Free SMS And Earn Part Time Money







1/9/11

అమితాబ్‌కు తబు జంటగా నటించబోతోంది. నేహా శర్మ, తాప్సీలు


పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే బాలీవుడ్ చిత్రంలో "ఝమ్మంది నాదం" ఫేమ్ సెక్సీ డాళ్ తాప్సీ నటించనుంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన "ఝమ్మంది నాదం" సినిమాలో అందాలను ఆరబోయడంతో తాప్సీకి ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి.

టాలీవుడ్‌లోనూ మాత్రం గాకుండా కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న తాప్సీ ఏకంగా బాలీవుడ్‌లోనూ నటించబోతోంది. బి‌గ్ బితో చేతులు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోయే చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం రానా, ఇలియానాలు జంటగా నటిస్తున్న "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్న పూరీ జగన్నాథ్, ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాలీవుడ్ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

"బుద్ధ" పేరిట రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌కు తబు జంటగా నటించబోతోంది. నేహా శర్మ, తాప్సీలు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Powered by web analytics software.