Free SMS And Earn Part Time Money







11/19/10

పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్


పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. తమిళంలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వేదం, మర్యాదరామన్న చిత్రాలు నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2011 ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలుకానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు.

పవన్ కల్యాణ్ చిత్రానికి యువన్ శంకర్ స్వరాలు అందించడం ఇదే ప్రథమం. గమ్యం, వేదం, చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చడం విశేషం. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ లుక్ విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు: నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ, కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: విష్ణువర్థన్
Powered by web analytics software.