Free SMS And Earn Part Time Money







1/19/11

భాను విత్తనం పెరిగి బాలీవుడ్ దాక పోయింది ఈ చెట్టు


మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ సంబంధాలు టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపుతున్నాయి. భాను కిరణ్‌తో నిర్మాతలు సి. కళ్యాణ్, శింగనమల రమేష్, గణేష్ సంబంధాలపై టాలీవుడ్ అట్టుడుకుతోంది. టాలీవుడ్‌లో భాను కిరణ్ వేళ్లు ఎంత వరకు చొచ్చుకుపోయి ఉన్నాయనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిర్మాతలతో కలిసి భాను కిరణ్ భూదందాలు నడిపిన వైనం కూడా బయటపడుతోంది. ఈ స్థితిలో రక్తచరిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో భాను కిరణ్ సంబంధాలపై పోలీసులు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. రక్తచరిత్ర సినిమాకు కోట్ల రూపాయలు వర్మకు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. వర్మ ఖాతాలో పడిన డబ్బులు సూరి భాను కిరణ్ ద్వారా వేశాడా, భాను స్వయంగా వేశాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రక్త చరిత్ర సినిమాకు ముందు నుంచే భాను కిరణ్‌ తో వర్మకు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. వర్మ ద్వారా భాను కిరణ్ బాలీవుడ్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు ఓ టీవీ చానెల్‌లో వార్త వచ్చింది. వర్మను పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
Powered by web analytics software.