Free SMS And Earn Part Time Money







2/4/11

మరి గబ్బర్ సింగ్ ఎవరని టాలీవుడ్ వర్గాల ప్రశ్న పూరి జగన్నాధ్ కి


పూరీ జగన్నాథ్ హిందీ చిత్రం ‘షోలే’ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ హీరోలుగా మంచి బాడీ పర్సనాలిటీ మాస్ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలైన ప్రభాస్, గోపిచంద్ కాంబినేష్ లో పూరీ జగన్నాథ్ రూపొందించాలని భావిస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబినేష్ ఇంతకు మందే ‘వర్షం’లో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకొన్న గోపిచంద్ ఇండస్ట్రీలో ఓ అగ్రసీవ్ హీరోగా వెలుగొందుతున్నాడు. అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ మల్టీస్టారర్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబందించి ‘పార్ట్ నర్’ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్వతి మిల్టన్, బిందుమాధవి హీరోయిన్స్ గా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Powered by web analytics software.