Free SMS And Earn Part Time Money







7/15/09

బిల్లా తరువాత ప్రభాస్




ప్రభాస్‌, పూరి జగన్నాథ్‌ల కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఏక్‌నిరంజన్‌'. ఆదిత్యారామ్‌ మూవీస్‌ పతాకంపై ఆదిత్యారామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది.'గత నెలలో 12 రోజుల పాటు స్విట్లర్లాండ్‌లోని పలు అందమైన లొకేషన్లలో హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ కంగనా రనౌత్‌లపై రెండు పాటలలో సినిమా షెడ్యుల్ పూర్తి చేసుకోగా ఈ నెల 12 నుంచి బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరుపుతున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తీస్తున్నారు. బ్యాంకాక్‌ షెడ్యూల్‌ తరువాత హైదరాబాద్‌లో మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేస్తారు. సెప్టెంబర్‌ నాటికి మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది. ప్రభాస్‌ నటన హైలైట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది' అని అన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ, పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా అత్యున్నత సాంకేతిక విలువలతో దీనిని రూపొందిస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌, కంగనా రనౌత్‌, సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్‌, వేణుమాధవ్‌, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, సంగీత, పోసాని కృష్ణమురళి, శ్రావణ్‌ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ,సమర్పణ: పూరి జగన్నాథ్‌, నిర్మాత: ఆదిత్యారామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. వరస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలుగించనుంది మగధీరతో రాంచరణ్,జోష్ తో నాగర్జున తనయుడు నాగచైతన్య,మల్లనతో విక్రం,మరో కొత్త సినిమాతో ఎంటి.ఆర్.,ఆంజనేయులుగా రవితేజ,గోపిచంద్ శంఖం ఇవన్నికాక ప్రభాస్ ఏక్ నిరంజన్ తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలుగించడానికి ముందుకు రాబోతున్నాయె మరి కాసుకోండి
Powered by web analytics software.