Free SMS And Earn Part Time Money







3/2/11

ఢమరుకం స్టోరి లైన్


నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న ఢమురకం చిత్రం బడ్జెట్ విని ఫిల్మ్ సర్కిల్స్ లో షాక్ అవుతున్నారు. దాదాపు 35 కోట్ల బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కేటాయించినట్లు చెప్తున్నారు. మొదట ఇరవై కోట్లకు శ్రీనివాస రెడ్డి బడ్జెట్ వేసి చూపించగా ఈ చిత్రానికి గ్రాపిక్స్ కి బాగా ఖర్చు అవుతుంది కాబట్టి నాగార్జున గర్వంగా చెప్పుకునే చిత్రం చేద్దాం మరింత బడ్జెట్ తీసుకోమని వెంకట్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ అదిరిందయ్యా చంద్ర,టాటా బిళ్లా మధ్యలో లైలా వంటి కామిడీలు తీసిన శ్రీనివాస రెడ్డి ఈ ఆఫర్ తో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈ చిత్రం స్టోరీ పాయింట్ ఎలా ఉంటుందంటే...దర్శకుడు శ్రీనివాస రెడ్డి గతంలో రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది . ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది. ఈ చిత్రంలో అనూష్క మరో సారి నాగార్జున సరసన చెయ్యనుంది. సోషియో ఫాంఠసీ గా రూపొందే ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2012 కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.
Powered by web analytics software.