Free SMS And Earn Part Time Money







12/28/10

బహిరంగ వేడుకలకి వెళ్లాలంటేనే భయం:sameera reddy




జూ ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల పాట్నాలో గోర పరాభవం ఎదుర్కొన్నారు. భోజ్ పురి నటుడు రవికిషన్ తో కలిసి ఇటీవల సమీరా రెడ్డి ఒక బహిరంగ వేడుకలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఇంతలో అక్కడున్న జనం మధ్య తోపులాట జరగి, ఆ రగడ కాస్తా పెరగడంతో బీహార్ వాసులు తమ తడాకా చూపించారు. వెంటనే స్టేజీ మీదకు రాళ్ల వర్షం కురిపించి, అక్కడున్న ఫర్నీచర్ ను ద్వంసం చేశారు.

ఊహించని ఈ సంఘటనతో బిత్తరపోయిన సమీరా రెడ్డి వెంటనే కుర్చీ వెనుక నక్కి, రాళ్ల దెబ్బలు తగలకుండా తనని తాను కాపాడుకునేందుకు ఆ కుర్చీనే అడ్డు పెట్టుకుని వేదిక దిగింది. అక్కడ్నుంచి నిర్వాహకుల సాయంతో తన కారు వరకు క్షేమంగా చేరుకుని, పరిస్థితి చక్కబడే వరకు కారులోనే ఉండి, తర్వాత గమ్య స్థానానికి బయల్థేరింది. తన జీవితంలోనే ఈ సంఘటన మరచిపోలేనిదని, ఇకపై బహిరంగ వేడుకలకి వెళ్లాలంటేనే భయంగా ఉందని సమీరారెడ్డి అంటోంది.
Powered by web analytics software.