Free SMS And Earn Part Time Money







9/19/09

విజయవాడలో 'ప్రస్థానం'


శర్వానంద్, రూబీ జంటగా దేవా కట్టా ('వెన్నెల' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప్రస్థానం'. విఆర్ సి మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయవాడలో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

చిత్ర విశేషాలను రవి వల్లభనేని తెలియజేస్తూ, విజయవాడ సిటీ, పరిసర ప్రాంతాలైన మానికొండ, పెనుమాక, చల్లపల్లి, కూచిపూడిలలో మూడు వారల జరిపిన తాజా షెడ్యూల్ లో రెండు పాటలతో పాటు ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సినిమా ఇతివృత్తం విజయవాడ నేపథ్యానికి చక్కగా సరిపోతుందని దర్శకుడు దేవ్ కట్టా చెప్పారు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ సమపాళ్లలో ఉంటూ సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిదని తెలిపారు. కథ, కథనాలతో పాటు చక్కటి సాంకేతిక విలువలతో చిత్రం రూపొందుతోందన్నారు. నటుడిగా తృప్తి నిచ్చే పాత్రను ఇందులో పోషిస్తున్నాయనీ, సాయికుమార్ అనగానే ఇందులోని పాత్ర అందరికీ గుర్తిండిపోతుందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పరిహార్, 'వెన్నెల' కిషోర్, జయప్రకాష్ రెడ్డి, జీవా, పవిత్ర, లోకేష్, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.





Powered by web analytics software.