Free SMS And Earn Part Time Money







1/31/11

ఒక్క సినిమాతో సౌందర్యని దాటి పోయిందా


నిత్యా మీనన్ ని నేను సౌందర్యతో పోల్చను. జయసుధతో పోలుస్తా ఎందుకంటే..నా దృష్టిలో సౌందర్య కంటే జయసుధ గొప్ప నటి. అవకాశాలు లభించాలే కానీ నిత్య భవిష్యత్తులో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటుందనేది నా నమ్మకం అంటోంది రోహిణి. రీసెంట్ గా ఆమె 'అలా.. మొదలైంది!' చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆమె ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే రోహిణి.. డైరెక్షన్ చేయాలనేది ప్రస్తుతం నాకున్న ఆశయం.ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశా. బాల నటుల మీద ఓ డాక్యుమెంటరీ తీశా. సినిమా కోసం తమిళంలో ఓ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నా. ఈ సంవత్సరమే దాన్ని చేయాలనుకుంటున్నా. థ్రిల్లర్. మానవీయ కోణంలో ఉండే కథ. తెలుగులో ఎవరన్నా అవకాశమిస్తే చేస్తా అన్నారు. ఇక నాని, నిత్య మీనన్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందులో ఆమె నాని తల్లి పాత్రను పోషించింది.ఈ చిత్రం ద్వారా బి.వి. నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమయ్యింది.
Powered by web analytics software.