ అని మాత్రమే చెప్పుకోవచ్చు.
Powered by web analytics software.